-
సాకారమవుతున్న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల దశాబ్దాల కల
-
వడివడిగా ‘వెలిగొండ’.. సాకారమవుతున్న ఆ మూడు జిల్లాల దశాబ్దాల కల
ఆలమూరు రామగోపాలరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నం వెలిగొండ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించడానికి వీలుగా 18.8 కి.మీల పొడవున మొదటి సొరంగం, హెడ్ రెగ్యులేటర్ పనులను 2021 నాటికే ప్రభుత్వం పూర్తిచేసింది. కన్వేయర్ బెల్ట్ తెగిపోతుండటం, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)లో సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో.. ఓ వైపు టీబీఎంతో సొరంగం తవ్వుతూనే మరోవైపు మనుషులతో తవ్వకం పనులు చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది దిశానిర్దేశం చేశారు. దీంతో 2022–23లో 5.52 కి.మీల పొడవున సొరంగం తవ్వి.. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు సృష్టించారు. మరోవైపు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నల్లమలసాగర్ పూర్తయింది. దీని నుంచి తీగలేరు కెనాల్ను అనుసంధానిస్తూ 550 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవల ప్రభుత్వం పూర్తిచేసింది. అలాగే, తీగలేరు కెనాల్కు నల్లమలసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీలుగా హెడ్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేసింది. తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్తో అనుసంధానం చేస్తూ 150 మీటర్ల పొడవున సొరంగం పనులను ఇటీవలే పూర్తిచేసిన ప్రభుత్వం.. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకూ శ్రీకారం చుట్టింది. యుద్ధప్రాతిపదికన తొలిదశ పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది నల్లమలసాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. వెలి‘గొండంత’ చిత్తశుద్ధి.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో 4,37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. అక్కడి 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టును ఆ మూడు జిల్లాల ప్రజల వరదాయినిగా అభివర్ణిస్తారు. – నిజానికి.. 1996లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. – పైగా.. 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే ఖర్చుచేశారు. అదీ శంకుస్థాపన సభ కోసమే. – 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. – శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు రోజుకు 3,001 క్యూసెక్కులు తరలించేందుకు ఒక సొరంగం తవ్వేలా 1994లో డీపీఆర్ను మహానేత వైఎస్ సమూలంగా మార్చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజులు తగ్గిన నేపథ్యంలో.. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా రెండు సొరంగాలు తవ్వేందుకు డీపీఆర్ను తయారుచేయించారు. – ఇలా శ్రీశైలానికి వరద వచ్చే 43 రోజుల్లోనే వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్ను నింపాలన్నది మహానేత వైఎస్ ఆలోచన. – ఇక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చుచేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తిచేయించారు. సొరంగాలను నల్లమలసాగర్ను అనుసంధానం చేసేలా 23 కిమీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేందుకు ఫీడర్ ఛానల్ పనులను చేయించారు. అలాగే, తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు. చంద్రబాబు వెలి‘గొండంత’ దోపిడీ విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును దోపిడికి అడ్డాగా మార్చుకున్నారు. అప్పటి నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చుచేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. జీఓ–22 (ధరల సర్దుబాటు), జీఓ 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తిచేస్తామని ప్రకటించి.. టీబీఎంల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు దండుకున్నారు. మళ్లీ 2018, 2019 నాటికి పూర్తిచేస్తామన్న చంద్రబాబు.. కమీషన్లు వసూలుచేసుకుని, ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు. సీఎం జగన్ హయాంలో వడివడిగా.. మహానేత వైఎస్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ ఆది నుంచి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తిచేయించారు. – రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ, సీఎం జగన్ వీటిని రద్దుచేసి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు పనులు అప్పగించారు. – రెండో సొరంగంలో టీబీఎంకు కాలంచెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దీంతో.. మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్ చెప్పడంతో అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్విస్తున్నారు. – ఇక 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున సొరంగం తవ్వారు. ఇది వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో రికార్డని ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అనుదీప్ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం రోజుకు 12 మీటర్ల మేర పనులు చేస్తున్నామని.. ఆగస్టు నాటికి రెండో సొరంగంలో మిగిలిన 1.889 కిమీల పనులను పూర్తిచేస్తామన్నారు. – మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగాల ద్వారా విడుదల చేసిన నీటిని నల్లమలసాగర్కు తరలించేందుకు 23 కిమీల పొడవున తవ్విన ఫీడర్ ఛానల్ను పటిష్టం చేసే పనులను చేపట్టామని.. ఆగస్టు నాటికి వాటిని పూర్తిచేస్తామని ఆ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ ఆవుల లక్ష్మి చెప్పారు. – అలాగే, నల్లమలసాగర్ నుంచి తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువకు నీటిని విడుదలచేసే హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని ఈఈ రమణ తెలిపారు. పునరావాసం పనులు వేగవంతం నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. వీటిల్లోని 7,318 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికే 96 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 7,222 నిర్వాసిత కుటుంబాలకు రూ.868.27 కోట్లతో పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టు కోసం 24,158.56 ఎకరాల భూమి అవసరం. ఇందులో ఇప్పటికే 20,760.47 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.679.79 కోట్లను వ్యయంచేసి.. పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతం.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ప్రకాశం జిల్లాలో పశ్చిమాన నల్లమల పర్వతశ్రేణుల్లో కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్)లను కలుపుతూ కాంక్రీట్ డ్యామ్లు నిర్మించడం ద్వారా 53.85 టీఎంసీలు నిల్వచేసేలా నల్లమలసాగర్ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ తవ్వుతున్న రెండు సొరంగాలు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు. ఈ ఏడాదే తొలిదశ పూర్తి ఈ ప్రాజెక్టు తొలిదశను ఈ ఏడాదే పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే తొలి సొరంగం పూర్తయింది. ఫీడర్ ఛానల్ సిద్ధంగా ఉంది. నల్లమలసాగర్ పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది పది టీఎంసీలను నల్లమలసాగర్లో నిల్వచేస్తాం. ఆ తర్వాత 30 టీఎంసీలు.. చివరగా 53.85 టీఎంసీలను నిల్వచేస్తాం. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ మహానేత ముందుచూపునకు నిదర్శనం శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్కు నీటిని తరలించవచ్చు. 879 అడుగుల స్థాయిలో శ్రీశైలంలో నీరునిల్వ ఉంటే.. పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 11,583 క్యూసెక్కులను నల్లమలసాగర్కు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే 40–43 రోజుల్లోనే నల్లమలసాగర్ను నింపేలా ప్రాజెక్టు డిజైన్ను మార్చడం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపునకు తార్కాణం. – మురళీనాథ్రెడ్డి, సీఈ, ప్రకాశం జిల్లా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధివల్లే.. ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధివల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతోంది. టీబీఎంలకు కాలం చెల్లడం, కన్వేయర్ బెల్ట్లు పనిచేయకపోవడంవల్ల సొరంగాల తవ్వకం 2014 నుంచి ముందుకు కదల్లేదు. మనుషుల ద్వారా సొరంగాలను తవ్వాలని సీఎం జగన్ నిర్ణయంవల్లే ఇప్పుడు ఆ పనులు పూర్తవుతున్నాయి. 2022–23లో రెండో సొరంగంలో 5.52 కిమీల పొడవున తవ్వాం. ప్రాజెక్టు చరిత్రలో ఇదో రికార్డు. – అబూ తలీమ్, ఎస్ఈ -
కరువు నేలలో జలధారలు
నీటి జాడలు లేక భూములు బీడు బారాయి. గుక్కెడు నీరు దొరక్క గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విలవిల్లాడిన నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. నెర్రెలు బారిన భూములు సస్యశ్యామలం కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో జలసిరులు నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందు కోసం రూ.84.25 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రత్యేక జీఓ విడుదల జేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరువు నేలపై జల పరవళ్లు చూడాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్లు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా మారనున్న వెలిగొండ ప్రాజెక్ట్కు నిధుల వరద పారించారు. వెలిగొండతో పాటు రామతీర్థం, గుండ్లకమ్మ, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. ఇలా కరువు సీమలో కృష్ణమ్మను పరుగులు తీయించారు. ఇప్పడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు చివరి భూములుగా ఉన్న తీగలేరు కాలువ టీ–5 పరిధిని పెంచి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. పుల్లలచెరువు మండలంలోని 9 గ్రామాలను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ నంబర్ 1824ను 2022 ఆగస్టు 17న విడుదల చేసింది. జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ. 84.25 కోట్లు మంజూరు చేసింది. తీగలేరు కాలువ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. తీగలేరును అభివృద్ధి చేయడం ద్వారా పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీరు అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. చిన కండలేరు ప్రాజెక్టుకు అనుసంధానం: తీగలేరు బ్రాంచ్ కాలువను అభివృద్ధి చేయటం ద్వారా ఆ కాలువ ద్వారా ప్రవహింపజేసే నీటితో పుల్లలచెరువు మండలంలోని చినకండలేరు జలాశయాన్ని అనుసంధానం చేయనున్నారు. దశాబ్దాల తరబడి తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న పుల్లలచెరువు మండల ప్రజల కష్టాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుక్కెడు నీటి కోసం వలసలు వెళ్లే గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించాలని సీఎంను కోరారు. దశాబ్దాలుగా కరువుతో బీడు భూములుగా మారుతున్న గ్రామాల రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి, సాగు నీటి అవసరాలు తీరాలంటే ఒక్క వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిధిని పెంచితేనే సాధ్యమని సీఎంకు వివరించారు. దీంతో ప్రత్యేక జీఓ ద్వారా నిధులు విడుదల చేశారు. 11,500 ఎకరాలు సస్యశ్యామలం: పుల్లలచెరువు మండలానికి కృష్ణా జలాలను తీసుకురావడంతో 9 గ్రామాల్లోని దాదాపు 11,500 ఎకరాలకు పైగా బీడువారిన భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టు టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడంతో మండల ప్రజల ఆశలు చిగురించాయి. కరువు నేలలో బీడు భూములను పంట పొలాలుగా మార్చటంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు మా ప్రాంతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. టి–5 కాలువ పనులు పూర్తిచేసి చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే మా ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. ఏళ్ల తరబడి నీరులేక ఇబ్బందులు పడుతున్నాం. సాగునీరు లేక, పంటలు పండక కరువుతో అల్లాడుతున్నాం. ప్రభుత్వం తీగలేరు కాలువ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయటంతో ఇక్కడి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. – శివారెడ్డి, రైతు, మల్లాపాలెం కోనసీమను తలపిస్తాయి.. తీగలేరు కాలువ పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురే‹Ùకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టి–5 కాలువ ద్వారా చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే ఈ ప్రాంత పొలాలు కోనసీమను తలపిస్తాయి. నీరు వృథా కాకుండా పంటలను సాగు చేసుకుంటాం. – నాసరయ్య, రైతు, పుల్లలచెరువు -
2023 సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తాం
-
CM YS Jagan: ఏడాదిలో వెలిగొండ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఈ చిరకాల కోరికను తీర్చాకే 2024లో ఎన్నికలకు వెళతామని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (బీఎస్సార్)ల కాంస్య విగ్రహాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 18.80 కిలోమీటర్ల మొదటి టన్నెల్, 18.78 కిలోమీటర్ల రెండో టన్నెల్ పనులను 2014కు ముందు నాన్నగారు ఉరుకులు, పరుగులు పెట్టించారని తెలిపారు. 2014 వరకు మొదటి టన్నెల్ను ఏకంగా 11.58 కి.మీ పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాలనలో మొదటి టన్నెల్ను కేవలం 4.33 కి.మీ. మాత్రమే తవ్వాగా, మనం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 2.89 కిలో మీటర్లు తవ్వి పూర్తి చేశామని చెప్పారు. రెండో టన్నెల్ పనులు 2014 వరకు 8.74 కిలో మీటర్లు తవ్వితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం 2.35 కిలో మీటర్లు మాత్రమే తవ్వి, చేతులు దులుపుకున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చాక రెండో టన్నెల్ను ఇప్పటికే 3.71 కిలో మీటర్లు పూర్తి చేశామని, ఇక మిగిలిన 3.96 కి.