-
ప్రేమ,పెళ్లి.. నా కౌశిక్ చచ్చిపోయాడు.. అయినా
సాక్షి, వెబ్డెస్క్: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది. ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే ‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది. నేను ఆర్జే, తను రైటర్ ‘‘కామన్ ఫ్రెండ్స్ ద్వారా కౌశిక్ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్ఫ్రెండ్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్ టవర్ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే సలహా ఇచ్చేందుకు తను లేడు తనకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. అప్పుడే భర్తను మర్చిపోయిందా? ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్న్యూస్డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్న్యూస్డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్తో పాటు టీవీ సిరీస్ల థీమ్ సాంగ్లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..
ముంబై: మహారాష్ట్రకు చెందిన మంజిరి ప్రభు తన సోదరి లీనాతో కలిసి పుణెలో ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకోగానే డ్రైవర్కు డబ్బు చెల్లించే క్రమంలో కనిపించిన ఓ అతిథి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రైవర్ కాళ్ల దగ్గర కూర్చుని, రెండు అందమైన కళ్లేసుకుని తదేకంగా తననే గోముగా చూస్తూ దృష్టిని ఆకర్షించింది. ఆ అతిథి పేరు రీని. ఆటో డ్రైవర్ హర్వీందర్ సింగ్ ప్రియనేస్తం అది. ఎల్లప్పుడూ తనతోనే ప్రయాణం చేస్తుంది. కానీ ఎన్నడూ కస్టమర్లను విసిగించకుండా, ఒద్దికగా ఉంటూ విశ్వాసానికి మారుపేరన్న నానుడిని నిజం చేస్తోంది. ‘రియల్ లైఫ్ శాంటా’’ అంటూ క్రిస్మస్ పర్వదినాన మంజిరి, సదరు ఆటోడ్రైవర్- అతడి పెంపుడు కుక్కకు సంబంధించిన విశేషాలను తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ఈరోజు నేను నిజమైన శాంటాను కలిశాను. నా సోదరి లీనా, నేను ఆటో ఎక్కాం. దిగిన తర్వాత డ్రైవర్కు డబ్బు ఇస్తున్నాను. అప్పుడే ఓ కుక్కపిల్ల నా కంటపడింది. డ్రైవర్ కాళ్ల దగ్గర ఓ రగ్గుమీద కూర్చుని నన్నే చూస్తోంది. కానీ ప్రయాణం చేస్తున్నంత సేపు తన అలికిడి అస్సలు వినిపంచనేలేదు. వాడి పేరు రోనీ అట. ఆటోడ్రైవర్ చెప్పారు. వీధిలో బేలగా చూస్తున్న ఆ కుక్కపిల్లను అతడి కొడుకు ఓ రోజు ఇంటికి తీసుకువచ్చాడట. అయితే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉండటంతో పప్పీని చూసుకోవాల్సిన బాధ్యతను హర్వీందర్ తీసుకున్నారట. ఇంటి నుంచి బయల్దేరే ముందే తనతో పాటు రోనీకి కూడా భోజనం, బిస్కట్లు ఓ బాక్సులో సర్ది తనవెంటే తీసుకువెళ్తారట. నేను ఈ ఫొటో తీస్తుంటే హర్వీందర్ సింగ్ కాస్త మొహమాటపడ్డారు. కానీ కానీ అంతటి దయార్థ హృదయం కలిగిన వారు ఎంతమంది ఉంటారు. సాటి మనుషులను కూడా పట్టించుకోని వ్యక్తులు ఉన్న సమాజంలో మూగజీవి పట్ల ఇంత కేరింగ్ తీసుకుంటున్న ఆయన ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. వాళ్లిద్దరి బంధం చూస్తే నాకు ముచ్చటేస్తోంది’’ అని మంజిరి పేర్కొన్నారు.(చదవండి: వైరల్గా మారిన బస్ డ్రైవర్ ఫొటో..) -
ఆన్లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!
ఒకప్పుడు పెళ్లిళ్లంటే కొబ్బరాకులతో ఇంటి ముందు పందిరి.. అరిటాకుల్లో బంతి భోజనాలు.. అంతా కలిసి ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టే దృశ్యాలు.. వివాహ తంతు ముగిశాక బ్యాండ్ బాజాలతో ఊరేగింపులు గుర్తుకు వచ్చేవి.. అయితే కాలక్రమేణా పెళ్లి వేదిక ఫంక్షన్హాళ్లకు మారింది. ఇక సంపన్నులైతే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట సుదూర ప్రాంతాలకు బంధు గణాన్ని తరలించి అత్యంత వైభవోపేతంగా వివాహాలు జరిపించే పోకడలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం కోవిడ్ కారణంగా సుముహుర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేక అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక లాక్డౌన్ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్లైన్లో వివాహ తంతు కానిచ్చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. వీడియోకాల్లో ఆశీస్సులు ఓకే.. మరి భోజనం సంగతి ఎలా? శుభమస్తు అని దీవించిన బంధువర్గానికి విందు భోజనం పెట్టేదెలా? కల్యాణ సాపాడు పెట్టడం కనీస మర్యాద కదా! అదే పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆలోచనలే వెంటాడాయి ఓ తమిళ కుటుంబాన్ని! అందులో పెద్దగా ఆలోచించాల్సి ఏముంది.. ఏ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థనో ఆశ్రయిస్తో సరిపోతుంది కదా అంటారేమో! అదీ నిజమే.. అయితే వాళ్లు డిజిటల్ అతిథులను కేవలం సాదా సీదా భోజనంతో సరిపెట్టేయాలనుకోలేదు. (చదవండి: అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!) అందుకే ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు. మ్యారేజ్ వెబ్కాస్ట్ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లిభోజనం చేస్తూ కంప్యూటర్ల ముందుకు కూర్చుని వధూవరులను ఆశీర్వదించమని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్ ఇందుకు సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డిసెంబరు 10న వివాహ బంధంతో ఒక్కటైన శివప్రకాశ్, మహతి జంటకు నెటిజన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు మనసులను ఒక్కటి చేసే వేడుక. ఇరు కుటుంబాల కలయిక. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నవ దంపతులు అనుదీప్ హెగ్డే, మినుషా కాంచన్ ఆ కోవకు చెందినవారే. పెళ్లి తర్వాత కచ్చితంగా హనీమూన్ వెళ్లాల్సిందేనని ఆమె పట్టుబట్టలేదు. భార్య కోరలేదు కదా అని అతడు అడగకుండా ఉండనూ లేదు. వీలు కుదుర్చుకుని ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలనుకున్నారు. అయితే అంతకంటే ముందు తమకు అత్యంత సమీపంలో ఉన్న సోమేశ్వర్ బీచ్ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన తర్వాత హనీమూన్కు వెళ్లాలన్న ఆలోచనను పక్కకు పెట్టేశారు. సరదాగా గడపడం కంటే ప్రకృతిని కాపాడుకోవడమే వారికి ప్రథమ ప్రాధాన్యంగా తోచింది. వెంటనే రంగంలోకి దిగారు. తమతో పాటు నలుగురి మద్దతు కూడగట్టుకుని బీచ్ ప్రాంగణంలో పోగైన చెత్తను ఏరిపారేసే బృహత్కార్యం తలకెత్తుకున్నారు. 