-
రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్ చీఫ్ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్ భూషణ్) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని రెజర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR — ANI (@ANI) January 19, 2023 ఇక జంతర్ మంతర్ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్ అయిన బబితా ఫోగట్ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు. వినేశ్ ఫోగట్(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్ క్యాంప్లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్లతో పాటు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ సైక్లింగ్ టీం కోచ్ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. హాలీవుడ్ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. -
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
UWW Ranking Series: అమన్ పసిడి పట్టు.. భారత్కు 12 పతకాలు!
కజకిస్తాన్లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ అమన్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్ 10–9తో మెరెయ్ బజర్బయెవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్ 7–0తో రిఫత్ సైబొతలొవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్లో భారత్ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ పంపిన నోటీసుపై ఆమె స్పందిస్తూ ఆదివారం క్షమాపణ కోరారు. కాగా, టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమెపై నిషేధంపై త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది. నిన్న(శనివారం) ఆమె స్పందిస్తూ.. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్పై అవగాహనలేని, షూటింగ్తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్కు గురయ్యానని వెల్లడించింది. -
Wrestler Sushil Kumar: సుశీల్ హాకీ స్టిక్తో...
న్యూఢిల్లీ: రెజ్లర్ సుశీల్ కుమార్ను దోషిగా చూపిస్తున్న దృశ్యం ఇదేనా! పోలీసులు సాక్ష్యంగా చెబుతున్న వీడియోలో సుశీల్ చేతిలో స్టిక్ ఉండగా, ఇద్దరు వ్యక్తులు నేలపై పడి దెబ్బలు తింటున్నట్లుగా కనిపిస్తోంది. సుశీల్ పక్కనే ఉన్న కొందరు వారిని చావబాదుతున్నట్లుగా పూర్తి వీడియోలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులనుంచి ఇంకా అధికారికంగా స్పష్టత రాకున్నా... ఢిల్లీ రెజ్లింగ్ వర్గాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మే 4న సాగర్ రాణా అనే యువ రెజ్లర్ చనిపోయిన ఈ ఘటనలో సుశీల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక ఈ హత్య కేసులో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది సుశీల్కుమార్ను ఇరికించారని, దీనంతటి వెనుక పెద్ద కుట్ర ఉందని అతడి తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదని, కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారని పేర్కొన్నారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఈ దృశ్యాలు బయటపడటం గమనార్హం. చదవండి: భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం -
షాకింగ్ : కోచ్లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
రెజ్లర్లు... పట్టు పడుతున్నారు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు రవి దహియా, దీపక్ పూనియా శిక్షణ మొదలుపెట్టారు. ఇక్కడి ఛత్రశాల స్టేడియంలో ఇద్దరు పట్టుపట్టే పనిలో నిమగ్నమయ్యారు. వీరి ప్రాక్టీస్ వీడియోను కోచ్, రెజ్లింగ్ దిగ్గజం సత్పాల్ సింగ్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైన ముందు జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ శిక్షణ మొదలు పెట్టామని ఆయన ట్వీట్ చేశారు. గతేడాది ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ (కజకిస్తాన్)లో పతకాలు సాధించడం ద్వారా టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందిన దీపక్ (86 కేజీలు), రవి (57 కేజీలు) ఇన్నాళ్లు కోవిడ్ మహమ్మారి వల్ల శిక్షణకు దూరమయ్యారు. -