మీలు కూడా 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళతామని, ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా రూపు రేఖలన్నీ సమూలంగా మారిపోతాయని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ మంచి చేసే మనుషులు చిరస్థాయిగా ఉంటారు ► మంచి చేసే మనుషులు చనిపోయినా, చిరస్థాయిగా మనస్సుల్లో నిలిచి ఉంటారు. మంచి చేసిన వారికి చావు ఉండదు. ఒకవైపు నాన్నగారు.. మరో వైపు సుబ్బారెడ్డి అన్న.. ఇలాంటి నాయకులను ఎవరూ మరిచిపోలేరు. – గాంధీ, అంబేడ్కర్, మహాత్మా పూలే, జగ్జీవన్ రామ్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, మహానేత వైఎస్సార్.. ఇలాంటి వారందరినీ కలకాలం తలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ, వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు ఎప్పటికీ మరణం ఉండదు. వీళ్లంతా తెలుగు నేల మీద గుర్తుండిపోయే శిఖరాలు. ► నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగారు. నాన్నగారి విగ్రహంతోపాటు, ఆయనతో కలిసి అడుగులు వేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి (శివప్రసాదరెడ్డి నాన్న) గారి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ► రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నాం. ఆ అడుగులు మరచిపోలేం ► రైతులకు ఉచిత విద్యుత్ అన్నప్పుడు.. కుయ్.. కుయ్ అని అంబులెన్స్ శబ్ధం విన్నప్పుడు, ఆరోగ్యశ్రీ అన్నప్పుడు మనకు ఆ దివంగత మహానేతే గుర్తుకు వస్తారు. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినప్పుడు.. కొందరు తీగలు చూపి, బట్టలు ఆరేసుకునేందుకే అవి పనికొస్తాయని ఎద్దేవా చేశారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అట్టడుగున ఉన్న పేద వారు నిజంగా జీవితంలో పైకి రావాలంటే ముఖ్యమైనది చదువు మాత్రమే. పేదల పిల్లలు చదువుకోవాలని ఆ మహానేత తపించారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. లక్షల కొద్దీ ఇళ్ల నిర్మాణం, జల యజ్ఞం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి వేసిన అడుగులు ఇప్పటికీ మరిచిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ► అలా మంచి చేసిన రాజశేఖరరెడ్డి కొడుకుగా, మీ బిడ్డగా జగన్ నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మాట ఇస్తున్నా. మీ చల్లని దీవెనలతో ఎన్నికలప్పుడు చెప్పిన హామీలలో 95 శాతం పూర్తి చేశాం. మీ చిరునవ్వులు, మీ ఆప్యాయతలు పంచి పెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితునికి, మిత్రునికి, అవ్వకు, తాతకు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు. గ్రానైట్ పరిశ్రమకు భరోసా ► స్టోన్ కటింగ్ మిషన్లకు సంబంధించి చిన్న చిన్న యాజమాన్యాల కింద పది మందికి పైగా పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నా పాదయాత్ర సమయంలో వారి కష్టాలు చెప్పుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆరోజు నేను ఏదైతే చెప్పానో.. ఆ విధంగా మళ్లీ స్లాబ్ సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడకు వచ్చే ముందే జీవో నంబరు 58 విడుదల చేశాం. ► నాన్న గారి హయాంలో తీసుకొచ్చిన ఈ స్లాబ్ పద్ధతిని 2016లో చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలు కష్టాల్లో కూరుకుపోయాయి. అందుకే దాదాపు ఏడు వేల యూనిట్లకు లబ్ధి చేకూరేలా జీవో 58 తీసుకొచ్చాం. ► ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్ ఎక్కువగా ఉంటుంది. 22 క్యూబిక్æ మీటర్ల ముడి గ్రానైట్ ప్రాసెస్ యూనిట్లకు సింగిల్ బ్లేడ్కు రూ.27 వేలు, మల్టీ బ్లేడ్కు రూ.54 వేలు నెలకు ఇచ్చేలా సీనరేజ్ స్లాబు నిర్ణయించాం. శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బేŠల్డ్కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్కు రూ.44 వేల సీనరేజ్ స్లాబ్ నిర్ణయించాం. ► ఇలా స్లాబ్ విధానం అమలు చేయడం వల్ల మన ప్రభుత్వానికి రూ.135 కోట్లు నష్టం వాటిల్లితుందని తెలిసినా, మీ బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ప్రకటించిన కొత్త విధానం వల్ల చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు స్పీడ్ అందుకుంటాయి. వాటికి అనుబంధంగా రవాణా, మార్కెట్ రంగాల్లో అవకాశాలు మెరుగుపడి కార్మికులకు మేలు జరుగుతుంది. విద్యుత్ యూనిట్కు రూ.2 రాయితీ ► గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నాను. దీంతో చిన్న చిన్న పరిశ్రమలు సైతం పుంజుకుంటాయి. చిన్న చిన్న గ్రానైట్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం యూనిట్కు హెచ్టీకి రూ.6.30, ఎల్టీకీ యూనిట్ రూ.6.70 చొప్పున వసూలు చేసేది. ఆ చార్జీల్లో ఇక మీదట నుంచి ప్రతి యూనిట్కు రూ.2 రాయితీ ప్రకటిస్తున్నా. అటు స్లాబ్ సిస్టం అమలు చేయటం, ఇటు విద్యుత్ యూనిట్లలో రాయితీలు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అయినా పరిశ్రమల అభివృద్ధి, కార్మికుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదేనని భావించాను. ► విద్యుత్ రాయితీ వల్ల ఏకంగా ప్రభుత్వానికి రూ.210 కోట్లు భారం పడుతుంది. మరో వైపు సీనరేజ్ మార్పు వల్ల రూ.135 కోట్ల భారం పడుతుంది. వెరసి రెండింటి మీద దాదాపు రూ.350 కోట్లు భారం పడుతుంది. ఈ రోజు నుంచి ఈ రెండూ అమలులోకి వస్తాయి. జెడ్పీ భవనం కోసం రూ.20 కోట్లు ► ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరిందని.. రూ.20 కోట్లు మంజూరు చేయాలని.. ఇక్కడకు వచ్చేటప్పుడు జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ అడిగారు. రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాను. తాళ్లూరు మండలం శివరామ్పురంలోని మొగిలిగుండాల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని చేపట్టాం. ఆ అమ్మ కోరిక మేరకు ఈ సందర్భంగా ఆ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మినీ రిజర్వాయర్గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చాం. ► మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు, కనిగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. ఒంగోలు సబర్బన్:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తి సభలో బుధవారం నవ్వుల.. పువ్వులు విరిశాయి. బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ.. డాక్టర్ వైఎస్సార్పై స్వయంగా రాసిన పాటను వినిపించారు. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. ‘ఎక్కడున్నావు రాజశేఖరన్నా.. మళ్లెప్పుడొస్తావు రాజశేఖరన్నా.. ఏమైపోయావు రాజశేఖరన్నా.. మంచి మనసున్న రాజశేఖరన్నా.. చందమామ రూపున్న వాడా.. మా కుటుంబానికి ఆత్మీయ సోదరుడా’ అంటూ భావోద్వేగంతో పాట పాడారు. సీఎం వైఎస్ జగన్ ఆమె వద్దకు వచ్చి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని తను ఆశీనులైన కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఈ దృశ్యం చూసిన వారు కరతాళ ధ్వనులు చేస్తూ మనసారా నవ్వుకున్నారు. -
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లోనే తప్పిదం.. ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది. అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కేంద్ర జల్శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు. -
నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి!