10 రోజుల పాటు శ్రమించి సుమారు 800 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అనుదీప్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘మీరిలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ నెటిజన్లు కొత్తజంటపై అభినందనల అక్షింతలు జల్లుతున్నారు.(చదవండి: తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు ) పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్ ‘‘ మా ఇద్దరి కల ఇది. పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్, పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత బైందూరులోని సోమేశ్వర్ బీచ్లోని చెత్తాచెదారాన్ని తొలగించాం. ఇప్పుడు ఇదొక మహోద్యమంగా మారింది. అంతా కలిసి 8 క్వింటాళ్లకు పైగానే చెత్తను ఏరివేశాం. మాకొక మంచి అనుభవం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందనే నా నమ్మకాన్ని నిజం చేసింది. మేమంతా మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించండి. కలిసి పనిచేస్తే ఇంకెంతో మార్పును తీసుకురాగలం’’ అని అనుదీప్ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా... ‘‘నేను, నాలో సగభాగమైన నా భార్య మినుషా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. ఎంతో మంది మాతో చేతులు కలిపి బీచ్ను శుభ్రం చేసేందుకు వచ్చిన తీరు అత్యద్భుతం. మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాయం అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తమకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ అనుదీప్- మినుషా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(చదవండి: ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు) View this post on Instagram A post shared by Anudeep Hegde (@travel_nirvana) -
‘మాకంటే ముందు అమ్మకే ముద్దు పెట్టేవారు’
పెళ్లినాటి ప్రమాణాలను మనసా, వాచా, కర్మణా ఆచరించే భర్తలు కొంతమందే ఉంటారు. పుట్టింటిని వీడి మెట్టినింట అడుగుపెట్టిన ‘ఆడపిల్ల’కు అన్ని బంధాలు తానే అయి ప్రేమానురాగాలు పంచుతారు. తండ్రిలా బాధ్యతగా వ్యవహరిస్తూ, తల్లిలా ఆప్యాయత కురిపిస్తూ, స్నేహితుడిలా తోడుంటూ, భర్తగా మనసెరిగి ప్రవర్తిస్తూ భార్య పట్ల అవాజ్యమైన ప్రేమను ప్రదర్శిస్తారు. ఇంతలా ప్రేమించే భర్త ఉంటే ఏ అమ్మాయి అయినా తనను తాను అదృష్టవంతురాలిగానే భావిస్తుంది. అంతేకాదు తాను పొందిన ప్రేమకు పదిరెట్లు ఎక్కువగానే ప్రేమను తిరిగి ఇస్తుంది. అలాంటి ఓ జంట కథ గురించి వారి కూతురు చెప్పిన విషయాలు వింటే కళ్లు చెమర్చకమానవు. ఒకరికొకరై బతికిన ఆ దంపతులు కొన్ని రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయిన వైనం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. న్యూయార్క్: ‘‘మా నాన్నకు ఐదుగురు కూతుళ్లం. బిజినెస్ ట్రిప్కు వెళ్లొచ్చినపుడు వెంటనే మేమంతా ఆయనకు ముద్దు పెట్టేందుకు వరుసలో నిలబడే వాళ్లం. కానీ నాన్న మాత్రం ముందుగా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె నుదుటిపై ముద్దుపెట్టేవారు. ఎందుకంటే మా నాన్న ఫస్ట్ లవ్ తనే కదా. అంతేకాదు మేం సరాదాగా రోడ్ ట్రిప్కు వెళ్లినపుడు గానీ, కుటుంబమంతా ఒక్కచోట చేరి కచేరీలు చేసినప్పుడు గానీ పాటల రూపంలో ఆమెపై ప్రేమను చాటుకునే వారు. అంతా మామూలు పాటలు పాడితే.. నాన్న మాత్రం పాతకాలం నాటి, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ ఆలపించేవారు. అమ్మను చూస్తూ ఆరాధనా భావం వ్యక్తం చేసేవారు. అయితే మా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం నాన్న ప్రేమ అందరికీ కాస్త వింతగా తోచేది. అయినా ఆయనెప్పుడూ వెనకడుగు వేయలేదు. అమ్మ కూడా అంతే నాన్నకు తగ్గట్టుగా నడుచుకునేది. ఆయనకు నచ్చినట్లే తన కట్టూబొట్టూ ఉండేది. తను అనారోగ్యం పాలైనపుడు కూడా నాన్న బెంగ పెట్టుకోకూడదనే ఉద్దేశంతో అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తించేది. అమ్మకు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన తర్వాత అనేక సర్జరీలు జరిగాయి. దాంతో రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణించసాగింది. సరిగ్గా నడవలేకపోయేది. (చదవండి: భార్య ప్రేమ కోసం సైకిల్ మీద ఖండాంతరాలు దాటి..) అప్పుడు నాన్నే తనకు ఊతకర్ర అయ్యారు. అమ్మను చేయి పట్టుకుని నడిపించేవారు. తనే బెడ్ పక్కనే కూర్చుని, సేవలు చేస్తూ.. గొంతు తడి ఆరేంత వరకు ఖురాన్ పటించేవారు. అమ్మ చివరి క్షణాల్లోనూ ఆయన తన పక్కనే ఉన్నారు. ‘‘ నువ్వెప్పుడూ ఒంటిరివి కావు. నేను నీతోనే వస్తున్నా’’అని అమ్మ చేతిలో చేయి వేసి మాట ఇచ్చారు. ఇదంతా చూస్తున్న నాకు నాన్న చాలా స్వార్థపరులు అనిపించింది. కోపం కూడా వచ్చింది. అంటే అమ్మ వెళ్లిపోయినా మేమంతా బతికి ఉన్నా విలువ లేదా అనిపించింది. నిజానికి అమ్మ మీద నాన్నకు ఉన్న ప్రేమ ఎలాంటిదంటే... అమ్మ చనిపోయిన తర్వాతి రోజే ఆయన తన సమాధి కోసం ప్లాట్ బుక్ చేసుకున్నారు. అమ్మ పక్కనే శాశ్వతంగా నిద్రించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. (చదవండి: నెటిజన్లను ఫిదా చేస్తున్న లవ్స్టోరి!) పేపర్ వర్క్ పూర్తైన తర్వాత రెండు రోజుల పాటు ఎంతో గంభీరంగా కనిపించారు. ఆ మరుసటి రోజే.. ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. షూ లేసులు కట్టుకుంటూ నేలమీద పడిపోయారు. అయినా ఆయనలో ఎలాంటి ఆందోళన, బాధ కనిపించలేదు. అంబులెన్స్ వచ్చే సమయానికే మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. బహుశా అమ్మను చేరుకుని ఉంటారు’’అంటూ ‘హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్’ ఫేస్బుక్ పేజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల అనుబందం గురించి సదరు మహిళ చెప్పుకొచ్చారు. అయితే తమ పేర్లు, పూర్తి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కేవలం వారి ఫొటోలను మాత్రం షేర్ చేశారు. ఈ క్రమంలో దివంగత దంపతుల లవ్స్టోరీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్లే నేటి ఆధునిక యువతకు వీరి బంధం ఆదర్శప్రాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా అంతటి గొప్ప ప్రేమజంటకు కూతురిగా జన్మించినందుకు మీరు అదృష్టవంతురాలు అని వారి కుమార్తెను అభినందిస్తున్నారు. వీళ్ల కథ వింటే.. నిజమైన ప్రేమికులను ఆ చావు కూడా విడదీయలేదు అనే మాట నిజమే అనిపిస్తోంది కదా!! -
నోరూరించే పీతల కూర..
-
నోరూరించే పీతల కూర.. ‘దీదీ’కి సాయం!
మనసుంటే మార్గం ఉంటుందనే నానుడిని మరోసారి రుజువు చేశాడు బెంగళూరుకు చెందిన అంకిత్ వెంగులేర్కర్. తమ ఇంట్లో పనిచేసే‘సరోజ్ దీదీ’ చేతివంటకు గుర్తింపు తీసుకువచ్చి ఆమెకు మరో ఆదాయ మార్గాన్ని చూపాడు. ‘అక్క’వంటపనిలో నిమగ్నమైతే.. ఆ వంటకాలను అమ్మిపెట్టే బాధ్యతను తలకెత్తుకుని పెద్ద మనసు చాటుకుంటున్నాడు. లాక్డౌన్ కారణంగా మాయమైన చిరునవ్వులను తిరిగి తీసుకువచ్చి ఆ మాతృమూర్తి ముఖాన్ని వికసింపజేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ‘అక్కాతమ్ముళ్ల’పై ట్విటర్ ఇండియా, పేటీఎం సహా ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా వంటి సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.(శారదకు జాబ్ లెటర్: సోనూసూద్) వివరాలు.. సరోజ్(47) అనే మహిళ గతంలో తన భర్తతో కలిసి మంగమమ్మనపాళ్యలో చిన్నపాటి హోటల్ నడిపేవారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరైపోయిన సరోజ్.. కుటుంబ పోషణ కోసం పనిమనిషి అవతారమెత్తింది. అలా అంకిత్ ఇంట్లోనూ పనికి కుదిరింది. ‘సరోజ్ దీదీ’అంటూ ఆమెను ఆప్యాయంగా పిలిచే అంకిత్కు.. ఆ అక్క చేతి వంట ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలో.. హోం-డెలివరీ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాననే తన ఆలోచనను అతడితో పంచుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అంకిత్.. సోషల్ మీడియా ద్వారా సరోజ్ వంటకాలను నెటిజన్లను పరిచయం చేశాడు. ఏడాది కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న సరోజ్ దీదీ ఎంతో రుచికరంగా వండుతుందని, పరిశుభ్రత పాటిస్తారని చెప్పుకొచ్చాడు. ఆమె వంట చేస్తున్న వీడియోలు, నోరూరించే వంటకాల ఫొటోలను షేర్ చేశాడు. (మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయనా) ‘‘ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలో నివసించే వాళ్లు రుచికరమైన భోజనం తినాలని భావిస్తే సరోజ్ దీదీని సంప్రదించండి. ఆమెకు అదనపు ఆదాయం సమకూరుతుంది. దయచేసి ఆమెకు అండగా నిలవండి’’అని అభ్యర్థించాడు. మంగళూరు పీతల కూర చేయడంలో సరోజ్ దీదీ దిట్ట అని, తన ట్వీట్కు స్పందించడం గొప్ప విషయమని, 10 ఆర్డర్లు వచ్చాయని, దీదీ ఎంతో సంతోషంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో అంకిత్ చొరవతో సరోజ్ జీవితంలో ఆనందం వెల్లివెరిసిందని, గొప్ప పనిచేశావంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. Saroj Didi's been cooking and cleaning at my Bangalore home for almost a year now. Extremely reliable. We bond over food and cats. She's been wanting to start a home-cooked food business for a few weeks now. We started today. She's extremely talented and experienced in cooking. pic.twitter.com/jEoRRofjQ3 — Gadgetwala (@ankitv) July 24, 2020 -
‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’
టీచర్లను ఏడిపించడం.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడటం వంటి చేష్టల్ని హీరోయిజంగా చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవంగా ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో.. ఎంతటి వేదనను కల్గిస్తాయో.. మనం ఊహించలేము. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి, షేర్ చేసుకుని.. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పాటికి అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సిన సమయం. కానీ కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తుండటంతో... విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్ క్లాస్లు నడుపుతున్నాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తమ టీచర్లను పిలిచి ఈ ఏడాది ఆన్లైన్ క్లాస్లు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. ప్రిన్సిపాల్ మాటలు వినగానే ఓ 55 ఏళ్ల టీచర్కు గుండెల్లో దడ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు ఇంకా స్మార్ట్ఫోన్ వాడకం గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది ఆన్లైన్లో క్లాస్లు తీసుకోవడం అంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు చేతకాదని చెప్తే యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తుంది. ఈ వయసులో ఆయనకు మరో ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. ఈ సమస్య గురించి కూతురుతో చెప్పాడు. ఆమె తండ్రికి ధైర్యం చెప్పి.. జూమ్లో ఆన్లైన్ క్లాస్ ఎలా తీసుకోవాలి.. స్మార్ట్ఫోన్ వాడకం గురించి కొన్ని బెసిక్స్ నేర్పింది. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే బోర్డు కావాలని చెప్పి దాన్ని కూడా తెప్పించాడు సదరు ఉపాధ్యాయుడు. ఫస్ట్ రోజు క్లాస్లో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త షర్ట్ తీసుకున్నాడు. ఇక ఆన్లైన్ క్లాస్లు మొదలు పెట్టే రోజు రానే వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని పాఠం ప్రారంభించాడు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు) కానీ మొదటి సారి కెమరా ముందు నిల్చుని పాఠం చెప్పాలంటే కాస్తా భయపడ్డాడు. గొంతు వణుకుతోంది. ఆయన ఇలా ఇబ్బంది పడుతుండగా ఓ గుర్తు తెలియని ఐడీ నుంచి కొన్ని అసభ్యకరమైన మాటలు వినిపించాయి. అసలే ఆన్లైన్ గురించి సరిగా తెలియని ఆ టీచర్.. ఈ చర్యలకు మరింత భయపడ్డాడు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. విద్యార్థుల మీద అరిచాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆగలేదు. ఆయన ఇన్నేళ్లు సంపాదించుకున్న గౌరవం కొన్ని సెకన్లలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వీడియోను మ్యూట్ చేశాడు. కానీ ఆ విద్యార్థి అన్మ్యూట్ చేసి.. టీచర్ను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆ విద్యార్థికి వినోదంగా అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే క్లాస్ను ముగించడం ఒక్కటే మార్గం. కానీ రేపు ఇలానే జరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం అతడికి ఎంతో అవసరం. దాంతో దుఖం తన్నుకొచ్చింది. (‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) కుమార్తెను పిలిచి ఒక్కసారిగా బోరున ఏడ్చాడు. ఇన్నేళ్లు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి.. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజును తలుచుకుంటే.. ఆ రాత్రి అతడికి నిద్ర కూడా పట్టలేదు. విద్యార్థులకు వినోదం.. అతడికి ప్రాణసంకటంగా మారింది పరిస్థితి. ‘టీచర్లను ఎగతాళి చేసి మీరు వినోదం పొందుతారేమో కానీ.. భవిష్యత్తులో మీరు బాధపడతారు’ అంటూ షేర్ చేసిన ఈ కథనం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. -
ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది
2017 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఇది ఒకటి. ఓ పెళ్లి కూతురు.. తన పెంపుడు కుక్కతో దిగిన ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పెళ్లి కూతురు, కుక్క ఇద్దరూ ఒకేలాంటి దుస్తులు ధరించి దిగిన ఈ ఫోటో జంతు ప్రేమికుల మనసు దోచింది. నాడు ఫోటో ఎంత వైరల్ అయ్యిందో నేడు దాని వెనక కథ అంత కన్నా ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఫోటోలోని యువతి పేరు మితాలి సాల్వి, కుక్కల ట్రైనర్. ఈ క్రమంలో కుక్కలతో తన పరిచయం, వాటితో తన అనుబంధం, కుక్కల ట్రైనర్గా విధానం వంటి పలు అంశాల గురించి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు సాల్వి.ఆ వివరాలు ఆమె మాటల్లోనే కుక్కలే నా థెరపిస్టులు.. ‘నాకు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి అమ్మ మరణించింది. ఆ సమయంలో నన్ను ఓదార్చింది.. నాకు స్వాంతన చేకూర్చింది ఈ కుక్కలే. చిన్న ముక్కుతో.. తోక ఊపుతూ నా చుట్టు తిరిగే ఈ కుక్కలే నాకు థెరపిస్టులు. ఇప్పటి వరకు నా జీవితంలో 13 కుక్కలు ఉన్నాయి. వాటి మీద అభిమానంతో వెటర్నరి డాక్టర్ కావాలనుకున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వారి బలవంత మీద ఇంజనీరింగ్లో చేరాను’ అన్నారు సాల్వి. అలా ‘పాంటీ’ నా జీవితంలోకి వచ్చింది.. పాంటీతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఓ రోజు నేను, నా స్నేహితుడు అలీ ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటు వెళ్తున్నాం. అప్పుడు ఓ దుకాణదారుడు ఓ చిన్న కుక్క పిల్లను కొట్టడం గమనించాం. వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని కాపాడం. తర్వాత ఆ చిన్న కుక్క పిల్లను నాతో పాటు హాస్టల్కు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ పెంపుడు జంతువులను మా హాస్టల్లోనికి అనుమతించరు. దాంతో ఆ చిన్న కుక్కను నా కాలేజీ బ్యాగులో పెట్టుకుని.. సెక్యూరిటీ కంటపడకుండా నా రూమ్కు తీసుకెళ్లాను’ అని గుర్తు చేసుకున్నారు సాల్వి. ‘పాంటీ’ పేరు వెనక కథ.. అయితే తన కుక్కకు పాంటీ అని పేరు పెట్టడం వెనక ఓ తమాషా సంఘటన జరిగిందన్నారు సాల్వి. ‘రూమ్లోకి తీసుకువచ్చిన తర్వాత ఓ రోజు ఆ కుక్క పిల్ల లాండ్రీ బకెట్లోంచి బయటకు దూకింది. అప్పుడు దానితో పాటు నా పాంటీ, బ్రా కూడా వచ్చాయి. వాటిని మీద వేసుకుని నా వద్దకు పరిగెత్తుకు వచ్చింది. అది చూసి దానికి ‘పాంటీ’ అని పేరు పెడితే బాగుంటుందనిపించింది. అందుకే దానికి ‘పాంటీ ’అని పేరు పెట్టాను అంటూ గుర్తు చేసుకున్నారు సాల్వి. కుక్కల ట్రైనర్గా ఎలా మారానంటూ.. ‘ఓ రోజు ‘పాంటీ’కి వాక్సిన్ వేపించాలని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ అది ప్రవర్తించిన తీరు వైద్యులను ఆకర్షించింది. ‘పాంటీ’ఎక్కడైన శిక్షణ ఇప్పించారా అని ప్రశ్నించారు. వారి ప్రశ్న నాకొక అవకాశాన్ని చూపించింది. దాంతో నేను కుక్కల ట్రైనర్గా మారాలనుకున్నాను. దీని గురించి ఇంట్లో వారికి చెప్తే ఒప్పు కోలేదు. అయితే ఈ విషయంలో అలీ నాకు మద్దతిచ్చాడు. దాంతో మేం ఇద్దరం పొదుపు చేసిన డబ్బుతో నేను కుక్కల ట్రైనర్గా శిక్షణ పొందాను. ఇప్పటికి 500 కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాను. ‘పాంటీ’ నాకు సహయకురాలిగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. అంతేకాక ‘నాకు నచ్చిన కెరియర్ను ఎంచుకోవడంతో పాటు.. అలీతో వివాహం వరకు నా జీవితంలోని ప్రతి ముఖ్య దశలో ‘పాంటీ’ నాతో పాటే ఉంది. అందుకే వివాహం రోజున నేను, ‘పాంటీ’ ఒకే రకమైన దుస్తులు ధరించాము. తను నాకు ఎంతో మంచి స్నేహితురాలు’ అంటూ చెప్పుకొచ్చారు సాల్వి. రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఇప్పటికే 16 వేల మంది దీనిపై స్పందించారు. ఇన్స్టాగ్రామ్లో 99 వేల మంది లైక్ చేశారు. ‘మీ కథనం చాలా బాగుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం కూడా మా పెళ్లిలో మా కుక్కలకు మేం వేసుకున్న లాంటి బట్టలే కుట్టించాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
