-
విజయ్ ఆంటోని 'తుఫాన్' ట్రైలర్ విడుదల
విజయ్ ఆంటోని.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో బాగా దగ్గరపయ్యాడు. రీసెంట్గా ఇటీవలే 'లవ్గురు'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇప్పుడాయన 'తుఫాన్'తో మెప్పించనున్నాడు. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన తుఫాన్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది ఒక దీవిలో జరిగే కథతో రూపొందించారు. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగు పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ ట్రైలర్లో ఉంది. ఈ చిత్రంలో యాక్షన్తో పాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలున్నట్లు తెలుస్తోంది. -
Vijay Antony: కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. టాలీవుడ్లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్ని ఓ పీడకల వెంటాడే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్గా సాగుతుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
లవ్ గురులా పరిష్కారాలు చెబుతాను
‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘లవ్ గురు’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్ గురు’ చిత్రం విజయ్ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
బిచ్చగాడు హీరో రొమాంటిక్ మూవీ.. తెలుగులో ఆసక్తికర టైటిల్!
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్కు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని
'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్'. చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా, డీఆర్ సంజయ్కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) ఈ సినిమాలో ప్రియా సుమన్ హీరోయిన్ కాగా.. గౌతమ్ మేనన్, రెడిన్ కింగ్స్లీ, వివేక్, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్గా విజయ్ ఆంటోని కొత్త లుక్లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'మీరా బంగారం..' విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ పోస్ట్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీరా బంగారం.. నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో! నిన్ను కలిసేవరకు.. ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్ అవుతోంది..' అంటూ ఎక్స్(ట్విటర్)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్గా మారగా బాధపడకండి మేడమ్ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023 చదవండి: సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం -
విజయ్ ఆంటోనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరోయిన్
కోలీవుడ్లో నటి అనూయకు మంచి గుర్తింపే ఉంది. 'శివ మనసుల శక్తి' చిత్రంలో నటుడు జీవాతో జత కట్టి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఒరుకల్ఒరు కన్నాడి, మదురై సంభవం, నన్బన్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్బాస్ సీజన్-1లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఐటెం సాంగ్స్లోనూ నటించడానికి వెనుకాడ లేదు. అయితే అలా శృంగార తారగా అందాలు ఆరబోసిన అవకాశాలు లేకపోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగయ్యారనే చెప్పాలి. అయితే తరచూ తన గ్లామరస్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. కాగా ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భాన్ని అనూయ పేర్కొంటూ తాను దుబాయ్లో పుట్టి పెరిగానని చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేశానని, కాగా తనకు సంబంధం లేకపోయినా నటుడు విజయ్ ఆంటోని, సుందర్ సి, జీవాతో తనను కలుపుతూ వదంతులు ప్రచారం చేశారని చెప్పింది. తాను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేకున్నా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రచారాలు అన్నీ అవాస్తవాలు కావడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. దీంతో ఎందుకు ఒంటరిగా ఉన్నారు? పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ఒక అభిమాని ప్రశ్నకు అనూయ బదిలీస్తూ తన చుట్టూ మంచి మగవాళ్లెవరూ లేరని చెప్పింది. దీంతో అనూయ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనూయ హీరో విజయ్ చిత్రం అయిన స్నేహితుడులో నటించింది. ఆ చిత్రంలో వారి ప్రొఫెసర్ పాత్రలో కనిపించిన సత్యరాజ్కు కూతురిగా ఆమె మెప్పించింది. -
విజయ్ ఆంటోని అలాంటివాడు.. ఈగో లేకుండా..: సత్యరాజ్
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్సామియిన్ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్. విజయ్.. నిరాడంబర వ్యక్తి నల్లుసామి పతాకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు. అప్పుడు ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్ చిత్రంలో విజయ్ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్ టైటిల్ దర్శకుడు సుశీంద్రన్ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్ ప్రశంసించారు. చదవండి: తెలంగాణ ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు -
‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉంది. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నారు. తాజాగా విజయ్ కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు. (ఇదీ చదవండి: ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన) విజయ్ ఆంటోనీ పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది. అలా నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల భాద్యతలను ఫాతిమానే దగ్గరుండి చూశారు. అలా సినిమా నిర్మాణ రంగంలో ఆమెకు మంచి అనుభవంతో పాటు గుర్తింపు ఉంది. కుమార్తె మీరా మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ తాజాగా ట్వీట్ చేశారు. మీరాను మరోసారి గుర్తుచేసుకుని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునే దానిని. కనీసం నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నేను దాచుకునే దాన్ని. ప్రస్తుతం నువ్వు మా మధ్య లేకపోవడంతో ఎప్పుడూ నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం కష్టంగా ఉంది. ఈ అమ్మ- నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా.. నీ కోసం నీ చెల్లెలు ఎదురుచూస్తూనే ఉంది. లవ్ యు తంగం.' అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. If I’d known u will live only for 16 yrs, I would have just kept u very very close to me,not even shown you to the sun and moon,am drowning and dying with ur thoughts,can’t live without you ,come back to babba and amma.laara keeps waiting for u,love u Thangam@vijayantony pic.twitter.com/7PAQ5Ji9qp — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) October 9, 2023 -
బాధలో కూడా ప్రమోషన్స్..
