vistara
-
ఎయిర్ హోస్టెస్పై వేధింపుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ, విదేశీ విమానాల్లో వేధింపులు పరిపాటిగా మారిపోయాయి. ఇటీవల భాలీవుడ్ నటి జైరాను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపగా.. తాజాగా ఎయిర్ విస్తారా మహిళా ఉద్యోగిపట్ల ఓ ప్యాసెంజర్ అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్నో-ఢిల్లీ విస్తారా విమానంలో మార్చి 24వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నోనుంచి ‘యూకే 997’ విమానం ఢిల్లీలో అడుగుపెట్టినపుడు క్యాబిన్ క్రూ ఉద్యోగి పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వైమానిక సిబ్బంది ఎయిర్ పోర్ట్లోని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజీవ్ వసంత్ డానీ (62)గా గుర్తించారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని విస్తారా ధృవీకరించింది. సిబ్బందిపై ప్రయాణీకుల అనుచిత ప్రవర్తన, వేధింపులను సహించేది లేదని, ఈ వైఖరి ఇతర ప్రయాణీకులకు కూడా ఇబ్బందిగా మారుతుందని , దీనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్స్ ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. కాగా గత ఏడాది దంగల్ నటి జైరా వాసిం తనకు జరిగిన అవమానంపై కంటతడి పెడుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన విస్తారా ఎయిర్లైన్స్ జైరాకు క్షమాపణలు చెప్పింది. ఈ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్దేవ్ లైంగిక వేధింపు ఆరోపణలతో ఐపిసి సెక్షన్ 354 కింద బుక్ అయిన సంగతి తెలిసిందే. -
గాల్లో 261మంది.. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం!
ముంబై : సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోని తమ ప్రాణాలు కలిసిపోతాయని భావించిన 261 మంది ప్రయాణికులు, ప్రమాదం నుంచి సెకన్లలో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళ పైలెట్ చూపించిన తెగువ ఇంతమంది ప్రాణాలను కాపాడ గలిగింది. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి. విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్క్రాఫ్ట్ను సురక్షితమైన దూరంగా మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో, పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లి, తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తార విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది. -
విస్తార దివాలి సేల్: తక్కువకే టిక్కెట్
-
విస్తార దివాలి సేల్: తక్కువకే టిక్కెట్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ ఇంకా వినియోగదారులను మురిపిస్తూనే ఉంది. భారీ భారీ డిస్కౌంట్లతో బ్రాండ్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనిలో విమానయాన సంస్థలు తామేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నాయి. తాజాగా యూకేకి చెందిన విస్తారా 48 గంటల లాంగ్ దివాలి సేల్ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన రూట్లలో టిక్కెట్ను రూ.1,149కే విక్రయించనున్నట్టు పేర్కొంది. 2017 అక్టోబర్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 13 వరకు ఈ 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' సేల్ అందుబాటులో ఉంటుంది. గోవా, పోర్ట్ బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, గౌహతి, అమృత్సర్, భువనేశ్వర్, మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి, ప్రాంతాలకు కస్టమర్లు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ రేపటి(అక్టోబర్ 13) వరకు ఉంటుంది. వన్ వే, ఎకానమీ క్లాస్, ప్రీమియం ఎకానమీలో రిటర్ను ట్రావెల్కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో చాలా తక్కువ సేల్ శ్రీనగర్-జమ్ము మార్గంలో ఉంది. ఇతర మార్గాలలో అద్భుతమైన ధరలను విస్తారా అందిస్తోంది. ఈ సేల్ కింద బుకింగ్స్ చేసుకున్న టిక్కెట్లు, మరే ఇతర డిస్కౌంట్ కిందకు రావని విస్తారా తెలిపింది. ఇండియాలో, డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్లో ఉంటుంది. -
మావోయిస్టులకు సురక్షిత ప్రాంతం కావాలి?!