జంతువులపై ప్రేమ జీవితాన్నే మార్చేసింది
మన మంచితనం, సహాయక గుణం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందనడానికి మరోసారి నిరూపించాడు ఓ 27 ఏళ్ల యువకుడు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వీధి శునకాలను కాపాడడానికి ఆ యువకుడు కనుగొన్న పద్దతిని మెచ్చి అతన్ని అసిస్టెంట్గా పెట్టుకున్నాడు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా. ఆ యువకుడి పేరు శాంతను నాయుడు. తాను ఉద్యోగం పొందిన తీరు, శునకాలను కాపాడడానికి కనుగొన్న పద్దతిని ఫేస్బుక్ పేజీ ‘ హ్యుమాన్స్ ఆప్ బాంబే’ లో వివరించారు. ‘ఐదేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వీధి కుక్కను చూపి చలించిపోయా. అవి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాయని తెలుసుకొని వాటిని ఎలాగైనా కాపాడాలని డిసైడ్ అయ్యాను. స్నేహితులతో కలిసి ఓ రిఫ్లెక్టర్ బెల్టు(పరావర్తనం చెందే బెల్టులు) ను తయారు చేశాను. రాత్రి పూట డ్రైవర్లకు కనిపించేలా ఆ బెల్టులను వీధి శునకాల మెడకు తొడిగించాను. దీంతో రాత్రి వేళలో శునకాలు రోడ్లపై పరిగెత్తినా.. డ్రైవర్లకు ఆ బెల్టులు కనిపించి వాహనాలను నిలిపివేస్తారు. ఈ ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో చనిపోయే శునకాల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి టాటా గ్రూప్ ఆప్ కంపెనీ ‘న్యూస్లెటర్’లో అచ్చయింది. ఆలోచన బాగానే ఉన్నా.. రిఫ్లెక్ట్ బెల్టులను ఉచితంగా పంపిణీ చేయడం నాకు ఆర్థికంగా ఇబ్బందైంది. అదే సమయంలో రతన్ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ అని, అతనికి లేఖ రాస్తే సహాయం అందుతోందని మా నాన్న సలహా ఇచ్చారు. తొలుత కొంత తటపటాయించినా, రాస్తే పోయేది ఏముందిలే అనుకొని టాటాకు లేఖ రాశాను. ఆ లేఖనే నా జీవితాన్ని మార్చేసింది. రెండు నెలల తర్వాత నన్ను కలవాలని రతన్ టాటా నుంచి లేఖ వచ్చింది. నమ్మలేక పోయాను. కొద్ది రోజుల తర్వాత రతన్ టాటాను ఆయన కార్యాలయంలో కలిశాను. నా ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న శునకాలను కూడా చూపించాడు. తర్వాత పై చదువుల కోసం విదేశాలకు పోయాను. నేను స్వదేశానికి తిరిగి వచ్చాక టాటా ట్రస్ట్లో పనిచేస్తానని ప్రామిస్ చేశా. చదువు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చాక ఓ రోజు రతన్ టాటా నుంచి ఫోన్ వచ్చింది. ‘ ఆఫీస్లో ఉన్న పనులతో చాలా బీజీ అయిపోతున్నాను. నువ్వు నాకు అసిస్టెంట్గా ఉండగలవా ’అని కోరారు. ఒక్కసారిగా షాకయ్యాను. పారిశ్రామిక దిగ్గజం నన్ను అసిస్టెంట్గా ఉంటారా అని అడగడం నమ్మలేకపోయా. వెంటనే సరే అన్నాను’ అని శంతను చెప్పుకొచ్చాడు. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గ్రేట్ స్టోరీ’, ‘మన మంచితనం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆ ఎక్స్-రే హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదట..
న్యూఢిల్లీ : అదేంటి! ఎక్స్రే ఫిల్మ్ హాలీవుడ్ సినీ అభిమానుల కలల సుందరి మార్లిన్ మన్రో అంటున్నారేంటి, ఆమె ఎప్పుడో చనిపోయిందిగా అనుకుంటున్నారా ? అక్కడే ఉంది అసలు విషయం .ముందు స్టోరీ మొత్తం చదవండి, తర్వాత మీకే విషయం మొత్తం అర్థమవుతుంది. జింబాబ్వేలో ఓ వ్యక్తి తన ఛాతిలో బొద్దింక కనిపించిన ఎక్స్రే ఫిల్మ్ను 'మిస్టర్ సైంటిఫిక్' ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి ఛాతి పరీక్ష కోసం జింబాబ్వేలో ఓ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్రే తీశారు. ఎక్స్రే ఫిల్మ్లో బొద్దింక కనిపించడంతో వెంటనే సదరు వ్యక్తిని సర్జరీ చేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. డాక్టర్లు చెప్పిన విషయాన్ని నమ్మిన ఆ వ్యక్తి తనకున్న ఆస్తిని మొత్తం అమ్మి సర్జరీ కోసం ఇండియాకు వచ్చాడు. కాగా, ఇక్కడి వైద్యులు అతనికి అన్ని పరీక్షలు నిర్వహించి అతని ఛాతిలో బొద్దింక లేదని, అది కేవలం ఎక్స్రే మిషన్లో ఉన్న బొద్దింక ఇమేజ్... ఆ ఫిల్మ్ మీద పడటంతో అలా కనిపించిందని తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు గుండెలు బాదుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫేక్ న్యూస్లను పసిగట్టడంలో సిద్ధహస్తులైన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ రంగంలోకి దిగింది. ఇదంతా కల్పితమని, కేవలం ఫోటోలను మార్పింగ్ చేశారని బయటపెట్టింది. గూగుల్ ద్వారా రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ ద్వారా ఒరిజినల్ ఇమేజ్ను కనుగొన్నామని పేర్కొన్నారు. కాగా, ఆ ఎక్స్రే ఫిల్మ్ ఒకప్పటి హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రోదని, కొన్నేళ్ల క్రితం కూడా ఇలాంటి కథనమే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని తెలిపారు. 1954లోమార్లిన్ మన్రో గైనకాలజీకి సంబంధించిన ఆపరేషన్ కోసం ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకున్నారు. అందులో ఒకటి ఛాతికి సంబంధించిన ఎక్స్రే ఫిల్మ్ కూడా ఉందని వెల్లడించారు. కాగా 2010లో మన్రోకు సంబంధించిన మూడు ఫిల్మ్ ఎక్స్రేలు వేలం వేయగా 45వేల డాలర్ల ధర పలికిందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఫోటోనూ రివర్స్ ఇమేజింగ్ ప్రాసెస్ చేయడంతో అసలు విషయం బయటపడిందని పేర్కొన్నారు. అదండీ దీని వెనకున్న అసలు రహస్యం. -
