-
మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ చీఫ్గా పవన్ దావులూరి నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్మైండ్ డిపార్ట్మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్ను ఏఐ బ్రాంచ్ హెడ్గా నియమించగా.. తాజాగా పవన్కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది. అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్కు సైతం చోటు దక్కింది. ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. కాగ్నిజెంట్కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్వర్క్స్కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్కి శాంతను నారాయణ్లు సీఈఓలుగా రాణిస్తున్నారు. -
ఎన్కోర్–ఆల్కమ్ కొత్త ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ కంపెనీ ఎన్కోర్–ఆల్కమ్ రూ.60 కోట్లతో గుజరాత్లోని సూరత్ వద్ద అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ ఫౌండర్, సీఎండీ అవుతు శివకోటిరెడ్డి బుధవారం తెలిపారు. ‘1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలో అతిపెద్ద కేంద్రం ఇదే. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా రెడీ అవుతుంది. ఇప్పటికే సూరత్లో అల్యూమినియం డోర్స్, విండోస్ ప్లాంటు ఉంది. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఎక్స్పీరియెన్స్ సెంటర్ మార్చికల్లా ప్రారంభం అవుతాయి. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం’ అని వివరించారు. హైటెక్స్లో జనవరి 19 నుంచి జరిగే ఏస్టెక్ ట్రేడ్ ఫెయిర్లో విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు. ఎన్కోర్–ఆల్కమ్ ఫౌండర్ అవుతు శివకోటిరెడ్డి -
విండోస్ బర్త్డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్ను మ్యాక్బుక్ ల్యాప్టాప్తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్లో ఐఫోన్ సపోర్ట్కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్తో కనెక్షన్కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్కు సపోర్ట్ చేస్తే ఐఫోన్ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్తో సెటప్ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్బార్లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
విండోస్ యూజర్లకు అలెర్ట్..! అవి కచ్చితంగా కావాల్సిందే..
మనలో చాలా మంది ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతుంటాం. గత ఏడాది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. విండోస్ 10ను వాడే యూజర్లు ఉచితంగా విండోస్ 11కు ఆప్ గ్రేడ్ కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ చిన్న మెలిక పెట్టింది. కచ్చితంగా కావాల్సిందే..! మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ ఎడిషన్ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్ ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే ప్రారంభించవచ్చును. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, పూర్తిగా లెవల్లో విండోస్ 11 ప్రొను వినియోగించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ అకౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పటికే విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతున్నవారు నేరుగా మైక్రోస్టాఫ్ 11 ప్రొ ఎడిషన్లోకి లాగిన్ అవవచ్చు. అంతేకాకుండా వారు ఇప్పటికే ఆ అకౌంట్లో నిలువు చేసుకున్న డాటాను ఈ వెర్షన్లో వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని నెలల్లో విండోస్ 11 ప్రోని విడుదల చేయనుంది. -
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే గుడ్న్యూస్..!
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరపోయే శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్, పీసీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలలోని విండోస్ ప్లాట్ఫామ్ లో కూడా ఎటువంటి చింత లేకుండా గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక ప్లాట్ఫామ్ తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు విండోస్ ప్లాట్ఫామ్ మీద గేమ్స్ ఆడాలంటే వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ లాగా ఒకే దగ్గర కావు, దీంతో గేమింగ్ ప్రియులు కొంత అసౌకర్యానికి గురి అయ్యేవారు. గేమింగ్ లవర్స్ ఆసక్తిని గమనించిన గూగుల్ విండోస్ ప్లాట్ఫామ్ లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ఫామ్ తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. గేమ్ అవార్డ్స్ 2021 సందర్భంగా హోస్ట్ జియోఫ్ కీగ్లీ ప్రధాన క్రాస్ ప్లాట్ఫామ్ ప్రకటన చేశారు. గూగుల్ నిర్మించిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ విండోస్ ప్లాట్ఫారంపై కూడా లభ్యం కానుంది. దీంతో గేమింగ్ లవర్స్ తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ అడుకోవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లేలోని గేమ్స్ గురుంచి గూగుల్ ప్రొడక్ట్ డైరెక్టర్ గ్రెగ్ హార్ట్రెల్ ది వెర్జ్ తో మాట్లాడుతూ.. గెమర్స్ మరిన్ని పరికరాల్లో గూగుల్ ప్లే గేమ్స్ పొందగలరు. వారు త్వరలో ఫోన్, టాబ్లెట్, క్రోమ్ బుక్, విండోస్ పీసీ మధ్య ఎటువంటి అంతరాయం లేకుండా గేమ్స్ ఎంజాయ్ చేయగలరు అని అన్నారు. లాంఛ్ తేదీ గురుంచి ఖచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. (చదవండి: భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక) -
విండోస్ యూజర్లకు షాక్ ! మైక్రోసాఫ్ట్ కీలక సూచన
విండోస్ ప్రింట్ స్పూలర్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్ హెచ్చిరించింది. ప్రింట్ స్పూలర్ సర్వీస్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సెక్యూరిటీ ప్యాచ్ ‘ప్రింట్ స్పూలర్ కోడ్కి సంబంధించిన లోపాల కారణంగా విండోస్కి సంబంధించిన అన్ని వెర్షన్లకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని అప్డేట్ చేసుకోకి వాళ్లు ప్రింట్ స్పూలర్ని డిసేబుల్ చేయడం మంచిదని సూచించింది. -
విండోస్ 11 రాకతో స్కైప్ కథ ముగిసినట్టేనా..!
