-
సాయికిరణ్కు కేసీఆర్ కేసరి టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేసరి రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఎంకేయూ గులాబ్ వ్యాయామశాలకు చెందిన రెజ్లర్లు సత్తాచాటారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ చాంపియన్షిప్లో 75–100 కేజీ విభాగంలో రెండు పతకాలను సాధించారు. జె. సాయి కిరణ్ ఈ విభాగంలో విజేతగా నిలిచి ‘కేసీఆర్ కేసరి’ టైటిల్ను గెలుచుకోగా... జె. నర్సింగ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బామ్ అఖాడాకు చెందిన అబ్దుల్ రహీమ్ రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ‘యువ కేసరి’ టైటిల్ను సలే ఖులేఖి అఖాడాకు చెందిన జఫర్ బిన్ ముబారక్ గెలుచుకున్నాడు. 65–74 కేజీ విభాగంలో జరిగిన ఫైనల్లో జఫర్... టి. శివ సింగ్ (ఆర్పీసీ)ని ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విభాగంలో జై భవాని వ్యాయామశాలకు చెందిన డి. సాయిదీప్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. కేసీఆర్ కేసరి టైటిల్ను గెలుచుకున్న సాయికిరణ్కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, యువకేసరి జఫర్కు పల్సర్ బైక్లు బహుమతులుగా లభించాయి. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 50 కేజీ: 1. కె. కిషోర్, 2. శ్యామ్ సింగ్, 3. ఎం. శ్రీకాంత్. 57 కేజీ: 1. అబూబకర్ బిన్ అలీ, 2. ఎం. విక్రమ్, 3. ఇలియాస్. 61 కేజీ: 1. ఎస్. అక్షిత్ కుమార్, 2. హెచ్. ధన్రాజ్, 3. విజయ్ కుమార్. 66 కేజీ: 1. వినయ్ కుమార్, 2. జి. అక్షయ్ యాదవ్, 3. కె. ఎస్. రూప్లాల్. 84 కేజీ: 1. చందన్ సింగ్, 2. ఒమర్ బిన్ జావేద్ 3. ముజాహిద్. 120 కేజీ: 1. షేక్ మొహమ్మద్, 2. అబ్దుల్ వసీఫ్, 3. శాంతికుమార్. -
విజేతలు అబ్దుల్ ఖాదర్, రహీమ్
రెజ్లింగ్ చాంపియన్షిప్ హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో అబ్దుల్ ఖాదర్, రహీమ్ విజేతలుగా నిలిచారు. ఫలక్నుమా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్షిప్లో సీనియర్ విభాగంలో అబ్దుల్ ఖాదర్, జూనియర్ విభాగంలో రహీమ్, సబ్ జూనియర్ విభాగంలో రూప్లాల్, ఓపెన్ కేటగిరిలో సారుుదీప్ చాంపియన్లుగా నిలిచారు. మొత్తం ఈ టోర్నమెంట్లో 210మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి నారుుని నర్సింహా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేసి గదతో సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొన్న పోలీస్ రెజ్లర్లు ఎం.సంతోష్, వీరేష్, మహేష్లకు గోల్డ్ మెడళ్లను బహుకరించారు. రెజ్లింగ్లో సత్తా చాటిన పహిల్వాన్లకు స్పోర్ట్స కోటా కింద ఉద్యోగాలను ఇప్పించేందుకు కృషిచేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావు, ఫలక్నుమా ఏసీపీ మొహమ్మద్ అబ్దుల్ బారీ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్నుమా డివిజన్ల ఇన్స్పెక్టర్లు, అదనపు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
రెజ్లింగ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ చాంపియన్షిప్ శుక్రవారం ప్రారంభమైంది. ఫలక్నుమా డివి జన్ పోలీసుల ఆధ్వర్యంలో బార్కాస్ స్పోర్ట్స ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ప్రారంభిం చారు. ఈ పోటీల్లో పలు అకాడమీలకు చెందిన ప్రము ఖ రెజ్లర్లు పాల్గొననున్నారు. యువకుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఈ చాంపియన్షిప్ ఉపయోగపడుతుందని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాంద్రాయణ గుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్నుమా పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్లర్లు, పలువురు పహిల్వాన్లు పాల్గొన్నారు. -
