-
హీరో విజయ్పై తప్పుడు ప్రచారం.. మండిపడుతున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గతేడాది లియో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. అయితే దళపతి ప్రస్తుతం ఆయన గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల ఆయన తన పార్టీ తరఫున 10,12వ తరగతి విద్యార్థులను సన్మానించారు. వరుసగా రెండో ఏడాది టాప్ స్టూడెంట్స్ను విజయ్ సత్కరించారు. అయితే ఈ వేడుకలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్పై నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ విద్యార్థిని భుజంపై వేయగా.. ఆమె అతని చేతిని పక్కకు తీస్తూ కనిపించింది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోకు తగిన బుద్ధి చెప్పిందంటూ పోస్టులు పెట్టారు.అయితే దీనిపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వీడియో చూపకుండా.. ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దయచేసి ఇలాంటి వీడియోలతో విజయ్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియా రీచ్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయవద్దని హితలు పలుకుతున్నారు. Oooo CHOLE BHATORE WAALI, "Fan Moment" mein bhi tatti karne ki aadat nahi jayegi tum jaise "Z" Class logo ke.... (For those who might think wrong)Here is the rest of the Video that She Cut to be a Cindi Chor..... @actorvijay pic.twitter.com/czoqbg347F— NETAJI🙏 (@__NETAJI__) June 29, 2024 hats off to this girl for showing this idli his place pic.twitter.com/PN1YW3lKru— Moana (@ladynationalist) June 29, 2024 -
జిమ్లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
దటీజ్ నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్లైన్ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్ స్టేట్స్మన్గా వాజ్పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.Naveen Patnaik & CM Mohan Majhi greet each other in assembly. Beautiful Video pic.twitter.com/6BL21FAZP5— Times Algebra (@TimesAlgebraIND) June 18, 2024ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. Naveen Patnaik’s dignity is a touchstone in political relationships. Here’s how he greeted the party that has all but wiped him out. Yes, they weren’t the kind of political enemies we’re accustomed too, but Naveen has been nothing but an image of grace. pic.twitter.com/VzYQKJ5WnS— Shiv Aroor (@ShivAroor) June 12, 2024 ఇదే కాదు.. సీఎంగా మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండాలో నవీన్ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
జీరో-వేస్ట్ వెడ్డింగ్: పర్యావరణ హితంగా పూర్వీ పరిణయ వేడుక
పెళ్లి అనంగానే ఎంత ఆర్భాటంగా జరుగుతుందో అంతే రేంజ్లో వేస్ట్ వస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే ఉంటుంది. మంచినీళ్ల బాటిళ్ల దగ్గర నుంచి భోజనాల వరకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువగానే వస్తుంది. అలాంటి వాటికి చోటివ్వకుండా శభాష్ అనేలా ఎకో ఫ్రెండ్లీగా పెళ్లి చేసుకుంది ఓ జంట. ఒకరకంగా చెప్పాలంటే 'జీరో వేస్ట్ వెడ్డింగ్'కి అసలైన నిర్వచనంగా నిలిచింది ఆ దంపతుల పెళ్లి.బెంగుళూరులోని వధువరులు అందరికీ ఆదర్శంగా నిలిచేలా జీరో వేస్ట్ వెడ్డింగ్ని జరుపుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వధువు డాక్టర్ పూర్వీ భట్ షేర్ చేసుకుంది. ఇది తన కల అని, కేవలం తన కుటుంబం సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఆనందంగా చెప్పుకొచ్చింది. భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించుకునేందుకే తాను ఇలాంటి వివాహం చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తన తల్లి సహకారంతోనే ఇలా జీరో వేస్ట్ వివాహాన్ని చేసుకోగలిగానని అంటోంది. అంతేగాదు ఆ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో పెళ్లి మండపాన్ని చెరకు గడలతో నిర్మించారు. డెకరేషన్కి మామిడి ఆకులు, కొబ్బరి ఆకులను వినియోగించారు. భోజనాలను అరటి ఆకుల్లో వడ్డించగా, వధువరుల దండలను పువ్వులు, పత్తిదారలతో రూపొందించినవి ఉపయోగించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్గా కూడా జ్యూట్ బ్యాగ్లను ఇచ్చారు. ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ గానీ, పేపర్ని గాని వినియోగించలేదు. పైగా ఈ తంతు ముగిసిన వెంటనే ఆ పెళ్లి మండపానికి ఉపయోగించిన చెరుకుగడలను గోవులకు తినిపించగా, మిగతా ఆకుల వేస్ట్ అంతా పోలాలకు ఉపయోగపడేల కంపోస్ట్ ఎరువుగా మార్చారు. అలాగే పెళ్లిలో పెద్ద ఎత్తున వినియోగించే వాటర్ వేస్ట్ని చెట్లకు వెళ్లేలా మళ్లించారు. ఎక్కడా..నీళ్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు తిరిగి భూమిలోనే ఇంకిపోయేలా ఉండే ఎకోఫ్రెండ్లీ వస్తువులనే ఉపయోగించారు ఆ వధువరుల తల్లిదండ్రులు. ఇలాంటి వివాహాన్ని జరిపించినందుకు వధువు డాక్టర్ భట్ తన తల్లిని అభినందించి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి. View this post on Instagram A post shared by Dr.Poorvi Bhat | Nutrition & Wellness (@herbeshwari)(చదవండి: చింత వద్దిక.. చింత చిగురు ఉందిగా..) -
జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్
పట్నా: జనతా దళ్యునైటెడ్ (జేడీయూ) నేత రాజ్దీప్ అలియాస్ రాజ్ యాదవ్పై శనివారం భాగల్పూర్లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్బాతీ చౌక్ వద్ద ఉన్న మార్కెట్లోకి రాజ్యాదవ్ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్యాదవ్ను బలవంతపెట్టారు.VIDEO | Bihar: A local JD(U) leader Raja Yadav was thrashed by miscreants over an alleged land dispute matter in Bhagalpur on Saturday. CCTV visuals of the incident. (Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/lQftoVCXov— Press Trust of India (@PTI_News) June 2, 2024 ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్గా మారింది. తీవ్ర గాయాల పాలైన రాజ్యాదవ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్ యాదవ్ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేదు.చెన్నైకి చెందిన ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలైంది. కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వావాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. దీంతో అసలేం జరిగిందంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా.. మరికొందరు ఇంకా ఏదో జరిగి ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకున్నారు.తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమాను జూన్ 14నుంచి జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తేలడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024 -
పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అన్నానగర్: కోయంబత్తూరులో అనుమతి లేకుండా పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి చిన్నతనం నుంచి గుడి రూపు ప్రాంతంలో సంచరించే పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తూ వచ్చింది. ఈ స్థితిలో కోయంబత్తూరులోని పులి యంగులం నివాస ప్రాంతంలో పాము సంచరిస్తోందని ఆ ప్రాంత ప్రజలు వారికి సమాచారం అందించారు. పాములు పట్టే ఉమామహేశ్వరి, సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని 8 అడుగుల పొడవున్న పామును పట్టుకుని అడవిలోకి పంపించారు. అంతకుముందు స్నేక్ క్యాచర్ ఉమా మహేశ్వరి పాము పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అనుమతి లేకుండా పామును పట్టుకుని, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. #Coimbatore Forest Department arrested two individuals for illegally handling an Indian rat snake and posting a video of it on social media, which went viral on May 25. The snake, listed under Schedule I of the Wildlife Protection Act, 1972, is a protected species.@THChennai📽️:… pic.twitter.com/WCenHD66Sf— Avantika Krishna (@AvantikaKrish) May 28, 2024 -
మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక.. వీడియో వైరల్..!
డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు దుండగులు ఆధునిక టెక్నాలజీతో దుర్వినియోదగానికి పాల్పడుతున్నారు. మొదట రష్మిక మందన్నా డీప్ ఫేక్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖ తారలు సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఇదిలా ఉండగా మరోసారి రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఆమె ఫేస్ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్స్టాగ్రామ్ రీల్ను ఎడిట్ చేసిన ఈ వీడియోను రూపొందించారు. అందులో రష్మిక ఫేస్ వచ్చేలా మార్చిన వీడియో కొద్దిసేపటికే వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. కాగా.. గతేడాది నవంబర్లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ బాధితులుగా నిలిచారు. సినిమాల విషయానికొస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించనుంది. -
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్కతా ఈ టార్గెట్ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
అకటా... నడిబజార్లో లక లక లక
‘కంటెంట్ క్రియేటర్లు తలుచుకుంటే వైరల్కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్ వీడియో ఇది.ప్రీతీ థాపాఅనే క్రియేటర్ చంద్రముఖి గెటప్లో డ్యాన్స్ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.‘మీ డ్యాన్స్ స్కిల్స్ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్ రూల్స్ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు. -
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
మే 12 ఆదివారం మాతృదినోత్సవ వేడుకలను ప్రపంచంమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల దాకా మదర్స్ డేని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయన తార ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.Happy Mother’s Day👩👦👦to all the Super Moms 😇💝 pic.twitter.com/BxYyOJl0vK— Nayanthara✨ (@NayantharaU) May 12, 2024 సూపర్ మామ్స్ అందరికీ హ్యాపీ మదర్స్డే అంటూ నయన్ తన విషెస్ అందించారు. తన కవల పిల్లలిద్దరితో ఆనందంగా గడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా స్టార్ హీరోయిన్ అలియా తన ఫ్యామిలీతో గడిపిన ఫోటోను షేర్ చేసింది. భర్త రణబీర్ కపూర్, అత్తగారు నీతూ కపూర్ ,తల్లి సోనీ రజ్దాన్,సోదరి షాహీన్ భట్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.అలాగే కాజల్ అగర్వాల్ కూడా తల్లితో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందించింది. -
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు. -
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్లెస్ బ్లౌజ్తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ఫేక్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.కాగా.. అలియా డీప్ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో ఆమె ఫేస్ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
వైఎస్ వివేకా కేసులో సంచలన వీడియో
-
జిమ్లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. జిమ్లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
రీల్స్తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్గా సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్కు సమ్మర్ వెకేషన్కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్ను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
Chittoor: రికార్డింగ్ డాన్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
చిత్తూరు అర్బన్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో జగన్మోహన్ నాయుడు రికార్డింగ్ డ్యాన్సు చూస్తూ కనిపించారు. ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్ చేశారు. సైకిల్ పోవాలి అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జిమ్లో తన వర్కవుట్స్కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్కీ షాదీ' అన్న హ్యాష్ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ను వదిలేసి బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
'అందువల్లే నాకు అవకాశాలు రావడం లేదు'.. జగపతి బాబు కామెంట్స్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమా తర్వాత పూర్తి స్థాయి విలన్గా మారిపోయారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో జగ్గు భాయ్ నటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ వీడియోను తన ట్విటర్లో పంచుకున్నారు. లెజెండ్ తర్వాత తన కెరీర్లో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉంది. కమిటేడ్గా చేస్తున్నారు. కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఓకే. కానీ ఆ సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అని.. వేరే అవకాశాలు రావడం లేదు. కానీ మరోపక్క.. అమ్మో జగపతిబాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారని' అని చెప్పారు. 'కానీ పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో అటు.. ఇటు కాకుండా అయిపోయా. గతంలో రెండు, మూడుసార్లు నా పని అయిపోయిందని ఓ స్టేజీలో నేనే అనుకున్నా. అది కూడా లెజెండ్ సినిమాకు రెండు నెలల ముందు. కానీ మళ్లీ వచ్చాను. మీ జగపతిబాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్తాను.. కానీ మళ్లీ వస్తూనే ఉంటాను.' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండా లెజెండ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా.. జగపతిబాబు ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Dabbunna Pedhavadini….. Inko #Legend kosam Eduruchustuna. pic.twitter.com/C1GzB8RXrR — Jaggu Bhai (@IamJagguBhai) April 2, 2024