మైక్రోసాఫ్ట్ కంపెనీ తదుపరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్షన్ విండోస్ 11 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మరింత సరళతరమైన డిజైన్తో పాటు, ఆండ్రాయిడ్ యాప్స్ విండోస్లో పనిచేసేలా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించింది మైక్రోసాఫ్ట్. కాగా విండోస్ 11 రాకతో ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ స్కేప్కు ఎండ్ కార్డ్ పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్కు ఎక్కువ ఆదరణ లభించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్లో బై డిఫాల్ట్గా వీడియో కాలింగ్ రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో స్కేప్ కనుమరుగయ్యే అవకాశాలున్నాయిని ఐరిష్ & సండే ఇండిపెండెంట్ టెక్ ఎడిటర్ అడ్రియన్ వెక్లర్ పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సుమారు 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్కేప్ కొనుగోలు అతిపెద్ద డీల్గా నిలిచింది. గత సెప్టెంబరులో, మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్.. జూమ్, బ్లూజీన్స్ టీమ్స్ ,స్కైప్ ఉపయోగించి వీడియో సమావేశాలను తన చాట్ ఫీచర్లో తెస్తున్నట్లు ప్రకటించగా, అక్టోబర్లో, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ గేనోర్ మాట్లాడుతూ..స్కైప్ మరింత విస్తరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసిన, వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న యాప్ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా కొన్ని రోజుల్లోనే గూగుల్ మీట్, జూమ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలు వీడియో కాలింగ్ ఫీచర్, మీటింగ్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్కేప్పై ఉన్న ప్రజాదరణ కాస్త తగ్గిపోయింది. బహుశా మైక్రోసాఫ్ట్ ఈ కారణం చేతనో స్కేప్కు ఎండ్కార్డ్ పలకాలని భావిస్తోందని టెక్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. స్కైప్ కు అంతా మేలు చేయలే...! కరోనా మహమ్యారితో ప్రముఖ వీడియో కాలింగ్, మీటింగ్ యాప్ జూమ్ అత్యంత ఆదరణ ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో స్కైప్లో ఏలాంటి గ్రోత్ కనిపించలేదు. సుమారు 70 శాతం ప్రజలు స్కైప్ నుంచి తప్పుకున్నారు. ప్లే స్టోర్లో స్కైప్ యాప్ ఆప్షనల్గా ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసే నాథుడే లేకుండా అయ్యాడు. చదవండి: గూగుల్ ఫోటోస్లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్డ్రైవ్లో..! -
అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో కొత్త వెర్షన్ విండోస్ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్కి సంబంధించి ఇది కొత్త శకమని, రాబోయే దశాబ్దం .. అంతకు మించిన కాలానికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..!
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ నుంచి రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ను ఫ్రీ అప్గ్రేడ్గా చేసుకోవచ్చునని ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం విండోస్ 10 యూజర్లకే కాకుండా విండోస్7, విండోస్ 8.1 ఆపరేటింగ్ యూజర్లకు కూడా ఉచితంగా విండోస్ 11ను అప్గ్రేడ్ చేసుకొవచ్చునని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్ 8 వాడుతున్న యూజర్లు మాత్రం డైరక్ట్గా ఆప్గ్రేడ్ను పొందలేరు. ఈ లేటేస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎక్కువ మంది యూజర్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్లనుంచి దృష్టిమరల్చడానికి ఫ్రీ ఆప్గ్రేడ్ను మైక్రోసాఫ్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లను మైక్రోసాఫ్ట్ భవిష్యత్తులో పట్టించుకపోవచ్చును. అనలిటిక్స్ ప్లాట్ఫామ్ స్టాట్కౌంటర్ అందించిన డేటా ప్రకారం..విండోస్ 10 తర్వాత విండోస్ 7 ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నిలిచింది. విండోస్ 7 వోఎస్ మే 2021 నాటికి మార్కెట్ వాటాలో 15.52 శాతం. విండోస్ 8.1 తరువాత 3.44 శాతం వాటాగా ఉంది. కాగా విండోస్ 8 మార్కెట్లో 1.27 శాతం వాటా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ను జూన్ 24 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారికి వెంటనే ఆప్గ్రేడ్ ఇచ్చే విషయంపై అస్పష్టత నెలకొంది. చదవండి: Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్గా సత్యనాదెళ్ల -
తీగ లాగితే ‘కిటికీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటికి తలుపులు ఎంత అవసరమో కిటికీలూ అంతే. అయితే ఈ మధ్యకాలంలో చెక్కతోనో, స్టీల్తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది. ఎన్నో వెరైటీలు, డిజైన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వీటి వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ►విండో బ్లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రావు. వీటికి పరదా అవసరం ఉండదు. లివింగ్ రూమ్తో పాటు బెడ్ రూములో అందమైన ప్రకృతి చిత్రాలు ఉన్న బ్లైండ్స్ను ఏర్పాటు చేసుకుంటే ఉదయం లేచి వాటిని చూస్తే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాదు బయటి వారికి లోపల ఏముందో కనిపించదు. మనం బయట ఏం జరుగుతుందో చూడాలనుకుంటే బ్లైండ్స్కు ఉన్న తాడు లాగితే సరిపోతుంది. ఇందులో వర్టికల్, రోలర్, చిక్, ఉడెన్, ఫొటో, జీబ్రా వంటి ఎన్నో రకాలుంటాయి. ఠి చీర్ బ్లైండ్స్ సహజసిద్దమైన బొంగు కర్రలతో చేస్తారు. ఇవి తలుపు మాదిరిగా కనిపిస్తుంటాయి. ధర చ.అ.కు రూ.200–350 వరకు ఉంటుంది. ఠి వర్టికల్ బ్లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. ధర చ.అ.కు రూ.90–150 వరకు ఉంటుంది. ఠి గాలి, వెలుతురు ధారాలంగా రావాలనుకునేవారు జీబ్రా బ్లైండ్స్ కరెక్ట్. చూడ్డానికి చిప్స్ మాదిరిగా ఉండే ఈ బ్లైండ్స్ పైనుంచి కిందికి తెరుచుకుంటాయి. ధర చ.అ.కు రూ.180–280 ఉంటుంది. ఠి రోలర్ బ్లైండ్స్ అచ్చం పరదా మాదిరిగా ఉంటుంది. తాడు లాగుతుంటే ముడుచుకుంటూ పైకి లేస్తుంది. ధర చ.అ.కు రూ.130–300 వరకు ఉంటుంది. -