చంద్రబాబు పాలన అంటే ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచన గుర్తుకు వస్తాయి. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో దుర్భిక్షం రాజ్యమేలింది. పాడికి పేరొందిన ప్రకాశం జిల్లాలో రైతులకు అండగా ఉన్న ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. రైతులను నట్టేట ముంచేసి.. వేలాది మంది కార్మికులను రోడ్డు పాల్జేశారు. రుణమాఫీ హామీని గాలికొదిలేసి లక్షలాది మంది కర్షకులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారు. ఈ ప్రాజెక్ట్ పేరుతో విడుదలైన అరకొర నిధులు బాబు బినామీలు కాజేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఐదేళ్లు కాలక్షేపం చేసిన ఎన్నికల వేళ హడావిడిగా శిలా ఫలకం వేసి వంచన చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను నట్టేట ముంచేసిన చంద్రబాబు.. ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఈ గడ్డపై మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారని జిల్లా వాసులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు హయాం 2014 నుంచి 2019 వరకు ప్రకాశం జిల్లాలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఐదేళ్లూ అన్ని మండలాల్లో కరువు తాండవించింది. సాగు, తాగు నీటి కోసం ప్రజలు విలవిల్లాడారు. పశ్చిమాన పలు గ్రామాల్లో ప్రజలు వలసబాట పట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనలతో హడావుడి చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ఐదేళ్ల బాబు నయవంచన పాలనను.. మూడేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని జనం పోల్చుకుంటున్నారు. జగన్కు జై కొడుతున్నారు. జిల్లాలో నాడు–నేడు ఒక్కసారి పరిశీలిద్దాం.. పాలేరూ అంతే.. కొండపి నియోజకవర్గంలోని సంగమేశ్వరం వద్ద పాలేరుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో ముందుకు సాగనేలేదు. అప్పటి, నేటి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి (టీడీపీ) కాంట్రాక్టర్లను మార్చటమే పనిగా పెట్టుకున్నారు. మూడుసార్లు కాంట్రాక్టర్లను మార్చి నిర్లక్ష్యం చేశారు. ఇలా అన్ని రంగాల్లో జిల్లాను గాలికొదిలేశారు. కరువు జిల్లాగా మార్చేశారు. రుణమాఫీ పేరిట దగా 2014 ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. కమిటీల పేరుతో ఏడాదిన్నరపాటు కాలయాపన చేశారు. పాత ప్రకాశం జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు, 7 లక్షల మంది డ్వాక్రా మహిళలు కలిపి సుమారు రూ.11 వేల కోట్లకు పైగా రుణాలు ఉండేవి. కేవలం రూ.3 వేల కోట్లలోపు మాత్రమే రుణాలు మాఫీ చేసి అటు రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు. హెరిటేజ్ కోసం ఒంగోలు డెయిరీ మూత... పాడి రైతులకు ఆదాయ వనరుగా ఉన్న ఒంగోలు డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ కోసం నిలువునా ముంచేశారు. తన పార్టీకి చెందిన డెయిరీ పాలక మండలి చేత సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్పించి దగా చేశారు. డెయిరీ సొమ్ముంతా దోచుకునేటట్లు చేసి చివరకు రూ.100 కోట్ల వరకు అప్పులు చేయించి మరీ డెయిరీని మూతవేయించారు. పాడి రైతులను నట్టేట ముంచారు. వేలాది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. వెలిగొండ పనులు నత్త నడక.... ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా నిర్మింపతలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఐదేళ్లూ నత్తను తలపించాయి. తన సొంత బినామీ అయిన సీఎం రమేష్కు వెలిగొండ పనులను అడ్డగోలుగా నామినేషన్పై ఇచ్చి రూ.వందల కోట్లు కాజేశారు. పనుల్లో మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఒకటో టన్నెల్ పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. ఆర్అండ్ఆర్ పనులు అసలు చేపట్టనే లేదు. నాడు గాలికొదిలేసిన టీడీపీ నేతలు ఇదే ప్రాజెక్టుపై లేఖల డ్రామాలు మొదలుపెట్టి అసత్య ప్రచారానికి పూనుకున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపన జిల్లా ప్రజల చిరకాల కోరిక రామాయపట్నం పోర్టు. టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్తో కాలయాపన చేశారు. చివరకు ఎన్నికలకు ముందు డ్రామాకు తెరతీశారు. మేజరు పోర్టును మినీపోర్టుగా మార్చేశారు. హడావుడిగా శిలాఫలకం వేశారు. నన్ను తిరిగి గెలిపిస్తే రామాయపట్నం పోర్టు, పేపర్ మిల్లు ఏర్పాటు చేస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చి వెళ్లారు. మారిన గతి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అభివృద్ధి పరుగులు తీసింది. వెలిగొండకు భారీగా నిధులు కేటాయించింది. పనుల్లో వేగం పెంచింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామంలో నాలుగైదు రకాల ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది దాదాపు రూ.19,600 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారులకు చేరాయి. మార్కాపురంలో మెడికల్ కాలేజీ.. దోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ప్రజలకు వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందుకోసం 50 ఎకరాలు కేటాయించి, నిర్మాణానికి రూ.475 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల దశ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జీజీహెచ్ అభివృద్ధికి రూ.170 కోట్లు జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.170 కోట్లు మంజూరు చేయించారు. జీజీహెచ్ వెనుక 7 ఎకరాలను అదనంగా కేటాయించారు. బెడ్లు పెంచటంతో పాటు అదనపు సౌకర్యాలు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి సీటీఎంఆర్తో పాటు జీజీహెచ్లో అనేక ఆధునికీకరణ పనులు చేపట్టారు. థర్డ్ వేవ్ కోవిడ్ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ వేలాది ప్రాణాలను కాపాడింది. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ.. టీడీపీ హయాంలో ఒక్క విద్యా సంస్థ కూడా జిల్లాకు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్శిటీని మంజూరు చేసింది. పేర్నమిట్టలో 109 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను డీపీఆర్ కోసం రూ.50 లక్షలు రిలీజ్ చేసింది. మొత్తం యూనివర్శిటీ బడ్జెట్ కింద రూ.340 కోట్లు కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ► నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించటానికి (స్కిల్ డెవలప్మెంట్) ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో 5 ఎకరాలు కేటాయించింది. ► దోర్నాలలో రూ.3 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► గిద్దలూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుంకేసుల గ్యాప్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లతో పనులు చేస్తున్నారు. ► ఒంగోలు నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు నగరానికి వచ్చినప్పుడు రూ.400 కోట్లు కేటాయించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరారు. దీంతో ఆ ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నట్లు బహిరంగ సభలోనే ప్రకటించారు. ► రూ.54 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ► చీరాల మండలంలోని వాడరేవు, కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో రెండు ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి స్థల సేకరణ పూర్తయింది. త్వరలో వాటి నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేసింది. రెండో టన్నెల్ 18.679 కిలో మీటర్లకుగాను ఇక కేవలం 4.920 కిలో మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతం చేసింది. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ఇప్పటికే 31,066 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసింది. భూ సేకరణ కోసం రూ.418 కోట్లు వెచ్చించింది. ఆర్ఆర్ ప్యాకేజీ కోసం 11 గ్రామాల తరలింపునకు రూ.116 కోట్లు కేటాయించింది. పేద విద్యార్థుల కల సాకారమే ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీని జిల్లాకు తీసుకొచ్చి పేద విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏటా 4 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చేరుతుంటారు. ఐదేళ్లపాటు అంటే 20 వేల మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం ఇడుపులపాయతో పాటు పేర్నమిట్ట అవతల ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనిర్మాణం కోసం కనిగిరి ప్రాంతంలో స్థల పరిశీలన జరుగుతోంది. -
వేగంగా వెలిగొండ పనులు
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్ టన్నెల్ను సైతం పరిశీలించారు. -
వెలిగొండపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదు
ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, కుందురు నాగార్జునరెడ్డి చెప్పారు. వైఎ స్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరగలేదని, వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఒంగోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. చంద్రబాబు స్క్రిప్టుపై సంతకాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చేతగానివారని మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు. లేఖలు రాయడం కాదని, చేతనైతే చంద్రబాబు ఐదేళ్ల పాలన, తమ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ఒంగోలు చర్చిసెంటర్లో మీడియా సాక్షిగా బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ను 3.300 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 3.500 కిలో మీటర్లు తవ్వి మొదటి టన్నెల్ను పూర్తిచేశామని చెప్పారు. బాబు పాలనలో వెలిగొండకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు. వెలిగొండ కోసం అంటూ దీక్షలు చేయడం కాదని, చేతనైతే ఎందుకు నిర్లక్ష్యం చేశారో చెప్పాలంటూ బాబును నిలదీయాలన్నారు. రామాయపట్నం పోర్టు, మైనింగ్ యూనివర్సిటీ, ఆసియా పేపర్మిల్లు, దొ నకొండ సెజ్లో విమాన విడిభాగాల పరిశ్రమలు ఎ క్కడ నిర్మించారో చూపించాలన్నారు. శనగలన్నీ కో ల్డు స్టోరేజీల్లో ఉండిపోతే క్వింటాలుకు రూ.4,750 చొప్పున తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పొగాకు రైతుకు కిలోకి కనీసం రూ.110 ఇప్పించామని వారు పేర్కొన్నారు. -
అప్పటివరకు కేరింతలు.. అకస్మాతుగా విషాదచాయలు
గాలివీడు (వైఎస్సార్ కడప జిల్లా): విహార యాత్ర విషాదకరంగా ముగిసింది. బెంగళూరుకు చెందిన నలుగురు సరదాగా ఈత కొడుతూ నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన శనివారం మండల కేంద్రానికి సమీపంలోని వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు దిగువనున్న గండిమడుగులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన దాదాపు 20 మంది కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా వాయల్పాడులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదా కోసం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సమీపంలోని మడుగులో ఈత కోసం దిగారు. ఈత కొట్టాలని దిగిన తాజ్ మహమ్మద్(41), ఉస్మాఖానం (12), మహమ్మద్ హంజా(11), మహమ్మద్ ఫహాద్(10)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్, ఎస్ఐ చిన్నపెద్దయ్య, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలించి రాత్రి 9 గంటలకు మృతదేహాలను వెలికితీశారు. -
తెలుగుగంగ, వెలిగొండ విస్తరణను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టుల విస్తరణ చేపట్టిందని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా బోర్డుకు రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టులను చేపట్టారని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా కడప జిల్లా దువ్వూరు మండలం జొన్నవరంలో ఎత్తిపోతల పథకం చేపట్టారని, దానికి రూ.564.6 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారని లేఖలో వివరించారు. వాస్తవానికి చెన్నై నగరానికి తాగునీటి కోసం తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారని, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారని తెలిపారు. అంతేగాకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ, గాలేరు– నగరి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకొని పెన్నా బేసిన్కు తరలిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 88వేల క్యూసెక్కులు తరలించేలా గ్రావిటీ కాల్వల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉందని.. ఏటా పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీలు తరలిస్తూ చెన్నైకి 10 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకునే పేరిట వెలిగొండ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారని, రిజర్వాయర్లో 875 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టులతో శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
వేగంగా వెలిగొండ రెండో టన్నెల్ పనులు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ (సొరంగం)లో మిగిలిన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ప్రభుత్వం, రెండో టన్నెల్ పనులను శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రెండో టన్నెల్ తవ్వకం పనులకు గాను అమెరికా సంస్థ రాబిన్స్ నుంచి డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)ను 2007లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ టీబీఎంలో, కన్వేయర్ బెల్ట్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు గత ప్రభుత్వం రాబిన్స్తో సంప్రదింపులు జరిపింది కానీ మరమ్మతులకు సంస్థను ఒప్పించలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాబిన్స్తో చర్చించడంతో పాటు సంస్థ ప్రతినిధులను రప్పించడం ద్వారా టీబీఎం, కన్వేయర్ బెల్ట్లకు మరమ్మతులు చేయించింది. టీబీఎంతోపాటు, కార్మికులతోనూ తవ్వించడం ద్వారా నెలకు వెయ్యి మీటర్ల చొప్పున పనులు చేయించి, ఏడు నెలల్లో మిగిలిన 7,383 మీటర్ల టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 830 అడుగులకు తగ్గిన వెంటనే ఈ టన్నెల్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను ప్రారంభించి, జూన్లోగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. వైఎస్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తి శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోగానే రోజుకు 11,582 క్యూసెక్కుల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా రెండు టన్నెళ్లను తవ్వాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్నది వైఎస్సార్ సంకల్పం. పనులు వేగంగా కొనసాగించడంతో మహానేత హయాంలోనే టన్నెళ్లు, నల్లమలసాగర్, ప్రధాన కాలువల పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఇక మిగిలిన పనులను పూర్తిచేసే పేరుతో కాంట్రాక్టర్లతో కలసి గత ప్రభుత్వ పెద్దలు రూ.66.44 కోట్లు దోచుకున్నారు. టన్నెళ్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి అధిక ధరలకు ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండను ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు అప్పగించిన రెండో టన్నెల్ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి, రివర్స్ టెండరింగ్తో రూ.61.76 కోట్లు ఖజానాకు ఆదా చేశారు. తద్వారా గత సర్కార్ అక్రమాలను బహిర్గతం చేశారు. మరోవైపు మొదటి టన్నెల్లో మిగిలిన 3.6 కి.