‘అతని వల్ల మర్చిపోలేని జ్ఞాపకంగా మారింది’
ముంబై : సాధరణంగా మొబైల్, వాలెట్ వంటివి పోతే దొరకడం చాలా కష్టం. మన అదృష్టం బాగుంటే తప్ప తిరిగి మన చేతికి రావు. క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు అన్ని ఆ వాలెట్లోనే ఉంటాయి. దొరికితే బాగుండని.. దొరకాలని కోరుకుంటాం. మనం కోరుకున్నట్లు జరిగితే.. ఇదిగో ఇలా ప్రచారం చేస్తాం. ట్విటర్ యూజర్ దర్థ్ సియర్ర తాను కలిసిన ఓ నిజాయితీపరుడైన క్యాబ్ డ్రైవర్ గురించి ట్విటర్ ద్వారా ఎంతో మందికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి దర్థ్ సియర్ర ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఈ నెల 10న నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా భార్య పబ్కు వెళ్లి ఎంజాయ్ చెద్దామని భావించాము. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేశాం. మిని హుండాయ్ ఎక్సెంట్ మా కోసం వచ్చింది. దాని డ్రైవర్ అసిఫ్ ఇక్బాల్ అబ్దుల్ గఫర్ పథాన్. మా ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభమైంది. దాంతో పథాన్ తన భార్యకు ఫోన్ చేసి.. పిల్లలన్ని బయకు పంపకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత మేం కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణాన్ని కొనసాగించాం. వర్షం కారణంగా ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఎలాగో అలా మేం వెళ్లాల్సిన పబ్కు చేరుకున్నాం. తర్వాత స్నేహితులను కలిసి పిచ్చాపాటి ప్రారంభించాం. ఓ గంట గడిచిన తర్వాత నా వాలెట్ మిస్సయిందని గుర్తించాను’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఓ నిమిషం పాటు నాకు కాళ్లు చేతులు ఆడలేదు. దాంతో క్యాబ్లో మర్చిపోయానేమో అని భావించి పథాన్కు కాల్ చేశాను. అతను చెప్పిన సమాధానం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను నా వాలెట్ను క్యాబ్లోనే మర్చిపోయానని.. అది గమనించిన పథాన్ దాన్ని తీసి భద్రం చేసినట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వెళ్లేటప్పుడు.. నన్ను కలిసి వాలెట్ తిరిగి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. చెప్పడమే కాక సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు నా దగ్గరకు వచ్చి వాలెట్ ఇచ్చాడు. అంతేకాక పుట్టిన రోజు శుభకాంక్షలు కూడా తెలియజేశాడు. నా పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కూడా కావడం నిజంగా అద్భుతం. అలా విషాదంగా ముగియాల్సిన నా పుట్టిన రోజు కాస్త పథాన్ నిజాయితీ వల్ల నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది’ అన్నారు దర్థ్ సియర్ర. ‘ఈ సోషల్ మీడియా వేదికగా మనం కోపాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూంటా. కానీ మంచి విషయాలను కూడా ఈ వేదిక మీదగా షేర్ చేసుకుందాం. దీని వల్ల కొందరైనా ప్రేరణ పొందుతారు’ అంటూ దర్థ్ సియర్ర ట్వీట్ చేసిన ఈ స్టోరీకి జనాలు ఫిదా అయి పోయారు. క్యాబ్ డ్రైవర్ నిజాయితీని తెగ మెచ్చుకుంటున్నారు. -
అమ్మాయిలు.. ఒక్క సారి ధైర్యం చేయ్యండి
ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి.. వారిని ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్క సారి అలా ధైర్యం తెచ్చుకుని ప్రయత్నిస్తే.. ప్రేమ, ఆనందం మీ సొంతం అవుతాయంటున్నారు ట్విటర్ యూజర్ రిలే. అందుకు తనే మంచి ఉదాహరణ అంటూ తన స్టోరిని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరి విపరీతంగా వైరలవడమే కాక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రిలే తన స్టోరి చెప్తూ.. ‘‘పబ్లిక్ స్పీకింగ్’ క్లాస్లో తొలిసారి ఆ అబ్బాయిని చూశాను. మొదటి చూపులోనే అతని మీద ఇష్టం కలిగింది. నెలలు గడుస్తున్న కొద్ది.. ఆ ఇష్టం ఇంకా పెరిగిపోయింది. ఓ రోజు ధైర్యం చేసి ఫేస్బుక్లో నా ప్రేమ గురించి తెలుపుతూ.. తనకు మెసేజ్ చేశాను. ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా కలిసి ఉన్నాం. అమ్మాయిలు ధైర్యం చేయ్యండి’ అంటూ రిలే చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. After crushing on “the cute guy from public speaking” for months, I made the most impulsive decision I have ever made & messaged him on Facebook 😂 1 year later, we are happily dating & have been talking every day since. Moral is: don’t be afraid to shoot your shot, ladies (; pic.twitter.com/5vxD49XtZE — Riłëy (@rileyy__daviss) May 3, 2019 ఈ స్టోరి చూశాక చాలా మంది తాము కూడా ఇలానే ధైర్యం చేసి ప్రపోజ్ చేశామని.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ కథలను కూడా షేర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే రిలే ట్వీట్ను దాదాపు 9 వేల మంది రీట్వీట్ చేయగా.. 97 వేల మంది లైక్ చేశారు. -
ఎంత క్యూట్గా రిక్వెస్ట్ చేశాడో..!
చిన్న పిల్లలతో విమానయానం చేసే వారి కష్టాలు చూడాలి. పాపం అనిపిస్తుంది. మాటలు రాని వయసులో ఆకలి, బాధ వంటి వాటిని ఏడుపు ద్వారానే తెలియజేస్తారు చిన్నారులు. కానీ అర్థం చేసుకోలేని వారు ఏంటీ గోళ అని విసుక్కుంటారు. అంతటితో ఊరుకోక ప్రయాణం మధ్యలోనే దించేస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలను చాలానే చూశాం. వీటి గురించి ‘లోకం తెలయని పిల్లలు.. కాస్తా ఓపిక పడితే ఏం పోతుంద’ని కొందరు.. ‘పిల్లలు ఏడుస్తూంటే ఇబ్బందిగా ఉండదా’ అని మరి కొందరు వాదించారు కూడా. ఏం చేస్తాం రెండు నిజమే. అయితే ఈ సమస్యను కాస్తా సృజనాత్మకంగా పరిష్కరించింది ఓ తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మహిళ తన నాలుగు నెలల పసికందుతో కలిసి అమెరికా వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన చిన్నారి వల్ల కలిగే ఇబ్బందిని పెద్ద మనసుతో అర్థం చేసుకోండంటూ కోరుతూ.. క్యాండీస్,ఇయర్ప్లగ్స్ ఉన్న ప్యాకెట్ను తోటి ప్రయాణికులకు పంచింది. ఇలా విమానంలోని దాదాపు 200 మంది ప్రయాణికులకు ఈ బ్యాగ్స్ను అందజేసింది. గిఫ్ట్ ప్యాక్ల కంటే కూడా వాటి మీద ఉన్న స్టోరి ప్రయాణికులకు తెగ నచ్చింది. గిఫ్ట్ ప్యాక్ మీద ‘హలో.. నా పేను జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. ఈ రోజు నేను మా అమ్మ, నానమ్మతో కలిసి మా ఆంటీని చూడ్డానికి అమెరికా వెళ్తున్నాను. ఇదే నా తొలి విమానయానం. అందువల్ల కాస్తా నెర్వస్గా, భయంగా ఫీలవుతున్నాను. సో నాకేమన్నా ఇబ్బందిగా అనిపించినప్పడు ఏడుస్తాను.. బాగా గొడవ చేస్తాను. వెంటనే ఏడుపు ఆపేస్తానని మీకు ప్రామిస్ చేయలేను. ముందు జాగ్రత్తగా మా అమ్మ ఈ గిఫ్ట్ ప్యాక్లను మీకు ఇస్తుందన్నమాట. నేను బాగా గొడవ చేసినప్పుడు మీకిచ్చిన ప్యాకెట్లో ఉన్న ఇయర్ప్లగ్స్ను వాడండే. మీ ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటూ చిన్నారి జున్వూ’ అని ఉంది. ఈ స్టోరిని ఫేస్బుక్లో షేర్ చేసిన డేవ్ కరోనా ఆ 200 మంది ప్రయాణికుల్లోఒకరు ఉన్నారు. ఈ తల్లి ప్రయత్నం నా హృదయాన్ని హత్తుకుందన్నారు కరోనా. అంతేకాక గిఫ్ట్ ప్యాక్ల మాట ఏమో కానీ.. జున్వూ రిక్వెస్ట్ మాత్రం ప్రయాణికులకు తెగ నచ్చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ స్టోరి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం జున్వూ సోషల్ మీడియాలో చిన్న సైజు హీరో అయ్యాడు. ‘చాలా మంచి ప్రయత్నం’.. ‘విమానంలో ప్రయాణించే వారు చిన్నారుల పట్ల కాస్త దయగా వ్యవహరిస్తే బాగుంటుందం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
ఆరుషి కోసం.. 6 గంటల్లో.. 16 లక్షలు
పుట్టిన ప్రతి మనిషి ఎదుగుతాడు. ఏళ్లు శ్రమించి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు ఎంత మురిసిపోయినా వారికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచేవి మాత్రం తమ చిన్నారి మొదటిసారి వేసిన బుడిబుడి అడుగులే. తప్పటడుగులతో ప్రారంభమయిన మనిషి జీవితం ఎన్నో మైళ్లు ప్రయాణించి విజయ తీరాలను చేరుకుంటుంది కానీ ఆరుషి విషయంలో ఈ సంతోషాలు ఏవి లేవు. ఎందుకంటే ఆ చిన్నారి పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది.. ఆపై 20 రోజుల్లో తండ్రి కూడా మరణించాడు. మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఉన్న తాతనాయనమ్మలే ఆ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబాన్ని విధి మరోసారి చిన్న చూపు చూసింది. నిండా మూడేళ్లు లేని ఆ పసిపాపకు దేవుడు ఖరీదైన జబ్బును బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు ‘కాన్జెనిటల్ సుడార్థ్రోసిస్ ఆఫ్ ద టిబియా’ (సీపీటీ). మన భాషలో చెప్పాలంటే విరిగిన కాలి ఎముక సరిగా అతుక్కోకపోవడమే కాక ఆ గాయం ఎన్నటికి మానదు. దాంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం ఆరుషి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ చిన్నారి పుట్టి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకూ తొలి అడుగు వేయలేదు. కారణం సీపీటీ. చిన్నారి ఆరుషికి ఏడాది వయసు ఉన్నప్పుడు ఈ జబ్బు బయటపడింది. దాంతో ఆ చిన్నారి నడవకూడదని చెప్పిన డాక్టర్లు.. ఆరుషి పాదాలకు బ్యాండేజ్ వేశారు. ఆపరేషన్ చేస్తే ఆ పాప కూడా అందరిలానే నడవగల్గుతుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అసలే అమ్మనాన్న లేక తాతనాయనమ్మల దగ్గర బతుకుతున్నారు. పూట గడవడమే కష్టం అంటే ఇక ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి వైద్యం చేయించడం వారి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఆరుషి తాత చేసేదేమో చిన్న సెక్యూరిటి గార్డ్ పని. వచ్చే మూడువేల జీతం రాళ్లతో నలుగురి కడుపులు నింపాలి. అలాంటిది 16 లక్షల రూపాయలు ఖర్చు చేసి మనవరాలికి వైద్యం చేయించడం తన వల్ల కాదని అర్థమైంది. కానీ ఇంత బాధలోను మనవరాలి మొము మీద చిరునవ్వు చూసినప్పుడల్లా ఎలాగైనా ఆ చిన్నారిని నడిపించాలని ఆ ముసలి మనసు ఆరాటపడేది. దాంతో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన, పర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సాయం కోరాడు. దీని వల్ల అంతగా ఉపయోగం లేకపోయింది. ఇలా అయితే లాభం లేదనుకుని తన దీన గాథను వివరిస్తూ ఫేస్బుక్లో ఓ స్టోరి పోస్ట్ చేశాడు. అతనికి తోడుగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చారు. అలా ఆరుషి వ్యధ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతా తెలిసింది. మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. దాంతో కేవలం 6 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి వైద్యానికి కావాల్సిన 16 లక్షల రూపాయల సొమ్ము సమకూరింది. తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆరుషి కుటుంబ సభ్యులు. త్వరలోనే తమ మనవరాలు లేడిపిల్లలా గెంతుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్గా మారిన మంచి మనిషి కథ
బీజింగ్: వృత్తి ఏదైనా ప్రవృత్తి ముఖ్యం. పెద్ద మనుసు ఉండాలిగానీ పేదలకు ఎలాగైనా సాయం చేయవచ్చు. అది చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని జియావోజువో అనే గ్రామం. అందులో వాంగ్ జెంగ్జియాన్ అనే వ్యక్తికి ఓ బార్బర్ షాపుంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు, అంటే రోజుకు 17 గంటలపాటు క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లగా ఆయన ఇలాగే అలుపు సొలుపూ లేకుండా పనిచేస్తూ ఈ వృత్తిలోనే తృప్తి పొందుతున్నారు. ఆయన బార్బర్ షాపుకు అంత ఎక్కువ గిరాకీ ఉండడానికి కారణం కటింగ్కు భారతీయ కరెన్సీలో కేవలం పది రూపాయలు మాత్రమే చార్జి చేయడం. అది కూడా ఇప్పుడు నిర్ణయించింది కాదు. తాను పాతికేళ్ల క్రితం ఈ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు నిర్ణయించిన చార్జి. పాతికేళ్లలో కరెన్సీ విలువ ఎంతో మారినా, నిత్యావసర సరకుల ధరలు పెరిగినా ఆయన మాత్రం చార్జీనీ మార్చలేదు. పైగా పేదవాళ్లకు, దివ్యాంగులకు ఉచితంగా హేర్ కటింగ్ చేస్తున్నారు. తన షాపుకొచ్చి కూర్చోగలిగిన వారికి కుర్చీలో, అంత ఓపిక లేనివారికి చెట్టు కింద నీడలో, షాపు దగ్గరికి రాలేనివారికి ఎక్కడుంటే అక్కడే, ముఖ్యంగా దివ్యాంగులకు, మంచం పట్టిన రోగులకు ఇంటికెళ్లి మరీ కటింగ్ చేస్తున్నారు. ‘నేను గతంలో వాంగ్ షాపుకెళ్లి కటింగ్ చేయించుకునేవాణ్ని. గత కొంతకాలంగా అనారోగ్యం వల్ల మంచం పట్టాను. లేవలేకపోతున్నా. వాంగ్ రెగ్యులర్గా ఇంటికొచ్చి హేర్ కట్టింగ్, షేవింగ్ చేసి వెళుతున్నారు. నేను పేదవాడిని అవడం వల్ల నా దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. పది రూపాయలేగదా! ఇద్దామనుకుంటే, బాబాయ్! డబ్బులెవరికి కావాలి, ప్రేమకావాలిగానీ అంటూ ఆప్యాయంగా పలకరించి వెళతారు’ అని ఓ 80 ఏళ్ల కస్టమర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రజా సేవ ఎలా అలవాటైందని వాంగ్ను ప్రశ్నించగా.. ‘ఇది ధనిక గ్రామమేమి కాదు. గ్రామంలో అందరూ సమానస్థాయి వాళ్లు ఉండరు. పేదవాళ్లు ఉంటారు, డబ్బులున్నవాళ్లు ఉంటారు. వారి వారి అవసరాలను దృష్టి పెట్టుకొని మన బతుకుతెరువుకు సరిపడినంతా చార్జిచేస్తే చాలు. వృత్తిలో డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. వృత్తిని చిత్తశుద్ధితో చేయడం ముఖ్యం’ అని నాకు ఈ విద్యను నేర్పిన గురువు చెప్పారని, ఆ గురువు మాటలు ఇప్పటికీ మరచిపోలేదని వాంగ్ స్థానిక మీడియోకు తెలిపారు. వాంగ్కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్లు వాంగ్ గొప్పగుణాన్ని ప్రశంసిస్తున్నారు. -
ఈ భామ వేళ్లు ఎంత పొడవో..
ఓ తైవాన్ మహిళ పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్లు గందరగోళంలో పడిపోయారట. చైనా సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించిన ఆ ఫోటో ఏంటంటే. అందరికంటే భిన్నంగా వున్న ఆమె కాలి వేళ్లు. అయితే అవి కాలివో.. చేతివో అర్థం కాక కొంచెం తికమక పడ్డారట. సుకుమారంగా, పొడవుగా ఉన్నాయో.. అంతే అసహజగా వున్న ఆమె వేళ్లు చేతివా....కాలివా అన్నంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా మారాయి. ఈ వేళల్లో ఎక్కువగా పొడవుగా ఉన్న వేలు (బొటన వేలు పక్కన ఉన్) సైజ్..అక్షరాలా 5సెం.మీ. దీంతో అంత పొడవుగా, వింతగా ఉన్న ఆ ఫోటోను చేసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవి కాలివేళ్లో.. చేతివేళ్లో అర్థంకాకుండా భలే వింతగా ఉన్నాయంటూ అబ్బురపడ్డారు పేరు వెల్లడికాని ఈ విశ్వవిద్యాలయం విద్యార్థిని తనపొడవు నాలుగు అడుగుల 11 ఇంచులనీ, కానీ తన టోస్ (కాలివేళ్లు) లో పెద్దగా వున్నాయంటూ ఫోటోలను తన బ్లాగ్ లోపోస్ట్ పెట్టింది. పాదంలో కాలి వేలి పొడవు అయిదు సెంటీ మీటర్లని పేర్కొంది. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాననీ, తన గ్రీక్ ఫీట్ ( పాదంలో రెండవ వేలు పొడవుగా వుండడం) కారణంగా తనను తాను సౌందర్య సామ్రాజ్ఞిగా అభివర్ణించుకుంది. అయితే ఆమె బ్లాగ్ లో పోస్ట్ చేసినప్పటికంటే ఫేస్ బుక్ పేజీలో మరింత ఆసక్తికరంగా మారాయి. లైకులు..కామెంట్లు.. ట్యాగ్స్.. షేర్ల వెల్లువ తో బాగా హల్ చల్ చేస్తున్నాయి.