భారత్కు ఐదు పతకాలు
న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్లో నాసిర్ హుస్సేన్కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
ఆసియా రెజ్లింగ్లో వినేశ్కు రజతం
న్యూఢిల్లీ : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ రజత పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన 48 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ 2-3తో యుకీ ఇరీ (జపాన్) చేతిలో ఓడి రెండో స్థానంతో సంతృప్తిపడింది. పురుషుల 74 కేజీల కేటగిరీలో నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్యం సాధించాడు. ప్లే ఆఫ్ బౌట్లో నర్సింగ్ 3-1తో జిగెర్ జకిరోవ్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. -
120 కేజీల విజేత నర్సింగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి రెజ్లింగ్ చాంపియన్షిప్లో 120 కేజీల టైటిల్ను జె.నర్సింగ్ (రాయల్ జూనియర్ కాలేజి) గెలుచుకున్నాడు. హైదరాబాద్ జిల్లా జూనియర్ కాలేజి గేమ్స్ సమాఖ్య (హెచ్డీజీసీఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని రె జ్లింగ్ హాల్లో సోమవారం జరిగిన ఈ పోటీల్లో 120 కేజీల వెయిట్ విభాగంలో ఎం.డి. ఆసిఫ్ (ఎం.ఎస్ జూనియర్ కాలేజి)పై నర్సింగ్ విజయం సాధించి టైటిల్ను గెలిచాడు. ఫైనల్స్ ఫలితాలు: 42 కేజీలు: 1.పి.శ్రీకాంత్ (ఎల్బీ జూనియర్ కాలేజి), 2.ఎం.సాయి కిరణ్ (నృపతుంగ జూనియర్ కాలేజి), 3.పి.రవితేజ (గవర్నమెంట్ జూనియర్ కాలేజి, ఆలియా), బి.సంతోష్ కుమార్(ఎల్బీ జూనియర్ కాలేజి). 46 కేజీలు: 1.ఉస్మాన్ ఖాన్ (ఎం.ఎస్ జూనియర్ కాలేజి), 2.జి.కల్యాణ్ కుమార్(ప్రగతి మహావిద్యాలయ), 3.వినీత్ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ), బి.హరిరామ్ (ఎల్బీ జూనియర్ కాలేజి). 50 కేజీలు: 1.ఎం.సల్మాన్ (చంచల్గూడ జీజేసీ), 2.డి.బాల్వీర్ (నవ చైతన్య జూనియర్ కాలేజి), 3.ఎస్.శ్రీశైలం (ఎన్జేసీ), కె.సాయినాథ్ (న్యూ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి). 55 కేజీలు: 1.విజయ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ), 2.ఎం.డి.ముబీన్(ఎం.ఎల్.జూనియర్ కాలేజి), 3. ఎం.డి.అసద్ (శ్రీనివాస్ జూనియర్ కాలేజి). పి.వినాయక్ (న్యూ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి). 60 కేజీలు: 1.జె.సాయికిరణ్ (ప్రగతి మహావిద్యాలయ),2. ఐజార్ అలీ ఖాన్(రెసిడెన్సీ కాలేజి), 3. సి.పవన్ కుమార్(ఎల్బీ జూనియర్ కాలేజి). 66 కేజీలు: 1.రాహుల్ (వీవీ జూనియర్ కాలేజి), 2.పి.నరేష్ యాదవ్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 3.ఆసిఫ్ ఖాన్ (జవహర్ కాలేజి), నవీన్ సింగ్ (నవ చైతన్య కాలేజి). 74 కేజీలు: 1.టి.శివ సింగ్ (శ్రీచైతన్య జూనియర్ కాలేజి), 2.రఘునందన్ యాదవ్ (ప్రగతి మహావిద్యాలయ), 3.పునీత్ కుమార్(భవాన్స్ కాలేజి). 84 కేజీలు: 1.ముదస్సిర్ అహ్మద్ (సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజి), 2.శివ(అగర్వాల్ జూనియర్ కాలేజి), 3.టి.చైతన్య యాదవ్ (శ్రీచైతన్య కాలేజి), ఎ.శ్రవణ్ కుమార్ (ప్రగతి మహావిద్యాలయ). 96 కేజీలు: 1.అహ్మద్ బిన్ హంజా అల్ జాబ్రీ (సెయింట్ మేరీస్కాలేజి). 2.అబ్దుల్ ఆసిఫ్, 3. కార్తికేయ(ఆర్జీసీ).