-
ఇకపై అలా చేస్తే భారీ జరిమానా: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ వార్నింగ్!
ఐపీఎల్-2024 నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై మైదానంలో ఉన్నపుడు.. మ్యాచ్లకు సంబంధించిన ఫొటోలు, లైవ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఐపీఎల్ ఫ్రాంఛైజీలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. జట్ల యజమానులు, కామెంటేటర్లు, ఆటగాళ్లు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల సోషల్ మీడియా టీమ్లను ఉద్దేశించి ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు బోర్డుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు. కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు గానీ షేర్ చేయకూడదు. ఒక్కోసారి కొంతమంది కామెంటేటర్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసినపుడు, మైదానం ఉన్నపుడు ఫొటోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో గనుక ఒక మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే అప్పుడు బ్రాడ్కాస్టర్లకు ఒక రకంగా అది నష్టమే. నిజానికి ఐపీఎల్ జట్లు సైతం లైవ్ మ్యాచ్ల వీడియోలు షేర్ చేయకూడదు. కొన్ని ఫొటోలు, లైవ్ మ్యాచ్ అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ ఫ్రాంఛైజీకి జరిమానా పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కొంత మంది ఆటగాళ్లు సైతం మ్యాచ్ డేకు సంబంధించిన ఫొటోలు పంచుకున్నారని.. వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా తాము ఆదేశించినట్లు సదరు అధికారి వెల్లడించారు. కాగా ఐపీఎల్ 2023-2027 ప్రసార హక్కులను స్టార్ ఇండియా(టెలివిజన్- రూ. 23,575 కోట్లు), వయాకామ్ 18(డిజిటల్- రూ. 20,500 కోట్లు- జియో సినిమా) దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో మాత్రమే మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఒకవేళ ఏదైనా ఐపీఎల్ టీమ్ గనుక లైవ్ గేమ్ను షేర్ చేస్తే రూ. 9 లక్షల మేర బోర్డు ఫైన్ విధించనున్నట్లు సమాచారం. -
Ashish Chanchlani: టాలెంట్తో.. బిలియన్ల వ్యూస్.. మిలియన్ల సబ్స్క్రైబర్స్..
'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్కి వెల్నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.' సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్స్టింక్ట్ ఉండటంతో టీన్స్లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్తో కలసి యాడ్స్ చేశాడు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు. 'బెస్ట్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా! ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే.. -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్ అతడు కదా: సెహ్వాగ్
#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్కేను చాంపియన్గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్ కెప్టెన్ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్-2024 సీజన్కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా. ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్కే కెప్టెన్గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్లో కెప్టెన్గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ధోని రుతురాజ్కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో ఈ వికెట్ కీపర్ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్ దృష్ట్యా కెమెరామెన్ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్ చేయడం విశేషం. Just a reminder: 𝙏𝙝𝙖𝙡𝙖 𝙣𝙚𝙫𝙚𝙧 𝙢𝙞𝙨𝙨𝙚𝙨 😉#CSKvsRCB #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/KMhidAc9Sp — JioCinema (@JioCinema) March 22, 2024 అతడు ఇప్పుడు కెప్టెన్ ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్. ఏంటో.. ఈ కెమెరామెన్ ఎప్పుడూ ధోని ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో కెప్టెన్గా రుతురాజ్కు మంచి మార్కులే పడ్డాయి. Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 రుతురాజ్ కెప్టెన్సీ బాగుంది భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఓపెనర్గా రుతురాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్తో దుమ్ములేపారు. జోష్గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్కు సిద్ధమయ్యారు. -
ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి?
-
చేపలెందుకు ఒడ్డుకు వచ్చేశాయి?
-
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతడు ఇచ్చిన క్యాచ్ను శుబ్మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. -
భారతదేశంలో క్రికెట్ అంటే చాలా క్రేజ్...మరి ఇంతనా..?
-
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్లో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
పండగ వైరల్
ఇంటింటా ముగ్గుల పాఠశాల ఒకప్పుడంటే ముగ్గులు వేయడం అనే కళను అమ్మ నుంచో నానమ్మ, అమ్మమ్మ, ఇరుగింటి, పోరిగింటి అత్తయ్యల నుంచో నేర్చుకునేవారు అమ్మాయిలు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. ఇంటర్నెట్టేవారికి పాఠశాల. సంక్రాంతి రోజుల్లో ముగ్గుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్లో ఆన్లైన్ ముగ్గుల ట్యుటోరియల్స్ హల్చల్ చేస్తున్నాయి. ‘బ్యూటీఫుల్ ఫ్రీ హ్యాండ్ స్క్వేర్ రంగోలి డిజైన్ ట్యుటోరియల్’ ‘సింపుల్ రంగోలి డిజైన్ 9 డాట్స్ చుక్కల ముగ్గులు’ ‘స్టెప్ బై స్టెప్ రంగోలి ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ విత్ 5 డాట్స్’ ‘క్రియేటివిటీ 3్ఠ3 డాట్స్ ముగ్గులు’... మొదలైనవి వాటిలో కొన్ని. ఇక ఇన్స్టాగ్రామ్లో ‘మై రంగోలి వరల్డ్’ పేరుతో వీడియోలు కనిపిస్తున్నాయి. పందెం కోడి రెండున్నర లక్షలు ‘ఎత్తర కోడి తిప్పర మీసం’అని సంక్రాంతి వస్తే బరిలోకి దిగుతారు పందెం రాయుళ్లు.తూ.గో, ప.గో జిల్లాల్లో సంక్రాంతికి కోళ్ల పందేలు జరపడం ఆనవాయితీ. అయితే పోటీలో గెలిచేందుకు కోళ్లను సాకే తీరు అంతే వినూత్నం.ఈ సంవత్సరం సంక్రాంతి పుంజు ఒక్కోటి రెండున్నర లక్షలు పలుకుతోంది. పందెం కోళ్ల కబుర్లకోసం నెటిజన్లు చెవి కోసుకుంటున్నారు కూడా.మగకోళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకుంటాయి? ఆడకోళ్లు సమర్థమైన కోడి పుంజునే ఎంచుకుంటాయి కాబట్టి. ఇతర మగకోళ్లను తరిమికొట్టి ఆడకోళ్లకు చేరువ కావాలి కాబట్టి. ఆడకోళ్లను, వాటి గుడ్లను రక్షించడానికి శక్తి కావాలి కాబట్టి. క్రీస్తు పూర్వం నుంచే కోడి పందాలు ప్రపంచదేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. కుమారస్వామి పతాకంపై కూడా కోడిపుంజు ఉంటుంది. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉంటాయి. కాకి, డేగ, నెమలి, పింగళి, పూల, మైల, కౌజు, సేతు, కాకి, సేవల, నల్లబోర, ఎర్రపోడ... ఇలా. కోడి పందేల పండితులు, పెంచే ఆసాములు దూరం నుంచి చూసి కూడా ఏ పుంజు ఏ జాతికి చెందిందో చెప్పేయగలరు. పందేల వేళ దేని మీద దేన్ని వదలాలో ఒక లెక్క ఉంటుంది. కోడి పుంజుల పంచాంగం, జాతకాలు ఉంటాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. కుక్కుట శాస్త్రమే ఉంది. పల్నాటి యుద్ధం కోడి పందేల ఆనవాయితీని మరవనీకుండా చేస్తూనే ఉంది. కోడి పందేల కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసే వారు... కోడి పందేల సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయం గడించేవారు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. పందెం కోళ్లను పెంచి అమ్ముతారు. ప్రస్తుతం ఒక్కో కోడి రెండున్నర లక్షల ధర పలుకుతోంది. ఇవి బాగా పోరాడటానికి గతంలో ఏం చేసేవారోగాని ఇప్పుడు వయాగ్రా, శిలాజిత్ వంటివి కూడా పెడుతున్నారని తాజా వార్తలు. లోకల్ బ్రీడ్స్లో మోసాలు ఉంటాయని థాయ్లాండ్, ఫిలిప్పైన్స్ నుంచి కూడా పుంజులను తెప్పించుకుంటున్నారు. అయితే అదంత సులువు కాదు. కోడి పందేలకు తర్ఫీదు ఇచ్చే గురువులు వేరే ఉంటారు. వీరు అక్టోబర్ నుంచి పుంజులకు శిక్షణ మొదలెట్టి జనవరికి పూర్తి చేస్తారు. వీటికి తినిపించే తిండి అమోఘం కాబట్టి వీటి రుచి అమోఘమని ఓడిన వాటిని ఎగరేసుకుపోయేవారూ ఉన్నారు.థాయ్లాండ్లో ఇలాంటి పోటీల్లో ఓడిన కోడిని 20 లక్షలకు కూడా కొన్న సందర్భాలున్నాయి.ఈసారి మనవాళ్లు ఎంతకు కొంటారో చూడాలి. క్యూఆర్ కోడ్ హరిదాసులు తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజంపై తంబుర, కాళ్లకు గజ్జెలు, రామదాసు కీర్తనలతో వీధుల వెంట నడిచొచ్చే హరిదాసులను చూస్తుంటే భక్తి భావం పోంగిపోర్లుతుంది. అయితే కాలంతో పాటు హరిదాసులు కూడా మారుతున్నారు అని చెప్పడానికి బైక్లపై వీధుల్లో తిరుగుతున్న హరిదాసులే నిదర్శనం. ‘మోడ్రన్ హరిదాసులు’ ‘హైటెక్ హరిదాసులు’ పేరుతో ఈ వీడియోలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కొందరు హరిదాసుల తంబూరలపై పేటీయం క్యూఆర్ కోడ్లు కనిపించడం విశేషం. మకర సంక్రాంతి పంచదార నగలు మహారాష్ట్రలో నూతన వధూవరులు తొలి మకర సంక్రాంతిని పంచదార నగలు ధరించి ఆహ్వానిస్తారు. దీని తాలూకు వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. ‘హల్వియాచే దాగినే’ అని పిలిచే ఈ నగలను పంచదార, నువ్వులు, సగ్గు బియ్యం ఉపయోగించి తయారు చేస్తారు. హల్వా అంటే తీపిదనం, దాగినే అంటే నగలు అని అర్థం. ఒక తరం నుంచి మరో తరానికి పరంపరగా ఈ ఆచారం వస్తోంది. ఈ నగలు ధరిస్తే కొత్త సంవత్సరంలో తీపిదనం, ఆనందం చేకూరుతాయని నమ్మకం. ఒకప్పుడు ఇండ్లలోనే వీటినే తయారు చేసుకునేవారు. ఇప్పుడు షాప్లలో కూడా వీటిని అమ్ముతున్నారు. కైట్ మానియా సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో తేలియాడే గాలిపటాలు ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అంటాయి. వాటి సంబరం మాట ఎలా ఉన్నా గాలిపటాల దారాలు పక్షుల పాలిట మృత్యు ద్వారాలు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆగ్మెంట్ రియాలిటీ (ఏఆర్ ) బేస్డ్ కైట్ గేమ్ల వైపు మొగ్గుచూపుతున్నారు కొందరు పక్షి ప్రేమికులు. అమెరికన్ మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్చాట్’ గత సంవత్సరం ‘కైట్ మానియా’ పేరుతో లాంచ్ చేసిన ఏఆర్ బేస్డ్ కైట్ గేమ్కు మంచి స్పందన లభించింది. దీనిలో యూజర్లు తమ సొంత కైట్ను క్రియేట్ చేసి ఎగరేయవచ్చు. -
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్బాల్ స్టార్ అలన్ విలియమ్స్తో కలిసి బాస్కెట్బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత
జమ్మూకశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో కశ్మీర్లోని అనేక ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలైన పిర్ కీ గలి, జోజిలా, గుల్మార్గ్లలో శుక్రవారం తొలి హిమపాతం నమోదైందికొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంచు కారణంగా నిలిచిపోయిన కొన్ని వాహనాలను అధికారులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం, రాత్రిపూట భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. కాబట్టి హైవే మూసి ఉంటుందని వారు తెలిపారు. హిమపాతం ముగిసిన తర్వాత హైవేను క్లియర్ చేసే పని ప్రారంభమవుతుందని వారు తెలిపారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై విపరీతమైన మంచు పేరుకుపోవడంతో అధికారులు రహదారులను మూసేశారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రత్యామ్నాయ లింక్ అయిన మొఘల్ రోడ్ను హిమపాతం కారణంగా గురువారం వాహనాల రాకపోకలకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పోషణ- పీర్ కి గలి మధ్య మంచు కురుస్తుండటంతో రహదారి మూసుకుపోయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు జమ్మూలోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాతో కలుపుతుంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై పలు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి సమయాల్లో భారీగా మంచు కురిసే అకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు. #WATCH | Jammu and Kashmir: Gulmarg receives season's first snowfall. pic.twitter.com/xGHbRm46Wa — ANI (@ANI) November 10, 2023 -
ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్లో సాంట్నర్ పట్టగా (బెయిర్స్టో).. రెండోది సౌథీ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ (మొయిన్ అలీ) అందున్నాడు. సాంట్నర్ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్ను పట్టుకున్న ఫిలిప్స్ అత్యద్భుతం. Some catch 👏 Jonny Bairstow is forced to depart early...#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hrB15EWVgt — England Cricket (@englandcricket) September 10, 2023 మొయిన్ అలీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ ఈ క్యాచ్ను అందకున్నాడు. రిస్క్తో కూడుకున్న ఈ క్యాచ్ను పట్టుకుని ఫిలిప్స్ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ క్యాచ్ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. Glenn Phillips ... Flying bird ...#ENGvNZ pic.twitter.com/Y1h08pWRE8 — Manikanta Aravind (@MA_Aravind) September 10, 2023 ఈ రెండు క్యాచ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్ క్యాచ్తో పోలిస్తే ఫిలిప్స్ క్యాచ్కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్ను ఫ్లయింగ్ బర్డ్తో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లివింగ్స్టోన్ (95 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఇంగ్లీష్ బౌలర్లు డేవిడ్ విల్లే (3/34), రీస్ టాప్లే (3/27), మొయిన్ అలీ (2/30), అట్కిన్సన్ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఇన్నింగ్స్లో డారిల్ మిచెల్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
డాన్స్ అనేది వైరల్ అని ఎందుకంటారంటే..
-
టైటానిక్ ఇల్లు కట్టుకున్న రైతు
-
కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..
ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్కి గర్వకారణమని, అతను చాలా స్కిల్ఫుల్గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్) -
డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగిన కోచ్..ఇది నిజంగా సిగ్గు చేటు! వీడియో వైరల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2023 ఆది నుంచే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో ఈ లీగ్ వార్తల్లోకెక్కింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఖలీద్ మహమూద్.. మ్యాచ్ జరగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. అసలేం జరిగిందంటే? ఈ టోర్నీ లీగ్ మ్యాచ్లో భాగంగా శుక్రవారం(ఫిబ్రవరి10) ఖుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిషల్ ఢాకా వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ జరగుతుండగా ఖలీద్ మహమూద్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇదింతా కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బాధ్యయుత కోచ్ స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించిన ఖలీద్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "యూరప్లో ఆటగాళ్లు ఇలా చేసినందుకు ఆటగాళ్లను సస్పెండ్ చేసారు. అటువంటిది కోచ్ స్థానంలో ఉన్న ఖలీద్ మహ్మద్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ ఎలా తాగాడో నాకు అర్థం కావడం లేదు. ఇది నిజంగా సిగ్గు చేటు అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs AUS: నా ముఖం కాదురా అయ్యా.. ముందు రిప్లేలు చూపించు! రోహిత్ సీరియస్ @BCBtigers In Europe players are getting suspended for vaping. I don’t understand how Khaled Mahmud Sujon smoked in the dressing room. It was absolutely disgusting to watch. — Azharul (@Azharulislam07) February 11, 2023 -
మధ్యతరగతి కుటుంబం.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! ఒక్కో వీడియోతో
గత సంవత్సరం టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్గా యూ ట్యూబ్ ప్రకటించిన వారిలో 22 ఏళ్ల అపర్ణా టాండలే ఉంది. మన దేశంలో ఇంటింటా తెలిసిన పని మనిషి పాత్రను చీపురు పట్టి హాస్యం చిలికేలా పోషించడమే అపర్ణా సక్సెస్కు కారణం. ఆమె చేసే ‘కామ్వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 3 కోట్ల వ్యూస్ అపర్ణ చేసిన ‘బారిష్ మే భీగ్నా’ (వానలో తడవడం) అనే మూడు నిమిషాల వీడియోకు 3 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. అపర్ణ పరిచయం. పని మనిషి అప్పుడే ఇల్లు తుడిచి మొత్తం శుభ్రం చేసి ఉంటుంది. అంతలో కాలింగ్బెల్ మోగుతుంది. ‘బారిష్ మే భీగ్నా’ తలుపు కన్నం నుంచి చూస్తే వానలో పూర్తిగా తడిసి వచ్చిన అమ్మగారూ, అయ్యగారూ. పని మనిషి గతుక్కుమంటుంది. ‘అమ్మో.. ఇప్పుడు వీళ్లు ఇంట్లోకి వస్తే ఇల్లంతా నీళ్లు, బురదా. మళ్లీ పనంతా చేయాలి’ అనుకుంటుంది. అంతే. తలుపుకు ఇంకో బోల్టు పెట్టేస్తుంది. అమ్మగారు కాలింగ్ బెల్ నొక్కితే బోల్ట్ తీస్తున్నట్టుగా నటిస్తూ ‘అమ్మా... బోల్ట్ స్ట్రక్ అయ్యింది’ అని లోపలి నుంచి అరుస్తుంది. బయటి నుంచి అమ్మగారి పిలుపులు... లోపలి నుంచి తలుపు రావడం లేదని పని మనిషి అరుపులు. తడిసి వచ్చిన అమ్మగారిని, అయ్యగారిని ఇంటి బయటే గంట సేపు కూచోబెట్టి ఈ లోపు హాయిగా టీవీ చూస్కుంటూ వాళ్లు పూర్తిగా ఆరారు అని తేల్చుకున్నాక అప్పుడు తలుపు తీస్తుంది పని మనిషి. ఇది అపర్ణా టాండాలె తీసిన మూడు నిమిషాల‘బారిష్ మే భీగ్నా’ షార్ట్ వీడియో. సూపర్హిట్ అయ్యింది. మూడు కోట్ల వ్యూస్ వచ్చాయి. పూణె అమ్మాయి పూణెకు చెందిన 22 ఏళ్ల అపర్ణ టాండాలె 2022లో యూట్యూబ్లో ఒక టాప్ కంటెంట్ క్రియేటర్గా నిలిచింది. ఆమె షార్ట్ వీడియోస్ కోసం చేసే పాత్ర పేరు షీలా దీదీ. సిరీస్ పేరు ‘కామ్వాలీ బాయి’. కామ్వాలీ అంటే పని మనిషి. ∙∙ పనిమనిషి లేని మధ్యతరగతి ఇల్లు ఉండదు. పని మనిషితో పేచీ పడని ఇల్లాలూ ఉండదు. పని సరిగ్గా చేయడం లేదని అమ్మగారు సణిగితే, పని ఎక్కువైందని పనిమనిషి గొణుగుతుంది. స్మార్ట్ పనిమనిషి పాత్ర బాగా తెలివైన పని మనిషైతే ‘స్మార్ట్ వర్క్’ చేసి పనిని తగ్గించుకోవడమో, తప్పించుకోవడమో చేస్తుంది. అపర్ణా టాండాలె తన సిరీస్లో ధరిస్తున్నది ఈ స్మార్ట్ పనిమనిషి పాత్రనే. ఎప్పుడూ ఆకుపచ్చని చీర, మేచింగ్ బ్లౌజ్, కొప్పు వేసిన జుట్టు, మెడలో నల్ల పూసలు, చేతిలో చీపురు... ఇది పనిమనిషి షీలా ఆహార్యం. ఆమె పని చేసేది ఒక యువ జంట ఇంట్లో. చేయాల్సిన పని చేస్తుంటుంది గాని ఒక్కోసారి తేడా వచ్చిందంటే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ట్రిక్సే ఒకటీ ఒకటిన్నర నిమిషాల వీడియోలుగా మనం చూస్తుంటాము. – ఒక వీడియోలో యజమాని ఒకసారి బోల్డన్ని ఇండోర్ ΄్లాంట్స్ తెస్తుంది. ‘దీనికి స్ప్రే చేస్తే చాలు. దానికి అరగ్లాసు నీళ్లు చాలు. ఈ దానికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి’... ఇలా పది కుండీల లెక్క చెబుతుంది అమ్మగారు. పని మనిషి షీలా ఇంత పని చేస్తుందా? ఒక రోజు పెద్ద బకెట్టు నిండా నీళ్లు మొక్కలకు పోయబోతూ అమ్మగారికి కంగారు పుట్టిస్తుంది. మరోరోజు మొక్కల దగ్గర ఒళ్లు గీరుకుంటూ ‘నాకు మొక్కలంటే ఎలర్జీ’ అంటుంది. మరోరోజు అమ్మగారి మీదే తుమ్ముతూ ‘మొక్కలకు నీళ్లు పోస్తే తుమ్ములు’ అంటుంది. దెబ్బకు మొక్కలకు నీళ్లు పోసే పని అయ్యగారు తీసుకుంటాడు. ఇదంతా ఎంతో ఫన్నీగా ఉంటుంది. మామూలుగా కాదు మరో వీడియోలో అమ్మగారు అల్మారాలోని తన బట్టలన్నీ సర్దమంటే ఒక్కదాన్నే చేయాలా అనుకున్న పని మనిషి ‘అమ్మగారూ... పొరుగింట్లో ఏమయ్యిందో తెలుసా?’ అని అమ్మగారిని పిలిచి మాటల్లో పెట్టి ఆమె చేతే మొత్తం బట్టలు మడత పెట్టిస్తుంది. ఇంకో వీడియోలో స్టోర్రూమ్ సర్దమంటే ‘బాబోయ్ ఎలుక...’ అని అరిచి యజమానిని పిలిచి ‘అటు పోయింది... ఇటు పోయింది’ అంటూ మొత్తం సామాను అతడే సర్దేలా చేస్తుంది. ఈ వీడియోలు చూసే ప్రేక్షకులు యజమానుల్లో తమని, షీలా పాత్రలో తమ పని మనిషిని చూసుకోవడం వల్ల ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. ∙∙ పూణెకు చెందిన యూ ట్యూబర్ అపర్ణ టాండాలెకు ‘షార్ట్స్ బ్రేక్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. అందులో ‘కామ్ వాలీ బాయి’ సిరీస్ చేస్తుంది. ఈ ఒక్క యూ ట్యూబ్ చానల్ కాకుండా ‘టేక్ ఏ బ్రేక్’, ‘మ్యాడ్ ఫర్ ఫన్’ అనే ఇంకో రెండు మూడు చానల్స్ నడుపుతోంది అపర్ణ. మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అపర్ణకు బాల్యం నుంచి నటి కావాలనే కోరిక. స్కూల్, కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు వేసేది. 2018 నుంచి యూ ట్యూబ్లో షార్ట్ వీడియోలు మొదలెట్టింది. పలుచటి శరీరంతో చురుగ్గా కదులుతూ హుషారైన ముఖ కవళికలతో ఆకట్టుకుంటుంది అపర్ణ. ‘ప్రతి ఇంట్లో ఇంటి పని ఉంటుంది. అలాగే పని మనిషి కూడా కావాల్సిందే. ఆ పాత్రను తీసుకుంటే ఎంతో హాస్యం పండించవచ్చు. బాధగా ఉన్నవారు కూడా నా వీడియోలు చూసి నవ్వాలి’ అంటుంది అపర్ణ. అలా నవ్వుతున్నారు కనుకనే ఆమెకు పాపులారిటీ. సృజనాత్మక ఐడియాలు ఉంటే భారీగా పాపులర్ కావచ్చనేదానికి అపర్ణే ఒక పెద్ద చీపురంత ఉదాహరణ. View this post on Instagram A post shared by Aparna Tandale (@aparna_tandale) View this post on Instagram A post shared by Shorts Break (@shortsbreak) -
చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..
కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్7 డ్రాగన్ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరోనా లెక్కలు వెల్లడించకుండా దాచేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది. దీంతో చైనా కేసులు, మరణాలు వివరాలు బయటికి రావడం లేదు. చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇక రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాకు సంబంధించి చైనా నుంచి వెలువుడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి కొన్ని భయంకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ కోవిడ్ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్ హోమ్స్) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు జరిపేస్తున్నారు కుటుంబ సభ్యులు. చదవండి: భారత్లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? I've seen quite a few similar videos, but haven't posted any until now. Given what we learned from other sources about how difficult & expensive to cremate a body in a #crematorium in #CCPChina, I'm not surprised if someone in the countryside chose to do this.#ChinaCovidDeaths pic.twitter.com/hxhGdhPriS — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 ‘ఓ వ్యక్తి వాళ్ల తండ్రి కరోనాతో మృతిచెందాడు. శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయడం ఖరీదుతో కూడుకుంది.దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను భరించలేక అతను తన తండ్రి మృతదేహాన్ని బహిరంగ స్థలాన్ని ఎంచుకొని అంత్యక్రియలు జరిపించాడు. ఇకపై అన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధానాన్ని ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ స్థానికులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. This is not a #BlackFriday rush. This is at #Suzhou Funeral Home, at 6am on Dec 30, 2022, people rushed to get a number as soon as the Funeral Home opened for registration. These ppl had been waiting since 9:00 pm on the previous night. #ChinaCovidSurge #ChinaCovidDeaths pic.twitter.com/vsh6h4HFOL — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 At Zhangjiagang, Suzhou City crematorium. Early in the morning, long line of funeral cars queuing. This is already 1 km away from the crematorium. #CCPChina #ChinaCovidCases #ChinaCovidDeaths #ChinaCovidSurge pic.twitter.com/LHM1Yko8Z0 — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 -
Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ 'బాంబ్ సైక్లోన్' విధ్వంసం సృష్టిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా క్రిస్మస్ పండుగను కూడా సరిగా జరుపుకోలేకపోయారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. A drone has captured incredible footage of entire houses encased in ice after a bomb cyclone hit the US and parts of Canada. Read more: https://t.co/jMSLhhH6kY pic.twitter.com/wdLzJUuUJA — Sky News (@SkyNews) December 28, 2022 #bombcyclone2022 #snowstorm #BombCyclone ravages East America,death toll rises to 60 The worst damage was in the #Buffalo area of #NewYork.Severe impact on electricity