మావోయిస్టులు మళ్లీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? కొత్త ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నారా? ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్గఢ్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో కొత్త ప్రాంతాలపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. సాక్షి, న్యూఢిల్లీ : ఏవోబీ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు, తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో ఇప్పటికే మావోయిస్టల కీలక స్థావరాలను పోలీసులు ధ్వంసం చేసిన నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లో పాగా వేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర-చత్తీస్గఢ్-మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అయిన బాలాఘాట్ జిల్లాను కేంద్రంగా మార్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్లో ఈ జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కావడం.. అక్కడ వామపక్ష భావజాలాన్ని పెంచితే ఉనికి మళ్లీ కాపాడుకోవచ్చని వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ బ్రిగేడ్ ట్రై జంక్షన్లో ఇప్పటికే మావోయిస్టులు విస్తారా బ్రిగేడ్ పేరుతో రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రిక్రూట్మెంట్లకు, పార్టీ విస్తరణకు కీలక మావోయిస్ట్ నేత అయిన సుధాకర్ వ్యూహరఛన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చత్తీస్గఢ్, జార్ఖండ్లలో కీలకంగా పనిచేసిన సుధాకర్.. అక్కడ పోలీస్ దాడులు, కూంబింగ్లు అధికం కావడంతో.. కొన్నేళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సురక్షిత ప్రాంతం కోసమే కొన్నేళ్లుగా మావోయిస్టులకు బలమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలను కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పట్టేశారు. దీంతో చత్తీస్గఢ్లోని బస్తర్ అటవీ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ కూడా పరిస్థితులు విషమంగా ఉండడంతో సురక్షిత, రక్షణ ప్రదేశం కోసం మావోయిస్టులు కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. -
విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్
ముంబై: ప్రముఖ ఎయిర్లెన్స్ విస్తారా విమాన టికెట్లలో భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. 'ఫ్రీడం సేల్' పేరుతో రెండు రోజుల అమ్మకాలను సోమవారం వెల్లడించింది. ఎంపిక చేసిన మార్గాలలో వన్ వేలో ఈ విమాన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. అతి తక్కువ ధరను రూ. 799లుగా నిర్ణయించింది. వీటిల్లో అదనపు చార్జీలు, హిడ్డెన్ ఫీజులు వుండవని స్పష్టం చేసింది. ఈ ఫ్రీడమ్ టు ఫ్లై (వన్-వే, అన్నీ కలిపి) ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే కొనసాగనుంది. ఆగష్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 23, 2017నుంచి ఏప్రిల్ 19, 2018 మధ్యకాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ను కేవలం రూ. 799లకు, ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ. 2,099 ధరల్లో అందిస్తోంది. 'ఫ్రీడమ్ టు ఫ్లై' సేల్ ద్వారా గోవా, పోర్ట్ బ్లెయిర్, లెహ్ (లడఖ్), జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గువహతి, అమృత్సర్, భువనేశ్వర్, అలాగే ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి తమ ఫ్యావరేట్ డిస్టినేషన్స్కు చేరుకోవచ్చని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పరిమిత సీట్లు అందుబాటులోఉంటాయని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ కింద టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా శ్రీనగర్-జమ్మూ మార్గంలో ఈ విక్రయానికి తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు కూడా రాయితీ ఛార్జీల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ-అమృత్సర్ మధ్య టికెట్ రూ. 1,199, ఢిల్లీ-చండీఘడ్కు ధర రూ. 1,299 గాఉండనుంది. ఢిల్లీ-శ్రీనగర్, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,499; ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పూణేలకు రూ. 2,099; ఢిల్లీ-కోల్కతా రూ. 2,199; ఢిల్లీ-గోవా రూ. 2,799 ఢిల్లీ- హైదరాబాద్ మధ్య ఎకనాకమీ రూ. 2,399, ప్రీమియం ఎకానమీ టికెట్ రూ.4,199లకే అందిస్తోంది. -
వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్