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు
న్యూఢిల్లీ: కొన్ని నిర్థారిత ప్లాట్ఫామ్స్కు రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు వాట్సప్ ప్రకటించింది. ‘నోకియా ఎస్ 40’లో డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్లో కూడా వాట్సప్ రాదు. భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఐఓఎస్ సపోర్ట్ చేయబోదని ఇంతకు వాట్సప్ తన బ్లాగ్లో పేర్కొంది. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్ 4.0 ప్లస్, ఐఓఎస్ 7 ప్లస్ లేదా విండోస్ ఫోన్ 8.1 ప్లస్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.3 కంటే పాత ఓఎస్లో వాట్సప్ పనిచేయదు. విండోస్ ఫోన్ 7, ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6, నోకియా సింబియన్ ఎస్ 60 వెర్షన్లలో కూడా వాట్సప్ రాదు. ఐఓఎస్ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్.. ఐఓఎస్ 7 ఆధారంగా నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓఎస్ 4.0 ప్లస్, ఐఫోన్ రన్నింగ్ ఐఓఎస్ 8 ప్లస్, విండోస్ ఫోన్ 8.1 ప్లస్, జియో ఫోన్, జియో ఫోన్ 2లకు వాట్సప్ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదని వాట్సప్ వెల్లడించింది. చాట్ హిస్టరీని ఈ-మెయిల్కు పంపుకోవచ్చని సూచించింది. -
తీ ఇన్ వన్ స్మార్ట్ విండో!
మీ ఇంట్లోని కిటికీలు ఒకేసారి మూడు పనులు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు నార్త్వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వీరు అభివృద్ధి చేసిన స్మార్ట్ కిటికీలు ఒకవైపు ఎండను, ఇంకోవైపు వేడిని నియంత్రిస్తూనే మరోవైపు హానికారక సూక్ష్మజీవులను చంపేయగలవు. విమానాలు మొదలుకొని ఆసుపత్రులు, బస్సులు, రైళ్లలో ఈ కిటికీలను వాడితే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించగలమనీ, అదే సమయంలో ఎండ, వేడిని నియంత్రించడం ద్వారా బోలెడంత డబ్బును కూడా ఆదా చేయగలమని అంటున్నారు షియా అనే శాస్త్రవేత్త. టంగ్స్టన్ ట్రయాక్సైడ్ అనే ప్రత్యేక పదార్థం వాడటం ద్వారా ఇది సాధ్యమవుతోందని, విద్యుత్తు ఛార్జ్ లేదా రసాయనాల ద్వారా ఈ పదార్థం తక్కువ సమయంలో కాంతిని ప్రసారం చే యడం లేదా అడ్డుకునే స్థితికి మారగలదని చెప్పారు. అదే సమయంలో సూర్యరశ్మిలోని పరారుణ కాంతికిరణాలను వేడిగా మార్చడం ద్వారా భవనం లోపలి భాగపు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చునని వివరించారు. టంగ్స్టన్ ట్రయాక్సైడ్కు నానోస్థాయి బంగారు కణాలను చేర్చడం ద్వారా వేడిని గ్రహించవచ్చునని చెప్పారు. ఈ వేడి వల్ల కిటికీ ఉపరితలంపై ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు జీవించలేవని అన్నారు. -
కిటికీలతో కరెంటు.. చల్లదనం
ఇంటి కిటికీలు మీక్కావాల్సిన విద్యుత్తును తయారు చేయడంతోపాటు ఇల్లంతా చల్లగా ఉంచితే ఎలా ఉంటుంది? అబ్బో అద్భుతంగా ఉంటుంది అంటున్నారా? అయితే మీ ఆశలు త్వరలోనే తీరనున్నాయి. చైనా శాస్త్రవేత్తలు కొందరు సూర్యరశ్మిలోని కొన్ని రకాల కాంతులను అడ్డుకునే, పారదర్శకమైన సోలార్ సెల్స్ను తయారు చేయడం దీనికి కారణం. సూర్యరశ్మిలో అతినీల లోహిత, పరారుణ కాంతి కూడా ఉంటుందని మనకు తెలుసు అయితే ఇవన్నీ విద్యుదుత్పత్తికి పనికి రావు. ఈ రకమైన కాంతిని మళ్లీ వాతావరణంలోకి పంపించేస్తే ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎక్కువ కాదు. చైనా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ప్లాస్టిక్లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది అటు సూర్యుడి తాపం లోనికి చొరబడకుండా అడ్డుకుంటూనే.. ఇంకోవైపు నిర్దిష్ట తరంగదైర్ఘ్యమున్న కాంతి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక ప్లాస్టిక్తో తయారైన కిటికీలు, సోలార్ ప్యానెల్స్ను వాడటం ద్వారా ఇళ్లలో విద్యుత్తు ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి ప్లాస్టిక్ సోలార్ సెల్స్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హిన్ లాప్ యిప్ చెప్పారు. చౌకగా తయారు చేసుకోగలగడం, విస్తృత వాడకానికి అవకాశం ఉండటం ఈ ప్లాస్టిక్ సోలార్స్ సెల్స్ సానుకూల అంశాలని వివరించారు. -
ఆ మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్స్ బంద్
శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ ఫోన్ 7.5, విండోస్ ఫోన్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ కూడా పనిచేయదు. విండోస్ 8.1, విండోస్ 10 మొబైళ్లకు మాత్రం పుష్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. -
ఈ కిటికీలతో బోలెడంత కరెంటు...
ఇంటి కిటికీలు వెలుతురుతోపాటు కరెంటు కూడా అందిస్తే బాగుంటుందని చాలాకాలంగా అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు తీరే రోజు దగ్గరకు వచ్చేసింది. అమెరికాలోకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల బందం ఇలాంటి సరికొత్త కిటికీలను అభివద్ధి చేసింది మరి! మార్కెట్లో ఇప్పటికే కొన్ని పారదర్శక సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా తాము చేయగలిగామని ఈ ప్రాజెక్టుకుకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త విక్టర్ క్లిమోవ్ తెలిపారు. రెండు పొరలుగా ఉండే ఈ కొత్త రకం సోలార్ ప్యానెల్ సాధారణ ప్యానెల్స్ విద్యుత్తు ఉత్పత్తి చేయలేని కాంతులనూ వాడుకోగలగడం విశేషం. కిటికీలోని రెండు పొరలు వేర్వేరు రంగులను శోషించుకోవడమే కాకుండా.. ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ రంగులను కిటికీకి ఒకవైపున ఉండే చిన్నసైజు సోలార్ ప్యానెల్స్వైపు మళ్లిస్తారు. దీంతో అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మోతాదు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల అంచనా. -
ఇంటి అందం రెట్టింపు
విపణిలోకి యూపీవీసీ తలుపులు, కిటికీలు సాక్షి, హైదరాబాద్ ఇంటికెవరొచ్చినా వారికి స్వాగతం పలికేవి తలుపులే. అందుకే అవి ఎంత అందంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపు అవుతుంది. అయితే గతంలో తలుపులు, కిటికీలను చెక్క, కలపతో చేయించేవారు. వీటి మన్నిక కొన్నేళ్లే ఉంటుంది. వీటి స్థానంలో ఇప్పుడు విపణిలోకి యూవీవీసీ తలుపులు, కిటికీలు వచ్చేశాయి. ధరలు కూడా అందుబాటులో ఉండటం, లెక్కలేనన్ని రంగులూ అందుబాటులో ఉండటం, మన్నిక విషయంలోనూ నాణ్యంగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్. దేశవ్యాప్తంగా తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటీష్ ప్రమాణాల్లో తేలింది. ⇔ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటి M? లు 300 పీఏ వరకు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ⇔ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది. ⇔ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్ధాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్ధాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ను ఆదా అవుతుంది. ⇔ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అందే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్కూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని చేధించడం అంత సులువు కాదు. బొమ్మలు భలే సాక్షి, హైదరాబాద్: ఇంట్లో గోడలకు వేలాడదీసే బొమ్మలు మన అభిరుచులను అద్దం పడతాయి. అందుకే ఎక్కడి బొమ్మలు అక్కడే వేయాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అని పెదవి విరుస్తారు. ⇔ వంట గదిలో తాజా కనిపించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా అంతగా రుచించవు. ⇔ హాల్లో ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను వేలాడదీయవచ్చు. ⇔ ఆఫీసుల్లో వెయింట్ హాల్లో అయితే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్లను పెట్టుకోవచ్చు. ⇔ ఇంటికి వేసే రంగులూ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంత కలుగచేస్తాయి. ముదురు రంగులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. -
మహిళకు మైక్రోసాఫ్ట్ నష్టపరిహారం
న్యూయార్క్ః సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్లతో ప్రవేశ పెట్టిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.. సంస్థకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. లక్షల మంది యూజర్ల అభిప్రాయాలతో తీర్చి దిద్దామని, అత్యంత సురక్షితమైన వెర్షన్ అంటూ గత యేడాది మార్కెట్లో ప్రవేశ పెట్టిన కంపెనీ.. యూజర్లను అప్ గ్రేడ్ చేసుకోమంటూ తొందర పెట్టడం తలకు చుట్టుకుంది. పాత వెర్షన్ ఓ ఎస్ లను వాడుతున్న వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమంటూ నోటీసులు పంపించడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ మహిళ కోర్టుకెక్కడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీపై పెట్టిన కేసులో విజయం సాధించింది. మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఆర్నెల్లలో 30 కోట్లమంది వరకూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకున్నా... అక్కడితో ఆగని మైక్రోసాఫ్ట్.. ఆ సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పాత ఓ ఎస్ లను వాడుతున్నవారికి నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ తమను బలవంత పెడుతోందంటూ అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేయగా... కొందరు తమ ప్రమేయం లేకుండా విండోస్ 10 ఇన్ స్టాల్ అయిపోతోందంటూ మండిపడ్డారు. అదే ఆరోపణలతో కోర్టు కెక్కిన మహిళ కేసును కోర్టు విచారించింది. తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది. విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
విండోస్ డెస్క్టాప్లోనూ వాట్సాప్
న్యూయార్క్: వాట్సాప్ అంటే ఇప్పటిదాకా మొబైల్ ఫోన్లకే పరిమితం. ఇకపై విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే డెస్క్టాప్లోనూ వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఫేస్బుక్. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. విండోస్, మ్యాక్ డెస్క్టాప్లో ఏ బ్రౌజర్ను ఉపయోగిస్తున్నప్పటికీ ఈ యాప్తో వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుకోవచ్చు. విండోస్ 8, ఆపై ఓఎస్లకు మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. మ్యాక్ 10.9, ఆపై ఓఎస్ వినియోగదారులు మాత్రమే దీనిని వినియోగించుకోవచ్చు. యాప్ను ఓపెన్ చేసి, అందులో కనిపించే క్యూఆర్ కోడ్ను మన స్మార్ట్ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా డెస్క్టాప్పై వాట్స్యాప్ దర్శనమిస్తుంది. ఎంచక్కా మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడమే. -
యూపీవీసీతో లుక్కే వేరు!