‘త్రిస్వర్ణ’ కాంతులు...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా రెజ్లర్లు స్వర్ణ కాంతులీనారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భాగంగా గురువారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్ పోటీల్లో భారత్కు ఒకే రోజు మూడు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. దివ్య కాక్రాన్ (68 కేజీలు), సరితా మోర్ (59 కేజీలు), పింకీ (55 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా... నిర్మలా దేవి (50 కేజీలు) రజతం దక్కించుకుంది. కిరణ్ (76 కేజీలు) మాత్రం విఫలమైంది. ఫైనల్స్లో సరిత 3–2తో బాట్సెట్సెగ్ అల్టాంట్సెగ్ (మంగోలియా)పై... పింకీ 2–1తో డల్గున్ బొలోర్మా (మంగోలియా)పై గెలిచారు. నిర్మలా దేవి 2–3తో మిహో ఇగారషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగంలో ఐదుగురు రెజ్లర్లు మాత్రమే ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. దివ్య బరిలోకి దిగిన నాలుగు బౌట్లలోనూ గెలిచి విజేతగా అవతరించింది. దివ్య వరుసగా 6–0తో అల్బీనా (కజకిస్తాన్)పై, 11–2తో డెల్గెరామా (మంగోలియా)పై, 8–0తో అజోదా (ఉజ్బెకిస్తాన్)పై, 6–4తో నరువా మత్సుయుకి (జపాన్)పై గెలిచి అజేయం గా నిలిచింది. ఇంతకుముందు ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు ఏకైక స్వర్ణం 2018లో నవ్జ్యోత్ కౌర్ (65 కేజీలు) రూపంలో లభించింది. ఈసారి మాత్రం ఒకేరోజు మూడు పసిడి పతకాలు లభించడం విశేషం. -
పాక్ రెజ్లర్లకు వీసాలు మంజూరు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనడానికి పాకిస్తాన్ రెజ్లర్లు భారత్కు రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ రెజ్లర్లు అయిన ముహమ్మద్ బిలాల్, అబ్దుల్ రెహ్మాన్, తయబ్ రాజా, జమాన్ అన్వర్లకు భారత ప్రభుత్వం శనివారం వీసాలను జారీ చేసినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్లో భారత్, భారత్లో పాక్ పర్యటించలేదు. గత ఏడాది డేవిస్ కప్లో భాగంగా పాకిస్తాన్లో భారత్ పర్యటించాల్సి ఉన్నా... భద్రతా కారణాలతో ఆ పోరు తటస్థ వేదికపై జరిగింది. కోవిడ్–19 వైరస్ కారణంగా చైనా రెజ్లర్లకు ఇంకా వీసాలను జారీ చేయలేదు. వీరి విషయంపై నేడు స్పష్టత రానుంది. -
బజరంగ్ పసిడి పట్టు
జియాన్ (చైనా): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లోనూ సత్తా చాటుకున్నాడు. రెండోసారి ఆసియా చాంపియన్గా అవతరించాడు. మంగళవారం మొదలైన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలి రోజు భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ప్రస్తుతం ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న బజరంగ్ తన ర్యాంక్కు న్యాయం చేస్తూ ఆసియా చాంపియన్షిప్లో అదరగొట్టాడు. సయాత్బెక్ ఒకాసోవ్ (కజకిస్తాన్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 12–7 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఒకదశలో 2–7తో వెనుకబడిన ఈ హరియాణా రెజ్లర్ ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి ఒకాసోవ్ పని పట్టాడు. రెండో విరామంలో పూర్తిగా దూకుడుగా వ్యవహరించిన బజరంగ్ తన ప్రత్యర్థిపై పట్టు సంపాదించి వరుసగా పది పాయింట్లు సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతకుముందు బజరంగ్ సెమీఫైనల్లో 12–1తో సిరాజుద్దీన్ ఖసనోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–0తో పీమన్ బియాబాని (ఇరాన్)పై, తొలి రౌండ్లో 10–0తో దివోషాన్ చార్లెస్ ఫెర్నాండో (శ్రీలంక)పై గెలుపొందాడు. సీజన్లో రెండో స్వర్ణం... గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన బజరంగ్... ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో డాన్ కొలోవ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం నెగ్గి సీజన్లో శుభారంభం చేసిన అతను ఆసియా చాంపియన్షిప్లో పసిడి పట్టుతో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో బజరంగ్కిది రెండో స్వర్ణం. 