-
రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి
-
టీడీపీ కార్యకర్తలు మీరు గుండాలా..?
-
టీడీపీ కార్యకర్తలా.. గూండాలా.. ఇదేం అరాచకం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, జాతీయ మానవహక్కుల కమిషన్లకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది’’ బాధితుల ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?‘‘చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి.. కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తలా.. గూండాలా?. ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది..‘‘ఇది చీకటి అధ్యాయంగా చర్రితలో మిగిలిపోతుంది. టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై దాడి చేసి, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోంది. ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా దాడులు చేయడం మంచి సంప్రదాయం కాదు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.’’అని విజయసాయి ధ్వజమెత్తారు.చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డికేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బిజెపి వెంటనే స్పందించాలి. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే నాయకులు, ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీఎం, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకో: మిధున్ రెడ్డిరాజకీయాల్లో గెలుపోటమలు సహజమని... కానీ గత కొన్ని రోజులగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా దారుణమని వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత పి.మిధున్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని… కానీ ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, గాయపర్చడం, ఇళ్లు కూల్చవేయడంతో పాటు వ్యాపారాలు కూడా దెబ్బతీయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని.. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా… ఈ విధంగా కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల ధ్వంసం చేయడం వంటివి గతంలో లేవని.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదన్నారు. ఆ తరహా దాడులకు పాల్పడ్డం సరికాదన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మేండేట్ ఇచ్చారని.. ఈ నేపధ్యంలో టీడీపీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో… అవన్నీ పూర్తి చేయాలని సూచించారు. 40 శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటే వేశారన్న విషయం టీడీపీ గుర్తుపెట్టుకోవాలని.. కేవలం మీకు వచ్చిన 50 శాతం పైచిలుకు ప్రజలకే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. దాడులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర పతి, మానవహక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. -
ఓటమికి కారణాలు తెలుసుకుంటాం
-
ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ
లోక్సభ 18వ ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై మీడియాలో సమీక్ష జరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వృద్ధి రేటుతో 2024 ఎన్నికల సమయానికి సుస్థిరత సాధించిందని ఆర్థికవేత్తల అంచనా. ఇదే నిజమైతే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ప్రగతి అత్యంత వేగవంతంగా సాగినట్లేనని కూడా వారు భావిస్తున్నారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో నిరుద్యోగం కాస్త ఎక్కువగా ఉందనే ప్రచారం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బాగానే వినిపించింది. ఆధునిక భారతంలో పట్టణ, నగర ప్రాంతాల్లోనే అన్ని విధాలా అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, మారుమూల ప్రాంతాల్లో వృద్ధి అంతగా లేదని కొందరు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు స్థానాలు ఎగబాకి పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానానికి చేరుకుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే దేశాన్ని మూడో స్థానానికి తీసుకెళతామని కూడా పాలకపక్షం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించింది. అగ్రశ్రేణి ఇకానమీగా అవతరించినప్పటికీ తలసరి ఆదాయం విషయంలో జీ–20 దేశాల్లో ఇండియా అట్టడుగున ఉందనే విషయాన్ని పాలకులు మరువకూడదని ఆర్థిక నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు.ప్రపంచ దేశాల ఆర్థిక బలాబలాలను మదింపు చేసి, వాటి పరపతికి సంబంధించి రేటింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నెలలో భారత సావరిన్ రేటింగ్ పరిస్థితిని ‘సుస్థిర’ (స్టేబుల్) నుంచి ‘సానుకూల’ (పాజిటివ్)గా అంచనావేసింది. బీబీబీ–రేటింగ్ను మాత్రం మార్చకుండా మెరుగైన భవిష్యత్తు ఉన్న దేశంగా ఇండియాను పరిగణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా విస్తరిస్తూ ముందుకు సాగడం వల్ల దాని పరపతిపై నిర్మాణాత్మక ప్రభావం ఉంటుందని ఎస్ అండ్ పీ పేర్కొంది.రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..మార్చితో పోలిస్తే దేశంలో ఏప్రిల్ నెల వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. కీలకమైన ఈ సూచిక రిజర్వ్ బ్యాంక్ లక్ష్యమైన 4%కు తగ్గకుండా కిందటి నెలలో 4.83% వద్ద నిలిచింది. వినియోగదారుల జీవన ప్రమాణాలను అధికంగా ప్రభావితం చేసే కీలకమైన ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం (ఫుడ్ ఇన్ఫ్లేషన్) మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో కొద్దిగా పెరిగింది (8.52% నుంచి 8.70%కు). 