♦ ఇంటి అందాన్ని రెట్టింపు చేసేది సింహద్వారమే ♦ దర తక్కువ, మన్నికెక్కువ దేశంలో తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. సాక్షి, హైదరాబాద్: ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో యూపీవీసీ తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ను సంక్షిప్తంగా యూపీవీసీ అంటాం. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. సౌకర్యాలెన్నో.. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. యూపీవీసీ తలుపులు, కిటికీలు 2,400 పీఏ ఒత్తిడి (సుమారుగా గంటకు 230 కి.మీ.వేగం)ని కూడా తట్టుకుంటాయని బ్రిటిష్ ప్రమాణాల్లో తేలింది. ♦ సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీ లు 300 పీఏ వరకు నీటిలో తడిసినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారుగా 30 ఏళ్లు. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తుప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వే యాల్సిన అవసరం కూడా లేదు. ♦ అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు త గ్గుతుంది. ♦ యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ♦ సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అంటే యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణహితమైనవి. అంతేకాకుండా యూపీవీసీ తలుపులు, కిటికీలకు ఉండే స్క్రూలు, గ్రిల్స్ బయటికి కన్పించవు. దీంతో దొంగలు వీటిని ఛేదించడం అంత సులువు కాదు. -
అలా లేకుంటే విమానాలు కూలిపోతాయి
ఒక వస్తువు నిర్మాణానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకే, ప్రతిపనికి భవిష్యత్ అంచనాలు, గతంలోని పరాభావాలు, ప్రస్తుత అనుభవాలు మేళవించుకొని ఒక వస్తువును రూపొందిస్తారు. అది చూసేందుకు తేలికగా అనిపించినా, పెద్దగా ఆలోచింపలేకపోయినా అసలు కథ తెలిస్తే మాత్రం అవునా.. అలాగా అని ఆసక్తిగా అనుకోవాల్సిందే. సాధారణంగా మనం విమానాలు చూస్తుంటాం. కొందరికైతే వాటిలో ప్రయాణించిన అనుభవం కూడా ఉండి ఉండేఉంటుంది. ఆ సమయంలో గమనించారో లేదో ఏ విమానానికి చూసిన దాని కిటికీలు గుండ్రంగా ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఆలోచించారా.. అలా ఉండటం వల్ల మతలబు ఏమిటి? ఎప్పటి నుంచి వాటిని గుండ్రంగా తయారుచేయడం మొదలుపెట్టారు? వాటిని చతురస్రాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, త్రిభుజాకారంలోనో ఎందుకు తయారు చేయలేదు? అని పరిశీలిస్తే.. దాని వెనుక అసలు కథ తెలిసింది. అది 1950. అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా ట్రెండింగ్. ఇవి మిగతా విమానాల కన్నా వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతోపాటు ఎంతో ఒత్తిడినితట్టుకోగలవి. కానీ,దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. అయితే, అనుహ్యంగా ఇదే జెట్ లైనర్ విమానాలు 1953లో కూలిపోయి 56 మంది ప్రాణాలు విడిచారు. ఇలా ఎందుకు జరిగి ఉంటుందని విచారణచేస్తే ఆ విమాన కిటికీలే సమస్య అని తెలిసింది. సాధారణంగా చతురస్రాకరంలో ఉంటే వాటికి కోణాలు ఉంటాయిని, ఒక్కోకోణం ఒక్కో బలహీనత ఉండి అక్కడ లోపలికి గాలి చొచ్చుకొచ్చి విండో పగిలిపోయి అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉండి విమానాన్ని కూలిపోయేలే చేస్తుందని వారు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి విమానాల కిటికీలు గుండ్రంగా రూపొందించడం మొదలు పెట్టారు. అలా ఉండటం వల్ల ఒత్తిడి అనేది ఒక చోట కేంద్రీకృతం కాకుండా విండో చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. తక్కువ ఒత్తిడి మాత్రమే విండోస్పై పడి విమానాలు సురక్షితంగా ఉంటాయి. -
ఇంట్లో దుర్వాసన తగ్గాలంటే..
ఇంటిప్స్ తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి.రాత్రిపూట కార్పెట్పై బేకింగ్ సోడా చల్లి, మరుసటి రోజు ఉదయం వాక్యూమ్ క్లీనర్తో శుభ్రపరచాలి.బకెట్ వేడి నీళ్లలో కప్పు అమోనియా కలిపి, ఆ నీళ్లతో ఫ్లోర్ తుడవాలి.అమోనియా కలిపిన వేడి నీటిలో డోర్మ్యాట్స్ నానబెట్టి, ఉతకాలి. ఫ్లోర్ తడి లేకుండా జాగ్రత్తపడాలి.ఫర్నీచర్, కార్పెట్స్, కర్టెన్స్ శుభ్రంగా ఉంచాలి. కిచెన్ సింక్లో క్యారట్, ఉల్లి, బంగాళదుంప తొక్కలు మిగిలిపోతే దుర్వాసన వస్తుంది. కొద్దిగా ఐస్ను గ్రైండ్ చేసి వేయాలి. దాని మీద బొరాక్స్ పౌడర్ను చల్లి, పై నుంచి నీళ్లు పోయాలి. సింక్లో నీళ్లు పోయే పైప్ దగ్గర మూత వేసి, దాంట్లో ఒక అంగుళం మేర వేడి నీళ్లు పోయాలి. దాంట్లో పిడికెడు బేకింగ్ సోడా వేయాలి. తర్వాత ఆ నీటిని వదిలేయాలి. వేడినీళ్లు, బేకింగ్ సోడా వల్ల సింక్లో దుర్వాసన వదులుతుంది. ఈ జాగ్రత్తలు ఇంటిని దుర్వాసన నుంచి విముక్తి చేస్తాయి. -
ఈ పల్లె... పక్షుల స్వర్గం!
ఒక ఉదయాన... కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు... చెట్టు కొమ్మ మీద పిట్ట పాట వినక ఎన్ని రోజులవుతుందో! ఒక సాయంత్రాన... ఆకాశ దేశాన బారులు బారులుగా ప్రయాణించే పక్షుల గుంపును చూసి ఎన్ని రోజులవుతుందో! మాయమైపోతుంది. మనిషిలోని మనిషి మాత్రమే కాదు... పక్షుల జాడ కూడా! అందుకే ఆ పక్షులను తన గుండెల్లో పెట్టుకోవాలనుకుంది కొక్కరేబేలూర్. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకాలో ఉన్న ఈ చిన్న ఊళ్లోకి అడుగుపెడితే... చెట్లకు వేలాడే పక్షిగూళ్లు స్వాగతతోరణాల్లాగ కనిపిస్తాయి. పక్షులను ప్రేమించమని మౌనంగా చెబుతాయి. ప్రతి చెట్టుకూ పక్షి గూళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మే నెలలోనైతే చిట్టి చిట్టి పక్షి పిల్లలతో వాతావరణం అల్లరి అల్లరిగా ఉంటుంది. పక్షులను పక్షుల్లా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. పక్షులు కూడా గ్రామస్థులకు బాగా అలవాటుపడిపోయాయి. వాటికి ఎంత దగ్గరికి వెళ్లినా, భయంతో పారిపోకుండా కళ్లలో కళ్లు పెట్టి ప్రేమగా చూస్తాయి. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన పక్షుల్లో పెలికాన్, బ్లాక్ ఐబిస్, గ్రే హెరాన్, ఇండియన్ పాండ్ హెరాన్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సెప్టెంబర్లో గ్రామంలోకి ప్రవేశించే పక్షులు మే తరువాత వేరే చోటుకి వలస వెళతాయి. ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి వలస వచ్చే ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా తమ అదృష్టంగా కూడా భావిస్తారు ఆ గ్రామస్థులు. చెట్ల మీద నివాసముండే పక్షులు అప్పుడప్పుడూ దగ్గరలోని పంటపొలాలపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటాయి. దీనివల్ల నష్టం వాటిల్లినా... వాటిని తరిమికొట్టడం, హింసాత్మక చర్యలకు దిగడంలాంటివేమీ చేయరు గ్రామస్థులు. పక్షులపై వారి ప్రేమను ప్రభుత్వం సైతం అర్థం చేసుకుంది. అందుకే పక్షుల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ‘‘ఈ పక్షులను చూస్తుంటే సొంత బిడ్డల్ని చూసినట్లుగా అనిపిస్తుంది’’ అంటుంది గ్రామానికి చెందిన ఒక గృహిణి. కొందరైతే చనిపోయిన తమ ఆత్మీయులను ఈ పక్షుల్లో చూసుకుంటా మని చెబుతున్నారు. ‘‘మీది ఏ ఊరు? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే, మా ఊరు పేరు చెబితే రాష్ట్రంలో గుర్తు పట్టనివారు ఉండరు. పైగా మా ఊరి ఔన్నత్యం గురించి పొగుడుతుంటారు కూడా’’ అంటాడు గ్రామానికి చెందిన కుమార్ అనే విద్యార్థి. ‘‘ఆడపిల్ల ప్రసవానికి పుట్టింటికి వెళ్లినట్లు ఈ పక్షులు మా ఊరికి వస్తాయి’’ అని గర్వంగా చెబుతాడు యోగేశ్ అనే యువకుడు. కొక్కరేబేలూర్ చేస్తున్న పుణ్యం ఊరకే పోలేదు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు ఈ గ్రామం ‘రోల్ మోడల్’గా మారింది. ప్రభుత్వం కూడా పక్షుల సంక్షేమానికి ప్రత్యేకంగా గ్రాంటు విడుదల చేస్తోంది. పక్షులను వాటి మానాన వాటిని వదిలేయడం కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రామస్థులు. ఏదైనా పక్షి అనారోగ్యంతో కనిపించినా, గాయపడినా తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కొందరైతే చేపపిల్లలను ప్రేమగా పక్షుల నోటికి అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఊరు దాటిన తరువాత ఒక్క చెట్టు మీద కూడా పక్షుల గూళ్లు కనిపించవు. దీన్ని బట్టి పక్షులకు, ఆ ఊరికి ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది. ‘‘పక్షులు ఈ ఊరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది? ఈ ఊరికే ఎందుకు రావడం మొదలైంది?’’లాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలేవీ దొరకక పోవచ్చు. కాని వాటి గురించి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- ‘‘పక్షులు కొలువైన చోట ఊరికి మంచి జరుగుతుంది’’ అని! -
త్రీమంకీస్ - 60
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్థ్రిల్లర్ - 60 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఏమిటా విండోస్?’’ గోడకి ఆనించి ఉన్న కిటికీలని చూసి మర్కట్ అడిగాడు. ‘‘అప్పుడప్పుడూ విండో షాపింగ్కి వెళ్ళొస్తూంటాను. కుక్క తోకని కూడా కాలు అనుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?’’ ‘‘ఐదు’’ బుష్ని చూస్తూ వేళ్ళతో లెక్కపెట్టుకుని మర్కట్ జవాబు చెప్పాడు. ‘‘తప్పు. నాలుగే. తోకని కాలని అనుకున్నంత మాత్రాన అది కాలు కాదు. ఇంకోటి అడగనా?’’ వైతరణి నవ్వుతూ అడిగింది. ‘‘ఒద్దు. ఒకే కుక్క చేత రెండుసార్లు కరిపించుకునేవాడు మూర్ఖుడు అవుతాడు.’’ వాళ్ళిద్దరూ దుప్పటి కిందకి చేరాక వైతరణి తన గౌన్ని విప్పి మంచం కింద పడేస్తూ అడిగింది. ‘‘లైట్లోనే ఇష్టం అన్నాగా? చెప్పండి. మనకి పుట్టే పిల్లల బంగారు భవిష్యత్కోసం ఏం చేద్దాం?’’ ‘‘టీ అమ్మే వాడిలా పెంచి మోడీని చేయచ్చు. లేదా ఐఐటిలో చదివించి కేజ్రీవాల్ని చేయచ్చు’’ మర్కట్ చెప్పాడు. ‘‘విదేశాల్లో మాత్రం చదివించద్దండి’’ ఆలోచించి చెప్పింది. ‘‘ఏం?’’ ‘‘రాహుల్ గాంధీలా తయారవుతాడు.’’ 19 ‘‘మీరు అసలు ఇంగ్లీష్ మందులే వాడరా?’’ వానర్ అడిగాడు. ‘‘ఊహూ. ఇంగ్లీష్ మందు తీసుకుంటే రెండుసార్లు రికవర్ అవాలి. ఓసారి జబ్బు నించి. ఇంకోసారి ఆ మందు నించి.’’ ‘‘మీకు బ్రేక్ఫాస్ట్ అలవాటు లేదా? అది మంచిదని డాక్టర్లు చెప్తారే?’’ వానర్ అడిగాడు. ‘‘ఏది తిని ఫాస్ట్ని బ్రేక్ చేస్తామో టెక్నికల్గా అదే బ్రేక్ఫాస్ట్. అందువల్ల ప్రపంచంలో బ్రేక్ఫాస్ట్ తినని వారే ఉండరు’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘ఈ రాత్రి వంట నేను చేయనా? లేక మీరు చేస్తారా?’’ వానర్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడే మర్చిపోయావా? నాన్ సెక్స్వల్ ప్రేమలో నంబర్ నైన్, కుక్ ఏ మీల్ టుగెదర్. కలిసి వంట చేయడం కూడా ప్రేమని వ్యక్తం చేసే ఓ పద్ధతి’’ డాక్టర్ మూలిక చెప్పింది. వానర్ ఫ్రిజ్ తెరిచి కూరలు ఉంచే క్రిస్పర్ బాక్స్ని తెరిచి చూశాడు. ‘‘అందులో అనేక రకాల ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, భస్మాలు కనిపించాయి. వాటిని చూసి చెప్పాడు. ‘‘లేవు. నేను వెళ్ళి తెస్తాను.’’ ‘‘ఏం లేవు?’’ మూలిక అడిగింది. ‘‘వంకాయలు. ఉల్లిపాయలు. ఉల్లి కారం పెట్టిన వంకాయ కూర తినాలని ఉంది.’’ ‘‘ఉల్లిపాయా! వంకాయా!’’ మూలిక పక్కలో బాంబ్ పడ్డట్లుగా అరిచింది. ‘‘ఏం?’’ ‘‘వంకాయ సర్వరోగప్రదాయిని అని వినలేదా? దాన్ని చస్తే తినకూడదు. తింటే త్వరగా చస్తాం అని ధన్వంతరి రాశాడు. ఉల్లిపాయ గాలే అసలు మనకి తగలకూడదు అని చరకుడు రాశాడు. ఈ రెండూ ఆయుర్వేదంలో నిషిద్ధం.’’ ‘‘పోనీ దొండకాయ, ఉల్లి కారం కూర?’’ ‘‘దొండ పరమ నిషిద్ధం. వెనకటికి ఒకడికి దొండ పాదు కింద స్నానం చేస్తే బుద్ధి మాంద్యం పట్టుకుందని చరకసంహితలో రాసుంది. అది మనిషిని నిస్తేజంగా మారుస్తుంది.’’ ‘‘వంకాయ, దొండకాయలకే ఉల్లి కారం వేసి వండితే బావుంటుంది. ఒక్కసారికేం కాదు.’’ ‘‘ఊహూ. అవి రెండూ వాతపిత్త దోషాలని కలిగిస్తాయి.’’ ‘‘పోనీ చామదుంపలు తెస్తాను. వేయించి ఇంత ధనియాల పొడి, ఉప్పూ, కారం చల్లి...’’ ‘‘నో. నో. నో. నో... దుంపకూరలు కూడా నిషిద్ధం. నేల అడుగున పండే వాటిలో ఒక్క వేరుశెనగ మాత్రమే శ్రేష్టం. మిగిలినవన్నీ వర్జింప తగ్గవి. అవన్నీ వాతాన్ని కలిగించేవి.’’ ‘‘కాని రాముడు అరణ్యవాసంలో కందమూలాలనే తిని జీవించాడు కదా?’’ ‘‘రాముడు దేవుడు. నువ్వు మనిషి.’’ వానర్ కొద్దిసేపు ఆలోచించి తనకి ఇష్టమైన కూరలని, వాటిని వండే విధానాలని చెప్పాడు. ఆమె వేటికి వాతపిత్తకఫ దోషాలో చెప్పి ఖండించేసింది. ‘‘బెండకాయ?’’ ‘‘అది కొంత దాకా ఓకే.’’ ‘‘సరే. బెండకాయ, వేరుశెనగపప్పు కలిపి వేపుడు చేస్తే?’’ ‘‘ఈరోజు చతుర్దశి. చతుర్దశి నాడు బెండకాయ తింటే ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది అని ఆయుర్వేద రత్నావళిలో రాశారు.’’ ‘‘పోనీ సొరకాయలో పాలు పోసి వండుదామా?’’ వానర్ ఆశగా అడిగాడు. ‘‘రాత్రి పూట సొరకాయ నిషిద్ధం. జలుబు చేస్తుంది.’’ ‘‘సరే. ఈరోజు తిథికి, ఈ వారానికి ఏవి సూటబుల్?’’ బలహీనంగా అడిగాడు. ‘‘తోటకూర పొడికూర, బచ్చలి పులుసు, గంగబాయిల కూర పచ్చడి.’’ ‘‘అదేమిటి? ఆక్కూరతో పచ్చడా? ఎక్కడా వినలేదే?’’ ‘‘చేస్తాగా. తిని చూసి మాట్లాడు. ముందుగా ఆకుకూరలని ఇసక పోయేలా బాగా కడిగి కాడల నించి ఆకులని వేరు చేయి... నా వంటంటే అంతా పడి చస్తారు.’’ (కోక్ ఫ్రిజ్లో కాకుండా టాయ్లెట్లో ఎందుకు ఉంది?) -
కొత్తసరుకు
ఐబాల్ ఆండీ ఫ్రిస్బీ... దేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఐబాల్ తాజాగా ఫ్రిస్బీ, స్టాలియన్ పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రిస్బీ రూ.5799, స్టాలియన్ రూ.6999లకు ఈకామర్స్ సైట్ల ద్వారా లభిస్తున్నాయి. ఫ్రిస్బీ ఫీచర్ల విషయానికొస్తే... ఇది లేటెస్ట్ ఓఎస్ కిట్క్యాట్తో నడుస్తుంది. నాలుగు అంగుళాల స్క్రీన్సైజున్న ఈ ఫోన్లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ను వాడారు. ఒక జీబీ ర్యామ్, 4జీబీల ప్రధాన మెమరీ ఉన్నాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ, సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 0.3 ఎంపీ మాత్రమే. బ్యాటరీ సామర్థ్యం 1600 ఎంఏహెచ్ మాత్రమే. ఇక స్టాలియన్ ఫీచర్లను పరిశీలిస్తే... దీని స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు కాగా, బ్యాటరీ సామర్థ్యం 1700 ఎంఏహెచ్. మిగిలిన ఫీచర్లన్నీ ఫ్రిస్బీతో సమానంగా ఉన్నాయి. రెండు ఫోన్లకూ త్రీజీ, ఎడ్జ్,జీపీఆర్ఎస్, వైఫై 802.11.బీ/జీ/ఎన్, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. జోల్లా సెయిల్ఫిష్... స్మార్ట్ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఎంట్రీ ఈ జోలా సెయిల్ఫిష్ ఓఎస్. ఆండ్రాయిడ్, విండోస్, ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ల తరువాత ఫైర్ఫాక్స్ ఓఎస్ అందుబాటులోకి రాగా తాజాగా ఈ సరికొత్త ఓఎస్ సెయిల్ఫిష్ మార్కెట్లోకి వచ్చింది. మాజీ నోకియా ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా విడుదలైన సరికొత్త స్మార్ట్ఫోన్ అనేక ఆసక్తికరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలై ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు రూ.16,499. సెయిల్ఫిష్ ఓఎస్ ప్రత్యేకత దాని యూజర్ ఇంటర్ఫేస్, మల్టీటాస్కింగ్ సామర్థ్యాల్లో ఉందని నిపుణులు అంటున్నారు. స్క్రీన్సైజు 4.5 అంగుళాలు కాగా, దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్డ్యుయెల్కోర్ స్నాప్డ్రాగన్ ఫోన్ను ఉపయోగించారు. రామ్ ఒక జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 16 జీబీ. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా 8 ఎంపీ రెజల్యూషన్తో, సెల్ఫీ కెమెరా 2ఎంపీ రెజల్యూషన్తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లోని చాలావరకూ అప్లికేషన్లను సపోర్ట్ చేయడం మరో విశేషం. ఎస్ఎంఎస్, ఫేస్బుక్, వాట్సప్ వంటి అన్ని రకాల మెసేజింగ్లు ఒకేచోట ఉండటం మరో ఆసక్తికరమైన ఫీచర్.