services. Due to the blizzard,nearly 200,000 residents eastern #USA haven't Electricity in the extreme cold pic.twitter.com/GFhGbitYGA — Kaustuva Ranjan Gupta (@GuptaKaustuva) December 28, 2022 మంచు తుఫాన్ వల్ల అమెరికాలో ఇప్పటివరకు 70 మందికిపైగా చనిపోయారు. కొందరు మంచులోనే గడ్డకట్టి కన్నుమూశారు. మరికొందరు వివిధ ప్రమాదాల్లో మరణించారు. That’s happened during a Historic Bomb Cyclone after a Decades. pic.twitter.com/uy10cJFfSM — Adeel Ali (@AdeelAl03137938) December 25, 2022 Bomb Cyclone Light house, Michigan City, 🇺🇸 pic.twitter.com/0BUQWIgMFR — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. స్టోర్లలోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు. దొరికిన కాడికి నగదు, వస్తువులు దోచుకెళ్లారు. Bomb Cyclone Buffalo, NY, 🇺🇸 Many stores were under theft pic.twitter.com/rT0E0mGToJ — Earth & beyond (@umadevipavuluri) December 26, 2022 అమెరికాలో మంచు తుఫాన్కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. The view out my parents garage in Prince Edward County. The drift is up to their second story patio #ONstorm #BombCyclone pic.twitter.com/ocbD9KPuZF — Smith (@RileyZSmith) December 25, 2022 Shouldn't laugh but..........#ice #blizzard #WinterStorm #BombCyclone #Elliott #wind #snow #Ice #WeatherBomb video:@kayokayla pic.twitter.com/jJyswxJDkd — Volcaholic (@CarolynnePries1) December 24, 2022 Bomb Cyclone ! Ashtoshing Scenas, Drone Camera Work , Shows Hudge Snow Mountains in NY. Buffalo, NY, 🇺🇸 #BombCyclone #BombCylonebyDrone #BuffaloNY #BuffaloStorm2022 pic.twitter.com/LxKa0oKM5b — Top Viral Videos (@ManojKu40226010) December 26, 2022 Amid plunging temperatures, one person in Montana decided to throw some boiling water in the air and make more snow. The huge winter storm pummelling the US has intensified into a "bomb cyclone", with 60% of the population under a winter weather warning.https://t.co/4DalHHz9Lj pic.twitter.com/ADu80WBRKP — Sky News (@SkyNews) December 24, 2022 Snow plows at work as Mammoth winter storm unleashes chaos in #Vancouver Extremely Dangerous travel conditions, due to freezing rain @TranBC @MainroadLM#BritishColumbia #BCStorm #Canada #Elliott #ColdWave #BombCyclone #Weather #Climate #GlobalWarming #BCSnow #PortMannBridge pic.twitter.com/ZGyHRQejuP — Earth42morrow (@Earth42morrow) December 23, 2022 చదవండి: రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం -
తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి
స్కూల్స్లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్ చెకింగ్లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. ఐతే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు గానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక ఉన్నతాధికారి ఇన్స్పెక్షన్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ఒక పోలీస్టేషన్ని తనిఖీ చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్ చేయగలవా అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్చేసి చూపించమంటే సదరు సబ్ఇన్స్పెక్టర్ చాలా తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడతారు. సదరు ఉన్నతాధికారి ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసి మొదటగా షాక్కి గురి అయ్యాడు. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరిస్తున్నాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. ఐతే సదరు ఇన్స్పెక్టర్పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు)