weight lifting
-
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
సాక్షి, వెబ్డెస్క్: కరోనా మహమ్మారి ప్రకంపనల మధ్య అసలు ఒలింపిక్ ఉత్సాహం ఉంటుందో లేదో అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్దమై పోయింది. సంబరం అలా మొదలైందో లేదో ఇలా ఒక పతకం భారత సిగలో మెరవడం విశేషమే మరి. అయితే ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలతో మెరిసి మురిపించిన లెజెండరీ భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం. రంగం ఏదైనా పురుషులతో సమానంగా అనే మాటను మన అమ్మాయిలు అధిగమించి తమకుతామే సాటి అంటూ దూసుకుపోతున్నారు. అన్నింటా మేమే ఫస్ట్ అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్... టెన్నిస్..బ్యాడ్మింటన్..క్రికెట్ ఇలా క్రీడ ఏదైనా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడా సంగ్రామం వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది. Chanu Saikhom Mirabai టోక్యో ఒలంపిక్స్లో తొలి పతకంతో శుభారంభం చేసి ప్రపంచం దృష్టిని తన వైపుతిప్పుకుని భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేశారు మన మణిపూర్ మణిపూస. మణిపూర్కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెయింట్ లిప్టింగ్ పోటీల్లో 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత మన దేశానికి వన్నె తెచ్చిన పతకమిది. ‘‘బంగారం పతకం కోసం చాలా ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు. కానీ సెకండ్ లిఫ్ట్ తరువాత పతకం ఖాయమని అర్థమైపోయిందంటూ’’ ఆమె సంబరపడిపోయారు. అంతేకాదు ‘‘ముందు ఒక పిజ్జా తినాలి..పిజ్జా తిని ఎన్ని రోజులైందో’’ అంటూ అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించారు. మరోవైపు తన విద్యార్థి మొత్తం దేశం మోముపై చిరునవ్వులు పూయస్తోందంటూ మీరా బాయి గురువు , మరో ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కుంజారాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. మణిపూర్ మణిపూస కుంజరాణీ దేవి వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని సైతం అందుకుని భారతీయ వెయిట్ లిఫ్టింగులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహిళ మణిపూర్కే చెందిన కుంజారాణీ దేవి. మీరా బాయికి తొలి అడుగులు నేర్పిన గురువు కుంజారాణి కావడం ఇక్కడ మరో విశేషం. ఆమె కరీర్ను రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. 2015 వరకు తనకు గురువుగా వున్న ఆమె స్టయిల్ను ఫాలో అవుతానని, ఆమెను చూసే వెయిట్ లిఫ్టింగ్ను కరియర్గా ఎంచుకున్నానని స్వయంగా మీరా బాయే చెప్పుకున్నారు. 1985 సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించారామె. 1989లో మాంచెస్టర్లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు సాదించారు. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్నితన ఖాతాలో వేసుకున్నారు. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించారు. ఇక ఆ తరువాత 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోనూ తన రెండవ స్థానాన్ని సాధించారు. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగంలో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకాన్ని సొంతం చేసుకున్నారు. యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పారు. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి 1990వ దశకంలో ఒలింపిక్ వేదికగా మువ్వన్నెల పతాకానికి వన్నె తెచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం కాంస్య పతకం సాధించారు. ఈ సమయంలో భారత్కు ఏకైక పతకాన్ని సాధించి, దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టిన ఆ క్షణాలను సగటు భారతీయుడు ఎలా మర్చిపోగలడు. 1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలతోపాటు, 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన రికార్డు మల్లీశ్వరి సొంతం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలోని క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ పదవి ఆమెను వచ్చి వరించింది. పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడా సంగ్రామం హోరా హోరీగా జరగనుంది. మన దేశం నుంచి 119మంది పాల్గొంటున్న ఈ ఒలింపిక్స్లో మరిన్ని పతకాలు, రికార్డులు మన సొంతం కావాలని కోరుకుందాం. ముఖ్యంగా బాక్సింగ్ మేరీ కోమ్ ఈ ఒలంపిక్లో ఎలాగైనా గోల్డ్ కొట్టాలి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, సీడబ్ల్యుజీ బంగారు పతక విజేత, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, ఆసియా ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత, ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నప్పటికీ .. ఇపుడు బంగారు పతకం సాధించాలనేది ఆశ. ఇందుకు 2020 టోక్యో గేమ్స్ ఆఖరి అవకాశం. వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన మహిళామణుల గురించి రాయాలంటే చాలా పెద్దలిస్టే.. భారత తొలి మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జి మొదలు పరుగుల రాణి పీటీ ఉష, బాక్సింగ్కు మారుపేరు మేరీ కోమ్...