-
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్ప్రకాష్ భార్య అనితా ప్రకాష్ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్కుమార్ చబ్బేవాల్ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్పూర్లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
దేశంలో ఈరోజు(మంగళవారం) లోక్సభ ఎన్నికల్లోని మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్లోని జష్పూర్లోని అరా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిదిమంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఆసుపత్రిలో జష్పూర్ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈరోజు ఉదయం 7 గంటలకు జష్ఫూర్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలుత 85 ఏళ్ల విద్యావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ బృందాన్ని నియమించారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశారు. జష్పూర్ జిల్లా పరిధిలో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్లో నలుగురు ఉద్యోగుల బృందం విధులు నిర్వహిస్తుంది. -
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్గఢ్లో నేడు (మంగళవారం) లోక్సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్గఢ్, జాంజ్గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్పూర్లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్పూర్లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్లో 25 మంది, జాంజ్గిర్-చంపాలో 18 మంది, రాయ్గఢ్లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్గా వర్గీకరించారు. -
ఇంటింటికీ చికెన్ పంపిణీ.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
-
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
మండుతున్న ఎండలు.. కేరళలో నలుగురు ఓటర్లు మృతి
లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13 , ఉత్తర్ ప్రదేశ్ 8,మహారాష్ట్ర 8,మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకశ్మీర్ 1,మణిపూర్ 1,త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండే ఎండను లెక్కచేయని ఓటర్లు క్యూలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత నలుగురు వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ముగ్గురు ఓటర్లు కాగా.. ఒకరు పోలింగ్ ఏజెంట్ ఉన్నారు. పాలక్కాడ్లోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఒట్టపాలెంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో ఓ పార్టీ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. కోజికోడ్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.మలప్పురం జిల్లా తిరూర్లో,63 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. శుక్రవారం తిరుర్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించాడు. అంబలప్పుజలో శుక్రవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.మరోవైపు రెండో విడత ముమ్మరంగా సాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1గంటల వరకు సుమారు 35 శాతం పోలింగ్ నమోదైంది. -
ఓటు వేస్తే టిఫిన్, తొలిసారైతే ఐస్క్రీమ్ కూడా..
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. మే 13న ఇండోర్లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్లోని కొన్ని షాపింగ్ మాల్స్లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. -
బీహార్ ఎవరిది? ఎన్డీఏ- మహాఘటబంధన్ హోరాహోరీ?
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని మోదీ- నితీష్, ఇటు ఆర్జేడీ నేత తేజస్వి - రాహుల్(కాంగ్రెస్)కు ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ రాజకీయాలపైనే అందరి దృష్టి నిలిచింది. బీహార్లో మోదీ-నితీష్ జోడీ గెలుపు గ్యారెంటీనా? రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? నితీష్ ఫ్యాక్టర్ ఎన్డీఏకు విజయాన్ని అందిస్తుందా? మహాఘటబంధన్ తన సత్తా చాటగలదా? ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నారు. 2019లో ఎన్డీఏకి 53.20 శాతం ఓట్లు రాగా, మహాఘటబంధన్కు 31.90శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీఏలోని బీజేపీకి 23.6 శాతం ఓట్లు వచ్చాయి. జేడీయూకి 21.8శాతం, ఇతరులకు 7.9శాతం ఓట్లు దక్కాయి. మహాఘటబంధన్కు వచ్చిన 31.90 శాతం ఓట్లలో ఆర్జేడీకి 15.4శాతం ఓట్లు, కాంగ్రెస్కు 7.7 శాతం ఓట్లు, ఇతరులకు 8.8 శాతం ఓట్లు వచ్చాయి. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారధ్యంలోని అధికార కూటమి విజయం సాధించింది.2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ, నితీష్లు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఎన్డీఏకు 31 సీట్లు లభించగా, 2019లో వీరిరువురూ కలిసి పోటీ చేసినప్పుడు 39 సీట్లు దక్కించుకున్నారు. ఈసారి బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్యే పోటీ నెలకొంది. ఈసారి బీజేపీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 9 స్థానాల్లో ఆర్జేడీతో పోటీ పోటీ ఏర్పడనుంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోటీ ఏర్పడనున్నదని సమాచారం. అదేవిధంగా జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో ఆర్జేడీతో కలిసి 10 స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ ఏర్పడనున్నదని సమాచారం. మహాకూటమిలోని ఇతర పార్టీల నుండి మూడు స్థానాల్లో మాత్రమే పోటీ ఉండనుంది. ఎన్డీఏలోని ఇతర పార్టీలకు బీజేపీ ఏడు సీట్లు ఇచ్చింది. ఈ స్థానాల్లో బీజేపీకి నాలుగు స్థానాల్లో ఆర్జేడీతో, ఒక స్థానంలో కాంగ్రెస్తో, రెండు స్థానాల్లో మహాకూటమికి చెందిన ఇతర పార్టీలతో పోటీ ఏర్పడనుంది. బీహార్లోని 23 లోక్సభ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, మహాకూటమికి చెందిన ఇతర పార్టీలు మొత్తం 8 స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగాయి. -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
ఆమే కీలకం
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్గఢ్లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది. మహిళా ఓటర్లలో చైతన్యం ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది. 2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్గా మారవచ్చని వ్యాఖ్యానించింది. -
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
అండమాన్- నికోబార్లో ఓటర్లెందరు? ఏ పార్టీకి కంచుకోట?