వర్షాకాలం ఇలా వచ్చిందో లేదో అలా విమానయానసంస్థలన్ని మాన్ సూన్ ఆఫర్లతో పోటీపడుతున్నాయి. ఇండిగో, గోఎయిర్ సంస్థలు విమానటిక్కెట్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా కూడా వర్షాకాల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు విస్తార 'గ్రేట్ మాన్ సూన్ సేల్' ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా పరిమిత కాలవ్యవధిలో 849 రూపాయలకే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా ప్రీమియం ఎకానమీ సీట్ల కోసం టిక్కెట్లను రూ.2,099కు విక్రయిస్తోంది. ఈ ఆఫర్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ సేల్ జూన్ 13 అర్థరాత్రి నుంచి, జూన్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. జూన్ 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని విస్తారా ఎయిర్ లైన్స్ తన ప్రకటనలో తెలిపింది. గోవా, పోర్టు బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, గౌహతి, అమృత్ సర్, భువనేశ్వర్, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగహూరు వంటి మార్గాలను ఈ స్కీమ్ కవర్ చేస్తోంది. డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్ లో ఉంటుందని, భారత్ లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని విస్తారా పేర్కొంది. జమ్ము-శ్రీనగర్ మార్గంలో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను రూ.849కే విక్రయిస్తోంది. తమ వెబ్ సైట్ airvistara.com, మొబైల్ యాప్స్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. -
డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విస్తారా
ముంబై: ప్రముఖ ఎయిర్లెన్స్ విస్తారా కూడా తగ్గింపు ధరలను ప్రకటించింది. 'మిడ్-సమ్మర్' సేల్ పేరుతో మంగళవారం డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మార్గాలలో అతి తక్కువ ధరను రూ. 999లుగా నిర్ణయించింది. ఈ ఆఫర్లో బుకింగ్స్ బుధవారం ప్రారంభమై మే 20న ముగియనున్నాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2017, జూన్ 12 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య ప్రయాణించేందుకు అవకాశం. జమ్మూ-శ్రీనగర్, గువహతి-బాగ్డోగ్ర మార్గాల్లో విమాన టికెట్ను రూ.999 లకే అందిస్తున్నట్టు విస్టా ప్రకటించింది. ఢిల్లీ-చండీగఢ్ రూ .1499 ఢిల్లీ-లక్నో రూ .1,549, ఢిల్లీ-అమృతసర్ రూ.1699 లుగా వెల్లడించింది . అయితే, ఆఫర్ కింద కేటాయించిన సీట్ల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ధరలో ఎకానమిక్ క్లాస్లో మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.అలాగే ప్రీమియం ఎకానమీలో రూ.2,000 ఆఫర్ను వాడుకోచ్చవని తెలిపింది. అలా ఏఈ రాయితీ ఛార్జీలు తిరిగి చెల్లించబడవని, గ్రూప్, ఇన్ఫాంట్ బుకింగ్లకు వర్తించవని ఎయిర్లైన్స్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కాగా దేశీయ విమానయాన సంస్థలు వరుసగా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో, నిర్ణీత కాలానికి గాను, గో ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఏసియా బడ్జెట్ ధరల్లో టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. A midsummer flight’s dream! Book at fares starting ₹999 all-in for travel between 12th Jun’17 – 20th Feb’18 https://t.co/9epGF2s6fx pic.twitter.com/qSAxTqjHjE — Vistara (@airvistara) May 16, 2017 -
విస్తారాలో భారీ పెట్టుబడులు
టాటా-సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎయిర్లైన్స్ సంస్థ 'విస్తారా'లో సింగపూర్ఎయిర్లైన్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 100 మిలియన్లకు పైగా సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్చేయనుంది. విస్తారా పనితీరుపట్ల ఆకర్షితమై అనుకున్నదానికి కంటే దాదాపు రెట్టింపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే పెట్టుబడులను ధృవీకరించిన ఎస్ఏఐ ఎంత పెద్దమొత్తంలో అనేది వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది. కమర్షియల్ కాన్ఫిడెన్సియల్ అని తెలిపింది. న్యూఢిల్లీ-ఆధారిత క్యారియర్ 2020వరకు లాభాలను ఆశించకపోయినప్పటికీ రెండు సంవత్సరాలకు పైగా దేశీయంగా సేవలందిస్తూ మంచి గ్రోత్ను సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రాంతీయ క్యారియర్ సిల్క్ ఎయిర్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు విస్తారాతోభాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా సింగపూర్క స్టమర్ సింగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి, అక్కడినుంచి 10 దేశీయ గమ్యస్థానాలకు విస్తారా ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ గురించి ఎక్కువ అవగాహనను విస్తరించడంలో ఈ ఒప్పందం కీలక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, తమ అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని విస్తారా ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే విస్తారాలో ఎస్ఏఐ 49శాతం వాటాను కలిగిఉంది. వచ్చే ఏడాది జూన్నాటికి విస్టారా దాని 20 వ విమానం కొనుగోలుతో ముఖ్యమైన మైలురాయిని తాకుతుందని, అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి వైమానిక మార్గాలను సుగమం చేస్తుందని భావిస్తున్నారు. జాయింట్ వెంచర్ వైమానిక సంస్థలో టాటా గ్రూప్ 51 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 45 దేశీయ రూట్లలో13 విమానాలను విస్తారా కలిగింది. భారత పౌరవిమానయాన నియమాల ప్రకారం, ఇంర్నేషనల్ సేవలందించలంటే విస్టారాకు కనీసం 20 విమానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో సుమారు 50 వైడ్ బాడీస్ సహా 100 విమానాలను కొనుగోలు ప్రణాళికలోఉన్నట్టు సమాచారం. అయితేఈ వార్తలను విస్తారా కొట్టిపారేసింది. టఫ్ ఆపరేటింగ్ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్ విస్తరించాలనేప్రణాళికలను పదేపదే ఎస్ఐఏ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారతదేశం ఉంది. -
ప్రేమికులకు విస్తారా లవ్లీ ఆఫర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ స్పెషల్ ఫైవ్ డే సేల్ ద్వారా ప్రేమికులకు బంపర్ ఆపర్ ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అయిదురోజుల ప్రత్యేక వాలెంటైన్స్ డే అమ్మకాలకు తెరతీసింది. ఈ తగ్గింపు ధరలను సోమవారం ప్రకటించింది. రూ. 899 ప్రారంభమయ్యే విమాన్ టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎకానమీ క్లాస్ లో ఒక మార్గం ప్రయాణానికి గాను అన్నీ కలిపి ఈ తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. టిక్కెట్ల అమ్మకాలు సోమవారం ఫిబ్రవరి 13, 2017 ప్రారంభం. శుక్రవారం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 28, 2017 సెప్టెంబర్ 20, 2017 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ క్లాస్ లో 60శాతం డిస్కౌంట్ తో స్పెషల్ డిస్కౌంట్, ప్రీమియం ఎకానమీలో 40శాతం వరకు రాయితీని వినియోగదారులకు అందిస్తోంది. భారతదేశంలో విస్తారా 20ప్రదేశాలకు ప్రయాణించేందుకు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల లాంచ్ చేసిన పోర్ట్ బ్లెయిర్ (అండమాన్), అమృత్సర్, లేహ్ (లడఖ్) సహా, కొత్తగా ప్రారంభించిన కోలకతా-పుణే మార్గంలో కూడా ఈ ఆఫర్ను వర్తింపచేయనున్నట్టు విస్తారా తెలిపింది. -
విస్తారా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా తన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ఎకానమీ తరగతి ప్రయాణానికి సంబంధించిన టికెట్లను రూ.899ల ప్రారంభ ధరతో ప్రయాణికులకు అందిస్తోంది. నేటి నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జనవరి 25 నుంచి అక్టోబర్ 1 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని విస్తారా వివరించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం దేశీ నెట్వర్క్కు మాత్రమే వరిస్తుందని పేర్కొంది. సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే కస్టమర్లు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్స్ను పొందొచ్చని తెలిపింది. -
‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. విస్తారా రూ.999కు, గోఎయిర్ రూ.736కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ‘సెలెబ్రేషన్ సేల్’’ పేరుతో అందిస్తున్న తమ ఆఫర్ కోసం బుధవారం నుంచి శుక్రవారం అర్థరాత్రి (ఈ నెల 25) వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గోఎరుుర్ విమానయాన సంస్థ తక్కువ ధరకే, రూ.736 ధరకు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. అన్ని రూట్లలో వర్తించే ఈ ఆఫర్కు నేటి వరకూ (ఈ నెల 24న) టికెట్లు బుక్ చేసుకోవచ్చని గో ఎరుుర్ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్తో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది. రూ.500, రూ.1,000 నోట్లు నేటి అర్థరాత్రి వరకూ తమ టికెట్ కౌంటర్లలో చెల్లుతాయని వివరించింది. -
రూ.949 నుంచి విస్తారా విమాన టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా ఆల్ ఇన్క్లూజివ్ వన్-వే టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.949ల ప్రారంభ ధరలతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 10 మధ్యలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 12 నుంచి 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని, ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకోవాలని విస్తారా తెలిపింది. -
2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!
ముంబై : దేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది 2018 ప్రధమార్దంలో విదేశాలకు విమానాలను నడిపే అవకాశముంది. ‘ఇప్పటికిప్పుడే ఏదోరకంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని మేం ఊవ్విళ్లూరడం లేదు. కానీ కచ్చితంగా విదేశాలకు విమానాలను నడుపుతాం. దీనికి మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది.’ అని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో ఆయన యాక్సిస్ బ్యాంక్తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రధమంగా సార్క్, గల్ఫ్ దేశాలకు విదేశీ సర్వీసులను నడుపుతామని సంజీవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న విమానాలు ఈ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు నిర్వహించగలవని పేర్కొన్నారు. కాగా విస్తారా దేశంలో తన కార్యకలాపాలను గతేడాది జనవరి 9న ప్రారంభించింది. ప్రస్తుతం 17 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్ నుంచి పోర్ట్బ్లెయిర్కు కూడా విమానాలు నడపనున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 11 విమానాలు ఉన్నాయి. సంస్థ అక్టోబర్లో మరో రెండింటిని డెలివరీ చేసుకోనున్నది. -
విస్తారా, ఎయిర్ ఏషియా కొత్త విదేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విమానయాన పథకం నేపధ్యంలో దేశీయ విమానయాన సంస్థలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సర్వీసుల నిబంధనలో మార్పులు కొన్ని నూతన సంస్థలకు కాసులు పండించనున్నాయి. 5/20 నిబంధనలోని అయిదేళ్ల సర్వీసును తొలగించడంతో ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా సంస్థలు తమ విదేశీ సర్వీసులను ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. ఇవి రాబోయే సంవత్సరంలో ఇంటర్నేషనల్ సేవలను ఆశించవచ్చని ఇండియా అండ్ సౌత్ ఏషియా ఐ జెట్స్ ఎండీ రాజన్ మెహ్రా మీడియాకు వెల్లడించారు. మొత్తంమీద సుదీర్ఘకాల నిరీక్షణ తరువాత వచ్చిన నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ పరిశ్రమ దీర్ఘకాలిక వృద్ధికి సానుకూలమని మెహ్రా అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త పౌర విమానయాన విధానం భారతదేశం విమాన పరిశ్రమలో కొత్తగా ప్రవేశించిన ఎయిర్ఏషియా, విస్తారా లాంటి వాటికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందనీ, మరోవైపు ఇండిగో, జెట్ ఎయిర్వేస్ వంటి పాత ఆటగాళ్లకు ప్రతికూలంగా ఉంటుందని తెలిపారు. 2020 నాటికి 300 మిలియన్ ప్రయాణీకుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. గంటకు రూ. 2500 చార్జ్ దేశీయ విమానయానానికి ప్రోత్సహాన్నిస్తుందన్నారు. పరిశ్రమల చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టిపెట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూరిజం, దేశీయ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని మెహ్రా చెప్పారు. చార్జీల తగ్గింపుతోపాటు నిర్వహణ, మరమ్మత్తు. ఆపరేషన్స్ (ఎంఆర్వో) లకు రాయల్టీ చెల్లింపులకై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామమన్నారు. అంతేకాదు ఈ ఎంఆర్వో సర్వీసులపై వ్యాట్ ను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం చెప్పిందన్నారు . ఈ చర్యలు భారతదేశాన్ని ఎంఆర్ వో హబ్ గా మార్చేందుకు దోహదం చేస్తాయన్నారు. -
విస్తారా ధరలు కూడా తగ్గాయ్.. !
న్యూఢిల్లీ : వివిధ డిస్కౌంట్ స్కీమ్స్ తో విమానసంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా సైతం తన ప్రయాణికుల టిక్కెట్ ధరలకు డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై, సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించేవారికి టిక్కెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. మరో సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ను పొడిగించింది. దేశీయ మార్గాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని, జూన్ 8 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు జాయింట్ వెంచర్ అయిన విస్తారా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ ను తీసుకొస్తోంది. జూన్ 10 వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. ఆఫర్ ధరల కింద రూ.1,099కి ఎకానమీ క్లాస్, రూ.2,284కు ప్రీమియం ఎకానమీ, రూ.5,775కు బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు ప్రారంభం కాబోతున్నాయని విస్తారా ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి ముంబై మార్గ ఎకానమీ క్లాస్ ఎయిర్ టిక్కెట్లకు రూ.1,920 ధర ఆఫర్ చేస్తున్నామని, రెగ్యులర్ గా అయితే ఈ మార్గంలో ధర రూ.2,743గా ఉంటుందని తెలిపింది. ఢిల్లీ-బెంగళూరు మార్గంలో కూడా రెగ్యులర్ గా ఉన్న రూ.3,093 ధరను, డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.2,165కు తగ్గించేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రమోషన్ ఆఫర్ టిక్కెట్ బుక్ చేసుకున్న అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. విస్తారా వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికైతే అదనంగా 5శాతం డిస్కౌంట్ ఆఫర్ ను పొందుతారని తెలిపింది. -
హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టాం. ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు. -
లాభాల గాల్లో విమానాలు..!
♦ అన్సీజన్లోనూ ప్రయాణికుల జోరు.. ♦ గత మూడు నెలల్లో 24 శాతం వృద్ధి ♦ బ్రేక్ ఈవెన్ స్థాయిని దాటి నిండుతున్న సీట్లు ♦ డిమాండ్కు తగ్గట్టు సర్వీసులు పెంచుకుంటున్న సంస్థలు ♦ వచ్చే నెల్లో మరో చౌక విమాన సంస్థ రంగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కింగ్ఫిషర్... పారమౌంట్... దమానియా... ఈస్ట్ వెస్ట్... స్పైస్ జెట్... జెట్ ఎయిర్వేస్... ఇవన్నీ ఒకప్పుడు నష్టాల్లో మునిగి తేలినవే. కాకపోతే ఆ నష్టాల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి కొన్నిటికి మాత్రమే వచ్చింది. ఆ శక్తి లేకపోవటంతో కింగ్ఫిషర్... పారమౌంట్, దమానియా, ఈస్ట్ వెస్ట్ వంటివి మూతపడ్డాయి. ఎయిర్ దక్కన్ వంటివి వేరే సంస్థల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. స్పైస్జెట్ యజమాని మారగా, జెట్ ఎయిర్వేస్ ఎతిహాద్ అండతో నిలదొక్కుకుంది. ఇదంతా ఎందుకంటే... అప్పుడప్పుడే భారతీయులకు విమాన ప్రయాణం అలవాటవుతున్న తరుణంలో వచ్చిన సంస్థలివి. కానీ అవి చేసిన అలవాటు ఇపుడు తారస్థాయికి చేరుకుంది. ఫలితం!! విమానాలు నిండిపోతున్నాయి. విమాన ప్రయాణికుల్లో రికార్డు వృద్ధి నమోదవుతోంది. విమానయాన సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. అదీ కథ. ఇపుడు విమాన యాన సంస్థలకు అన్సీజన్ లేదు. మార్చి, ఏప్రిల్ నెలలు ఇప్పటిదాకా అన్సీజనే అయినా... ఈ సారి ఆ నెలల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రస్తుతం దేశంలో సర్వీసులందిస్తున్న 11 విమానయాన సంస్థల్లోనూ సీట్లు రికార్డు స్థాయిలో భర్తీ అవుతున్నాయి. మార్చి నెలల్లో అన్ని విమానాల సగటు లోడ్ ఫ్యాక్టర్ (సీట్లు నిండటం) రికార్డు స్థాయిలో 83 శాతానికి చేరుకుంది. అమెరికా తర్వాత విమానాల్లో సీట్లు ఈ స్థాయిలో భర్తీ అవుతున్నది ఇక్కడే కావటం విశేషం. సాధారణంగా 100 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాల్లో సీట్లు 75-80 శాతం నిండితే బ్రేక్ ఈవెన్కి వచ్చినట్లేనని, ఇప్పుడు చాలా సర్వీసుల్లో అంతకంటే ఎక్కువ శాతం సీట్లు భర్తీ అవుతున్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొన్నాళ్ళు పరిస్థితులిలాగే ఉంటే అన్ని ఎయిర్లైన్స్ కూడా లాభాల్లోకి వస్తాయన్నారు. స్పైస్ జెట్ టాప్; విస్తారా లాస్ట్ గత నెలలో స్పైస్ జెట్ సగటు లోడ్ ఫ్యాక్టర్ 91 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 75 శాతంతో విస్తారా చివరి స్థానంలో ఉంది. నిజానికి 75 శాతమంటే అది కూడా బ్రేక్ ఈవెన్ పరిస్థితే. అంటే దాదాపు ఏ విమానయాన సంస్థా నికరకంగా సీట్లకు సంబంధించి నష్టాల్ని మూటగట్టుకోవటం లేదన్న మాట. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎయిర్కోస్టా లోడ్ ఫ్యాక్టర్ 82.1 ఉండగా, తరచు కొన్ని విమానాలు రద్దవుతున్నా ట్రూజెట్ కూడా 77.9 శాతం ఎస్ఎల్ఎఫ్ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణీకుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని ఎడల్వైజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.5 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు కూడా బాగా తగ్గడంతో దాదాపు అన్ని విమానయాన సంస్థలు నిర్వహణ లాభాల్లో నడుస్తున్నాయి. డిమాండ్ ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సుల్లాగా టాప్ ఎక్కి ప్రయాణించే పరిస్థితి కనపడుతోందని ఒక ఎయిర్లైన్స్ సంస్థ ప్రతినిధి నవ్వుతూ వ్యాఖ్యానించారంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత సీజన్లో ఎయిర్లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించడాన్ని తగ్గించాయి. మరో కొత్త ఎయిర్లైన్... పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో చౌక విమానయాన రంగంలోకి కొత్తగా మరో సంస్థ ప్రవేశించబోతోంది. తమిళనాడుకు చెందిన సీఎంసీ విద్యాసంస్థ ‘ఎయిర్ కార్నివాల్’ పేరుతో రంగంలోకి రాబోతోంది. మే నెల్లో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో దేశీయంగా విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థల సంఖ్య 12కి పెరగనుంది. మిగిలిన సంస్థలు కూడా డిమాండ్కు తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కొత్తగా మరో 50 విమానాల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్కోస్టా ఈ డిసెంబర్ నాటికి విమానాల సంఖ్యను 4 నుంచి 8కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూజెట్ కూడా తన విమానాల సంఖ్యను ఈ ఏడాదిలోగా మూడు నుంచి 10కి పెంచుకోవాలనుకుంటోంది. వృద్ధి నమోదవుతోందిలా... ♦ అన్సీజన్గా భావించే ఫిబ్రవరిలో ఈ ఏడాది 79 లక్షల మంది ప్రయాణించారు. గతేడాదికన్నా దాదాపు 25% అధికం. ♦ 2016 తొలి మూడు నెలల్లో ప్రయాణించిన వారి సంఖ్య 2.3 కోట్లు. గతేడాది ఇదే కాలంలో ప్రయాణించిన 1.85 కోట్ల మందికన్నా దాదాపు 23 శాతం అధికం. -
విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించే విస్తార విమానయాన సంస్థ హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ చార్జీలను అందిస్తోంది. ఈ హోలీ ప్రత్యేక చార్జీలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, దీనికి పన్నులు, ఇతర చార్జీలు అదనమని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా ఒక వైపు విమాన చార్జీలు ఎకానమీ క్లాస్కు రూ.999 నుంచి, ప్రీమియమ్ ఎకానమీ క్లాస్కు రూ.2,299 నుంచి మొదలవుతాయని వివరించింది. ఈ ప్రత్యేక చార్జీలకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 అర్థరాత్రి వరకూ ఉంటుందని, సీట్లు పరిమితమని తెలిపింది. తామందించే అన్ని దేశీయ రూట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయని, కొత్త రూట్లు-జమ్ము, శ్రీనగర్, కోచిలకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. -
టాటా విమాన సర్వీసులిక విస్తారం
న్యూఢిల్లీ: టాటా సన్స్-సింగపూర్ ఎయిర్లైన్స్ల జాయింట్ వెంచర్కు బ్రాండ్ నేమ్ విస్తారను, లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఆకాశంలాగా పరిమితులు లేని విస్తరణను సూచించే విస్తారను బ్రాండ్నేమ్గా ఎంపిక చేశామని విస్తార సీఈవో టీక్ యోహ్ చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. విమాన సర్వీసులకు సంబంధించిన ఆమోదం (ఏయిర్ ఆపరేటర్ పర్మిట్-ఏఓపీ) ను పొందే ప్రక్రియ తుది దశలో ఉందని టీక్ యోహ్ చెప్పారు. తమ సంస్థ తొలి విమానం వచ్చే నెలలో వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా మొత్తం ఐదు విమానాలతో సర్వీసులను నిర్వహిస్తామని వివరించారు. ఎయిర్బస్ ఏ-320 విమానాలను ఇరవై వరకూ లీజుకు తీసుకోవాలని ఇప్పటికే ఈ కంపెనీ నిర్ణయించింది. వీటిల్లో అధునాతన తాజా టెక్నాలజీతో తయారైన ఏ-320 విమానాలు ఏడు వరకూ ఉన్నాయి. 11 నగరాలకు సర్వీసులు: కాగా విస్తార బ్రాండ్నేమ్, లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా-ఎస్ఐఏ ఎయిర్లైన్స్ చైర్మన్ ప్రసాద్ మీనన్, బోర్డ్ డెరైక్టర్లు ముకుంద్ రాజన్, స్వీ వాహ్ మ్యాక్లు కూడా పాల్గొన్నారు. ఏయే నగరాలకు విమాన సర్వీసులను నడపాలనే విషయమై దాదాపు తుది నిర్ణయానికి వచ్చామని టీక్ యోహ్ పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ సంస్థ ప్రారంభంలో ఐదు నగరాలకు విమాన సర్వీసులందిస్తుందని, ఆ తర్వాత 11 నగరాలకు వాటిని విస్తరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, జమ్మూ, శ్రీనగర్, పాట్నా, చండీఘర్ నగరాలకు ఈ సంస్థ విమాన సర్వీసులను అందించనున్నదని సమాచారం. భారత వైమానిక మార్కెట్లో విస్తార చెప్పుకోదగ్గ సంస్థ అవుతుందని ప్రసాద్ మీనన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విస్తరంగా-ప్రయాణికుల సహజ ఎంపిక అవుతుం దని పేర్కొన్నారు. టాటా గ్రూప్ పెట్టుబడులు పెడుతున్న మరో విమానయాన సంస్థ ఎయిర్ ఏషి యా తమకు పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయన్నారు.