కుస్తీ వస్తాదు సాక్షీ మాలిక్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా.. చదరంగంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ భాగ్యశ్రీ థిప్సే, కోనేరు హంపీ, హారిక.. ఇక క్రికెట్లో మిథాలీరాజ్.. సఫాలీ వర్మ ఇలా ఎందరో.. మరెందరో.. అందరికీ మరోసారి జయహో...! -
కరణం మల్లీశ్వరి ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ
-
మీరాబాయి చానుపై ప్రశంసల జల్లు
-
మీరాబాయి చానుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. కాగా భారత్కు పథకం సాధించిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ స్పందించారు. ‘అద్భుతమైన ప్రదర్శన. టోక్యో 2020 ఒలింపిక్స్లో భారతదేశం పథకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తం మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. A magnificent feat! Absolutely delighted to see India off the mark in #Olympics #Tokyo2020. Hearty congratulations @mirabai_chanu on winning the silver medal in 49 kgs women's weight lifting category.#MirabaiChanu — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 -
వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్న సింధూ
మహబూబ్నగర్ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్ లిఫ్టింగ్లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్ ట్రైనింగ్ అనంతరం సింధూ వెయిట్ లిఫ్టింగ్కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది. 27 నేషనల్ పోటీల్లో 19 పతకాలు సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్ఘడ్ (రాయ్పూర్)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులోని ఎంఎస్యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్కత్తాలో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్లిఫ్టింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్కత్తా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. – సింధూ, వెయిట్లిఫ్టర్ 2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్రెడ్డి చేతులమీదుగా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ -
గురు నాయుడుకు కాంస్య పతకం
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ఆసియా యూత్, జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ ఎస్.గురు నాయుడు కాంస్య పతకాన్ని సాధించాడు. ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో విజయనగరం జిల్లా లిఫ్టర్ గురు నాయుడు యూత్ బాలుర 49 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. గురు నాయుడు మొత్తం 177 కేజీలు (స్నాచ్లో 77+క్లీన్ అండ్ జెర్క్లో 100) బరువెత్తాడు. -
భారత వెయిట్లిఫ్టర్ రాఖీ హల్దర్కు కాంస్యం
దోహాలో జరిగిన ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ టోర్నమెంట్లో భారత్కు మూడో పతకం లభించింది. మహిళల 64 కేజీల విభాగంలో రాఖీ హల్దర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచింది. రాఖీ మొత్తం 218 కేజీలు (స్నాచ్లో 85 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 123 కేజీలు) బరువెత్తింది. ఈ క్రమంలో రాఖీ 214 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ సీనియర్ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ స్థాయి అర్హత టోర్నమెంట్గా గుర్తింపు పొందిన ఖతర్ కప్లో ఓవరాల్గా భారత్కు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు ఈ టోర్నీలో మీరాబాయి చాను స్వర్ణం, జెరెమీ లాల్రినుంగా రజతం సాధించారు. -
ఒకేసారి 27 రికార్డులు బద్దలు