2017లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. అంతేకాకుండా ఈ టోర్నీ చరిత్రలో రెండు కాంస్యాలు (2018లో 65 కేజీలు; 2013లో 60 కేజీలు), ఒక రజతం (2014లో 61 కేజీలు) కూడా సాధించాడు. మరోవైపు పురుషుల 79 కేజీల విభాగంలో ప్రవీణ్ రాణా రజతం, 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్ కాంస్య పతకం సాధించారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 0–3తో బామన్ మొహమ్మద్ తెమూరి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో సత్యవర్త్ 8–2తో హావోబిన్ గావో (చైనా)పై గెలుపొందాడు. 57 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవి కుమార్ 3–5తో ప్రపంచ మాజీ చాంపియన్ యూకీ తకహాషి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 70 కేజీల విభాగంలో రజనీశ్ తొలి రౌండ్లో 0–11తో యూనస్ అలీఅక్బర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. -
టాప్ ర్యాంక్లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో బజరంగ్ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్షిప్లో రజతం నెగ్గాడు. గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ టోర్నీలోనూ స్వర్ణం నెగ్గిన బజరంగ్ ఈనెల 23 నుంచి చైనాలో జరిగే ఆసియా చాంపియన్షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు. -
డబ్ల్యూడబ్ల్యూఈకి అమితాదరణ
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్మానియా 35 టోర్నమెంట్కు అభిమానుల నుంచి గొప్ప స్పందన లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు ట్రిఫుల్ హెచ్, బటిస్టా బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్, రోమన్ రైన్స్, రొండా రౌసీ, షార్లెట్ ఫ్లెయిర్లు తలపడిన ఈ పోటీలను పెద్దసంఖ్యలో అభిమానులు వీక్షించారు. న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్లైఫ్ స్టాండ్స్నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ హిందీ, ఇంగ్లిష్, తమిళ్ చానళ్ల ద్వారా భారతదేశంలోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్లో భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. చరిత్రాత్మకమైన ఈ రెజిల్ మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్లను నిర్వహించింది. ఇందులో భాగంలో షార్లెట్ పెయిర్పై బెకీ లించ్ విజయం సాధించింది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్లో కోపీ కింగ్స్టన్ తీవ్రంగా శ్రమంచాడు. 11 సంవత్సరాల తర్వాత తలపడిన అతను స్ఫూర్తిదాయక విజయాన్ని నమోదు చేశాడు. యూనివర్సల్ చాంపియన్ టైటిల్ కోసం బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్ పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సేథ్ రోలిన్స్ గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకున్నాడు. నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్లో దిగ్గజాలు బటిస్టా, ట్రిఫుల్ హెచ్ తలపడ్డారు. రిక్ ప్లెయిర్ ఈ మ్యాచ్లో సహాయం అందించడంతో బటిస్టాపై ట్రిపుల్ హెచ్ గెలుపొందాడు. క్యాన్సర్తో పోరాడి గెలుపొందిన రోమన్రైన్స్ తన స్ఫూర్తిదాయక పోరాటంతో డ్య్రూ మెకిన్టైర్ను ఓడించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లంతా తమ శక్తియుక్తులు ప్రదర్శించడంతో పోరాటాలు వీక్షకులకు కనువిందు చేశాయి. -
‘టాప్స్’ నుంచి రెజ్లర్ రీతూ ఫొగాట్ ఔట్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) యువ రెజ్లర్ రీతూ ఫొగాట్ను టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించింది. గతేడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గిన రీతూ ఇటీవల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కు మారింది. టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్కు తాను అందుబాటులో ఉండనని... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు చెప్పింది. ఒలింపిక్స్ పతకాల కోసమే టాప్స్లోని క్రీడాకారులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నారు. అలాంటపుడు ఒలింపిక్స్ ఆడని క్రీడాకారులను అందులో ఉంచడం తగదని భావించిన ‘సాయ్’ వెంటనే రీతు ఫొగాట్ను తప్పించింది. -
పసిడి పతక పోరుకు రవి కుమార్ అర్హత
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ రవి కుమార్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ఫైనల్కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. రొమేనియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రవి 10–8తో తురొబోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే స్వర్ణ పతక పోరులో జపాన్కు చెందిన తొషిహిరోతో రవి తలపడతాడు. ఒకవేళ రవి గెలిస్తే ఈ ఈవెంట్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్గా గుర్తింపు పొందుతాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
మహిళా రెజ్లర్లకు నిరాశ
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు నిరాశపరిచారు. ఆరు వెయిట్ కేటగిరీల్లో ఒక్కరు కూడా సెమీఫైనల్కు చేరుకోలేకపోయారు. సీమ (55 కేజీలు), నవ్జ్యోత్ కౌర్ (68 కేజీలు), రజని (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సరిత (59 కేజీలు), రీతూ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సీమ 0–11తో దావాచిమెగ్ (మంగోలియా) చేతిలో... నవ్జ్యోత్ 0–4తో కుంబా ఫాంటా సెలెన్ (ఫ్రాన్స్) చేతిలో... రజని 0–2తో మార్టినా క్యునెజ్ (ఆస్ట్రియా) చేతిలో... కిరణ్ 2–12తో ఎల్మీరా సిజ్దికోవా (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. షూవ్డోర్ బతర్జావ్ (మంగో లియా) 10–0తో సరితపై, పెట్రా మారిట్ (ఫిన్లాండ్) 6–2తో రీతూపై గెలిచారు. నవ్జ్యోత్ కౌర్పై గెలిచిన సెలెన్... రీతూపై నెగ్గిన పెట్రా మారిట్ ఫైనల్కు చేరుకోవడం తో వీరిద్దరికి బుధవారం కాంస్యం గెలిచేందుకు రెప్చేజ్ బౌట్లలో అవకాశం దక్కింది. -
ఎయిర్పోర్ట్లో స్టార్ప్లేయర్ ఎంగేజ్మెంట్
సాక్షి, న్యూఢిల్లీ : ఏషియన్గేమ్స్లో సత్తా చాటి భారత్కు స్వర్ణం అందించిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఎంగేజ్మెంట్ను వినూత్నంగా జరుపుకున్నారు. రెజ్లింగ్లో పసిడి కొట్టి తొలి భారత మహిళా రెజ్లర్గా వినేశ్ ఫొగాట్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం జకార్త నుంచి భారత్కు తిరుగు వచ్చే క్రమంలో ఆమె ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన వివాహ నిశ్చితార్థం జరుపుకున్నారు. తన ప్రియుడు సోమ్వీర్ రతితో ఇరుకుటుంబాల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. గ్రీకో-రోమన్ రెజ్లర్ అయిన సోమ్వీర్తో వినేశ్ ఎయిర్పోర్ట్లోనే రింగ్స్ మార్చుకుని కేకు కట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వినేశ్ ఫొగాట్.. ఫైనల్లో జపాన్ రెజ్లర్ యుకి ఇరీని 6-2తో ఓడించారు. ఇక తన లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సేనని, దీని కోసం అన్ని పోటీల్లో పాల్గొంటున్నాని వినేశ్ ఫొగాట్ స్పష్టం చేశారు.(చదవండి: ‘పసిడి’ కాంత) The best decision I ever made! Glad you pinned me for life 😍❤️ A post shared by Vinesh Phogat (@vineshphogat) on Aug 22, 2018 at 12:12am PDT ప్రియుడు సోమ్వీర్తో వినేశ్ ఫొగాట్ -
నెవర్ స్టాప్
వినేష్ పోగత్. రెజ్లింగ్లో కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ రెండింట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఒకే ఒక్క రెజ్లర్. వినేష్ పెదనాన్న పేరున్న రెజ్లర్ మహవీర్ సింగ్ పోగత్. ఆయన తన నలుగురు కూతుళ్లతో పాటు తన తమ్ముడి కూతుళ్లయిన ప్రియాంక, వినేష్లకూ కలిపి ఇంట్లోనే రెజ్లింగ్లో తిరుగులేని ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన కథను ‘దంగల్’ పేరుతో బాలీవుడ్ సినిమాగా కూడా తీసింది. ఇప్పుడు ఈ ఆరుగురూ పెద్ద రెజ్లర్స్. గీతా, బబితా, వినేష్ ఇప్పటికే కామన్వెల్త్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే, వీళ్లలో వినేష్ తాజాగా ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించారు. ఇది ఇండియన్ వుమన్ రెజ్లింగ్ చరిత్రలోనే రికార్డు. ఈ అవార్డు అందుకున్న వినేష్, తన ఆనందాన్ని తెలుపుతూ, ‘ఏషియన్ గేమ్స్లో గోల్డ్ అందుకోవడం అద్భుతంగా ఉంది. ఈ మెడల్ ఇండియాది. అన్ని సందర్భాల్లో నా వెన్నంటి ఉన్న వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ సక్సెస్తోనూ ఎప్పుడూ ఆగిపోవద్దు. నెవర్ స్టాప్.’ అంటున్నారు వినేష్! -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్!