అండమాన్- నికోబార్ దీవులలోని ఓటర్ల సంఖ్యను ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతదేశంలోని ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 3,15,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 52 శాతం పురుషులు, 48 శాతం మహిళలు. అండమాన్- నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బిఎస్ జగ్లాన్ తెలిపిన వివరాల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల 5300 మంది ఓటర్లు మొదటిసారి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు కాగా, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు . 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 6 శాతం మేరకు పెరిగింది. ఏప్రిల్ 19న అండమాన్ నికోబార్ దీవుల్లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బిష్ణు పద్ రేకు ఎన్డిఏ కూటమి టికెట్ ఇవ్వగా, ఇండియా కూటమి నుంచి కుల్దీప్ రాయ్ శర్మను అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎంపీ కుల్దీప్. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బిష్ణు పద్ రే ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ విశాల్ జాలీకి టిక్కెట్ కేటాయించింది. నాడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుల్దీప్కు 95,308 ఓట్లు రాగా, విశాల్కు 93,901 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అండమాన్ నికోబార్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ 1967లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ గణేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో కూడా చేరారు. ఆయన 1971లో కూడా గెలిచారు. 1977 నుంచి 1999 వరకు కాంగ్రెస్కు చెందిన మనోరంజన్ భక్త్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1999లో బీజేపీకి చెందిన బిష్ణు పద్ రే తొలిసారిగా ఇక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2004లో మనోరంజన్ భక్త్ తిరిగి గెలిచారు. బిష్ణు పద్ రే 2009, 2014లో ఎంపీగా ఉన్నారు. కులదీప్ రాయ్ శర్మ 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు. -
ఇంటింటికీ బీజేపీ.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. దేశంలో మూడో విడత పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 18న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ వెలువడేలోగా రాష్ట్రంలో తొలివిడత ‘ఓటర్స్ ఔట్ రీచ్’పూర్తిచేయాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద ఈ నెల 14 నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట ఓటర్లను వారి ఇళ్ల వద్దే పార్టీ కార్యకర్తలు కలుసుకోనున్నారు. 17వ తేదీలోగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్లోని ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసే (మే 11)లోగా ప్రతి కుటుంబాన్ని మొత్తంగా మూడుసార్లు కలిసి మద్దతు కోరాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి ఇంటి తలుపు తట్టేలా.. తొలి విడత లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని బీజేపీ చేపట్టనుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి, ఆ కుటుంబ సభ్యులను కలుసుకుని ఈసారి బీజేపీకి ఓటేయాలని కోరనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) వంటివి వారికి అందించనున్నారు. ఈ ప్రచార ప్రక్రియకు సంబంధించిన మొత్తం మెటీరియల్ ఇప్పటికే సిద్ధమై పార్టీ యంత్రాంగానికి అందుబాటులోకి తెచ్చినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడురోజులు సన్నాహక సమావేశాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లడానికి ముందు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయిలో దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటికి సమాంతరంగా ఈ నెల 15వ తేదీలోగా 17 ఎంపీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సమ్మేళనాలు పూర్తి చేయనున్నారు. వీటిల్లో పోలింగ్ బూత్ల కోఆర్డినేటర్లు మొదలు రాష్ట్రస్థాయి వరకు నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చేవెళ్ల, తదితర చోట్ల ఈ సమ్మేళనాలు పూర్తికాగా, 15 వరకు మిగతా పార్లమెంట్ సీట్ల పరిధిలో నిర్వహించనున్నారు. ప్రత్యేక ‘కాస్ట్ ఔట్ రీచ్’ప్రోగ్రామ్ వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘కాస్ట్ ఔట్ రీచ్’కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేపట్టనుంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీల స్థాయిల్లో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళ, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. నామినేషన్ల సమయంలో ర్యాలీలు ఈ నెల 25న రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. 18వ తేదీ తర్వాత లోక్సభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత మే 13వ తేదీ పోలింగ్ వరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, కార్నర్ మీటింగ్లు లాంటి స్వయంగా ఓటర్లను కలుసుకునే ‘ఓటర్ ఔటర్ రీచ్’కార్యక్రమాలకే నాయకత్వం ప్రాధాన్యతనివ్వనుంది. -
ఆ అనుమానాలు పోవాలంటే...
ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ వీటిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. ఎన్నికలు అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా! ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందు సులువైన పరిష్కారం, వీవీప్యాట్ స్లిప్లను అందివ్వడం!! స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. నొక్కినదానికే పడిందని నిర్ధారించే వీవీప్యాట్ స్లిప్ వీరికి భౌతికంగా అందుతుంది. ఓటరు ఈ స్లిప్ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి, సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తూ (మార్చి 16, 2024) భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ చాలా ధీమాగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసినవని వివరించారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్ యూనిట్,కంట్రోల్ యూనిట్తో పాటు, వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్) అనే మూడు భాగాలు ఉంటాయన్నది మనకు తెలుసు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసు కునేందుకూ, ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నివృత్తికీ వీవీ ప్యాట్లు కీలకమవుతాయి. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకోలా చెప్పాలంటే వీటిపై అనుమానాలు రేకెత్త డమే తప్పన్న చందంగా మాట్లాడుతోంది. ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని, వీవీప్యాట్ స్లిప్పు లపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నది ఎన్నికల కమిషన్ వాదనగా ఉంది. నమ్మమంటే నమ్మాల్సిందేనా? ఈవీఎంల దుర్వినియోగం అసాధ్యమని సీఈసీ చెబుతున్నా ఓటర్లలో చాలామందికి ఆ నమ్మకమైతే లేదు. ఈవీఎంలపై సందేహాలు వద్దు అని చెప్పేందుకు సీఈసీ తానే రాసిన ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ఆరోపణలపై ఈవీఎంలే స్వయంగా స్పందిస్తే ఎలా ఉంటుందో వివరించారు. ‘‘తీరని కోరికలకు అన్ని వేళల్లో అందరిపై దూషించడం సరికాదు. మీరేంటో మీరే నిరూపించుకోలేనప్పుడే ఈవీఎంలపై తప్పు మోపుతారు’’ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ‘తీరని కోరికలు’గా అభివర్ణించడంతోనే ఈవీఎంలు విశ్వసనీయ మైనవి అయిపోవు. ఎన్నికలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ బాధ్యత పూర్తయినట్టూ కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నది ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం నిపుణులు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేదనీ, వాటిని నమ్మలేమనీ వీరందరూ పలు సందర్భాల్లో ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదు. ఈ ధోరణి అనుమానాలు మరిన్ని రెకెత్తేలా చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సంఖ్యలను అస్సలు ప్రశ్నించకూడ దన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్ ధోరణి. దేశ జనాభాలో 11 శాతం మంది మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనీ, గడచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారనీ నీతి ఆయోగ్ చెబుతోంది. పారదర్శకత ఏమాత్రం లేని నేపథ్యంలో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ ఈవీఎంలపై చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న భరోసాలను ఎలా నమ్మగలరు? ఎన్నికలు అందరి వ్యవహారం... ఓటర్లు వేసిన ఓటును మార్చి చూపే అవకాశం కానీ, ఈవీఎంలు తప్పులు చేయడం కానీ అసాధ్యమని ఎన్నికల కమిషన్(ఈసీ) చెబు తోంది. కానీ చాలా కారణాల వల్ల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈవీఎంలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు సంబంధించి 2019 సాధారణ ఎన్నికల్లో సుమారు 373 నియో జకవర్గాల గణాంకాల్లో తీవ్రమైన తేడాలున్నట్లు ‘ద క్వింట్’ వెబ్సైట్ గుర్తించింది. ఈ విషయంపై సీఈసీ, ఈసీ స్పందన నాస్తి. ఎన్నికల తరువాత ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, ఆరోపణలు చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. తద్వారా మాత్రమే అది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్న భరోసా సామాన్యుడికి ఇవ్వగలదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రమే ఈవీఎంల విశ్వసనీ యతపై సందేహాలు లేవనెత్తుతారు అని సీఈసీ చేసిన వ్యాఖ్య రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది... ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు శ్రమ చేయని వారు చెప్పే కుంటిసాకు అని చెప్పే ప్రయత్నం. రెండోది... ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మాత్రమే పరిమితమని చెప్పడం. రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో సర్వాధికారి పౌరుడే. ఈ ప్రజాస్వామ్య సర్వాధికారి సార్వభౌమత్వాన్ని తనకు నచ్చిన వ్యక్తికి దఖలు పరచడమే ఓటింగ్. ఈ పని జరగాలంటే ఎన్నికలు, ఓటింగ్ వ్యవస్థ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు... అలా జరిగినట్లు కనిపించాలి కూడా. అంతేకాదు... తాము వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా ఓటరుకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. ఓటింగ్, లెక్కింపు వ్యవస్థలు రెండూ కూడా ఓటరు ఎవరికి ఓటేశారో వారికే ఓటు పడిందని ధ్రువీకరించేలా పనిచేయాలి. వేసిన వెంటనే రికార్డు కావాలి. రికార్డు అయిన విధంగానే లెక్క కూడా తేలాలి. ఈవీఎం యంత్రాలపై ఈసీ నిఘా అనేది రెండు కారణాల వల్ల అంత నమ్మదగ్గదిగా అనిపించదు. మొదటిది ఈవీఎం యంత్రాలను ప్రభావితం చేయగలమని, లేదా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేలా చేయగలమన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ తగినంతగా ప్రయత్నించకపోవడం;ఓటర్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈసీ విశ్వసనీయత అనేది అతి నిమ్న స్థాయికి చేరడం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వివక్ష లేకుండా ఎన్నికల కోడ్ను అమలు చేయలేకపోవడం వాటిల్లో ఒకటి మాత్రమే. ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు అనేందుకూ, నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అనేందుకూ ఆధారాలు లేవు. అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంతమాత్రాన జరిగినట్టూ కాదు. కానీ సాక్ష్యం లేకపోవడం అన్నది సంఘటనే జరగకపోవడం కాదు. వీవీప్యాట్ స్లిప్ ఇవ్వాలి! ఎన్నికల సమయంలో వ్యవస్థలు, వనరులన్నింటిపై పెత్తనం, అధికారం ఒక పార్టీదిగా ఉంటుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అనుమానాలు, ఆరోపణలు వస్తూంటాయి. ఈవీఎంల విషయంలో ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే... తమ ఓటు రికార్డు అయ్యిందా, లేదా అన్నది. ఈ ఆందోళనకు సులువైన పరిష్కారం ఉంది. ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్లను అందివ్వడం. ఓటరు తాను అనుకున్న పార్టీకే ఓటు పడిందని నిర్ధారించుకుంటే ఆ స్లిప్ను బాక్స్లో మళ్లీ వేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. ఆ తరువాత వీరికి భౌతికంగా వీవీప్యాట్ స్లిప్ అందుతుంది. ఓటరు ఈ స్లిప్ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. గత ఏడాది డిసెంబరులో ఇండియా కూటమి కూడా ఇదే సూచన చేసింది. సుప్రీంకోర్టు విచా రణలోని అంశాల్లోనూ ఇది ఉంది. వీవీప్యాట్ స్లిప్స్ను లెక్కించి ఫలితాలను ప్రకటించడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరగవచ్చు కానీ... ఏడు దశల్లో నెలన్నర పాటు ఎన్నికలు జరగ్గా కానీ జాప్యం ఒకట్రెండు రోజులు ఫలితాలు వెల్లడించేందుకు అయితే నష్టమేమీ ఉండదు. ఎ ఎల్ ఐ చౌగులే వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓటర్లు
సాక్షి, అమరావతి: ఎప్పుడూ లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై యువత ఆసక్తిని చూపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఈ నెల రెండో తేదీ నాటికి రాష్ట్రంలో కొత్తగా 1,26,549 మంది ఓటర్లు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకటించిన రోజుకి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 గా ఉంటే ఏప్రిల్ 2కి 2,09,16,389కు పెరిగినట్లు తెలిపింది. పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కు పెరిగినట్లు పేర్కొంది. నామినేషన్లు దాఖలు చివరి రోజు వరకు కొత్త ఓటర్లను చేర్చుకొనే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ రెండున్నర నెలల్లో 2,56,781 మంది ఓటర్లు పెరిగారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని, దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 10 లక్షలు దాటుతోందంటున్నారు. 2019 తర్వాత పెరిగిన ఓటర్లు 41.31 లక్షలు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య 3,69,29,330 (సర్విస్, థర్డ్ జెండర్ ఓట్లు కాకుండా)గా ఉంటే అది ఇప్పుడు 4,10,60,555కు పెరిగింది. అంటే 41,31,225 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019లో పురుష ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా ఇప్పుడు 2,01,44,166కు, మహిళా ఓటర్లు 1,86,04742 నుంచి 2,09,16,389కు పెరిగారు. సర్విసు, ఎన్నారై, థర్డ్ జెండర్ ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. -
ఈ లోక్సభ నియోజక వర్గాలు.. దేశ రాజకీయాల్లో కీలకం!
దేశంలో లోక్సభ ఎన్నికలకు జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే దేశంలోని కొన్ని లోక్సభ నియోజకవర్గాలు దేశరాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటాయి. అత్యధిక ఓటర్లతో పాటు వివిధ అంశాలు ఆయా నియోజకవర్గాలను అగ్రస్థానంలో నిలిపివుంచుతున్నాయి. ఈ జాబితాలోని ప్రముఖ నియోజకవర్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల్కాజిగిరి, తెలంగాణ ఓటర్ల సంఖ్య: సుమారు 31,50,303. తెలంగాణలోని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఓటరు జనాభా పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. తెలంగాణలో జనాభా వైవిధ్యానికి ఈ ప్రాంతం నిలయంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రాముఖ్యతను ఈ నియోజకవర్గం ప్రతిబింబిస్తుంది. నేతలందరూ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గత ఎన్నికల్లో మాల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. అవుటర్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 25 లక్షలు. ఔటర్ ఢిల్లీ.. జనాభా పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ద్వారక, నజఫ్గఢ్, ముండ్కా తదితర ప్రాంతాలు దీనిలో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ జనాభా కలయికతో ఈ లోక్సభ నియోజకవర్గం ఎన్నికల సమయంలో అధిక ఓటింగ్ శాతాన్ని స్థిరంగా నమోదు చేస్తూ వస్తోంది. ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ ఓటర్ల సంఖ్య: సుమారు 23 లక్షలు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధికి ఉదాహరణగా నిలిచింది. ఇది ఓటర్ల సంఖ్య పెరిగేందుకు దారితీసింది. పట్టణ, గ్రామీణ జనాభా ఇక్కడ అత్యధికం. దేశ రాజకీయాలకు కీలక నియోజకవర్గంగా ఘజియాబాద్ అవతరించింది. బెంగళూరు సౌత్, కర్ణాటక ఓటర్ల సంఖ్య: సుమారు 20 లక్షలు. భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని సౌత్ బెంగళూరులో జయనగర్, బసవనగుడి, ఎలక్ట్రానిక్ సిటీలాంటి ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. గణనీయమైన సంఖ్యలో ఇక్కడ ఓటర్లు ఉన్నారు. కర్ణాటక రాజకీయాలకు ఈ నియోజనవర్గం కేంద్ర బిందువుగా ఉంది. అలాగే దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంటుంది. ముంబయి నార్త్, మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య: సుమారు 18 లక్షలు. ముంబై నార్త్ 18 లక్షల జనాభా కలిగిన లోక్సభ నియోజకవర్గం. మలాడ్, కండివాలి, బోరివలి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉన్నత వర్గాల నుండి అట్టడుగు వర్గాల ప్రజలకు నిలయంగా ఈ నియోజకవర్గం ఉంది. భారతదేశ ఆర్థిక చిత్రాన్ని చూపించే ఈ నియోజనవర్గం దేశరాజకీయాల్లో కీలకంగా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 17 లక్షలు. ఈశాన్య ఢిల్లీలో షహదారా, సీలంపూర్, యమునా విహార్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇది జాతీయ రాజధానిలో సామాజిక,ఆర్థిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ నేపథ్యాలు కలిగిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడున్నారు. చాందినీ చౌక్, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: సుమారు 16 లక్షలు. చాందినీ చౌక్.. ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. సందడిగా ఉండే మార్కెట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఢిల్లీలో ఇది ఒక ప్రధాన లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ పాత ఢిల్లీ, దర్యాగంజ్, చాందినీ చౌక్ తదితర ప్రాంతాలున్నాయి. విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాల ఓటర్లు ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ ఓటర్ల సంఖ్య: 15 లక్షలు. వాయువ్య ఢిల్లీలో రోహిణి, నరేలా, కిరారి తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకవైపు విశాలమైన పట్టణ ప్రాంతం, మరోవైపు గ్రామీణ ప్రాంతం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఢిల్లీ ఓటర్లలో అత్యధికులు ఈ ప్రాంతంలోనే కనిపిస్తారు. ఇది దేశ రాజధానిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. తిరువనంతపురం, కేరళ ఓటర్ల సంఖ్య: సుమారు 14 లక్షలు. కేరళ రాజధాని తిరువనంతపురం రాజకీయంగా అవగాహన కలిగిన జనాభాకు నిలయంగా ఉంది. ఇక్కడి ఓటర్లు ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం కనిపిస్తుంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. గణనీయసంఖ్యలో ఇక్కడున్న ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను అమితంగా ప్రభావితం చేస్తుంటారు. పుణె, మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య: 13 లక్షలు. పూణే ప్రాంతం విద్యా సంస్థలతో పాటు సాంస్కృతిక కేంద్రాలకు నిలయంగా ఉంది. శివాజీనగర్, కోత్రుడ్, హడప్సర్ తదితర పేరొందిన ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనే యువకులు, విద్యావంతులైన ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. లక్నో, ఉత్తరప్రదేశ్ ఓటర్ల సంఖ్య: దాదాపు 12 లక్షలు లక్నో.. ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం. దేశంలో రాజకీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఎన్నికల సమయంలో గణనీయమైన ఓటింగ్ నమోదవుతుంటుంది. హజ్రత్గంజ్, అలంబాగ్, గోమతి నగర్ తదితర ప్రాంతాలు ఇక్కడున్నాయి. సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దేశంలోని ఈ లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో కీలకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు క్రియాశీల రాజకీయ భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి. -
ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు. మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు. ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు. కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్రెడ్డి ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్కుమార్ప్రసాద్, రజత్భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బుందేల్ఖండ్లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్ఖండ్లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్పై ప్రతాప్గఢ్లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు.దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్దళ్ టిక్కెట్పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్వాదీ పార్టీ ఆమెకు లోక్సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
వందేళ్లు దాటిన ఓటర్లు.. ఇక్కడ 5 వేల మందికి పైనే..
దేశ చరిత్రలో తొలిసారిగా రానున్న లోక్సభ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 85 ఏళ్లు పైడిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. 5 వేల మందికి పైగా శతాధికులు పంజాబ్లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు ఐదు వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో మొత్తం 205 మంది 120 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నారు. ఇందులో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారు. ఇక 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసువారు మొత్తం 5,004 మంది ఉన్నారు. 100 నుండి 109 సంవత్సరాల వయసువారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది మహిళలు ఉన్నారు. అలాగే 110 నుండి 119 ఏళ్ల ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 59 మంది, మహిళలు 100 మంది ఉన్నారు. మొదటిసారి ఓటర్లు పంజాబ్లో మొత్తం 2,12,71,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,11,92,959 మంది పురుషులు, 1,00,77,543 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 4,89,631 మంది 18-19 ఏళ్లలోపువారు అంటే మొదటి సారి ఓటర్లు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న ఏడవ దశలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఓటింగ్ శాతం 65.96 శాతం నమోదైంది. ఈసారి 70 శాతానికి పైగా ఓటింగ్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
రాహుల్ కాదు వరుణ్.. అమేథీ ఓటర్ల యూటర్న్?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమేథీ(యూపీ) లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో, గాంధీ కుటుంబానికి పట్టంకట్టే స్థానికులు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు చూస్తున్నారు. రాహుల్ 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తన ‘కుటుంబ నియోజకవర్గాన్ని’ తిరిగి దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్సభ ఎంపీగా ఉన్నారు. అలాగే రాహుల్ తిరిగి వయనాడ్ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. రాయ్బరేలీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సోనియా గాంధీ అమేథీ నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలో భవిష్యత్తులో ఇక్కడి ప్రజలు తన కుటుంబానికి మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా దివంగత సంజయ్ గాంధీతోపాటు తన రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత రామ్ కరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 1980లో సంజయ్ గాంధీ అమేథీ సీటును గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అయితే పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించే వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
హామీలపై సమాచారం.. ఓటర్ల హక్కు: సీఈసీ
చెన్నై: ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమేనా? అనేది తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉందని ముఖ్య ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చే హక్కు రాజకీయ పారీ్టలకు ఉన్నట్లే.. ఆయా హామీల్లో నిజమెంత? వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సేకరిస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లు ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోందని వెల్లడించారు. రాజీవ్ కుమార్ శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసే విధానం, నిధుల సేకరణ మార్గాలను రాజకీయ పారీ్టలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఒక ‘ప్రొఫార్మా’ సిద్ధం చేశామని తెలిపారు. -
ఆ రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు.. వేలల్లో!
బీహార్లో లోక్సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల సన్నాహాల పరిశీలనకు బీహార్కు వచ్చిన ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షించింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు. బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.64 కోట్లని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఈసారి 9.26 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని వెల్లడించారు. బీహార్లో 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 21 వేలకు పైగా ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి అభ్యర్థులకు ప్రచారానికి ఐదు వాహనాలకు బదులు 14 వాహనాల వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. దేశంలో 18వ లోక్సభకు ఎంపీలను ఎన్నుకునేందుకు మరికొద్ది వారాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. Live from 2 pm today : Press Conference at Patna by Election Commission after Review of Poll-preparedness of #Bihar & #Jharkhand for #GeneralElection2024 https://t.co/G33lHSAJxg — Spokesperson ECI (@SpokespersonECI) February 21, 2024 -
సాధారణ ఎన్నికల్లో ఓటర్లు ఎంతమందంటే..!
ప్రజాప్రతినిధులను ఎన్నుకోని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లోనే జరగనున్నాయి. అలాగే ఎన్నికల ముఖ్య అధికారి సాధారణ ఎన్నికల జరిగే అవకాశం ఉన్న తాత్కాలిక తేదీని కూడా జారీ చేశారు. ఆ తేదీకి అటు ఇటుగా పలు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఈ సారి ఓటర్లు ఎంతమంది? వారిలో మహిళా ఓటర్లు ఎంతమందంటే..? ఈసారి దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం ప్రంపచంలోనే అత్యధిక మంది ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. అందుకోసం ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయంలో వెల్లడయ్యింది. అంతేగాదు జనవరి 1,2024ని అర్హత తేదీగా సూచిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/స్వయం ప్రతిపత్తి ప్రాంతాల వారిగా ఓటర్ల జాబితాలను కూడా ప్రచురించింది. అలాగే నియోజక వర్గాల విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏకంగా 96.88 మంది అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. ఈ ఓటర్ల జాబితాలో లింగ సమానత్వం హైలెట్గా నిలిచింది. ఈసారి కనివినీ ఎరుగని రీతీలో మహిళా ఓటర్ల నమోదులో పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లు నమోదవ్వగా, వారిలో మహిళా ఓటర్ల జాబితా ఏకంగా 1.41 కోట్ల మంది నమోదు చేసుకోవడం విశేషం. ఓటు హక్కు వినియోగంలో పురుష ఓటర్ల కంటే సుమారు 15% పెరిగింది. అంతేగాదు లింగ నిష్పత్తి 2019లో 940 ఉండగా అది కాస్తా 2024కి 948కి పెరిగడం విశేషం. అలాగే ఈసారి 2 కోట్ల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంతోపాటుగా వికలాంగులకు కూడా ఓటింగ్లో అన్ని రకాల వెసులబాటు కల్పించడంతో వారి నమోదు కూడా కాస్త పెరిగింది. ఎన్నికల సంఘం అధికారుల చేత ఇంటింటికి సమగ్ర సర్వే చేయించి మరీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో 1,65,76,654 మంది చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు ఉన్నారు. ఇందులో 67,82,642 మంది చనిపోయిన ఓటర్లు, 75,11,128 మంది శాశ్వతంగా మారిన/గైర్హాజరైన ఓటర్లు ఉండగా, 22,05,685 నకిలీ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈసారి ఓటర్లగా నమోదు చేసుకునే దరఖాస్తులు ఏకంగా 10.64 లక్షలకు పైగా వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొది. .ఈ సారిగా ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా ముఖ్యంగా బలహీన గిరిజన వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇంత భారీ స్థాయిలో ఓటర్లు నమోదవ్వడం అనేది భారతదేశం స్థితిస్థాపకత, ప్రజలకు ప్రజాస్వామ్య విధానం పట్ల ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది. ఎన్నికల సంఘం దృష్టి సారించిన అంశాలు.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ను ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యేలా ఈ కింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే.. పారదర్శకత స్వచ్ఛత లింగ నిష్పత్తి చేరిక పారదర్శకత చర్యలు వివిధ రాజకీయ పార్టీలతో తరచుగా జిల్లాఎన్నికల అధికారులు,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సాధారణ సమావేశం అవ్వడం. స్పెషల్ సమ్మరీ రివిజన్తో డేటా సేకరించడం. ఓటర్ల జాబితా కాపీలను రాజకీయ నాయకులతో కలిసి షేర్ చేసుకోవడం. వారి అభ్యంతరాలను నోటీసు చేయండం. గడవు ముగిసేలోపు చేయాల్సిన ధృవీకరణ, ఫీల్డ వెరిఫికేషన్ స్వచ్ఛత డూప్లికేట్/బహుళ ఎంట్రీల తొలగింపు. చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు. ఓటర్ల ఫోటోల్లో వ్యత్యాసాలను తొలగించడం అలాగే ఓటర్ల ఫోటోల చిత్ర నాణ్యతను మెరుగుపరచడం. అంతరాలు లేకుండా.. ఓటర్లు/జనాభా నిష్పత్తితో అంతరాలు తగ్గించడం లింగ నిష్పత్తి వయస్సు వారీగా జాబితా తీసుకోవడం (ప్రత్యేకంగా 18 నుంచి 19, 19 నుంచి 20 ఏళ్లు వారీగా ) చేరిక: దివ్యాంగులు సులభంగా ఓటు వేసేలా ఎన్నికల డేటాబేస్లో గుర్తింపు ముఖ్యంగా చదువుకున్న యువత నమోదుపై దృష్టిసారించేలా చేయటం మహిళా ఓటర్లను పెంచేలా డ్రైవ్లు అలాగే థర్డ్ జెండర్లో పెరుగుతున్న నమోదు కోసం కేంద్రీకృత వ్యూహం ముఖ్యంగ బలహీన గిరిజనలు నూటికి నూరు శాతం నమోదు చేసుకునేలా ప్రత్యేక ప్రయత్నాలు. ఇంతలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భారీగా నమోదు రాజకీయ పార్టీలు, పౌరులు అందించిన సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఎన్నికల కమిషన్ పేర్కోంది. అలాగే ఎలక్టోరల్ జాబితా సవరణ 2024లో ఇంకా ఎన్రోల్ చేయించుకోని అర్హులైన పౌరులు ఇప్పటికైనా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్ లోపు ఓటర్లు అప్డేట్ చేయించుకునే వెసులుబాటు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. (చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!) -
ప్రపంచంలో అత్యధిక 'ఓటర్లు' మనకే!
ఢిల్లీ, సాక్షి: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో.. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా 97 కోట్ల మంది ఓటు నమోదు చేయించుకున్నారని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు విడుదల చేసింది. తద్వారా గత లోక్సభ ఎన్నికల ఓటర్ల కంటే.. ఆరుశాతం ఎక్కువ ఓటు రిజిస్ట్రేషన్ నమోదైందని ఈసీ స్పష్టం చేసింది. పుణేలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఓటర్లు 96.88 కోట్ల మంది .. భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు అని సీఈసీ తెలిపారు. ఇక.. ఇందులో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి.. పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ఈసీ ప్రముఖంగా పేర్కొంది. మహిళలతో పాటు ఈసారి యువత సైతం ఓటు కోసం నమోదు భారీ సంఖ్యలోనే చేసుకుంది. ఇక లింగ నిష్పత్తి చూస్తే(1000:..) 2023లో 928 ఉండగా.. 2024 నాటికి(డ్రాఫ్ట్ కంటే అధికంగా నమోదు) అది 948కి చేరింది. ఇక.. ఈసారి దేశ యువతలో(18-29 మధ్య వయసువాళ్లు) రెండు కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు. మొత్తం 2.63 కోట్ల కొత్త ఓటర్లలో .. 1.41 కోట్లు మహిళలు కావడం గమనార్హం. అంటే.. మిగిలిన 1.22 కోట్ల పురుష ఓటర్ల కంటే అధికమన్నమాట.