దోహా: ఖతర్ కప్ అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ టోర్నమెంట్లో యూత్ ఒలింపిక్స్ చాంపియన్, భారత యువతార జెరెమీ లాల్రినుంగా రజత పతకం సాధించాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన మిజోరం లిఫ్టర్ లాల్రినుంగా మొత్తం 306 (స్నాచ్లో 140 కేజీల+క్లీన్ అండ్ జెర్క్లో 166 కేజీలు) కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల లాల్రినుంగా తన పేరిటే ఉన్న ఐదు సీనియర్ జాతీయ రికార్డులను, ఐదు జాతీయ జూనియర్ రికార్డులను, ఐదు జాతీయ యూత్ రికార్డులను, మూడు యూత్ వరల్డ్ రికార్డులను, మూడు ఆసియా యూత్ రికార్డులను, ఆరు కామన్వెల్త్ రికార్డులను బద్దలు కొట్టాడు. -
కాజల్.. సవాల్
చెన్నై : హీరోయిన్ల ఛాలెంజ్లు అధికం అవుతున్నాయి. మొన్న నటి సమంత ఒక్క బక్కెట్ నీరు అంటూ ఛాలెంజ్ విసిరింది. తాజాగా నటి కాజల్అగర్వాల్ కూడా సవాల్ అంటోంది. అయితే ఈ అమ్మడి ఛాలెంజ్ చాలా బరువైనదే. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నట జీవిత మైలురాయి టచ్ చేయడానికి చేరువలో ఉన్న నటి కాజల్ అగర్వాల్. అదే విధంగా అర్ధ సెంచరీ చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా ఈ అమ్మడికి సినీ మోహం ఏ మాత్రం తీరలేదు. స్టిల్ నాటౌట్ క్రేజీ హీరోయిన్గా బరిలో ఉంది. బహు భాషా నటిగానూ రాణిస్తోంది. ఇందుకు కావలసినంత అందాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలూ చేస్తోంది. అందుకు కసరత్తులు చాలా అవసరం. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ మరింత డోస్ పెంచేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఎక్సర్సైజ్లతో సరిపెట్టుకుంటూ వెయిట్ లిప్ట్ జోలికి పోనీ ఈ బ్యూటీ ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలెట్టేసింది. వెయిట్లిప్ట్ల్లో హీరోయిన్లు పోటీ పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా కాజల్అగర్వాల్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 70 కిలోల బరువును చేతులతో లేపేసే ప్రయత్నం చేసింది. తన శిక్షకుడి పర్యవేక్షణలో అంత వెయిట్ లిప్ట్ చేసిన కాజల్ అమ్మో అంటూ ఒక్క సారిగా కింద చతికిల పడిందట. అయితే ఇది ట్రైలరేననీ, మెయిన్ పిక్చర్ ముందు ముందు చూపిస్తాననీ సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్ను తను విసిరింది అభిమానులకా? లేక ఇతర హీరోయిన్లకా అనే చర్చ సినీ వర్గాల్లో స్టార్ట్ అయ్యింది. అయితే చందమామ వెయిట్ లిప్ట్ కసరత్తుల దృశ్యాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కమలహాసన్కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. ఆయన సరసన మరింత నాజూగ్గా కనిపించాలనే ఈ వెయిట్లిప్ట్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కాజల్ కసరత్తుల వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. -
వెయిట్ లిఫ్టింగ్తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
బరువులెత్తితే.. మధుమేహ నియంత్రణ!
మధుమేహంతో బాధపడుతున్న ఊబకాయులకు వెయిట్ ట్రెయినింగ్, శక్తినిచ్చే వ్యాయామాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. నడక లాంటి వ్యాయామాలే మధుమేహానికి చాలనుకుంటున్న తరుణంలో కంపినాస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త విషయాన్ని చెప్పడం గమనార్హం. ఊబకాయులు పైన చెప్పిన రెండు పనులు చేస్తే వారి కాలేయాల్లో పేరుకున్న కొవ్వు గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా రక్తంలోని చక్కెర మోతాదులు నియంత్రణలోకి వస్తాయని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో రెండువారాలపాటు బరువులెత్తడం, శక్తినిచ్చే వ్యాయామాలు చేయడం ద్వారా కాలేయ కణజాలంలోని జన్యువుల్లో మార్పులు వచ్చాయని, ఫలితంగా అక్కడి కొవ్వులు వేగంగా కరగడం మొదలైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియాండ్రో పెరీరా తెలిపారు. ఇదంతా ఎలా జరుగుతోందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వ్యాయామం కారణంగా నిర్దిష్ట ప్రొటీన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను గుర్తిస్తే వాటిని కృత్రిమంగా తయారు చేయవచ్చునని లియాండ్రో ఆశాభావం వ్యక్తం చేశారు. కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు స్థానికంగా మంట/వాపు లాంటివి వస్తాయని, ఫలితంగా కాలేయంలోని కణాలు ఇన్సులిన్పై ప్రభావం చూపే స్థితిని కోల్పోతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాహారంగా మాత్రమే ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్లూకోజ్ రక్తంలోనికి చేరిపోతుందని వివరించారు. -
విరాట్ వీరత్వం చూశారా!
ఐపీఎల్ 2012లో ఘోరంగా విఫలమైన తర్వాత తనపై తనకే చికాకు కలిగింది విరాట్ కోహ్లికి. జట్టులో ఒక్కరికైనా క్రీడాకారుడికి ఉండాల్సిని బాడీ ఫిట్నెస్ ఉందా అంటూ అప్పటి టీమిండియా కోచ్ విమర్శ. జట్టులో కొనసాగలన్నా.. అత్యున్నత శిఖరాలు ఎక్కాలన్నా ఎదో కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాడు కోహ్లి. అనుకున్నదే తడవుగా ఫిట్నెస్ మంత్ర మొదలెట్టాడు. బాడీ ఫిట్గా ఉంటే బ్యాటింగ్ బాదేయొచ్చని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు మొదలెట్టిన వర్కౌట్స్ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. తొలుత కోహ్లి పేరే వినిపించడం విశేషం. ప్రస్తుతం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించే వరకు వచ్చాడు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్గా ఉండే కోహ్లి.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. వెయిట్ లిఫ్టర్కు ఏమాత్రం తీసిపోని విధంగా.. ఎక్కువ బరువులను మోస్తూ ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్గా కోహ్లి కనిపించాడు. అంతేకాకుండా ‘ఏం సాధించాలనుకున్నా, ఏదైనా కావాలని కోరుకోవాలనుకున్నా ముందుగా మనం బలంగా, బాడీ ఫిట్గా ఉండాలి’అంటూ క్యాప్షన్ చేర్చాడు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. సారథి దారిలోనే మిగిలిన ఆటగాళ్లు ఫిట్నెస్పై దృష్టి పెట్టడం విశేషం. అందుకే ఆటగాళ్లు పూర్తిగా ఫిట్గా ఉండటంతో టీమిండియా ఎప్పుడూ లేనంతంగా ఫీల్డింగ్లో బలంగా ఉంది. ఇక వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో చెలరేగిన టీమిండియా సారథి వరసగా మూడు శతకాలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఇక ఈ సిరీస్లోనే పదివేల పరుగుల క్లబ్లో చేరాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లోనే పదివేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. -
వెయిట్లిఫ్టర్ రాహుల్ స్వస్థలంలో సంబరాలు
-
కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన తెలుగు తేజం
-
కామన్ వెల్త్ గేమ్స్: భారత్కు మరో స్వర్ణం
-
సత్తా చాటిన సతీష్.. భారత్కు స్వర్ణం
గోల్డ్కోస్ట్: కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటింది. వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్ కుమార్ శివలింగం ఈ ఘనత సాధించారు. మొత్తం 317 కేజీల బరువునెత్తి అద్భుత ప్రదర్శన కనబరిచిన సతీష్ పసిడి పతకాన్ని పొందారు. తమిళనాడు వెల్లూరుకు చెందిన సతీష్ 2013లో కామన్వెల్త్ గేమ్స్లోనూ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఈసారి క్రీడల్లో ఇప్పటిదాకా భారత్కు ఐదు పతకాలు రాగా.. అన్నీ వెయిట్లిఫ్టింగ్ విభాగంలోనే సాధించటం విశేషం. -
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ రెండో స్వర్ణం
-
వెయిట్లిఫ్టింగ్లో భారత్కు మళ్లీ స్వర్ణం
గోల్డ్కోస్ట్, ఆస్ట్రేలియా : కామన్వెల్త్ గేమ్స్లో మహిళల వెయిట్లిఫ్టింగ్లో భారత్ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ రౌండ్లోమూడు అటెంప్ట్లలో విజయం సాధించిన సంజిత.. క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్లో విఫలమైంది. అయితే, సంజితకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్ కూడా క్లీన్ అండ్ జర్క్ మూడో అటెంప్ట్లో విఫలం కావడంతో భారత్కు స్వర్ణ పతకం ఖాయమైంది. -
సూపర్.. చాను
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకాన్ని సాధించింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని అందుకుంది. తొలుత స్నాచ్లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటింది. ఇక మారిషస్కు చెందిన వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ చాలెంజ్లో మీరాబాయి చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్లో భాగంగా జరిగిన మూడు రౌండ్లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్ఫుల్గా బరువులు ఎత్తగా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయి చాను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. క్లీన్ అండ్ జర్క్ చివరి రౌండ్లో అత్యధికంగా 110 కేజీల బరువు ఎత్తిన చాను తొలి స్థానంలో నిలిచింది. దాంతో పసిడి పతకం మీరాబాయి చాను ఖాతాలో వేసుకుంది. ఇది క్లీన్ అండ్ జర్క్లో మీరాబాయ్ చాను అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డులెక్కింది. అంతకుముందు 109 కేజీలను మాత్రమే తన అత్యుత్తమ క్లీన్ అండ్ జర్క్ ప్రదర్శన కాగా, దాన్ని చాను తాజాగా అధిగమించి సరికొత్త వ్యక్తిగత ఫీట్ను సైతం సొంతం చేసుకుంది. అయితే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్లు రెండేసి రౌండ్లను మాత్రమే పూర్తి చేయడం చాను ఆధిపత్యాన్ని రుజువు చేసింది. మరోవైపు గురువారం జరిగిన పురుషుల వెయిట్లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
భారత్కు ఇది గొప్ప ఆరంభం: కైఫ్
సాక్షి, స్పోర్ట్స్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన భారత అథ్లెట్లను క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందించారు. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. తద్వారా ఈ గేమ్స్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మరో అథ్లెట్ గురురాజా రజతం సాధించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను, గురురాజాలు మరిన్ని విజయాలు అందుకోవాలని, రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు మరింత గుర్తింపు దక్కాలని తన ట్వీట్ ద్వారా కైఫ్ ఆకాంక్షించారు. కాగా, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పతకం అందించిన అథ్లెట్గా గురురాజా నిలిచాడు. Congratulations to #MirabaiChanu for the gold and #Gururaja for the silver at the #CWG2018 . Great start for India. Wish more success and recognition for our talent in the coming days. pic.twitter.com/OR33sFskeK — Mohammad Kaif (@MohammadKaif) 5 April 2018 కరణం మల్లేశ్వరి హర్షం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతంగా బరువులెత్తి కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిందని వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ప్రశంసించారు. భారతీయ అథ్లెట్లకు ఇది శుభ పరిణామం. ఇతర అథ్లెట్లకు మీరాబాయి స్వర్ణం స్ఫూర్తినిస్తుందన్నారు. తొలి లిఫ్ట్తోనే పతకం సాధించడం విశేషమని మల్లేశ్వరి కొనియాడారు. మీరాబాయి ప్రదర్శనను గమనించినట్లయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పథకంపై ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్లిఫ్టింగ్లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్లిఫ్టర్గా కరణం మల్లేశ్వరి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
భారత్కు తొలి స్వర్ణం
-
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం
-
భారత్కు తొలి స్వర్ణం
గోల్డ్కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 48 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను పసిడిని సాధించారు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తంగా 196 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకాన్ని అందుకున్నారు. తొలుత స్నాచ్లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటారు. ఇక మారిషియన్ వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ చాలెంజ్లో మీరాబాయి చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్లో భాగంగా జరిగిన మూడు రౌండ్లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్ఫుల్గా బరువులు ఎత్తగా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయి చాను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. క్లీన్ అండ్ జర్క్ చివరి రౌండ్లో అత్యధికంగా 110 కేజీల బరువు ఎత్తిన చాను తొలి స్థానంలో నిలిచారు. దాంతో పసిడి పతకం మీరాబాయి చాను ఖాతాలో వేసుకున్నారు. ఇది క్లీన్ అండ్ జర్క్లో మీరాబాయ్ చాను అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డులెక్కింది. అంతకుముందు 109 కేజీలను మాత్రమే తన అత్యుత్తమ క్లీన్ అండ్ జర్క్ ప్రదర్శన కాగా, దాన్ని చాను తాజాగా అధిగమించి సరికొత్త వ్యక్తిగత ఫీట్ను సైతం సొంతం చేసుకున్నారు. అయితే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో రోల్యా రానైవోసోవా, దినుషా గోమ్స్లు రెండేసి రౌండ్లను మాత్రమే పూర్తి చేయడం చాను ఆధిపత్యాన్ని రుజువు చేసింది. బుధవారం జరిగిన వెయిట్లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ గురురాజా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. -
వెయిట్లిఫ్టింగ్ విభాగంలో గురురాజాకు రజతం
-
వెయిట్లిఫ్టింగ్లో భారత్కు రజతం
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్ లిప్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ పసిడి సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.