2023 నవంబర్ నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%కి పైనే ఉంటోంది. సామాన్య, పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అందుకే, సాధారణ ఎన్నికలను, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కారు కిందటేడాది నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి గోధుమలు, బియ్యం, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది.అంతర్జాతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు21వ శతాబ్దం మొదటి పాతికేళ్ల చివరిలోకి వచ్చిన ప్రస్తుత సమయంలో నిరుద్యోగం కూడా ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. దేశంలో మార్చిలో 7.4%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.1%కు పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేట్ సంస్థ అంచనావేసింది. పట్టణ ప్రాంతాల్లో 19–29 ఏళ్ల యువతలో నిరుద్యోగం 2023 చివరి మూడు నెలలతో పోల్చితే స్వల్పంగా (16.5% నుంచి 17%కి) పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అంతర్జాతీయరంగంలో ఇండియా పలుకుబడి చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిందనే నిపుణులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ బడా కంపెనీలను ఒక్క చైనా వైపే చూడకుండా ఇండియా రావాలని కోరుతూ ప్రోత్సాహకాలను అందిస్తానంటోంది. మొత్తంమీద భారత విదేశాంగ విధానం ఈ పదేళ్లలో చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి పక్షంలో కేంద్రంలో అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు. -
ఆధారాలు ఉన్నా..నో యాక్షన్..
-
కూటమి చర్యలు అనైతికం
నెల్లూరు (దర్గామిట్ట): కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడుతున్నాయని నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొందరు కూటమి పార్టీ నాయకులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.టీడీపీ సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డి లాంటి వ్యక్తులు పోలింగ్ జరిగే చోటుకు వెళ్లారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో కొందరు బీఎల్ఓలు నిబంధనల్ని ఉల్లంఘించారని తెలిపారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రిటరి్నంగ్ అధికారి వికాస్ మర్మత్కు ఆధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏడుగురు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే ఒకరి మీద చర్య తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్కుమార్ యాదవ్ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఆయనకు తనవంతు సాయం అందిస్తున్నారన్నారు. డబ్బులతో గెలవచ్చనుకుంటున్నారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. డబ్బులతో గెలవ వచ్చని వాళ్లు భావిస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చి దాంతో గెలుస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం 1,200 మంది రౌడీలను, నారాయణ సిబ్బంది, విజయవాడ, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నారు. -
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలకు చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ పురంధేశ్వరి కావాలనే సోము వీర్రాజును పక్కనబెట్టారు. అలాగే, ఎల్లో మీడియా పెద్దలు ఓటమి భయంతో రాత్రి పూట నిద్రపోవడంలేదని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు. ఏమాటకామాట! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 ఎన్నికలలో టీడీపీ (తప్పుడు)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ ఆఖరి పోరాటంలో బాబుకు ఓటమి తప్పదనే ‘కమురు వాసన’ అక్కడివరకు వ్యాపించడం వారిని కలవరపాటుకి గురిచేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికలలో టీడీపీ (దుష్)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 -
బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేతలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర తీశారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియా, చంద్రబాబుపు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒకరి పేరుతో ఉన్న భూమిని ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం సాధ్యమా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2024 అలాగే, ‘న’మ్మక’స్తుడైన రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ చౌదరి పార్టీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాడని టీడీపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబుకు తప్పుడు సలహా ఇచ్చి కొంపముంచాడని కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 67 లక్షల ఫించను లబ్దిదారులు, వాళ్ల కుటుంబసభ్యులను చేతులారా దూరం చేసుకున్నామని తలలు బాదుకుంటున్నారు. మరో వారంరోజుల్లో ప్రచారం ముగుస్తుండగా ఇప్పుడీ విషమ సమస్య నుంచి బయటపడేది ఎలాగా అని కుమిలిపోతున్నారు’ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. న’మ్మక’స్తుడైన రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ చౌదరి పార్టీ అభ్యర్ధుల గెలుపు అవకాశాలను దెబ్బతీశాడని టీడీపీ శ్రేణులు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని చంద్రబాబుకు తప్పుడు సలహా ఇచ్చి కొంపముంచాడని కార్యకర్తలు ఆగ్రహావేశాలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2024 -
ప్రచారంలో విజయ్ సాయి రెడ్డికి సర్ ప్రైజ్..!
-
నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం
-
ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం...
-
ఎన్నికల ప్రచారంలో విజయసాయి రెడ్డి భార్య, కూతురు
-
బాబు డైరెక్షన్ లో సీఎం జగన్ పై 2సార్లు ఎటాక్
-
సీఎం జగన్ పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి
-
నాన్నతో కలిసి ప్రజా సేవలో... చాలా హ్యాపీగా ఉంది
-
YSRCP ప్రభంజనం ఖాయం
-
టీడీపీ నుంచి ముఖ్య నేతలు వైఎస్సార్సీపీలో చేరడానికి కారణం..!
-
ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం
-
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
చంద్రబాబుకు ఓటేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే: విజయసాయి రెడ్డి
-
‘ఎల్లో మీడియా వంకర రాతలు.. జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది’
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా చురకలు అంటించారు. ‘‘అసలు దున్నా లేదు. దూడా లేదు.. నిత్యం వైఎస్ జగన్ ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ చేయించినట్టు, వైఎస్సార్ కాంగ్రెస్ హస్తమున్నట్టు అబద్ధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది పచ్చమీడియా. అదృష్టవశాత్తు జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది కాబట్టి వంకర రాతలను ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయి. అసలు దున్నా లేదు. దూడా లేదు. నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2024 ఇదీ చదవండి: AP: పింఛన్ల పంపిణీపై కీలక ఉత్తర్వులు -
విశాఖలో చంద్రబాబు చేసిన అరాచకాలు..
-
చంద్రబాబు ఏ–1గా పది కేసులు
కందుకూరు రూరల్/నెల్లూరు (దర్గామిట్ట): ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రధాన నిందితుడి(ఏ–1)గా సుమారు పది కేసులు నమోదు కాబోతున్నాయని రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం కందుకూరులోని శ్రీవెంగమాంబ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఏ–1గా ఇప్పటికే మూడు, నాలుగు కేసులు నమోదయ్యాయని, మరో నాలుగైదు కేసులు నమోదు కాబోతున్నాయని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడిన సొమ్మును విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్నారు. అవినీతి సొమ్మును ఏపీలో పెట్టుబడి పెట్టినా కనీసం రాష్ట్రం బాగుపడేదన్నారు. బాబు పొత్తులతో వైఎస్సార్సీపీకే లాభం ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం అని.. ఈ పొత్తుల వల్ల బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లారని విజయసాయిరెడ్డి అన్నారు. దీనివల్ల వైఎస్సార్సీపీ లాభపడుతుందేగానీ.. నష్టం లేదన్నారు. అదేవిధంగా బీజేపీకి, జనసేనకు కూడా నష్టం లేదన్నారు. కేవలం నష్టపోయేది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా వైఎస్సార్సీపీ సీట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పులు చేశారన్నారు. వైఎస్సార్సీపీలో పదవులు అనుభవించిన రఘరామకృష్ణరాజు పార్టీలోనే ఉంటూ.. పార్టీని తిడుతూ రాజకీయం చేశారన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా తిరిగి ఆయనను చట్టసభలకు పంపించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితిని తనకు తానే కొనితెచ్చుకున్నాడని చెప్పారు. ఆయనను బీజేపీ, జనసేన, టీడీపీ సహా ఏ పార్టీ నమ్మడం లేదన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి ఉన్నారు. నెల్లూరులో ఐటీ సెజ్ ఏర్పాటుకు కృషి కాగా.. నెల్లూరు రామ్మూర్తి నగర్లోని రామచంద్ర కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం సభ్యులతో ఆత్మీయ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని, రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖలో ఐటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో నెల్లూరులో ఐటీ సెజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని, మౌలిక వసతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2019లో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐటీ రంగంపై దృష్టి సారించి ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని, ఈ మేరకు ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ ఐటీ విభాగం సభ్యులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్అహ్మద్, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోచంరెడ్డి సునీల్ మాట్లాడారు. -
టీడీపీని వీడి YSRCPలో చేరిన పలువురు కార్యకర్తలు, నేతలు