మీల పనిని 13 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశారు. లైనింగ్తో సహా మొదటి టన్నెల్ పూర్తయింది. మొదటి టన్నెల్కు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు హెడ్ రెగ్యులేటర్ను గతేడాదే పూర్తి చేశారు. ఇక రెండో టన్నెల్ ఏడు నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించడం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ల ద్వారా నల్లమలసాగర్కు అక్టోబర్ నాటికి కృష్ణా వరద జలాలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ రెండవ టన్నెల్లో ఇప్పటి వరకు పనులు పూర్తయిన ప్రాంతం -
‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్డౌన్ కొనసాగింది. జూన్ నుంచి నవంబర్ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం. వేగం పుంజుకున్న రెండో సొరంగం పనులు ఇదే ప్రాజెక్ట్లో భాగమైన రెండో సొరంగం పనులను వేగవంతం చేశారు. నల్లమల సాగర్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులను అభినందించిన మంత్రి అనిల్ సొరంగం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ మేఘాను మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ అభినందించారు. జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ జలంధర్లకు బుధవారం రాత్రి ఫోన్ చేసిన మంత్రి గడువులోగా పనులు పూర్తి చేశారని అభినందించారు. రెండో సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మాట నిలబెట్టుకున్న సీఎం ప్రాజెక్ట్ మొదటి సొరంగం పనులు బుధవారం రాత్రి పూర్తయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు దీనిని ప్రాధాన్యత ప్రాజెక్ట్గా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి దశ పనులను పూర్తి చేసి వచ్చే సీజన్లో నల్లమల సాగర్కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తామని గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రకటించారు. ఆ మేరకు పనులు పూర్తి చేయించి మాట నిలబెట్టుకున్నారు. -
వెలిగొండ పనుల వేగం పెంచండి
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో 237 మీటర్ల మేర పని చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు) అడ్డురావడం వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. టన్నెల్ తవ్వకం పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, టన్నెల్ బోరింగ్ మెషీన్ తొలగించే పనులు ఫిబ్రవరికి పూర్తవుతాయని చెప్పారు. ఎట్టి పరిప్థితుల్లోనూ ఫిబ్రవరికి తొలి దశను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో టన్నెల్ ఆగస్టు నాటికి పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఆలోగా ప్రాజెక్టు రెండో దశ ద్వారా నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని సూచించారు. నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను దశలవారీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన కార్యాచరణ మేరకు పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
గత ప్రభుత్వం వెలిగొండపై కాలయాపన చేసింది
-
‘ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం’
సాక్షి, కర్నూలు: వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి శ్రీశైలం డ్యామ్ నుంచి బోట్లో వెళ్లి వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాంతంలోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను సాకారం చేసే దిశగా తలపెట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుతుందని తెలిపారు. (ఏపిలోకి నైరుతి రుతుపవనాలు) గత ప్రభుత్వాలు 12 సంవత్సరాలు అవుతున్నా వెలుగొండ ప్రాజెక్టు పనులను అంతంత మాత్రంగానే పూర్తి చేశారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం నాలుగు కిలోమీటర్ల టన్నెల్ను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కేవలం16 నెలల్లో మూడు కిలోమీటర్లు టన్నెల్ను పూర్తి చేసిందని తెలిపారు. జూన్ 25 లోపు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ వరకు ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ఏడున్నర కిలోమీటర్ల దూరమున్న రెండో టన్నెల్ పనులను 18 నెలల లోపు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం: మంత్రి అనిల్
-
మెట్టకు అండ వెలిగొండ
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతగా జరుగుతున్నాయి. దుర్భిక్షమైన మెట్టప్రాంతాలను ఆదుకునేందుకు దాదాపు 15 ఏళ్ల క్రితం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన అకాల మరణం తర్వాత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. మూడు దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వైఎస్సార్ కలను నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్ట్ పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి ఈ పనులు పూర్తయితే, రెండో దశలో జిల్లాకు సంబంధించిన పనులు పుంజుకోనున్నాయి. ఉదయగిరి: డెల్టా ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లా పశ్చిమ దిశలోని ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లోని భూములకు సాగునీరు, తాగు నీరు అందించేందుకు 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనమరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్ పాలకులు, ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్ట్ను సత్వరమే పూర్తి చేసేందుకు నడుం బిగించారు. అందులో భాగంగా ఇటీవల ప్రాజెక్ట్ను సందర్శించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జూన్కల్లా మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్సార్ సీఎంగా 2005 నుంచి 2009 వరకు ఈ ప్రాజెక్ట్ పనులను శరవేగంగా చేపట్టారు. ఆయన మరణంతో పనులు నత్తను తలపించాయి. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్పై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అంతకు ముందు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి తమ బినామీ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టినా పనుల్లో పురోగతి లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మూడు జిల్లాల మెట్ట రైతులు దిగాలు పడ్డారు. మళ్లీ చిగురించిన ఆశలు కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగాన కొళ్లాం ప్రాంతంలోని హెడ్ రెగ్యులేటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీరు నిల్వ చేసి అక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి కొంత మేర ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఇందుకు అవసరమైన రూ.185 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు అంగీకరించింది. రెండో దశ పనులకు అవసరమైన రూ.1,600 కోట్లు కూడా యుద్ధప్రాతిపదికన అందజేసేందుకు సీఎం సుముఖంగా ఉన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలోని ఐదు మండలాల్లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉదయగిరిలోని నాలుగు మండలాలకు 47 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. శరవేగంగా పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు ఈ ప్రాజెక్ట్లో అంతర్భాగంగా నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల సాగర్ నుంచి 139 కి.మీ పొడవుతో తవ్విన కాలువ ద్వారా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీరు వస్తుంది. ఇక్కడ 2.02 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి 39.8 కి.మీ మేర ఉదయగిరి ఉప కాలువను తవ్వారు. తద్వారా గండిపాళెం రిజర్వాయర్కు కూడా నీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు మండలాలకు సాగు, తాగునీరందుతుంది. సీతారామపురం వద్ద నిర్మించ తలపెట్టిన సీతారామసాగర్లో పది టీఎంసీల నీరు ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది. మెట్టప్రాంతం సస్యశ్యామలం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలోని 75 శాతం మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. పెద్దిరెడ్డిపల్లి సీతారామసాగర్ రిజర్వాయర్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రాజెక్ట్ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన బీడు భూములను చేర్చేందుకు అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను. ఈ ఐదేళ్లలోనే సాగునీరు, తాగునీరు అందుతుంది. నెల క్రితం మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరును సందర్శించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు. – మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే -
వెలిగొండ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి టన్నెల్లో రోజుకు సగటున 7.5–8మీటర్ల చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఇందులో మిగిలిన 940 మీటర్ల పని 117 రోజుల్లో పూర్తవుతుంది. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 836.20 అడుగులకు తగ్గిపోవడంతో వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులను సోమవారం ప్రారంభించనున్నారు. మూడున్నర నెలల్లో వీటిని పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. అంతేకాక.. - టన్నెల్ నుంచి ప్రధాన కాలువకు నీటిని తరలించే లింక్ కెనాల్ పనులను వేగవంతం చేశారు. - 53.85 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల పరిధిలోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. - జూలై నాటికి వీటిని పూర్తిచేసి ఆగస్టులో కృష్ణా వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టి వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. - రెండో టన్నెల్ పనులకు సంబంధించి టీడీపీ హయాంలో కాంట్రాక్టర్కు దోచిపెట్టిన రూ.61.76కోట్లను వైఎస్ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు ఆదా చేసింది. పునరావాసంపై ప్రత్యేక దృష్టి ఇక నల్లమలసాగర్ ముంపు గ్రామాల్లోని 4,617 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్వాసితులకు పరిహారం అందించి.. వారిని పునరావాస కాలనీలకు తరలించే పనులను జూలైలోగా పూర్తిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను ప్రభుత్వం ఆదేశించింది. సకాలంలో పనులను పూర్తిచేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరదను రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 45 రోజుల్లో 43.50 టీఎంసీలను తరలిస్తారు. తద్వారా దుర్భిక్ష ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. అలాగే, 15.25 లక్షల మంది దాహార్తిని తీరుస్తారు. సీఎం పర్యటనతో పనులు మరింత వేగం వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే.. - గడువులోగా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి.. జూలై నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలన్నారు. - నిజానికి మొదటి టన్నెల్లో ఫిబ్రవరి 20 వరకు రోజుకు 6.5–7 మీటర్ల చొప్పున పనులు జరిగేవి. సీఎం పర్యటన తర్వాత అవి వేగం పుంజుకున్నాయి. రెండో టన్నెల్ను కూడా 2021కి పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేశారు. -
‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు పరి శీలించడానికి ఫిబ్రవరి 20న శివరాత్రికి ముందురోజు నల్లమల అడవుల ముఖ ద్వారం డోర్నాల వద్దకు వెళ్లారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు నల్లమల అడవుల్లో మరణించిన కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రుద్రకొండ వద్ద ఉన్న పావురాలగుట్టకు ఈ వెలిగొండ ప్రాజెక్టు సమీప ప్రాంతం. అయితే, సీఎంగా వైఎస్సార్ జీవించివున్న రోజుల్లో నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలకు సిద్ధం అన్నప్పుడు, ‘మీడియా’ సాక్షిగా వాళ్ళు అడివిలో నుండి బయటకు వచ్చిందీ, చర్చలు ముగిసాక వాళ్ళు తిరిగి ‘లోపలికి’ వెళ్ళిందీ ఆ ప్రాంతంలోనే. మా ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది అని నక్సలైట్లను ఆహ్వానించిందీ, ఆ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలపడానికి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన శంకు స్థాపన చేసిందీ; ఇవి రెండూ జరిగింది, 2004లో వైఎస్సార్ సీఎం అయిన తొలి ఆరు నెలల్లోనే. నిజానికి ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చెయ్యాలని అప్పట్లో లక్ష్యం పెట్టారు, కాని 2000 మే చివరి వరకు కనీసం అనుమతులు కూడా రాలేదు. తర్వాత 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. వైఎస్సార్ సీఎం అయ్యాక, 2004 అక్టోబర్ 27న నల్లమల ముఖద్వారం గొట్టిపడియ దగ్గర దీనికి శంకుస్థాపన చేసి, వెంటనే నిధులు విడుదల చేశారు. అప్పటికి 1996లో రూ. 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి రూ. 5,500 కోట్లకు చేరింది. కానీ, వైఎస్సార్ చొరవతో 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. మూడు ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు ఇంకా పూర్తి కాలేదు. తండ్రి ఆనాడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు వద్ద, ఇప్పుడు తనయుడు సీఎం హోదాలో ప్రాజెక్టు సొరంగం ‘లోపలికి’ వెళ్ళడం అనేది, దృశ్యమానంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ చూడ్డానికి అక్కడ అంతకు మించి ఇంకా ఎంతో వుంది. ఇప్పటివరకు రాజ్యం ‘లోపలికి’ వెళ్ళక, ‘ఓపెన్’ కాని చాలా కొత్త ప్రాంతాలను, ఈ ప్రభుత్వం విద్య, వైద్యంతో పేదలకు గౌరవ ప్రదమైన జీవనం ఇస్తూ, చేస్తున్న ‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే. (చదవండి: వెలిగొండ వేగం పెరగాలి) మధ్య కోస్తాలో తూర్పుకనుమల పాదాల వద్ద నల్లమల అడవుల అంచుల్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లోని కరువు ప్రాంతాల్ని కలుపుకుని, 1970లో ‘ప్రకాశం’ ఒక జిల్లా అయింది. జిల్లా పశ్చిమ ప్రాంతం పెద్దగా మెరుగుపడిన పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు. 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, ఇప్పుడు ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ‘ఫోకస్’ పడింది గానీ, లేకుంటే ఈ ప్రాంత పరిస్థితిని వూహించడం కష్టం. ‘వెలుగొండ’ ప్రాజెక్టు పూర్తి అయ్యాక, సాగులోకి రానున్న 4,47,300 ఎకరాల భూములకు ఇన్నేళ్లకు విలువ పెరగనుంది. కృష్ణా నది సహజ ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన దారి మళ్ళించి నల్లమల అడవుల గర్భం లోపల నుండి కొండకు వేసిన సొరంగ మార్గం ద్వారా, త్వరలో నదీ జలాలు ఇకముందు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నిత్య కరువు ప్రాంతానికి తరలివస్తాయి. తూర్పు కనుమల్లో నల్లమల అరణ్యం అంచుల్లో ఇప్పటివరకు సాగు జలాలు అందని ఇంత పెద్ద విస్తీర్ణం ఇకముందు సాగులోకి వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాలోని 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది. ఏకకాలంలో ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మధ్యకోస్తా ప్రాంతాన్నే కాకుండా రాయలసీమ జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత ‘మెరైన్ బోర్డ్’ వచ్చాక రామాయపట్నం, దుగ్గరాజపట్టణం పోర్టులకు రవాణా కోసం అనుసంధానం అయ్యే ఈ ప్రాంతం రూపురేఖలు చాలా తక్కువ కాలంలో మారిపోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక వ్యాఖ్యాత -
ఆ ఇద్దరి మధ్య తేడా అదే..!
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో తవ్వింది 600 మీటర్ల మాత్రమేనని.. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత 8 నెలల్లో 1.4 కి.మీ తవ్వారని.. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఇదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. ఆగస్టుకల్లా ఫేజ్-1 ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని సీఎం వైఎస్ జగన్ చెప్పడం ప్రకాశం జిల్లా రైతులకు ఊరటనిస్తుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. (వెలిగొండ వేగం పెరగాలి) ఎన్పీఆర్ ఆమోద యోగ్యం కాదు.. ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యలను, వారిని అభద్రతా భావానికి గురిచేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించదని మరో ట్వీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఎన్పీఆర్ ప్రస్తుత రూపం మాకు ఆమోద యోగ్యం కాదు. ఇప్పటికే జీవో తెచ్చాం. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వెలిగొండ వేగం పెరగాలి
ఐదేళ్ల టీడీపీ సర్కార్ హయాంలో 600 మీటర్ల మేర టన్నెల్–1 పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నమాట. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రాధాన్యత క్రమం’లో శరవేగంగా పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళిక అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అధికారులకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గురువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘ప్రాజెక్టుల బాట’కు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం హెలికాఫ్టర్లో బయలుదేరి 10.55 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు (సొరంగం)–2 వద్ద పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం ట్రాలీలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1లోకి ప్రవేశించి, టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్) ద్వారా సొరంగం తవ్వకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ నమూనా చూపుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఐదేళ్లలో 600 మీటర్లు.. ఎనిమిది నెలల్లో 1.4 కి.మీల సొరంగం తవ్వకం ‘ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత పనులు పడకేశాయి. ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తొలి దశను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించాం. గడువులోగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ఐదేళ్లుగా పనులు ఎందుకు ముందు సాగలేదని అధికారులను ప్రశ్నించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో టన్నెల్–1 పనులు 15.2 కిలోమీటర్ల నుంచి 15.8 కిలోమీటర్ల వరకు అంటే 600 మీటర్ల మేర మాత్రమే చేయగలిగామని అధికారులు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో టన్నెల్–1 పనులను 15.8 కిలోమీటర్ల నుంచి 17.2 కిలోమీటర్ల వరకు అంటే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్–1ను ఎట్టిపరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. నెలకు 200 మీటర్ల చొప్పున టన్నెల్ను తవ్వుతున్నామని, జూన్–జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో టన్నెల్–2 పనులు 410 మీటర్లే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొల్లంవాగు మీదుగా వెలిగొండ టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేయడానికి సాగుతున్న హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనుల గురించి సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. హెడ్ రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ సక్రమంగా చేయక పోవడంతో వాటిని మరొక కాంట్రాక్టర్కు అప్పగించామని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయంలోనీటి మట్టం 850 అడుగులకు తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10.75 కిలోమీటర్ల నుంచి 11.16 కిలోమీటర్ల (410 మీటర్లు) వరకు మాత్రమే చేశారని అధికారులు వివరించారు. టన్నెల్–2ను రెండు వైపుల నుంచి తవ్వడం ద్వారా శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చేసిన సూచనలకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల కొరత రానివ్వం.. పనులు వేగంగా చేయండి వెలిగొండ ప్రాజెక్టు పనులకు అవసరమైన 2,884.13 ఎకరాల భూమిని మార్చి 31లోగా సేకరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయని.. ఆ గ్రామాల పరిధిలోని 4,617 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారని నివేదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. అందుకు అవసరమైన రూ.1,860 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత కాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అవసరమైతే ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి వేరే కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించాలని సూచించారు. పుల్లలచెరువు మండలంలో టీ–5 బ్లాక్ వద్ద అదనంగా కాలువ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే పనులు చేపట్టడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, వాటిని మంజూరు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈస్ట్రన్ కెనాల్ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, వేణుగోపాల్, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘వెలిగొండ’ పనులపై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్ష
-
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం జగన్