భారత పట్టుకు మరోసారి ‘పసిడి’ చిక్కింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. తొలి రోజు పురుషుల రెజ్లింగ్లో బజరంగ్ పూనియా బంగారు పతకం నెగ్గగా... ఈసారి మహిళల రెజ్లింగ్లో వినేశ్ ఫొగాట్ భారత సత్తా చాటి పసిడి కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలో 23 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు భారత షూటర్ల గురికి రెండు రజత పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్... పురుషుల ట్రాప్ విభాగంలో లక్షయ్ షెరాన్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా రెండో రోజు భారత్ ఖాతాలో స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మూడు పతకాలు చేరాయి. ప్రస్తుతం భారత్ ఐదు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. జకార్తా: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత ‘పసిడి పట్టు’ పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. యావత్ జాతి గర్వపడేలా చేసింది. ఫైనల్లో వినేశ్ 6–2 పాయింట్ల తేడాతో యుకి ఇరీ (జపాన్)ను ఓడించి చాంపియన్గా అవతరించింది. అంతకుముందు వినేశ్ తొలి రౌండ్లో 8–2తో సన్ యానన్ (చైనా)పై... క్వార్టర్ ఫైనల్లో 4 నిమిషాల 37 సెకన్లలో 11–0తో కిమ్ హ్యుంగ్జూ (దక్షిణ కొరియా)పై, సెమీఫైనల్లో 75 సెకన్లలో 10–0తో దౌలత్బైక్ యక్షిమురతోవా (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్లో సన్ యానన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ మోకాలి గాయంతో అర్ధంతరంగా వైదొలిగింది. ఆరు నెలల విశ్రాంతి తర్వాత కోలుకున్న ఆమె ఈసారి మాత్రం సన్ యానన్పై పూర్తి ఆధిపత్యం చలాయించింది. గతంలో ఆమెతో పోటీపడ్డ మూడుసార్లూ ఓడిన వినేశ్ నాలుగో ప్రయత్నంలో గెలిచింది. జపాన్ రెజ్లర్ యుకి ఇరీతో జరిగిన ఫైనల్లో వినేశ్ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రౌండ్లో జపాన్ రెజ్లర్ కోలుకునేందుకు ప్రయత్నించినా వినేశ్ తన పట్టు సడలించకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. సాక్షి మలిక్ చేజేతులా... భారత్కే చెందిన సాక్షి మలిక్ (62 కేజీలు), పూజా ధాండ (57 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయారు. ఐసులు టినిబెకోవా (కిర్గిస్తాన్)తో జరిగిన సెమీఫైనల్లో సాక్షి 7–9తో ఓడింది. 10 సెకన్ల సమయం ఉందనగా సాక్షి 7–6తో ఆధిక్యంలో ఉంది. అయితే చివరి 10 సెకన్లలో ఆమె రక్షణాత్మకంగా వ్యవహరించడం... టినిబెకోవా దూకుడుగా ఆడి సాక్షి మలిక్ను మ్యాట్ బయటకు పంపించి రెండు పాయింట్లు సంపాదించి 8–7తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే రిఫరీ 2 పాయింట్ల నిర్ణయాన్ని సాక్షి సమీక్ష కోరడం... రిఫరీ నిర్ణయం సరైనదేనని తేలడంతో ఆమె అదనంగా మరో పాయింట్ కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది. కాంస్య పతక బౌట్లలో సాక్షి 2–12తో హాంగ్ జంగ్వన్ (ఉత్తర కొరియా) చేతిలో... పూజా 1–6తో సాకగామి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మరో భారత మహిళా రెజ్లర్ పింకీ (53 కేజీలు) తొలి రౌండ్లో 0–10తో సుమియా (మంగోలియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 125 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సుమీత్ 0–2తో దావిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. వైఎస్ జగన్ అభినందన... స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను... రజత పతకాలు గెలిచిన షూటర్లు దీపక్ కుమార్, లక్షయ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఏషియాడ్లో భారత క్రీడాకారుల బృందానికి అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగా. ఆసియాస్థాయిలో మూడుసార్లు రజతం గెలిచా. అందుకే ఈసారి ఎలాగైనా పసిడి గెలవాలనుకున్నా. పూర్తి ఫిట్నెస్తో ఉండటం... కఠోర శ్రమ ఫలించడం... అన్ని పరిస్థితులు అనుకూలించడం... దేవుడు కూడా సహకరించడంతో పసిడి కల నెరవేరింది. –వినేశ్ 2 ఆసియా క్రీడల్లో వినేశ్కు ఇది రెండో పతకం. 2014 ఇంచియోన్ క్రీడల్లో ఆమె 48 కేజీల విభాగంలో రజతం గెలిచింది. 2 ఆసియా క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్. గతంలో గీతిక జఖర్ (2006; 63 కేజీల్లో కాంస్యం; 2014; 63 కేజీల్లో రజతం) ఈ ఘనత సాధించింది. -
‘దంగల్’ తరహా సీన్ రిపీట్..
బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘దంగల్’లో హీరో అమీర్ ఖాన్ను తన కూతురు ఫైనల్ బౌట్ చూడకుండా జట్టు కోచ్ ఆయనను ఓ గదిలో బంధిస్తారు. నిజంగా ఇది జరగనప్పటికీ సినీడ్రామా కోసం అలా చేశారు. స్టార్ రెజ్లర్లు గీత, బబిత ఫొగాట్ తండ్రి మహావీర్ ఫొగాట్ జీవితచరిత్ర ఆధారంగా ఆ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బంధించడం జరగలేదు కానీ... స్టేడియం వెలుపల మహావీర్ నిరీక్షించిన ఘటన గోల్ట్కోస్ట్లో జరిగింది. తన కుమార్తె తలపడుతున్న 53 కేజీల స్వర్ణ పతక బౌట్ను చూసేందుకు స్టేడియానికి వెళ్లిన మహావీర్ టికెట్ లేక ఆగిపోయారు. తొలి మూడు బౌట్లలో బబిత గెలిచినా... అది చూసే అవకాశం మాత్రం మహావీర్కు దక్కలేదు. చివరకు ఆస్ట్రేలియా రెజ్లర్లకు వచ్చిన టికెట్లతో ప్రవేశం పొందిన ఆయన... తన కుమార్తె ఫైనల్ ‘పట్టు’ చూడగలిగారు. టికెట్ల వ్యవహారంపై చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా మాట్లాడుతూ రెజ్లింగ్ కోచ్ తోమర్కు ఐదు టికెట్లిచ్చామని... అమెకు ఎందుకు అందలేదో తెలియదన్నారు. రాత్రి దాకా ప్రయత్నించా: బబిత ‘అథ్లెట్కు రెండు టికెట్లిస్తారు. కానీ అవి నాకు అందలేదు. నా తండ్రికి టికెట్ ఇవ్వండని ఐఓఏ అధికారుల్ని, భారత చెఫ్ డి మిషన్ను అడిగా. బుధవారం రాత్రి పది గంటలదాకా నాకు ఇదే పనైంది. ఎంత చేసినా టికెట్లు అందలేదు. దీంతో స్టేడియం వెలుపలే మా నాన్న ఉండిపోయాడు. చివరకు ఆస్ట్రేలియన్ల చొరవతో ఆఖరి పోరు చూడగలిగారు. నేను చాలా నిరాశ చెందాను’ అని బబిత వాపోయింది. -
ఓవరాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లా రెజ్లింగ్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జిల్లా జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్ టైటిల్ సాధించింది. 79 పాయింట్లతో హైదరాబాద్ జట్టు మొదటి స్థానంలో నిలవగా... 51 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా జట్టు రెండో స్థానం దక్కించుకుంది. బాలికల 50 కేజీల విభాగం ఫైనల్లో సీహెచ్.మౌనిక (వరంగల్)పై ఎన్.శిరీష యాదవ్ (హైదరాబాద్) గెలుపొందింది. 53 కేజీల విభాగంలో వైష్ణవి యాదవ్ (హైదరాబాద్)పై ఎన్.మౌనిక (కరీంనగర్) విజయం సాధించింది. 55 కేజీల విభాగంలో ఎం.నవ్య (మెదక్)పై వి.నయని (రంగారెడ్డి) గెలిచింది. 59 కేజీల విభాగంలో వీణ (నిజామాబాద్)పై టి.సంధ్యారాణి (మెదక్); 62 కేజీల విభాగంలో పి.నిహారిక (కరీంనగర్)పై రోహిణి (రంగారెడ్డి) గెలుపొందారు. బాలుర 55 కేజీల విభాగంలో కె.మధుకర్ (వరంగల్)పై తుకారామ్ సింగ్ (హైదరాబాద్); 60 కేజీల విభాగంలో ఎం.శ్రీకాంత్ (నిజామాబాద్)పై సాయి కుమార్ యాదవ్ (అదిలాబాద్); 63 కేజీల విభాగంలో మోనూ యాదవ్ (రంగారెడ్డి)పై అబూబకర్ బిన్ అలీ (హైదరాబాద్); 67 కేజీల విభాగంలో జి.నరేందర్ (రంగారెడ్డి)పై అబ్రార్ (హైదరాబాద్); 72 కేజీ ల విభాగంలో నవాజ్ అహ్మద్ (హైదరాబాద్)పై కె.శివ (మహబూబ్నగర్); 77 కేజీల విభాగంలో ఎం.బాలాజీ (వరంగల్)పై సి.నితిన్ (హైదరాబాద్); 82 కేజీల విభాగంలో కళ్యాణ్రామ్ (వరంగల్)పై కె.యశ్విన్ సింగ్ (హైదరాబాద్); 87 కేజీల విభాగంలో వివేక్ (వరంగల్)పై ధీరన్ యాదవ్ (హైదరాబాద్) గెలుపొందారు. -
ఘోర రోడ్డు ప్రమాదాలు..14మంది దుర్మరణం
సాక్షి, పుణె: రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని కడెగావ్ సమీపంలోని సంగ్లీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్ల్లోకి వెళితే...రెజలర్స్ పోటీలో పాల్గొని పుణె నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్న ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రెజలర్స్తో పాటు డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నీటికుంటలో బస్తు బోల్తా.. 8మంది మృతి బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లా కరెకెరెలో శనివారం ఉదయం బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నీటికుంటలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి శుక్రవారం రాత్రి 43మంది ప్రయాణికులతో కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదెరింది. ధర్మస్థలా సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
అభిమానుల అతి.. చిక్కుల్లో రెజ్లర్ సుశీల్ కుమార్
న్యూఢిల్లీ : అభిమానులు అతిగా ప్రవర్తించడంతో రెండుసార్లు ఒలింపిక్ విజేతైన రెజ్లర్ సుశీల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. సుశీల్ అనుచరులు తమపై దాడి చేశారని ప్రత్యర్థీ రెజ్లర్ ప్రవీణ్ రాణా సోదరుడు.. నవీన్రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఢిల్లీ పోలీసులు సుశీల్పై కేసు నమోదు చేశారు. వచ్చే ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి రెజ్లర్ల అనుచరుల మధ్య రచ్చ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ సుశీల్ అనచురులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు. కేసుపై స్పందించిన సుశీల్ కుమార్.. ‘ఇలాంటి ఘటనలు క్రీడల్లో చోటుచేసుకోకూడదు. ఓటమి, గెలుపు మంచిగానే తీసుకోవాలి. ఆ విషయంలో ప్రవీణ్ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అక్కడ క్రమశిక్షణతో నడుచుకోవాల్సింది, ఏ ఒక్కరు రఫ్గా ఆడలేదు. మనం దేశం తరుపున రెజ్లింగ్ ఆడుతున్నామని’ కేసునమోదవ్వడంపై సుశీల్ స్పందించాడు. -
మ్యాట్ బయట ముష్టిఘాతాలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం! వివరాల్లోకెళితే... వచ్చే ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించాడు. అయితే సెమీస్ పోరు తర్వాత ప్రవీణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సుశీల్కు ప్రత్యర్థిగా నిలబడేంత సాహసం చేస్తావా’ అంటూ సుశీల్ అనుచరులు తనను, తన సోదరుడిని కొట్టారని అతను చెప్పాడు. తనను చంపేస్తామని కూడా వారు బెదిరించారని, ప్రొ రెజ్లింగ్ లీగ్లో ఎలా పాల్గొంటావో చూస్తామంటూ హెచ్చరించారని కూడా ప్రవీణ్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై మరొకరు దాడి చేసినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనను సుశీల్ ఖండించాడు. ‘బౌట్లో ప్రవీణ్ నన్ను కొరికాడు కూడా. అయితే అది అతని వ్యూహంలో భాగం కావచ్చు కాబట్టి పట్టించుకోను. అయితే బయట జరిగిన ఘటన సరైంది కాదు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి బౌట్ ముగిసిందంటే మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం’ అని సుశీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల జాతీయ చాంపియన్షిప్లో సుశీల్తో తలపడక ముందే అతనిపై ‘గౌరవం’తో వాకోవర్ ఇచ్చిన ముగ్గురు రెజ్లర్లలో ప్రవీణ్ రాణా కూడా ఒకడు కావడం విశేషం! -
రాజధానిలో.. దంగల్
మన మల్లయోధులకు హరియాణా నిపుణుల శిక్షణ - ఆ రాష్ట్ర యువతకు కబడ్డీలో తెలంగాణ శిక్షణ - ఘుమర్, లంబాడా నృత్యాల్లో పరస్పర తర్ఫీదు - ఇరు రాష్ట్రాల సంయుక్త ‘పురావస్తు’ తవ్వకాలు - ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పథకంలో భాగం సాక్షి, హైదరాబాద్: దంగల్ (కుస్తీ). హరియాణా మల్లయోధుడు మహవీర్సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా రూపొంది రికార్డులు నెలకొల్పిన హిందీ సినిమా. ఇప్పుడీ క్రీడ హరియాణా, తెలంగాణ మధ్య వారధి కాబోతోంది. మల్లయోధుల శిక్షణకు హరియాణా మారుపేరు కాగా, కుస్తీకి హైదరాబాద్లోనూ అనాదిగా ప్రత్యేక స్థానముంది. ఈ నేపథ్యంలో మన వర్ధమాన రెజ్లర్లకు హరియాణా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం నగరంలో ప్రత్యేక అఖాడా (రెజ్లింగ్ శిక్షణ కేంద్రం)లు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం రూపొందించిన ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమంరూపుదిద్దుకుంది. హైదరాబాద్లోని మెరుగైన అఖాడాలను, ప్రతిభావంతులైన యువతను ఎంపిక చేసేందుకు ముగ్గురు కోచ్లతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వారికి హరియాణా నిపుణులు త్వరలో శిక్షణ మొదలు పెడతారు. అలాగే కబడ్డీ, ఖోఖోల్లో హరియాణా క్రీడాకారులకు తెలంగాణ నిపుణులు తర్ఫీదునిస్తారు. ఈ క్రీడల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ దినకర్బాబు తెలిపారు. ఇది రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచటంతో పాటు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిపెట్టగలదని ఆశాభావం వెలిబుచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పథకం అమలులో తెలంగాణ–హరియాణా జోడీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. పథకం అమలులో పురోగతిని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా విభాగాల అధికారులు గురువారం సచివాలయంలో మీడియాకు వివరించారు. వారి ఘుమర్..మన లంబాడా నృత్యాలు.. సాంస్కృతిక అనుబంధాన్ని పెంచుకోవడంలో భాగంగా హరియాణా కళాకారులు ఇటీవల నగరానికి వచ్చి 15 మంది యువతులకు అక్కడి ప్రసిద్ధ ఘుమర్ నృత్యాన్ని నేర్పారు. తెలంగాణ సంప్రదాయ లంబాడా నృత్యాన్ని స్థానిక కళాకారుల నుంచి నేర్చుకున్నారు. ఇటీవల హరియాణాలో తీజ్ పండుగ సందర్భంగా అక్కడి రాజ్భవన్లో తెలంగాణ కళాకారులు ఘుమర్, హరియాణా కళాకారులు లంబాడా నృత్యాలతో స్థానికులను అలరించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం నాడు రవీంద్రభారతిలో హరియాణా కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెంకటేశం తెలిపారు. త్వరలో హరియాణాలో తెలంగాణ సంబురాలు, హైదరాబాద్లో హరియాణా దివస్ నిర్వహిస్తామని వెల్లడించారు. హరప్పా నాగరికత విలసిల్లిన ప్రాంతాల్లో ఒకటైన హరియాణాలోని కునాల్లో పురావస్తు తవ్వకాల్లో తెలంగాణ సిబ్బంది పాలుపంచుకోనున్నారు. తెలంగాణలో శాతవాహనుల జాడలున్న కర్ణమామిడి, బౌద్ధజాడలున్న పెద్దబంకూరుల్లో తవ్వకాల్లో హరియాణా నిపుణులు పాల్గొంటారని పురావస్తు సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. 100 తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు, 100 తెలుగు జాతీయాలు, ప్రముఖ తెలుగు కవుల మూడు రచనలను హిందీలోకి అనువదించి హరియాణాకు అందజేస్తారు. అలాగే వారి పుస్తకాలనూ తెలుగులోకి అనువదిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.