-
కూతురు లేదన్న బాధను దిగమింగుకుంటూ ప్రమోషన్స్
-
అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ.. విభిన్నమైన కథలతో పాటు తన సూపర్ టాలెంట్తో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. బిచ్చగాడు2తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత 'హత్య' అంటూ పలకరించినా అది పెద్దగా మెప్పించలేదు. తాజాగా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. దానికి హిట్లర్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పేరుతో ఇప్పటికే చిరంజీవి బ్లాక్బస్టర్ కొట్టాడు. దీంతో సులభంగా హిట్లర్ పేరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందనే ఈ టైటిల్ పెట్టినట్లు టాక్. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. (ఇదీ చదవండి; నటి హరితేజ విడాకులు.. వైరల్గా మారిన పోస్ట్) విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన వారు ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. అయితే దీనిని అన్ని భాషల్లో లాంచ్ చేశారు. 'హిట్లర్' సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక నియంతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే హిట్లర్.' అని చెప్పారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ను ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇదే ట్రైన్లో హీరోయిన్ రియా సుమన్ను హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తూ గౌతమ్ మీనన్ కొత్త లుక్లో కనిపించారు. త్రీడీ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్తో రూపొందించిన ఈ మోషన్ పోస్టర్లో చివరగా విజయ్ ఆంటోని జోకర్ గెటప్లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇదీ యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది. -
దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట ఈ మధ్య జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే.. 16 ఏళ్ల వయసులోనే ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. కూతురు చనిపోవడంతో విజయ్ ఎంతగానో కృంగిపోయాడు. ఈ బాధలో ఇప్పటి వరకు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. తన కుటుంబ సభ్యులు సరిగ్గా భోజనం కూడా చేయడంలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. (ఇదీ చదవండి; థియేటర్స్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా) సాదారణంగా చాలామంది నటీనటులు సినిమా షూట్ పూర్తి అయిన తర్వాతో ఎదో కారణం చెప్పి సినిమా ప్రమోషన్లుకు రాకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారు. కానీ కన్నకూతురు చనిపోయినా తన సనిమా విడుదల దగ్గర్లో ఉండటంతో ఆయన నిర్మాతల గురించి ఆలోచించి తన చిన్న కూతురుతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే విజయ్ ఆంటోనీ ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్లో పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్ ఈ ఈవెంట్కు హాజరయ్యారని తెలిసింది. విజయ్ హీరోగా సీఎస్ ఆముదన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడదల విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ పరిస్థితిని చూసి ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అలా చేస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని విజయ్ ఈ సినిమాను ముందుగా అనుకున్న అక్టోబరు 6న రిలీజ్ చేయండి అని చెప్పారట. అందుకు అంగీకరించిన మూవీ టీమ్ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ నిబద్ధత కలిగిన నటుడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో మాత్రమే విడుదల అవుతుంది. త్వరలో తెలుగులో కూడా విడుదల కానుంది. #VijayAntony's Daughter #Lara at the Raththam press meet❤️@vijayantony @mrsvijayantony #Raththam #Galatta pic.twitter.com/jbg63rDcUy — Galatta Media (@galattadotcom) September 28, 2023 #VijayAntony arrives at #Raththam press meet with his second daughter Lara. pic.twitter.com/jkFCL750dv — Chennai Times (@ChennaiTimesTOI) September 28, 2023 -
ఇంతటి దుఃఖంలో కూడా విడుదల ఆపొద్దని చెప్పిన విజయ్ ఆంటోనీ.. కారణమిదే
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా 'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం. (ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ) దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్ 6న తమిళ్లో విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు.తెలుగు వర్షన్ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోనీ భావించారట. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది. ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది. -
విజయ్ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్ ఎమోషనల్
హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని. సునీల్, నటి రీతూవర్మ, అభినయకింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్కుమార్ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నటుడు సునీల్ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్ తన కాలేజ్మేట్ అని పేర్కొన్న విశాల్.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య -
కుమార్తె మృతిపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. కన్నీరు పెట్టిస్తున్న వ్యాఖ్యలు
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్) 'నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి ఆమె వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.' అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. మీరా మృతిపై అందరి హృదయాలను కదిలించే నోట్ను విజయ్ ఆంటోనీ షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా దానిని చూసి కంటతడి పెడుతున్నారు. నిర్మాత ఫాతిమాను విజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బలవన్మరణానికి పాల్పడిన పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది.