-
ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!
అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్ పోల్ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు. మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్ కీ బాత్లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్ఎన్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది. ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు. అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ దందాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్ ఇమేజ్ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది. అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్ను నియమించి కమీషన్ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!! ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కృత్రిమ గాలులు పనిచేస్తాయా?
ఇంకో నాలుగు రోజులు మాత్రమే! ఈనెల 30న తెలంగాణ రాష్ట్రం మూడో సర్కార్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. మూడో అసెంబ్లీ ఎన్నిక ముక్కోణపు పోటీగా మారడం విశేషం. ఎన్నికలన్న తర్వాత సర్వేలు, ప్రజాభిప్రాయ నాడీ జ్యోతిష్యాలు, ‘గాలి’ వేగాన్ని అంచనా వేసి చెప్పడాలు... ఇటువంటి వన్నీ షరా మామూలే! ఒకదానికొకటి పొంతన లేకుండా రకరకాల సర్వే ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఇలా పొంతన లేకపోడానికి కారణం... ఇందులో కొన్ని ‘ఉద్దేశపూర్వకమైనవి’ కావడమే! అన్ని రకాల సర్వే ఫలితాలను క్రోడీకరిస్తే, ఒక మూడు అంశాలు నిగ్గుతేలుతున్నాయి. ఒకటి – ఈసారి అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పోటీని ఎదు ర్కొంటున్నది. కొన్ని జిల్లాల్లో పాత బలాన్ని కాపాడుకున్నట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో బలహీన పడినట్టు స్పష్టమవుతున్నది. రెండు – కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే పుంజుకున్నది. అయితే ఈ పరిణామం కొన్ని ప్రాంతాలకే పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా కనిపించడం లేదు. మూడు – బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బీజేపీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇదే ప్రకటన ఒక రెండు మూడు నెలల ముందు చేసి ఉన్నట్లయితే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణలుగా చెప్పడం రివాజు. కానీ ఇప్పటి రాజకీయ పరిస్థితికి ఆ విభజన నప్పడం లేదు. రాష్ట్రానికి పడ మటి దిక్కున ఉన్న గ్రేటర్ హైదరాబాద్ (24), మెదక్ (10), నిజామాబాద్ (9) ప్రాంతాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగానే కనిపిస్తున్నది. మొత్తం సీట్లు 43. ఇందులో ఆనవాయితీగా మజ్లిస్ గెలిచే సీట్లు 7 తీస్తే మిగిలినవి 36. ఇందులో అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంటుందనీ, రెండో స్థానం కోసం బీజేపీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కోవచ్చనీ క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తున్నది. ఖమ్మం జిల్లాను ఉత్తర తెలంగాణగానూ, నల్లగొండను దక్షిణ తెలంగాణను పరిగణిస్తుంటారు. సరిహద్దు జిల్లాలైన ఈ రెండింటినీ కలిపి తూర్పు తెలంగాణగా భావించవచ్చు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 22 సీట్లున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు. బీజేపీ పరిస్థితి అట్లా కాదు. వాయవ్య దిక్కు ఎంట్రీ పాయింట్లో (ముధోల్, ఆదిలాబాద్, బో«ద్, నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల) బలంగా కనిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా పాకెట్ల మాదిరిగా విస్తరించింది. బీఆర్ఎస్ స్థావరంలో 36 సీట్లు ఉండటమే గాక రెండో స్థానం కోసం బీజేపీ నుంచి గట్టి పోటీని కూడా కాంగ్రెస్ ఎదుర్కోవలసి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ స్థావరంలోని 22 సీట్లలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలవగలిగే సీట్లు ఆరు న్నాయి. మరో ఆరు సీట్లలో నువ్వా నేనా అనే పరిస్థితులున్నాయి. ఇది అధికార పార్టీకి సానుకూల అంశం. ఈ స్థావరాల నుంచి బయల్దేరి ఉమ్మడి జిల్లాలైన మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీట్ల కోసం మూడు పార్టీలు వేటాడవలసి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాపై మూడు పార్టీలకూ భారీగానే ఆశలున్నాయి. గాలివాటం ఎటువైపున్నా మూడు పార్టీలు కూడా కచ్చితంగా బోణీ కొట్టే అవకాశం ఉన్నది. బొగ్గు బెల్ట్లో కాంగ్రెస్ బలంగా ఉన్నదనీ, మిగిలిన ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు అవకాశాలున్నాయనీ స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థి కూడా బలంగా కనిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషకు కూడా రాష్ట్రవ్యాప్త గుర్తింపు లభించింది. రెండు ప్రధాన పార్టీల తరఫున రెడ్డి,వెలమ కులాలకు చెందిన ఇద్దరు బడా బాబులు హోరాహోరీ తలపడుతున్న చోట ఐఐటీ గ్రాడ్యుయేట్, పాతికేళ్ల పద్మశాలి యువతి గెలిస్తే బాగుండను కునే వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. ఇటువంటి కలలు ఫలించాలంటే మన ప్రజాస్వామ్యంలో చాలా పరిణతి రావాలి. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే గదా ఏదో ఒకరోజు ఆ నవయుగం ఆవిష్కృత మయ్యేది. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది. అయినా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నట్టు జరుగు తున్న ప్రచారం నేపథ్యంలో ఈ జిల్లాను హోరాహోరీ పోటీ కోటాలో వేయాల్సి వస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రెండు మూడు సీట్లలో సంచలనం సృష్టిస్తామని బీజేపీ నాయకత్వం చెప్పుకొస్తున్నది. అందుకు అను గుణంగానే చాప కింద నీరు మాదిరిగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ పాలకుర్తి నియోజ కవర్గం. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఓటమి ఎరగకుండా అనేక పోరాటాల్లో గెలిచిన వార్ వెటరన్ ఎర్రబెల్లి. కానీ ఈసారి ఒక పాతికేళ్ల యువతితో హోరాహోరీ పోటీని ఎదుర్కొంటు న్నట్టు వార్తలు వస్తున్నాయి. అమె రికాలో చదువుకొని వచ్చిన యశస్విని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తున్నది. పద్నాలుగు నియోజకవర్గాలున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లో కొల్లాపూర్ నియోజకవర్గం ఉన్నది. రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన ఇద్దరు దొరలు అక్కడ తలపడుతున్నందుకు కాదు. ఒక నిరుపేద దళిత యువతి... పేరు కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క. అక్కడ బరిగీసి నిలబడింది. ఏ పార్టీ అండ లేదు. ఇండిపెండెంట్గానే! పుట్టెడు పేదరికం కారణంగా చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి అండగా ఉంటూ ఓపెన్ యూని వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించ లేదు. నాలుగు బర్రెలు కొనుక్కొని పోషిస్తూ సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క పేరుతో ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిరుద్యోగ యువత తరఫున తాను నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక సాధనంగా మలుచుకోవాలని నామినేషన్ వేసింది. ఈమె పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం నలు మూలల నుంచి యువతీ యువకులు తండోపతండాలుగా కొల్లాపూర్కు వెళ్లి బర్రెలక్కకు మద్దతును ప్రకటిస్తున్నారు. దీనర్థం అక్కడ బర్రెలక్క గెలుస్తుందని కాదు. అంత ఆశలేదు. ఒకవేళ కొల్లాపూర్ ప్రజల్లో హఠాత్తుగా ఏదో ఒక నవ చైతన్యం ప్రవేశించి బర్రెలక్క గెలిస్తే అదొక యుద్ధ ప్రకటనే! నోట్ల కట్టల ప్రజాస్వామ్యానికి రోజులు దగ్గర పడినట్టే! ఉమ్మడి పాలమూరులో బీజేపీ మూడు సీట్లపై ఆశలు పెట్టుకున్నది. కర్ణాటక సరిహద్దుల్లోని ఒక నియోజకవర్గాన్ని, గతంలో రెండుసార్లు గట్టి పోటీ ఇచ్చిన మరో నియోజక వర్గాన్ని ఖాయంగా గెలుస్తామని ఆ పార్టీవారు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ఢంకా బజా యించి చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనం బాగా బలంగా ఉంటే తప్ప బీఆర్ఎస్ ఆధిక్యాన్ని తగ్గించడం ఈ జిల్లాలో సాధ్యం కాకపోవచ్చు. బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి ఖాయంగా వస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అందుకు దోహదపడే కారణ మేమిటో స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కారణమా? లేక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూసి జనం మురిసిపోతున్నారనుకోవడమా? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమైతే కాంగ్రెస్కే జనం ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉన్నది కదా! పైగా బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని బీజేపీ చేసిన వాగ్దానం మెజారిటీ రాష్ట్ర ప్రజలను ఆకర్షి స్తున్నప్పుడు కాంగ్రెస్నే ప్రత్యామ్నాయంగా ఎందుకుఎంచుకోవాలి? కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల సానుకూలత పెల్లుబకడానికి అందులో ఏమున్నది? కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలనే కొంచెం అటూ ఇటూ మార్చి అచ్చేశారు. ఆయన ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువ ముట్ట చెబుతామని చెప్పారు. కాలాను గుణంగా ఎవరైనా ఈ పెంపుదల చేయాల్సిందే. అంతకుమించిన మౌలికమైన మార్పుల ప్రతిపాదన ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. అంతకంటే బీజేపీ చెప్పిన బీసీ ముఖ్యమంత్రే వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పును సూచించే హామీ అవుతుంది. కనుక కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రజాస్పందన ఉన్నదనేది అవాస్తవం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని అనుకుంటే ప్రతిపక్షానికి జరిగే లబ్ధిలో బీజేపీ కూడా కచ్చితంగా భాగస్వామి అవుతుంది. ఆ పార్టీ చెబుతున్నట్టు రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రభంజనంలా లేకుండా సాధారణ స్థాయిలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలే ఉంటాయి. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతోకొంత వ్యతిరేకత వ్యక్తమవడం సర్వసాధారణం. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రచార మవుతున్నంత తీవ్రస్థాయిలో ఉన్నదా అనేది సందేహాస్పదం. అంత తీవ్ర వ్యతిరేకతకు తగిన ప్రాతిపదిక లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్లో వ్యాపార ప్రయోజనాలున్న కొందరు కోటీశ్వరులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పించే ఉపాయాలను అన్వేషిస్తున్నారు. సలహాలు – సంప్రతింపుల కోసం యెల్లో మీడియా పెద్దలను కూడా తరచూ కలుస్తున్నట్టు ఇప్పుడిప్పుడే వార్తలు బయట కొస్తున్నాయి. ఈ వ్యవహారానికి అందుబాటులో ఉండి మార్గదర్శనం చేయడం కోసమే చంద్రబాబు లేని జబ్బులు తెచ్చుకొని మెడికల్ బెయిల్ సంపాదించారన్నది నిర్ద్వంద్వంగా రూఢి అవుతున్నది. ఆయన రహస్య భేటీలు నిరాఘాటంగా జరిగిపోతున్నాయి. ఈ మొత్తం స్కీములో భాగంగానే తెలంగాణ రాజకీయ వాతావరణంలోకి కృత్రిమ పవనాలను ప్రవేశ పెట్టినట్టు తెలుస్తున్నది. కొన్ని సర్వే సంస్థలను వశపరచు కొని అనుకూలమైన రిపోర్టులను ప్రచారంలో పెట్టారు. సరికొత్త ఎత్తుగడగా రూమర్ స్ప్రెడర్లను (వదంతుల వ్యాపకులను) రంగంలోకి దించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఈ రూమర్ స్ప్రెడర్స్ తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ వేవ్ రాబోతున్నదని, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని సోషల్ మీడియా ప్రచారానికి ఆజ్యం పోశారు. దసరా సెలవులను కూడా ఈ ప్రయోజనానికి వాడు కున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే పిల్లలకు ఉద్యోగాలు రావనే ప్రచారం విస్తృతంగా చేశారు. క్షేత్రస్థాయిలో జరుగు తున్న ఈ వ్యతిరేక ప్రచారాలను అధికార వర్గాలు గానీ, అధికార పార్టీ కార్యకర్తలు గానీ పసిగట్టలేకపోయారు. ఒక స్వార్థ వ్యాపార – రాజకీయ ముఠా రూమర్ స్ప్రెడర్స్నూ, సోషల్ మీడియా సైన్యాన్నీ రంగంలోకి దించి బీజేపీ సింగిల్ డిజిట్ దాటదనీ, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదనీ గత రెండు మాసాలుగా పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా గాలి వీస్తున్నదనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ కృత్రిమ ‘గాలుల’ ప్రభావం ప్రజల మీద ఏ మేరకు పడిందనే విషయం మరో వారం రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. ఎన్నికల ఫలితాలను హైజాక్ చేయడానికి ఈ ముఠా ఇంత తీవ్రంగా ఎందుకు ప్రయత్నిస్తున్నదో, ఇన్ని వ్యయ ప్రయాసలకు ఎందుకోర్చుకుంటున్నదో ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం!
సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయించును. ఇది ఒక నిత్య సత్యం. పేద ప్రజల సాధికారతను పెత్తందార్లు అంగీకరించరు. ఇది కూడా అటువంటిదే. అనుదిన సత్యమే. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక... ఈ సుభాషితాన్ని ‘ఈనాడు’ పత్రికవాళ్లు అప్పుడెప్పుడో బ్రాండ్ క్యాంపెయిన్కు వాడుకున్నట్టు గుర్తు. ఇప్పుడు పైన చెప్పిన రెండో సత్యాన్ని నిలబెట్టడం కోసం ఆ పత్రిక యాజమాన్యం ‘త్యాగాలకు’ కూడా సిద్ధమైంది. ఇంటింటికీ ఉచితంగా పత్రికను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ‘సత్యం నినదించు గాక’ అనే క్యాంపెయిన్ను ‘ఈనాడు’ చాలాకాలం కిందటే నిలిపివేసింది. చంద్రబాబు–యెల్లో కూటమి అండ్ సన్స్ ప్రయోజనాలకు అనుగుణంగా నిత్యం అసత్యాలను అచ్చొత్తడమే పనిగా పెట్టుకొన్నందున ఆ క్యాంపెయిన్ను కొనసాగించడానికి వాళ్లకే సిగ్గేసింది కాబోలు. ఏదో సినిమాలో మెడలో రుద్రాక్ష మాల ఉన్నంత వరకూ అల్లు అర్జున్ నాన్వయలంట్గా ఉండిపోతాడు. ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మాలను తీసి పక్కన పెడతాడు. ఈ తీసుకోవడం, వేసుకోవడం గొడవంతా ఎందుకని ‘ఈనాడు’ వాళ్లు సత్యం నినదించుగాక అనే క్యాంపెయిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం సమీపిస్తున్నకొద్దీ అసత్య కథనాల వంటకాన్ని ‘ఈనాడు’ భారీగా పెంచేసింది. పేజీకో పొయ్యి చొప్పున వెలిగించి నిత్యాగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్నది. అసత్య కథనాలతో అధికార పక్షం మీద బురద జల్లడానికే అది పరిమితం కాలేదు.మానవ నాగరికత వికాసానికి మోకాలొడ్డే సాహసం చేస్తున్నది. ప్రజాస్వామ్య పరిణతి ప్రస్థానాన్ని వెక్కిరించే విదూషక పాత్రను పోషిస్తున్నది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనే తింగరి చేష్టకు తెగబడుతున్నది. కష్టజీవులు తలపెట్టిన సాధికారత యజ్ఞంపై మారీచ మాయలు ప్రయోగిస్తున్నది. మహిళలూ – పేదవర్గాల సాధికారత అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హామీ. ఈ హామీని అమలుపరచడంలో విఫలమైన ప్రభుత్వా ధినేతలందరూ ఈ విషయంలో దోషులే. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ కల్పించడం ద్వారానే క్రమంగా సాధికారత సాధ్యమవుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ క్రమం నెమ్మదించింది. ఇన్నాళ్లకు ఇప్పుడొక రాష్ట్ర ప్రభుత్వం దాని వేగాన్ని పెంచే పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు, అన్నివర్గాల మహిళలకు ఒక్కొక్కటిగా ఆర్థిక రాజకీయ సాంఘిక హోదాలను కట్టబెడుతూ వెళుతున్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని సాధికారత పథంలో పరుగు తీయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో ఒక జన జాగృత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాన వేసుకున్న మాట నిజమే. ఆ పార్టీ ప్రభుత్వమే, ఆ పార్టీ అధినేతే స్వయంగా పేదవర్గాల సాధికారతను ఒక పవిత్ర లక్ష్యంగా పరిగణిస్తున్నప్పుడు అదే పార్టీ ఈ కార్యక్రమానికి ముందు నడవడం అసహజమేమీ కాదు. వెనుకబడిన వర్గాలను వెన్నెముక వర్గంగా మలిచే కార్యక్రమం వల్ల పాలక పార్టీ పలుకుబడి మరింత పెరుగుతుందనడం కూడా వాస్తవమే. ఈ ఒక్క కారణం చాలదా యెల్లో మీడియా కళ్లు మంటెక్కడానికి! దానికి తోడు శ్రామిక వర్గాల సాధికారతను సిద్ధాంతపరంగానే చంద్రబాబు కూటమి వ్యతిరే కిస్తున్నది. కబుర్లు ఏవైనా చెప్పవచ్చు. ఆచరణ ఏమిటన్నదే కీలకం.వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సాధికారతకు బాటలు వేసే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పార్టీ – యెల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేకించాయి. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను వ్యతిరేకించాయి. ఇప్పటికీ అభాసుపాలు చేయ డానికి, విఫలం చేయడానికి ప్రయ త్నిస్తున్నాయి. మహిళల పేరు మీద సొంత ఇల్లు కట్టించే కార్య క్రమాన్ని వ్యతిరేకించాయి. కోర్టు మెట్లెక్కాయి. అమరావతి శాసన రాజధాని పరిధిలో బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల పట్టా లిస్తే ఘోరమైన, క్రూరమైన అప చారం జరిగినట్టు గావుకేకలు పెట్టాయి. బాబు గార్లు ఉండాల్సిన చోట బడుగులు నివసించడమేమిటని వాదించాయి. కుల భ్రష్టమైపోతారట, మైలపడిపోతారట! ఇదే విషయాన్ని పాలిష్ చేసి చెప్పారు. జనాభా సమ తుల్యత దెబ్బతింటుందని! కోర్టులో కూడా ఇదే వాదన చేశాయి. పేదింటి ఆడబిడ్డల చదువు మధ్యలో ఆగిపోకుండా, బాల్య వివా హాల రుగ్మతను రూపుమాపే విధంగా పెళ్లి కానుకల కార్యక్రమాన్ని డిజైన్ చేస్తే కూడా ఈ కూటమి మండిపడింది. కారణం ఆడపిల్లల మీద అభిమానం కాదు. వారి అభివృద్ధి మీద ద్వేషం. అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఇలాగైతే ఈ రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టారు. ఖర్చు చేయడానికి ప్రజల చేతిలో డబ్బులుంచాలని అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తలు చెప్పినా మన యెల్లో కూటమికి తలకెక్కలేదు. జనం సొమ్ముతో సొంత వ్యాపారాలు చేసుకునే మన ‘చీ’ట్ ఫండ్ ముఠాకు అభిజిత్ ముఖర్జీలు, అమర్త్యసేన్లతో ఏం పని? చివరకు ఆర్థిక వేత్తలు చెప్పిందే నిజమైంది. జీఎస్డీపీ గ్రోత్ రేట్లో ఏపీ అగ్రగామిగా నిలబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమవడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది. ఆత్మ విశ్వాసం ఇనుమడించింది. పేద వర్గాల ప్రజలు సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం మీదా చంద్రబాబు – యెల్లో ముఠా దాడులు చేస్తూనే వస్తున్నది. సాధికారత కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా మలిచి ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధమవగానే ‘ఈనాడు’ పత్రిక అన్ని విలువల్నీ వదిలేసింది. దిగంబరంగా నిలబడింది. చివరకు ఉచిత పత్రిక అవతారమెత్తింది. ‘సాక్షి’ చదివే పాఠకులందరికీ ఫ్రీగా పత్రికను పంచడం మొదలుపెట్టింది. ఇదితొలి దశ. క్రమంగా పాఠకులందరికీ పంచడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ‘ఈనాడు’ పాఠకులుగా వున్నవారు వచ్చేనెల బిల్లు కట్టే పరిస్థితి లేదు. పక్కింట్లో ఫ్రీగా వేస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బిల్లు కట్టాలి. చివరికి ఫ్రీగా పేపర్ వేయించుకోవడానికి కూడా నెలకు రెండు ప్రియా పచ్చడి సీసాలు గిఫ్టుగా ఇవ్వాల్సిన దుఃస్థితిలోకి మన ఉచిత పత్రిక కూరుకొనిపోవచ్చు. స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన వేళ ఈ విషాదం దాని స్వయంకృతం. సామాజిక సాధికారత యాత్ర మొదలవగానే ఫ్రీ పేపర్ కార్యక్రమాన్ని ఈ పత్రిక ప్రారంభించింది. ఈ కార్యక్రమం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందనేది ఒక కారణం కావచ్చు. అసలు కారణం పేదల, మహిళల సాధికారతకు యెల్లో కూటమి వ్యతి రేకమన్న విషయం గతంలో అనేక మార్లు రుజువైంది. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన వారెవరు? చంద్రబాబు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వారెవరు? చంద్రబాబు. దళితులు... మీకెందుకురా అధికారాలు, రాజకీయాలు... అవన్నీ మేం చూసుకుంటామని బోధించిన వారెవరు? బాబు శిష్యపరమాణువు చింతమనేని ప్రభాకర్. కోడలు మగపిల్లాడిని కంటా నంటే అత్త వద్దంటుందా అని మీడియా సమావేశంలోనే ప్రవ చించిన వారెవరు? చంద్ర బాబు. మహిళా అధికారి పట్ల వందలాదిమంది సాక్షిగా దుశ్శాసనుడిలా ప్రవర్తించింది ఎవరు? చంద్రబాబు శిష్య పరమాణువు చింతమనేని ప్రభాకర్. బీసీల తోకలు కత్తిరి స్తానని బెదిరించిందెవరు?చంద్రబాబునాయుడు. ఎస్సీ పిల్లలు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరని తిట్టి పోసిందెవరు? చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదినారా యణరెడ్డి. ముస్లిం మైనారిటీ లకూ, గిరిజనులకూ మంత్రి పదవి లేకుండా చేసిందెవరు? చంద్రబాబు నాయుడు. రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలి ఏర్పాటును అటకెక్కించిందెవరు? చంద్రబాబు నాయుడు. ఈ రకమైన దుర్నీతిని ప్రశ్నించకుండా, ప్రస్తావించకుండా, ఎండ గట్ట కుండా ఆమోదముద్ర వేసిన ప్రముఖ పత్రికారాజము ఏది? మన ఉచిత పత్రిక, దాని తోకపత్రిక. ఇటువంటి ముఠా ప్రజా సాధికారతను ఏ రకంగా సహిస్తుంది? రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రోజూ వేలాదిమంది బహు జనులు సాధికారత కోసం నినదిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. సభల్లో సగటున ఇరవై నుంచి పాతికవేల మంది చొప్పున మూడు ప్రాంతాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. ఉష్ట్ర పక్షికి భయం వేసినప్పుడు దాని తలను ఇసుకలో దాచేస్తుందట! అప్పుడేమీ కనపడదు. భయం తగ్గిన తర్వాత మళ్లీ బయటకు తీస్తుంది. ఉచిత పత్రికకు కూడా అటువంటి భయమేదో ఉన్నట్టుంది. బాటలు నడిచీ, పేటలు కడచీ, కోటల న్నిటినీ దాటుకుంటూ వచ్చే శ్రామిక జనాన్ని చూస్తే భయం. అందుకే సభ ప్రారంభం కాకముందూ, ముగిసిన తర్వాత ఫోటోలు తీసి అచ్చేసుకొని సంబర పడుతున్నది. ఉష్ట్రపక్షి మాదిరిగా ఉచిత పత్రిక దాని తలను ఎక్కడో దాచుకుంటే నిజం దాగుతుందా? ఎన్నో టీవీ చానెళ్లు, పత్రికలు అసలు విషయాన్ని చూపెడుతున్నాయి కదా! అయినా సరే – నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆశల పల్లకిలో కాంగ్రెస్, అడ్వాంటేజ్ బీఆర్ఎస్!
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతోపాటు తెలంగాణాలో కూడా విజయం సాధిస్తే ‘ఇండియా’ కూటమిలో తన నాయకత్వానికి గౌరవం పెరుగుతుందనీ, ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవచ్చనీ ఆ పార్టీ వ్యూహం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు. మధ్యప్రదేశ్లో కూడా సులభంగానే గెలుస్తామనే ధీమా ఆ పార్టీలో కనబడింది. నిన్నటి పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేయ వచ్చని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ పరిస్థితి ఇట్లా ఉంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే సంప్రదాయమున్న రాజ స్థాన్లో కాంగ్రెస్ గెలవడం మాత్రం అనుమానమే! రాజస్థాన్ను కోల్పోతే ఆ లోటును తెలంగాణతో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. కర్ణాటక ఎన్నికలు, బండి సంజయ్ను నాయకత్వం నుంచి తప్పించడం జరిగిన తర్వాత బీజేపీ బలహీనపడినట్టు కనిపించడం కూడా కాంగ్రెస్ ఆశలకు ఊపిరిపోసింది. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై సహజంగానే వ్యతిరేకత ఉంటుందనీ, అది తమకు కలిసివస్తుందనీ కూడా కాంగ్రెస్ అంచనా వేసుకున్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా ఒక భారీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల చేతి గుర్తు మీద వైకుంఠాన్ని చూపడానికి కూడా అది వెనకాడలేదు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలను, ఐదు డిక్లరేషన్లను, రెండు లక్షల ఉద్యోగాలను, ఇంకా అనేక హామీలను ప్రకటించింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, ఏపీలో చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తు గ్యారెంటీ... ఈ గ్యారెంటీ మాటలు మేనిఫెస్టోల్లో కొత్తగా చేరినట్టు కనిపి స్తున్నవి. కాంగ్రెస్ – తెలుగుదేశం మధ్యన ఈ ‘గ్యారెంటీ’ లింకేదో ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయ – వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. రైతుబంధు, రైతు బంధు పెంపు కూలీలకు వర్తింపజేయడం, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్... ఇంత వరకు లెక్కేసినా అదనంగా ఏటా 60 నుంచి 70 వేల కోట్లు అవసర మవుతాయి. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తే అదే 38 వేల కోట్లు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున పది లక్షల ఇళ్లు కేటాయిస్తే 50 వేల కోట్లవుతుంది. ఇలా ఒకసారి పెట్టే ఖర్చు ఈ రెండు పద్దులకే 88 వేల కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్లు కూడా చంద్రబాబు భాషలోనే సంపద సృష్టిస్తా మని చెబుతున్నారు. ఇంతకు ముందు ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు మాయం చేసిన ప్రజాధనం 5 లక్షల కోట్లుగా లెక్క తేలింది. కానీ సృష్టించిన సంపద మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విష యాన్ని గమనంలో ఉంచుకోవలసింది. కర్ణాటకకు ఒక తటస్థ బృందాన్ని పంపించి ఐదు గ్యారెంటీల అమలుపై అధ్యయనం చేసి ఇక్కడ ఆ నివేదికను విడుదల చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి విశ్వస నీయత పెరిగేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటక ఐదు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన పథకం ‘శక్తి’ మాత్రమే! ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరే ‘శక్తి’. ‘అన్న భాగ్య’ ఇంకో పథకం. రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని వారికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామన్నది ఎన్నికల గ్యారెంటీ హామీ. ఐతే ఐదు కేజీలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు. మరో ఐదు కేజీలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నగదు బదిలీలో జాప్యం జరుగు తున్నదనీ, కొందరికి అందడం లేదనీ ఆరోప ణలు వస్తున్నాయి. ప్రతి మహిళకు నెలకు రెండు వేలు అందజేసే పథకం పేరు ‘గృహ లక్ష్మి’. రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభించారు. కోటీ ఆరు లక్షల మంది లబ్ధిదారుల్లో 85 నుంచి 90 శాతం మందికి వరసగా మూడు నెలలపాటు నగదు బదిలీ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేసే ‘గృహజ్యోతి’ పథకం మాత్రం కర్ణాటకలో కల్లోలం సృష్టించింది. ఈ పథకం ప్రారంభానికి ముందు రైతుల పంపుసెట్లకు ఏడు గంటల విద్యుత్ను ఇచ్చేవారు. ఇప్పు డది నాలుగు నుంచి ఐదు గంటలకు పడిపోయింది. బెంగళూరు నగరంతో సహా పగటిపూట కరెంట్ కట్లు పెరిగిపోయాయి. ‘గృహజ్యోతి’ రాష్ట్రంలో చీకట్లు నింపిందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. ‘యువ నిధి’ పేరుతో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు. ఇంకా అది ప్రారంభానికి నోచుకోలేదు. విద్యుత్ సరఫరా అంశంపై అధికార బీఆర్ఎస్ పార్టీ సవాళ్లను కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కో లేకపోతున్నది. అధికార పార్టీ విసిరిన ‘పవర్’ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చిక్కుకొని నష్టపోయిందనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలహీనపడిన పార్టీ పెద్దగా పుంజుకున్నట్టు ఇప్పటికీ కనిపించడం లేదు. బీజేపీ ప్రభ తగ్గిన తర్వాత దాని విస్తృతి కొంచెం పెరిగినట్టు కనిపిస్తున్నా... 90 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నది. సాధారణ మెజారిటీకి అవసరమైన యాభై శాతం స్ట్రయిక్ రేటును సాధించినప్పటికీ ఆ పార్టీ అవసరమైన సీట్లకు చాలా దూరంలోనే ఉండిపోతుంది. తాను గట్టిగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో మూడింట రెండు వంతుల స్ట్రయిక్ రేటు సాధించగలగాలి. ఆ స్థాయి స్ట్రయిక్ రేటును ‘వేవ్’గా పరిగణిస్తారు. అటువంటి ప్రభంజనం ఏదీ ఉన్నట్టుగా ఇప్పటి వరకూ ఏ ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ కూడా గుర్తించలేకపోయింది. అధికార పార్టీకి ఉన్న మరో సౌలభ్యం దానికి మజ్లిస్ మిత్రపక్షంగా ఉండటం! ఊరు మీద ఊరు పడ్డా మజ్లిస్ పార్టీ ఏడు సీట్లకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. బీఆర్ఎస్కు ఓ ఏడు సీట్లు తగ్గినా కూడా మజ్లిస్ తోడ్పాటుతో భర్తీ చేసుకోగలదు. యాభై శాతం స్ట్రయిక్ రేటుతో కూడా ఆ మాత్రం సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోగలుగుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన సారూప్యతను కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో నలభయ్యేళ్ల లోపు ఓటర్లు ఎంతమంది ఉన్నారో దాదాపుగా అంతే సంఖ్యలో 40 ఏళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారు. వివిధ సర్వేల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల ప్రకారం 40 ఏళ్ల లోపు సమూహంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నది. మార్పు కావాలన్న అభిప్రాయం ఈ సమూహంలో వినబడుతున్నది. నలభ య్యేళ్లు దాటిన వారిలో ప్రభుత్వ అనుకూలత బలంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్తో పాటు ఈసారి బీజేపీ కూడా పంచుకోవలసి ఉంటుంది. బీజేపీ ఓటర్లలో యువతరం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్కు ప్రతికూలమైన అంశం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లనే పొందిన కాషాయ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోబోతున్నదని శాస్త్రీయమైన సర్వేల్లో వెల్లడవుతున్నది. వ్యూహాత్మకంగా 25 స్థానాలపై కేంద్రీకరించి పరివార్ శక్తులు చాపకింద నీరులాగా పనిచేసుకుంటు న్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పది సీట్లకు తగ్గకుండా గెలవాలనీ, మిగిలిన పదిహేను చోట్ల రెండో స్థానంలోనైనా నిలవాలనీ బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలించినంత మేరకు కాంగ్రెస్ బలంలో కోత పడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన 34 సీట్ల హామీని కాంగ్రెస్ నిల బెట్టుకోలేక పోవడం కూడా ఒక మైనస్ పాయింట్. బీసీల్లో ఈ పరిణామం ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్న వాళ్లు కూడా అది గెలిచే నియో జకవర్గాల పేర్లను 45కు మించి చెప్పలేక పోతున్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తున్నది. సోషల్ మీడియాలో వీరు క్రియాశీలకంగా ఉన్నందు వల్ల కాంగ్రెస్ టాక్ కొంత గట్టిగా వినిపి స్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బేరీజు వేసుకు న్నప్పుడు అధికార పార్టీ విజయానికి ఢోకా ఉన్నట్టు కనిపించడం లేదు. కాకపోతే బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆవిర్భవించ వచ్చు. ఈరోజు వరకున్న పరిస్థితి – అడ్వాంటేజ్ బీఆర్ఎస్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3 శాతం ఓట్లు సంపాదించింది. ఆ మూడు శాతం ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్ను చంద్రబాబు చేతిలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణా యూనిట్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒక సారో పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే! లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో ‘హోమ్లీ ఫీలింగ్’ను కలుగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనుకాడటం లేదు. తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇండియా టుడే’ జాతీయ న్యూస్ ఛానల్ వాళ్లు హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతోపాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రెండు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ‘1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించింద’ని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50 వేల ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథా లాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటా యనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే రెండు చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? ఎనభయ్యో దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో యెల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి యెల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను ముని గింది గంగ! తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగివుండి తీరాలి. వేరే మార్గం లేదు! ఆ దశలో చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని సృష్టించి పరుగులరాణి పంచకల్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ‘ఐటీ రంగ సృష్టికర్త అతనే’ అని డప్పు వేయించారు. ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే – చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి, తనను తాను ఐన్స్టీన్కు అన్నయ్యగా, న్యూటన్కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా! రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్ఫోన్, కంప్యూటర్ వగైరా వగైరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేక పోవడానికి యెల్లో మీడియా డప్పుల మోతే కారణం. వాస్తవానికి హైదరాబాద్లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసు కున్న దార్శనికుడు... నాటి ప్రధాని పీవీ నరసింహారావు. ‘సాఫ్ట్వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్పై ఉండే మక్కువతో మొదటి పార్క్ను హైదరాబాద్కు కేటాయించారు. ఇప్పుడు ‘సైబర్ టవర్స్’గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) శంకు స్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి, ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు, బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలిస్థానంలో ఉండవలసిన హైదరాబాద్ను బెంగళూరు అధిగమించింది. ఆ రకంగా హైద రాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం! వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావల్సినవాడ య్యారు. కనుక ఐటీని కనిపెట్టినవాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు’ అనుకున్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్నని నమ్మడం మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్ను తీసుకోవాలి కదా? విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ వాళ్లే దీన్ని గుర్తించి క్రెడిట్ను కాంగ్రెస్కు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాటపడుతున్నారు. దాని కొనసాగింపే నిన్నటి ‘ఇండియా టుడే’ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు. చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్కు కాంగ్రెస్ వాళ్లు శంకుస్థాపన చేస్తే, ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారం భంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగురోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కి.మీ. రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే! కాగితం కదిలిందీ లేదు. సర్వే జరిగిందీ లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో, 175 కి.మీ. పొడవునా నిర్మించాలని సంకల్పించి, సర్వేలను ముగించి, శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే! ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి, ‘పెద్దలా? గద్దలా..?’ పేరుతో విషప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనుక ఆయన సలహాను వైఎస్సార్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభు త్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలామందికి గుర్తే! భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90 శాతాన్ని రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుదీ కరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా వుంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం యెల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభి మానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహ రిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్ఠలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు, పాంచాల రాజైన ద్రుపదుడు బాల్యస్నేహితులు. కష్టాల్లో ఉన్న ద్రోణుడు ఒకసారి సాయం కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడట. ద్రుపదుడు అవమానించి పంపాడు. ఆ కోపాన్ని చానాళ్లపాటు ద్రోణుడు కడుపులో దాచుకున్నాడు. కురు, పాండవ రాకుమారులకు విద్య నేర్పిన తర్వాత కడుపులోని అక్కసును వాళ్ల ముందు ద్రోణా చార్యుడు వెళ్లగక్కాడు. వెంటనే అర్జునుడు బయల్దేరి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు ముందు నిలబెడతాడు. ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదుర వుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోలెడంత ఊరట. తన విజన్ను పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు. ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు. అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకూ, రాచకొండ గుట్టలకూ మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్గా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివా దాలు వగైరా వేరే అంశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్ర బాబు గురువు. చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురుపరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకూ ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి! గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయాన్నందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్తో పాటు బాబు వర్గం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారూ సుమారు 150 మంది హైదరాబాద్లోని ఓ క్లబ్లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లో భూములు కొనుగోలు చేసినవారున్నారు. ఇంకొందరు తెలుగు దేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలనీ, అందుకు అవసరమైన ‘సహకారాన్ని’ అందించాలనీ కూడా వారు తీర్మా నించినట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి. అమరావతి వెంచర్లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు రాచకొండ ప్రక టనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్ష ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది. రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు. భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు కావలసింది అరచేతిలో వైకుంఠం చూపడమే! అమ రావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ‘హస్తం’లో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే! క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నాలుగు వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28వ తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాంగ్రెస్ వెనుక అదృశ్య హస్తం!
కొన్ని సారూప్యతలు కాకతాళీయం కావచ్చు. కొన్ని కాకతాళీయంగా భ్రమింపజేసే ప్రణాళికలు కావచ్చు. 83 సంవత్సరాల వృద్ధుడైన విప్లవ కవి వరవరరావుకు కూడా హైదరాబాద్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ముంబై ఎన్ఐఏ కోర్టు అనుమతి లభించింది. అయితే ఈ అనుమతి కోసం ఆయన గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నిస్తున్నారట! చంద్రబాబు కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం హైకోర్టు నుంచి మెడికల్ బెయిల్ సంపాదించిన సంగతి తెలిసిందే. వరవరరావుకు చంద్రబాబు కంటే ఓ వారం రోజుల ముందే కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆయనకు ఆపరేషన్ కోసం ఒక వారం రోజులు మాత్రమే సమయమిచ్చారు. చంద్రబాబుకు ఆ హడావిడి లేదు. న్యాయ స్థానం ఉదారంగానే సమయాన్నిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడానికి ఒక రోజు ముందే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగిసేరోజు దాకా ఆయనకు బెయిల్ గడువు వర్తిస్తుంది. భలే టైమింగ్! రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వ్యవహారాల్లో బాబు ఆసక్తి చావలేదు. ఆయనకూ, ఆయనకు కావలసిన వారికీ అక్కడ విస్తారంగా ఆస్తులుండటం అందుకు కారణం కావచ్చు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఆయన దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా దొరక్కపోయి ఉన్నట్లయితే డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కుట్ర పన్నారట! ప్రభుత్వానికి ఉప్పందడంతో రెడ్హ్యాండెడ్గా పట్టుకోగలిగింది. హైదరాబాద్ మీద ఏపీకి పదేళ్లపాటు ఉన్న రాజధాని హక్కుల్ని వదులుకునేందుకు సిద్ధపడటంతో కేసీఆర్ ఈ కేసులో చంద్రబాబును వదిలేశారు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్తో జట్టుకట్టి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించి భంగ పడ్డారు. ఆయన ఆసక్తికి తగినట్టుగానే ఆయన ప్రస్తుత మెడికల్ బెయిల్ టైమింగ్ కూడా బాగా కుదిరింది. బెయిల్ రావడానికి రెండు రోజుల ముందు తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ను చంద్రబాబు ములాఖత్కు పిలిపించుకున్నారు. ఆ భేటీ తర్వాత జ్ఞానేశ్వర్ హైదరాబాద్కు వెళ్లి ప్రెస్మీట్ పెట్టి పార్టీకి రాజీ నామా చేశారు. ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా టీడీపీ అభిమానుల ఓట్లు కాంగ్రెస్కు వేయించాలని చంద్రబాబు ఆయనకు చెప్పారట! ఈ వైఖరి నచ్చని జ్ఞానేశ్వర్ తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇదే సమయానికి తెలంగాణ కాంగ్రెస్ వైఖరిలో కూడా మార్పులు రావడం మొదలైంది. రాయ్పూర్ తీర్మానం మేరకు బీసీలకు, మహిళలకు, యువతరానికి టిక్కెట్ల పంపిణీలో పెద్ద పీట వేయబోతున్నట్లు ఊదరగొట్టారు. బీసీలకు 34 సీట్లను కేటాయించబోతున్నట్టు రాష్ట్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. కానీ కేటాయింపు దగ్గరికొచ్చే సరికి మొండి చేయి చూపెట్టారు. ఏపీ రాజ కీయాల్లో బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్ర బాబు హెచ్చరిస్తుంటారు. తెలంగాణా కాంగ్రెస్ వాళ్లు మాత్రం నిజంగానే బీసీల తోకలు కత్తిరించేశారు. ఇప్పటివరకు ప్రకటించిన 100 సీట్లలో 20 సీట్లు మాత్రమే బీసీలకు ప్రకటించారు. అందులో నాలుగు సీట్లు హైదరాబాద్ పాతబస్తీ లోనివి! డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేని స్థానాలు. అంటే నికరంగా బీసీలకు 16 సీట్లను మాత్రమే కాంగ్రెస్ ఇచ్చి నట్టు! ప్రకటించవలసిన సీట్లు 19. అవన్నీ బీసీలకు ఇస్తేనే కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నట్టు! కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మరో నాలుగు కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టడంతో అలిగి ఆఫీసుల్లో కూర్చున్న కమ్యూనిస్టు ముత్తయిదువలను కాంగ్రెస్ వాళ్లు బొట్టు పెట్టి మరీ పిలుచు కొచ్చారు. కనీసం చెరో రెండు సీట్లను వాయనంగా ఇస్తామని చివరిదాకా నమ్మబలికారు. ఆఖరు నిమిషంలో చెరొకటే ఇస్తామని చెట్టెక్కడంతో అవమానంగా భావించిన సీపీఎం కాంగ్రెస్తో తెగదెంపులు ప్రకటించింది. సీపీఐ మాత్రం ఆ ఒక్కటి చాలనే నిర్ణ యానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికీ, యువనేతలకూ టిక్కెట్ల పంపి ణీలో చేయిచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారికి బదులుగా దాదాపు 35 మంది పారాచూటర్లకు (అప్పుడే పార్టీలోకి వచ్చినవారు) టిక్కెట్లు కేటాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలనే నిర్ణ యంతో రాయ్పూర్ డిక్లరేషన్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే పదేళ్లుగా అధికారంలో వుండి బాగా నునుపుదేలి ఉన్న బీఆర్ఎస్ గుర్రాలను ఈ కొత్త గుర్రాలు ఢీ కొట్ట గలుగుతాయా? కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్టు వారికి అనుకూలమైన గాలి వీస్తున్నట్టయితే బలిసిన అభ్యర్థులు దేనికి? రాయ్పూర్ డిక్లరే షన్కు కట్టుబడి ఉండవచ్చు కదా! అభ్యర్థుల ఎంపికకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ వివరణలు సంతృప్తికరంగా లేవు. వారి నిర్ణయాలను వారే తిరగదోడటం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉన్నట్టు తోస్తున్నది. పోస్ట్ ఎలక్షన్ ‘అవసరాలను’ కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. 1994 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు–రామోజీ ద్వయం ఈ రకమైన వ్యూహాన్ని అమలుచేసింది. వెన్నుపోటు ఘట్టంలో ఈ వ్యూహం వారికి ఉపకరించింది. ‘గెలుపు గుర్రాల’ ఎంపికలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలను ప్రామాణికంగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. రాయ్పూర్ డిక్లరేషన్ తయారు చేయడంలో కూడా సునీల్ పాత్ర ఉందనే ప్రచారం ఉన్నది. తన డిక్లరేషన్కు విరుద్ధంగా తానే అభ్యర్థులను ప్రతిపాదిస్తాడా? ఇంకేదైనా కారణం ఉన్నదా? సునీల్ కనుగోలు మనవాడే! బళ్లారిలో పుట్టి పెరిగిన తెలుగువాడు. ఆంధ్రరాష్ట్రంతో సామాజిక బంధాలు – బాంధవ్యాలు ఉన్నవాడేనని చెబుతారు. రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నదట! తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున పనిచేయాలనే ఆలోచన కూడా ఉన్నదంటారు. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తన మార్గదర్శకాలను తానే ఉల్లంఘించడం కోసం సునీల్ కనుగోలు పేరును వాడేసుకుంటున్నది. చంద్రబాబు మెడికల్ బెయిల్పై విడుదలై హైదరాబాద్కు చేరుకున్న రోజున జూబ్లీహిల్స్లోని ఓ క్లబ్లో ఒక భారీ పార్టీ జరిగిందట! సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన సుమారు 150 మంది బాబు అనుయాయులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అందులో చర్చ జరిగిందట! చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఛోటా, బడా నేతలు ‘సెటిలర్లందరూ ఈసారి కాంగ్రెస్కే ఓటేస్తార’ని బడాయి కబుర్లు చెప్పడం వింటున్నాము. వాస్తవం ఏమిటంటే ఆంధ్ర సెటిలర్లలో చంద్రబాబు సామాజిక వర్గం వారి జనాభా కేవలం ఇరవై శాతం మాత్రమే. మిగిలిన ఎనభై శాతం జనాభాలో అత్యధికులు ఈ వర్గం రాజకీయ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధ అభిప్రా యాలతో ఉంటారు. కానీ సెటిలర్లందరి తరఫున వీరు చేస్తున్న ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచే అవకాశాలే ఎక్కువ. 25 అసెంబ్లీ సీట్లున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ బాగా బలపడిందని జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సీఎస్డీఎస్కు చెందిన సంజయ్ కుమార్ ‘ఇండియా టుడే’ ఛానల్లో మాట్లాడుతూ మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోతున్నట్టు చెప్పారు. ‘టైమ్స్ నౌ’లో నావికా కుమార్ కూడా తమ సర్వేలో అటువంటి ఫలితమే వచ్చిందని చెప్పారు. ఒక్క సీ–ఓటర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను అంచనా వేస్తున్నది. కానీ ఆ సంస్థ ట్రాక్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి ఉపకరి స్తున్న మాట యథార్థమే. కానీ విజయ తీరాలను చేరడానికి కాంగ్రెస్ అనేక అడ్డంకులను అధిగ మించవలసి ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అభిమానించే బీసీల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించ వలసి ఉన్నది. అంతర్గత కుమ్ము లాటలను అధిగమించవలసి ఉన్నది. అన్నిటినీ మించి కాంగ్రెస్ గెలిస్తే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరన్న నమ్మకం ఓటర్లకు కలగాలి. అప్పుడు కూడా బీజేపీ ఓటు శాతం సింగిల్ డిజి ట్కు పరిమితమైతేనే కాంగ్రెస్ బలమైన పోటీదారుగా రంగంలో ఉంటుంది. ఈలోగా బిడ్డను కనా ల్సిన తెలంగాణ కాంగ్రెస్కు బదులుగా చంద్రబాబు వర్గం తానే పురిటి నొప్పులు పడతానంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భావజాలం గీసిన భూమధ్య రేఖ!
నిఖార్సయిన వర్గ విభజన చోటు చేసుకుంటున్నది. కులమూ, వర్గమూ కలగాపులగమైన సమాజం మనది. పెత్తందారీ తోడేళ్లు కులాల మేకతోళ్లు కప్పుకొని మందల్లో దూరిన ప్రమాదకర వ్యవస్థ మనది. ఇప్పుడు ఒక రేడియం స్టిక్కర్ అడ్డుగీత రెండు వర్గాల మధ్య విభజన రేఖలా చీకట్లో కూడా మెరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో సామాజిక శక్తుల పునరేకీకరణ రాజకీయ శిబిరాల్లో వేగంగా జరుగుతున్నది. ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ పేరుతో వైసీపీ పతాకాల నీడలో పీడిత వర్గాల ప్రజలు రాష్ట్రమంతటా కదం తొక్కుతున్నారు. అగ్రకుల పేదల సౌహార్దం ఈ యాత్రలకు వన్నె తెస్తున్నది. గడిచిన ఏడు రోజుల్లో 19 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరిగాయి. 19 బహిరంగ సభలు జరిగాయి. ఈ సభల్లో ఐదు లక్షలమందికి పైగా జనం పాల్గొన్నట్టు అంచనా. ఇంకా బస్సు యాత్ర పొడుగునా మద్దతు ప్రకటించినవారూ, బస్సులో ఉన్న నాయకుల సందేశాన్ని గ్రామగ్రామాన విన్న వారినీ కలుపుకుంటే ఈ సంఖ్య బహుశా రెట్టింపు ఉంటుంది. ఇంకో యాభై రోజులపాటు ఈ యాత్రలు కొనసాగనున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను గమనంలోకి తీసుకుంటే దాదాపు కోటిమంది సాధికార యాత్రల్లో ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. పేద వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వైసీపీ నేతలు బలహీన వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఆలంబనతో సాధికారత పథంలోకి దూసుకొనిపోవలసిన ఆవశ్యకతను వారికి బోధిస్తు న్నారు. పాల్గొంటున్న జనం కూడా నాటి ప్రభుత్వ విధానాలు, నేటి ప్రభుత్వ విధానాల మధ్య గల తేడాలను బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే బహిరంగ సభల్లో ప్రస్తావించిన ఒక పోలిక ఇప్పుడు జనం చర్చల్లో నిత్యం నానుతున్నది. పేదల సంక్షేమం కోసం తాము ‘డీబీటీ’ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానాన్ని అనుసరిస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ‘డీపీటీ’ (దోచుకో... పంచుకో... తినుకో) అమలు చేశారని ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు జనం సాక్షిగా రుజువులు కనిపిస్తున్నాయి. అమ్మవొడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెన్షన్ కానుక వగైరా 29 స్కీముల పేరుతో అక్టోబరు చివరి నాటికి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వేసింది. జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యాకానుక తదితర తొమ్మిది నాన్ డీబీటీ స్కీముల కింద మరో లక్షా 67 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు కాలం నాటి రాష్ట్ర బడ్జెట్తో జగన్ ప్రభుత్వం బడ్జెట్ దాదాపుగా సమానం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన ప్రకారం బాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కార్ చేసిన అప్పులు తక్కువ. మరి ఈ ప్రభుత్వం జనం ఖాతాల్లోకి పంపించిన డబ్బును బాబు హయాంలో దేనికి ఉపయోగించారు? జగన్ ప్రభుత్వ డీబీటీ, నాన్ డీబీటీ స్కీముల ద్వారా 1 కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రతి కుటుంబానికీ ఒకటి కంటే ఎక్కువ పథకాలు లభించాయి. ఈ కుటుంబాల వారికి సగటున 3 లక్షల రూపాయల లబ్ధి జరిగింది. మరి బాబు హయాంలో ఈ డబ్బులు పొందిన లబ్ధిదారులెవరు? చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాలు అరకొర మాత్రమే! సంక్షేమ పెన్షన్ల మీద 53 మాసాల్లో జగన్ ప్రభుత్వం 81 వేల కోట్లు ఖర్చుపెడితే 60 మాసాల్లో బాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 20 వేల కోట్లు మాత్రమే! ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుకార్చారు. ఇంతకు మినహా ఆయన అమలుచేసిన డీబీటీ స్కీములు ఏమీ లేవు. అప్పుడు పేద లబ్ధిదారులు ప్రయోజనం పొందిన స్కీములు తక్కువే అయినా పెత్తందారీ లబ్ధిదారులు మాత్రం కళ్లు చెదిరే మొత్తాలను స్కాముల ద్వారా కొల్లగొట్టారు. ఇందులో ఆరు స్కాములపై ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. 371 కోట్ల స్కిల్ స్కామ్లో లబ్ధిదారుగా చంద్రబాబు వైపే వేళ్లన్నీ చూపెడుతున్నాయి. 144 కోట్ల ఫైబర్నెట్ స్కామ్లో కూడా ఆయనే తుది లబ్ధిదారుగా సీఐడీ నిర్ధారణకొచ్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్లో అధమ పక్షం రెండు వేల కోట్ల భూ దోపిడీ జరిగింది. ఇందులో చంద్రబాబు కుటుంబంతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని, పవన్ కల్యాణ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమలను లబ్ధిదారులుగా గుర్తించారు. 4,500 కోట్ల విలువైన అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణ, లింగమనేని కుటుంబాలు ముఖ్య లబ్ధిదార్లు. మద్యం కుంభ కోణం విలువ 5,200 కోట్లు. చంద్ర బాబుతోపాటు అయ్యన్నపాత్రుడు, సుధా కర్ యాదవ్ (యనమల వియ్యంకుడు), ఎస్పీవై రెడ్డి లబ్ధిదారులు. ఇసుక కుంభ కోణం విలువ 10 వేల కోట్లు. చంద్ర బాబుతోపాటు పీతల సుజాత, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఆరు స్కామ్ల మీద సీఐడీ తగిన ఆధారాలతో కేసులను నమోదు చేసింది. ఇవే కాకుండా బలమైన ఆరోపణలతో డజన్ల కొద్దీ స్కాములున్నాయి. ఒక్క విశాఖపట్నం నగరంలోనే రూ. లక్ష కోట్ల విలువైన 20 వేల ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో వాటికి సంబంధించిన భూరికార్డులు గల్లంతయి నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలోనే చంద్రబాబు విశాఖలో మకాం వేసి తుపానుపై తాను యుద్ధం చేసినట్టు ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 వేల కోట్ల విలువైన గ్రానైట్, ఇనాం, ప్రైవేట్ భూములను చెరపట్టినట్టు ఆధారాలు లభిస్తు న్నాయి. పవన విద్యుత్ ఒప్పందాల్లో 11,625 కోట్లు కొల్లగొట్టారు. అమరావతి బాండ్ల జారీ ముసుగులో చినబాబు, పెద బాబులు రెండు వేల కోట్ల పెట్టుబడులు బినామీ కంపెనీల ద్వారా పెట్టినట్టు ఆరోపణ లొచ్చాయి. నీరూ–చెట్టూ పథకంలో 24 వేల కోట్లను కైంకర్యం చేశారు. ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కాంట్రాక్టుల్లో 4 వేల కోట్లు స్వాహా చేశారు. తాత్కాలిక సచివాలయ భవనం కాంట్రాక్టులో 800 కోట్ల కమిషన్ బాబుకు చేరినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఆయనకు నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అమరావతి హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడిలో 380 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో కాంట్రాక్టుల్లో 675 కోట్ల మూలవిరాట్టుకు ముడుపు కట్టినట్టు సమాచారం. జెన్కో థర్మల్ ప్రాజెక్టు టెండర్లలో 670 కోట్లు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో 1800 కోట్లు అవినీతి ఖాతాలో పడి నట్టు రుజువులున్నాయి. ఇవి కొన్ని మాత్రమే! ఇక రాజధాని పేరు మీద తెరలేపిన అవినీతి ఒక అంతులేని అగాధం. దిగితే తప్ప దాని లోతు తెలియదు. బాబు జమానాలో దాదాపు ఆరు లక్షల కోట్ల మేరకు స్వాహాకార్యం జరిగినట్టు బలమైన ఆరోపణలున్నాయి. ఈ మొత్తంలో వాటాలు పొందిన వారిలో పెత్తందార్లు, ఉప పెత్తందార్లు చాలామందే ఉన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదార్లు సాధికారత పేరుతో జైత్రయాత్రలు చేస్తుంటే మన పెత్తందారీ, పిల్ల పెత్తందారీ లబ్ధిదారులు చూస్తూ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. స్కిల్ స్కామ్లో చంద్ర బాబు అరెస్ట్ సందర్భాన్ని ఉపయోగించుకొని సాధికారత యాత్రలను మరుగుపరచడానికి శతవిధాలా ప్రయత్నించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పార్టీ పేరుతోనూ, ఇతర సంఘాల పేరుతోనూ ఈ పిలుపులు ఇచ్చినప్పటికీ ఇందులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఒకే ఒక్క సామాజిక వర్గం వారు. ఈ కార్యక్రమాల కోసం సోషల్ మీడియా వేదికగా జరిగిన సన్నాహాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారి వివరాలను పరిశీలించినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. బాబు మెడికల్ బెయిల్పై విడుదలై విజయవాడ చేరుకున్న సందర్భంగా పబ్లిక్ షోను ఆర్గనైజ్ చేసిన వారిని పరిశీలించినప్పుడు కూడా ఇదే సంగతి తేటతెల్లమైంది. నలభయ్యేళ్ల చరిత్ర, అందులో ఇరవయ్యేళ్లు అధికారంలో ఉన్న పార్టీ చివరికి ఒక సామాజికవర్గంపైనా, పిడికెడు మంది ఇతరులపైనా ఆధారపడాల్సి రావడం ఒక విషాదం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ బలాబలాల పొందిక ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నది. ఇప్పుడు మేకతోళ్లు కప్పుకున్న తోడేళ్లను మంద గుర్తించ గలుగుతున్నది. ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్ల ప్రజాధనాన్ని భోంచేసిన పెత్తందారీ శక్తులు ఒక పక్కన, నాలుగున్నర లక్షల కోట్లను పైసా వృథా కాకుండా ప్రజా సంక్షేమానికి తరలించిన ప్రజాశక్తులు పక్కన మోహరించాయి. అధికారానికి దూరమైనప్ప టికీ ధనబలం కలిగిన పెత్తందారీ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇతర చిన్నాచితక రాజకీయ పార్టీలను అదుపులోకి తీసుకొని తనకు అను కూలంగా తోలుబొమ్మలాటలాడించగల సామర్థ్యం పెత్తందారీ పార్టీకి ఉన్నది. మీడియా మీద ఉన్న గుత్తాధి పత్యంతో ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసుకోగల ప్రావీణ్యం దానికున్నది. వ్యవస్థ లను నియంత్రించి చట్టానికీ, ధర్మానికీ తాను కోరు కున్న భాష్యం చెప్పగల నేర్పరితనం దాని సొంతం. రాబోయే యుద్ధంలో పేదవర్గాలు గెలుపొందాలంటే నిరంతర జాగరూకత ఒక్కటే మార్గం. రచ్చబండలపై రాజకీయ పార్టీల జమాఖర్చులను దండోరా వేయడమే శరణ్యం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సాధికారతే ప్రజాస్వామ్యం!
కులం పునాదుల మీద మనం ఒక జాతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఘంటాపథంగా ప్రకటించారు. భారతీయులందరినీ ఏకతాటి మీదకు తీసుకొని రావాలంటే అందుకు తొలి షరతు కుల నిర్మూలనేనని ఆయన స్పష్టం చేశారు. ఒక మానవ సమూహం నాగరిక పౌరసమాజంగా మన్నన పొందాలంటే, దాని పాలనా విధానంలో ప్రజా స్వామ్యం శోభిల్లాలంటే... ఆ సమూహంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని జీవించే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవానికి అతిపెద్ద శత్రువు కులమేనని పెరియార్ రామస్వామి నాయకర్ నిగ్గు తేల్చారు. కుల నిర్మూలన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది? అనాగరికమైన ఈ కుల వ్యవస్థను కూలదోయడానికి ఉపకరించే ఆయుధాలేమిటి? దుర్భర బర్బర సంప్రదాయాల నుంచి సంఘాన్ని విముక్తం చేయడమెట్లా? ఆయా చార్రితక కాలమాన పరిస్థితులను బట్టి సంఘ సంస్కర్తలు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలన్నారు. పేదకులాల ప్రజలందరూ బాగా చదువుకోవాలని ఉపదేశించారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. పుట్టుక కారణంగా నిమ్నకులం వారుగా ముద్రవేయించుకునే ప్రజలందరూ ధనిక కులాల వారితో ఇంచుమించు సరిసమా నమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ హోదాలను అందుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మన్యూనత అదృశ్యమై ఆత్మగౌరవం మొగ్గ తొడుగుతుంది. భారత రాజ్యాంగం ఇదే అభిప్రాయాన్ని తన లిఖితపూర్వక ఆదేశాల్లో ప్రతిఫలింపజేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలందరూ సమాన వాటాదారులు కనుక హెచ్చుతగ్గులు లేని సమాజానికి బాటలు వేయడం రాజకీయ పక్షాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇప్పటివరకూ మన ఏలికలు విఫలమవుతూ వస్తున్నారనేందుకు నిమ్నవర్గాల దుఃస్థితే సజీవ సాక్ష్యం. ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని మొక్కుబడి ప్రయోజ నాలను కల్పించినప్పటికీ, సామాజిక హోదాను కట్టబెట్టడంలో మన ప్రభుత్వాలు చేసింది పెద్ద గుండుసున్నా మాత్రమే! ఆంధ్ర ప్రదేశ్లో ఆధికారంలో వున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన 53 నెలల పాలనాకాలంలో ఈ ఒరవడిని మార్చింది. ఆర్థిక, రాజ కీయ రంగాల్లో మొక్కుబడి తతంగాలకు స్వస్తి చెప్పి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎవరూ పట్టించు కోని సాంఘిక రంగంలో సైతం ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైంది కనుకనే, ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు కనుకనే పార్టీ అధినేత వైఎస్ జగన్ సామాజిక సాధికార యాత్రలకు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలు మరింత జన చేతనను జ్వలింపజేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకూ గత కాలపు ప్రభుత్వాల తూతూ మంత్రపు తతంగాల స్థానంలో విప్లవకర విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేద వర్గాల ప్రజలను సంక్షేమ పథం నుంచి సాధికారత గమ్యం వైపు ఆయన మళ్లించారు. ప్రజలకు ఆ గమ్యాన్ని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరుగుతున్న యాత్ర లకు ‘సామాజిక సాధికార యాత్ర’లుగా ఆయన నామకరణం చేశారు. పేదవర్గాల ప్రజలందరూ ఈ గమ్యానికి చేరుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, సార్థకత. సమస్త వృత్తి వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహించే సకల జనులందరూ నిజమైన స్వేచ్ఛతో, సాధికార స్వరంతో నిర్భ యంగా తమ అభిప్రాయాలు వెల్లడించగలిగే దశకు చేరుకున్న ప్పుడే ప్రజాస్వామ్యం నూరుశాతం ఫలించినట్టు లెక్క. రాజ కీయ వేషాలు వేసుకున్న దొంగలకు, దోపిడీదార్లకు, పిండారీ లకు అదుపులేని లైసెన్స్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నడిరోడ్ల మీద సభల పేరుతో తొక్కిసలాటలు సృష్టించి జనాన్ని చంపే స్వేచ్ఛ కోసం, నేరం చేసినట్టు ఆధారా లున్నవాడు కూడా అరెస్ట్ కాకుండా ఉండే స్వేచ్ఛ కోసం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడే స్వేచ్ఛ కోసం ఇప్పుడు జరుగుతున్న ఆరాటాలు, పోరాటాలు ప్రజాస్వామ్యంగా పరిగణించడం సాధ్యం కాదు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ప్రకటిస్తూ పేద తల్లిదండ్రుల పక్షాన ఆ ఆస్తిని సమకూర్చే బాధ్యతను వైఎస్ జగన్ ప్రభుత్వం తలకెత్తుకున్నది. ఆ చదువు నాణ్యమైనదిగా, ఆధునిక సాంకేతికత జోడించినదిగా, అత్యు న్నతస్థాయి పాఠశాలల ప్రమాణాలను అందుకునేదిగా ఉండేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంత బృహత్తరమైన కార్యా చరణలో తల్లిదండ్రుల మీద వీసమెత్తు భారం పడకుండా, పైగా వారికి ప్రోత్సాహకం కూడా లభించేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి బాలికా, బాలుడూ కచ్చితంగా బడికి వెళ్లేలా, ఏ ఒక్కరూ మధ్యలో బడి మానివేసే పరిస్థితి రాకుండా అందరూ ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఒక విప్లవోద్యమం మొదలైంది. ఈ ‘ఆస్తి’పరులు తమ చదువును మదుపుచేసి మరో పదేళ్ల తర్వాత నుంచి వరుసగా ప్రతి ఏటా సంపద సృష్టిలో కీలక బాధ్యత వహించబోతున్నారు. తాము పుట్టి పెరిగిన వర్గాన్ని విముక్తం చేయబోతున్నారు. వైద్యం, వ్యవసాయం, చిన్న–సూక్ష్మ పరిశ్రమలు, చిరు వ్యాపారాలు తదితర రంగాలను కూడా పేదల అనుకూల విధానాలు ఆవహిస్తున్నాయి. ఇప్పుడు చేయూత కోసం ఎదురు చూసే స్థితిలో ఉన్న ప్రజలు రానున్న కాలంలో పదిమందిని చేయిపట్టి నడిపించగల స్థితికి చేరుకుంటారు. జగన్ ప్రభుత్వ విధానాల ఫలితంగా మరో ఐదు, పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భు తాలను చూడబోతున్నది. బలహీన వర్గాలకు రాజకీయ పదవుల కల్పనలో కూడా పాత పద్ధతులకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పింది. మంత్రి మండలి శాఖల కేటాయింపుల్లో, శాసనమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికలో, కార్పొరేషన్లు, మేయర్లలో, మునిసిపల్, జడ్పీ ఛైర్మన్లలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఇలా అన్నిరకాల రాజ కీయ పదువుల్లో బలహీన వర్గాలకు సింహభాగం కేటాయింపులు చేసిన జగన్ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖించింది. సామాజిక సాధికార యాత్రలో వైసీపీ నాయకులు ఈ గణాంకాలను ఉటంకిస్తూ చేస్తున్న సవాళ్లకు బదులు చెప్పలేక విపక్షం డిఫెన్స్లో పడిపోయింది. ఆర్థిక – రాజకీయ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఒక ఎత్తయితే, సామాజిక మార్పులు మరో ఎత్తు. పేదవర్గాలు తల ఎత్తుకొని జీవించడానికి దోహదపడే మార్పులు కొన్ని ఆర్భాటం లేకుండా చోటు చేసుకుంటున్నాయి. ఒక నిశ్శబ్ద విప్లవం కమ్ముకొస్తున్న దృశ్యం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో మూడు అంశాలను మనం స్పష్టంగా చూడవచ్చు. 1. కొత్తగా వెలుస్తున్న వాడల్లో కులజాడలు కన్పించడంలేదు. 2. హిందూ సమాజం అపురూప గౌరవంగా భావించే ఆలయ మర్యాదలు పెద్ద కులాల పరిధుల్ని దాటి బలహీనవర్గాల్లోకి ప్రవేశించాయి. 3. శ్రామిక మధ్యతరగతి మహిళల మాటకు ఇంటాబయటా క్రమంగా మర్యాద మన్నన పెరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యంలో నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లను పరిశీలించడానికి ఇటీవల బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ప్రతినిధి ఒకరు రాష్ట్రంలో పర్యటించారు. సెమీ అర్బన్ ప్రాంతమైన సామర్లకోటలో వేల సంఖ్యలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించి అక్కడ నివాసముంటున్న వాళ్లతో మాట్లాడారు. అందులో ఇంజేటి సమర్పణరాజు అనే లబ్ధిదారుడు చెప్పిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ‘మాకు (దళితులకు) గతంలో కాలనీలు వేరుగా ఉండేవి. అవమానంగా ఉండేది. ఇక్కడలా చేయలేదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల నంబర్ల ఆధారంగా డ్రా తీశారు. డ్రాలో వచ్చిన ఫ్లాట్లను కేటాయించారు. అన్ని కులాల వారూ పక్కపక్కనే వచ్చారు. సంతోషంగా ఉంది.’ ఆ ప్రతినిధి పరిశీలించిన అన్ని కాలనీల్లో ఈ మాట వినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి వాస్తవ్యురాలు గుండుగోలు అరుణ అనే దళిత మహిళ మాట్లాడుతూ మాకు వచ్చిన ఇంటికి ఎదురుగానే కమ్మవారికి వచ్చింది. మా పక్కనే తూర్పు కాపులకు వచ్చింది. అందరం కలిసే ఉంటున్నామని చెప్పింది. బలహీన వర్గాల వారికి ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాల్లో కులాల వారీ కాలనీలు పట్టణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించాయిగానీ, గ్రామాల్లో చాలాకాలం కొనసాగాయి. ఆ సంప్రదాయాన్ని 17 వేల జగనన్న కాలనీల్లో స్వస్తి పలికి సమష్టి జీవనానికి శ్రీకారం చుట్టారు. సంపన్నులకు, పెద్ద కుటుంబాల వారికీ, వ్యాపారులకు మాత్రమే ఆలయ కమిటీల్లో చోటు దొరికేది. పూర్వపు ధర్మ కర్తలకు లభించే గౌరవ మర్యాదలు ఈ కమిటీ సభ్యులకు కూడా లభిస్తాయి. ఆలయంలో లభించే గౌరవానికి హిందువులు విశేష ప్రాధాన్యమిస్తారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమా క్లైమాక్స్ దృశ్యం ఈ అభిప్రాయానికి అద్దం పడుతుంది. విఖ్యాత హిందూ దేవాలయం తిరుమలలో ఆలయ మర్యాదల కోసం సంపన్నులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తహతహలాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి తిరుమలలో తిరుమలేశుని తొలిదర్శనం చేసుకునే అవకాశాన్ని సన్నిధి గొల్లకు జగన్ మోహన్రెడ్డి హక్కుభుక్తం చేశారు. వెనక బడిన కులాల్లో మరింత వెనుకబడిన కులాల వారికి కూడా తిరుమల ఆలయ కమిటీలో సభ్యత్వం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే వేలాది ఆలయా లకు నియమించిన కమిటీల్లో సగం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలవారే! ఇదొక సామాజిక హోదా, గౌరవం. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బలహీనవర్గాల ప్రజలకు ఇప్పుడీ గౌరవం దక్కింది. మహిళా సాధికారత లేకుండా జన సాధికారత సంపూర్ణం కాదు. అది సంపూర్ణం కాకుండా నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించదు. పేద వర్గాల పురుషులు రాజకీయ, ఆర్థిక,సాంఘిక వివక్షలకు మాత్రమే గురవుతారు. శ్రామిక వర్గ మహిళలు తమ పురుషులతో సమానంగా ఈ వివక్షలను ఎదుర్కొంటూనే లైంగిక అసమానత్వాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఈ రెట్టింపు వివక్ష ఈనాటిది కాదు. ఈ దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. రెండు శతాబ్దాల క్రితం మాక్సిమ్ గోర్కీ రాసిన రష్యన్ నవల ‘అమ్మ’ ఇతివృత్తమే ఇది. ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషల్లో కోట్లాది మంది చదివి ప్రభావితమైన నవల బహుశా ‘అమ్మ’ ఒక్కటేనేమో! రెట్టింపు దోపిడీనీ, రెట్టింపు అవమానాల్నీ ఎదుర్కొన్న అమ్మ మాత్రం బేల కాదు. పోరాట పటిమకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే శ్రామిక మహిళలందరూ పోరాట పటిమ గలవారే. ‘మదర్ ఇండియా’లే! వారి గౌరవ మర్యాదలను ఇనుమడింపజేయగల కొన్ని ప్రత్యేక పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్రంలోని స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాలపై సగానికి పైగా మహిళలే ఆసీనులయ్యారు. ఆలయ కమిటీల్లోనూ సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో సగం దక్కించుకున్నారు. మంత్రివర్గంలో కీలక శాఖల అధిపతులుగా ఉన్నారు. రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం ఒక భాగం మాత్రమే! ‘అమ్మ ఒడి’, అమ్మ పేరున ‘ఆస్తిపత్రం’, అమ్మకు ‘చేయూత’ అనే మూడు విశిష్ట పథకాలు ఎక్కడా లేనివి. మహిళల ఆత్మగౌరవానికి మకుట ధారణ చేసినవి. పిల్లల చదువులు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయా ధికారాన్ని ‘అమ్మ ఒడి’ పథకం ఆమెకు కట్టబెట్టింది. 30 లక్షల మంది మహిళలకు సంపూర్ణ హక్కులతో ఇంటి పట్టాలను జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. ఇంటాబయటా ఆమె గౌరవం పెరిగింది. చేయూత పథకంతో నడివయసులోనూ మహిళలు వ్యాపారస్తులుగా రాణిస్తున్నారు. మనుమలు, మను మరాళ్లకు చిన్నచిన్న బహుమతులు కూడా కొనివ్వలేని నిస్స హాయ స్థితిని వాళ్లిప్పుడు జయించారు. వ్యాపార విజయాల కోసం ఇప్పుడు పాటుపడుతున్నారు. ఈ 53 నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు బహుజనులను, మహిళలను సాధికారత పథంలో నిలబెట్టాయి. ఈ పరిణా మాన్ని పెత్తందారీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో అన్ని వైపుల నుంచీ యుద్ధాన్ని ప్రకటించాయి. తప్పుడు ప్రచారాలతో ఒక విష వృష్టిని కురిపిస్తున్నాయి. సాధికార యాత్రలతో విష ప్రచారాలను ఎండగట్టవలసిన బాధ్యత, పెత్తందారీ కుట్రలను తిప్పి కొట్టవలసిన బాధ్యత బహుజనులూ, మహిళలదే! ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగితేనే కులం జాడలు, వెలివాడలు అదృశ్యమవుతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన తర్వాత, ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్తో చదివించారో కూడా పవన్, మనోహర్లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్ఎమ్వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బీసీ ‘కమలం’!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది. గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్ఎస్కు వందమందికి పైగా సిటింగ్ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది. కాంగ్రెస్కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు. వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్పాత్ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు. మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు. 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్ మెంట్ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు. ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో వెళ్లండ’ని సీనియర్ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు. ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కె. లక్ష్మణ్ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది. వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్రిజర్వ్డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు. ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్మెంట్ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మార్చింగ్ సాంగ్
నూరు గొడ్లను తిన్న ఒకానొక రాబందు ఓ చిరుగాలి వానకు గాయపడిందట! ఈ గాయం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమట! కానీ, గాయపడిన పిట్టల కోసం, రాలిపడిన పువ్వుల కోసం పరితపించడం మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమట! పిట్టల గాయాలు మాన్పి నింగి లోకి ఎగరేయడం నేరమట! రాలిన పువ్వులను మాల కూర్చి మందిరానికి చేర్చడం పాపమట! తీతువులు నీతులు చెబుతున్నాయ్. గ్రద్దలు క్రుద్ధమవు తున్నాయ్. తోడేళ్లు తొడలు చరుస్తున్నాయ్! ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ నేడు ప్రజాస్వామ్య పాఠాలను బోధిస్తున్నది. దాని తాబేదార్లు తందానా అంటున్నారు. పెత్తందారీ ప్రజా స్వామ్యం కోసం వందిమాగధులు, భజంత్రీలు సహస్ర గళార్చన చేస్తున్నారు. రాబందుల స్వేచ్ఛపై ఆంక్షలేమిటి? రామోజీల ‘చీట్’లకు ఆటంకాలేమిటని ప్రశ్నిస్తున్నారు. తోడేళ్ల మందలు స్వైర విహారం చేసినంత మాత్రాన బంధిస్తారా? ప్రభుత్వ పెద్దలు ఖజానాకు కన్నం వేస్తే అరెస్టు చేస్తారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిందని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊరేగుతున్నారు. ఇప్పుడక్కడ ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతున్నది. కులం,మతం, ప్రాంతం, జాతి, స్త్రీ–పురుష వివక్ష లేకుండా భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రసాదించిన హక్కులను వారికి దఖలు పరచడానికి, ఆదేశిక సూత్రాలను శిరసావహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షం, దాని తైనాతీల రూపంలో ఘనీభవించిన పెత్తందారీ వ్యవస్థ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నది. దాని దశకంఠాలు రణరంకెలు వేస్తున్నయ్. దాని వేయి చేతులు కత్తులు దూస్తున్నయ్. పేద ధనిక తేడా లేకుండా పుట్టిన ప్రతిబిడ్డ ఆనందంగా ఆరోగ్యంగా పెరగడం కోసం, ఉన్నత లక్ష్యాల వైపు స్వేచ్ఛగా పరుగెత్తగలగడం కోసం, అందలాలు అందుకోవడం కోసం సమానావకాశాలుండాలని రాజ్యాంగం వాంఛించింది. ఆ వాంఛితానికి వాస్తవ రూపు కట్టడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పెత్తందారీ వ్యవస్థ ప్రయోజనాలకు ఈ ప్రయత్నాలు వ్యతిరేకం. కనుకనే తెలుగుదేశం – యెల్లో మీడియాల సేనాధిపత్యంలో మోహరించిన పెత్తందారీ వ్యవస్థ యుద్ధం ప్రకటించింది. అందుకే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘క్లాస్ వార్’గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘వర్గ పోరాటానికి’ తన సేనావాహినిని సమాయత్తం చేస్తూ ఈ వారం విజయవాడలో వైఎస్ జగన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలం, ఆ పైస్థాయి పార్టీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘మీరే నా సేనాపతులు. మీరే నా దళపతులు’... అంటూ ఈ సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికది ప్రసంగం కాదు. ఒక మార్చింగ్ సాంగ్. కవాతు గీతం. ‘పదండి ముందుకు, పదండి తోసుకు... పోదాం పోదాం పైపైకి! కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ’ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా సాగిందా ప్రసంగ పాఠం. ప్రజలందరికీ సమాన హక్కుల కోసం, సమాన అవకాశాల కోసం తన ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘మాగ్నా కార్టా’పై ఆయన తన దళపతులకు సంపూర్ణ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నా... నా... నా... నా... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రకులాల పేదలు అని పదేపదే సంబోధిస్తూ ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీని ఘంటాపథంగా ప్రకటించారు. ఆ ఫిలాసఫీని పార్టీ నాయకశ్రేణుల మెదళ్లలోకి బలంగా జొప్పించే ప్రయత్నం చేశారు. గడిచిన ఎన్నికల్లో మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన ‘మాగ్నాకార్టా’ను 99 శాతం అమలు చేశామని ఆయన ఈ సభలో ప్రకటించారు. ‘‘ఈ 52 మాసాల్లో మనం చేసిన మంచే మన బలం... మన ధైర్యమని చెబుతూ ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాం. దేవుడి దయ మనకు తోడుగా ఉన్నది. చేసిన అభివృద్ధి కళ్లెదుట కనిపిస్తున్నది. కనుక ’వై నాట్ 175‘ అనేది మన లక్ష్యం కావాల’’ని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేస్తూ సాగిన ఐదేళ్ల పదవీ కాలానికి ఒక వినూత్నమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని ప్రజా ఉద్యమ రూపంగా మలిచి ఆయన పార్టీ శ్రేణుల ముందుంచారు. ఈ ఉద్యమం నాలుగు రూపాల్లో సంక్రాంతి పండుగ దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత పెన్షన్ల పెంపుతో సహా మరో మూడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖాన్ని పూరించబోతున్నది. ఈ నాలుగంచెల ఉద్యమంలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరుకూ చేరువవుతాయి. ‘మా పరిపాలనలో మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండ’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మాటతోనే ఆయన పార్టీ సగం యుద్ధాన్ని గెలిచింది. అదే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి గడప ముందు వినిపిస్తారు. క్లైమాక్స్లోని మొదటి ఉద్యమ రూపం – ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం’. ఇది ప్రారంభమై పదిహేను రోజులు విజయవంతంగా నడిచింది. ఇంకో ఇరవై ఐదు రోజులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా పదిహేను వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామాన్నీ, ఇంటినీ జల్లెడపడుతున్నారు. ఈ శిబిరాలు అందరికీ పరీక్షలు చేసి, సమస్యలున్నవారికి మందులు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కావడం లేదు – జబ్బులున్న వారినీ, దీర్ఘకాలిక రోగా లున్నవారినీ కూడా గుర్తించి వారికి చేయూతనిచ్చి రోగం నయమయ్యే దాకా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ శిబిరాలు జరిగినన్ని రోజులు ఊరూవాడా అంతటా ఆరోగ్య రంగంపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైద్య సేవలు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. యాభై వేలకు పైగా వైద్య సిబ్బందిని కొత్తగా నియమించడం, ఊరూరా వెలసిన ఆరోగ్య కేంద్రాలు, పటిష్ఠమైన పీహెచ్సీలు, అందు బాటులోకి ఫ్యామిలీ డాక్టర్ పథకం, అంబులెన్స్ సర్వీసులు, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు వగైరా విషయాలన్నింటిపై జనంలో చర్చ జరుగుతుంది. వారికి అవగాహన పెరిగి, వైద్య సేవలను గరిష్ఠంగా వినియోగించు కోగలుగుతారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనేది రెండో దశ కార్యక్రమం. ఇది కూడా నలభై రోజుల దీక్ష. ఇందులో కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపునూ తడతారు. ఐదేళ్లలో వచ్చిన మార్పులను గుర్తు చేస్తారు. పరిపాలనా వికేంద్రీకరణనూ, కొత్త జిల్లాలను, గ్రామ సచివాలయాలను, వలంటీర్ వ్యవస్థను, వాటి ప్రయోజనాలనూ గుర్తు చేస్తారు. చేరువైన ఆరోగ్యరంగాన్నీ, మెరుగైన విద్యా వ్యవస్థనూ పరిశీలించాలని చెబుతారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆర్బీకే సెంటర్లనూ, వాటి ప్రయోజనాలనూ వివరిస్తారు. మొత్తంగా ఆ ఇంటికీ, ఊరికీ, ఆ ప్రాంతానికీ జరిగిన మేలును విడమర్చి చెబుతారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల పనితీరును తులనాత్మక పరిశీలనకు పెడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులంతా పాల్గొనే సామాజిక బస్సు యాత్రలు రెండు మాసాలపాటు సాగుతాయి. సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత, వేసిన పెద్దపీట ఈ యాత్రలలో హైలైట్ అవుతుంది. రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక విద్యా రంగాల్లో ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సామాజిక న్యాయం, బాబు హయాంలో జరిగిన దురన్యాయాలు చర్చకు వస్తాయి. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జీలుగా పనికిరారు, బీసీల తోకలు కత్తిరిస్తా..’ అనే భావజాలానికీ, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అనే భావ జాలానికీ మధ్య ఉన్న తేడాను జనం గుర్తిస్తారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అనే పురుషాహంకారానికీ, మహిళా సాధికా రత స్వరానికీ మధ్య గల తేడాను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆఖరి దశలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ అనే కార్యక్రమం ఒక యువ చేతనా ఉద్యమం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా క్రీడా రత్నాలను వెలికితీసే యజ్ఞం. లక్షలాదిమంది యువకులు ప్రత్యక్షంగా ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఎన్ని కల ప్రచారానికి ముందు ఐదేళ్ల పాలనా కాలానికి వైసీపీ అధినేత రూపకల్పన చేసిన భారీ క్లైమాక్స్ సన్నివేశం ఇది. ఐదేళ్లు ఆధికారంలో ఉన్న తర్వాత ప్రతి గడప తొక్కడానికీ, ప్రతి గుండెను తడమడానికీ ఎంత ధైర్యం కావాలి? ‘నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి’ అని చెప్పడానికిఎంత నైతిక స్థైర్యం కావాలి? ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న వైసీపీ ప్రభు త్వంతో తలపడేందుకు ప్రతిపక్ష శిబిరం దగ్గర ఉన్నదేమిటి? అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చట్టానికి దొరికిపోయి సెంట్రల్ జైల్లో సేద తీరుతున్న అధినాయకుడు. తండ్రి అరెస్టు తర్వాత పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చి నిలబడకుండా ఢిల్లీకి పారిపోయిన వార సుడు. నాయకుడు చేసిన అవినీతి గురించి వాదనలొద్దు, గవర్నర్ అనుమతి తీసు కోలేదు కనుక కేసు కొట్టేయాలని వాది స్తున్న ఖరీదైన లాయర్లు. ఒక సిద్ధాంతం, నిబద్ధత, మాట నిలకడ, విలువల కట్టు బాటు వంటివేమీ లేని ఒక నట భాగ స్వామి. ప్రతిపక్ష నేత సొంత పార్టీ కోమాలోకి జారుకోగా ఆయన సొంత కులం వారిని రెచ్చగొట్టి ఏవో కొన్ని కార్య క్రమాలను మమ అనిపిస్తున్న కోటరీ... ఇదీ ప్రస్తుత టీడీపీ, దాని మిత్ర పక్షాల పరిస్థితి. పెత్తందారీ శిబిరానికి అర్థబలం, అంగబలం దండిగానే ఉండ వచ్చు గాక. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దానికి నైతిక బలం హీనదశలో ఉన్నది. సాను భూతి కోసం నాటకాలాడే దుఃస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. పేదవర్గాలు చైత న్యంతో మెలిగితే మరో ఐదేళ్లలో ఆ వర్గాల సాధికారత ఇంకో వంద రెట్లు పెరుగుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
వచ్చే ఫిబ్రవరి లోగా చంద్రబాబుకు బెయిల్ దొరికే అవకాశం లేదు! ఆయన మీద నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో సీఐడీ చేస్తున్న వాదనలు పరిశీలించిన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది!! ఈ లోగానే ఆయనకు ఊరట లభించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పూర్వాశ్రమంలో ఇటువంటి అద్భుతాలు చంద్రబాబు వల్ల సాధ్యమయ్యేవి. ఆ మేజిక్ ఇప్పుడేమైపోయిందని బాబు అనుచరగణం కలవర పడిపోతున్నది. కొన్ని దశాబ్దాలుగా ఆయన్ను ఆశీర్వదిస్తూ వస్తున్న ‘అద్భుత’ దీపాలు కొన్ని ఇప్పుడు వానప్రస్థం స్వీకరించి మిణుకుమిణుకుమంటున్నాయి. కనుక ఇప్పుడు పాత మేజిక్ మీద ఆశ పెట్టుకోవడం కుదరకపోవచ్చు. చంద్రబాబు మీద నమోదైన నేర శిక్షాస్మృతి సెక్షన్లు ఆరు మాసాల్లోగా బెయిల్ లభించడానికి అనుమతించవు. కనుకనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇదొక అక్రమ కేసుగా వాదిస్తూ విచారణే జరక్కుండా కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోపక్క చంద్రబాబు పార్టీ అనుయాయులు, యెల్లో మీడియా పెద్దలు సమష్టిగా ‘అక్రమ కేసు’ వాదాన్ని తీవ్రంగా ప్రచారంలో పెట్టే పనిలో నిమగ్న మయ్యారు. తప్పుడు సమాచారాన్ని అందజేసి కొందరు తట స్థుల చేత కూడా తమకు అనుకూలమైన ప్రకటనలు చేయించు కుంటున్నారు. యెల్లో మీడియా తనను తాను తాకట్టు పెట్టుకుంటూనే, బాబు సామాజిక వర్గాన్ని కూడా తాకట్టు పెడుతూ ఒక కృత్రిమ సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం వారొక తప్పుడు వాదాన్ని తయారుచేసి అందుకు అనుగుణంగా లా పాయింట్లు లాగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగిందా లేదా అనే చర్చను వారు పక్కనబెట్టి సాంకేతిక అంశాలను ముందుకు తెస్తున్నారు. ఆ సాంకేతిక అంశాలు కూడా న్యాయస్థానాల పరిశీలన ముందు నిలబడేవి కావని న్యాయకోవిదులు ఘంటాపథంగా చెబుతు న్నారు. ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ, 2018) సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే (మాజీ ముఖ్య మంత్రి కనుక) గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నర్ అనుమతి తీసుకున్నట్టు రికార్డు చేయలేదు కనుక కేసు కొట్టేయండి’ అని కోర్టులో వాదిస్తున్నారు. ‘ఒకసారి కేబినెట్ ఆమో దించిన తర్వాత దీన్ని ‘స్కామ్’ అని ఎట్లా అంటారు? ఇచ్చేయండి బెయిల్’ అని అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో దుర్వినియోగ మైన డబ్బులు బాబు ఇంటికి చేరినట్టుగా సాక్ష్యాలు చూపలేదు గనుక ఆయన్నెట్లా బాధ్యుడిని చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటివే మరికొన్ని సాంకేతిక అంశాలను రూపొందించుకొని చంద్రబాబు అరెస్టు అక్రమమనే వాదాన్ని యెల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ రకమైన ప్రచారంతో సాను భూతిని సృష్టించడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఇది రాజకీయ దురుద్దేశంతో, కక్షపూరితంగా నమోదైన కేసుగా చిత్రిస్తున్నది. ఒకవేళ రాజకీయ కక్షే నిజమైతే ఆ కక్ష ఏ ప్రభుత్వానిది? కేంద్రానిదా... రాష్ట్రానిదా? ఎందుకంటే ఈ కేసు 2016లోనే వెలుగు చూసింది. వెలుగులోకి తెచ్చింది కేంద్ర ఏజెన్సీలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడే! పుణేలో ఉన్న కొన్ని డొల్ల కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం జీఎస్టీకి దరఖాస్తు చేసుకున్నాయి. సరుకులను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన జీఎస్టీలో మళ్లీ వాటిని అమ్మేసినప్పుడు కంపెనీలు పన్ను రాయితీని క్లెయిమ్ చేస్తాయి. సరుకులను సొంతానికి కాకుండా వ్యాపారం కోసం ఉపయోగించడం వల్ల ఈ రాయితీ లభిస్తుంది. ఎన్నడూ లక్ష రూపాయల వ్యాపారం కూడా చేసినట్టు చూపని కంపెనీలు హఠాత్తుగా భారీ ప్రమాణంలో ట్యాక్స్ ఇన్పుట్ను క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారు లకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. సరుకులు ఎక్కడా కొనకుండానే, అమ్మకుండానే బోగస్ ఇన్వాయిస్ (బిల్లులు)లు సృష్టించారని తేలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోసం సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా బోగస్ ఇన్వాయిస్లు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రజాధనాన్ని ఎవరో ఈ రకంగా కొల్లగొడుతున్నారని జీఎస్టీ అధికారులకు అర్థమైంది. దాంతో వారు ఈ సమాచారాన్ని రాష్ట్ర సీఐడీకి అందజేశారు. ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు ఉన్న కారణంగా కేసు ముందుకు కదల్లేదు. తర్వాత ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) అధికారులు కూడా ప్రవేశించి కేసులు నమోదు చేశారు. ఈడీ, జీఎస్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో భాగం కనుక, ఈ కేసును వెలికితీసింది వారే కనుక రాజకీయ కక్ష, దురుద్దేశం నిజమైతే కేంద్రానికే ఉండాలి కదా! ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ సంగతి చూద్దాం. దీని ప్రకారం నిందితుడి అరెస్టుకు అతని నియామక అధికారి (అపాయింటింగ్ అథారిటీ) ముందస్తు అనుమతి అవసరమని ఈ సెక్షన్ చెబుతున్నది. ముఖ్యమంత్రిగా నియమించేది గవ ర్నర్ కనుక ఆయన అనుమతి ముందస్తుగా ఉండాలని తెలుగు దేశం వాదన. అరెస్టయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతిని కూడా పక్కనపెడదాం. సీఐడీ చేస్తున్న వాదన ప్రకారం ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది 2018లో! కానీ ఈ స్కామ్ జరిగిందీ, జిఎస్టీ, ఈడీలు కేసులు నమోదు చేసిందీ అంతకుముందే కనుక గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన మరో విశేషమేమిటంటే చంద్రబాబు మీద కేవలం అవినీతి నిరోధక చట్టం కేసులు మాత్రమే నమోదు కాలేదు. సీఆర్పీసీ సెక్షన్లయిన 120బి, 107, 409 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. అవినీతి నిరోధక చట్టానికి జరిగిన సవరణ సీఆర్పీసీ సెక్షన్ల కింది జరిగిన అరెస్టులకు కూడా వర్తిస్తుందా? అందుకు ఏదైనా ఉదాహరణ ఉన్నదా? 409 రెడ్ విత్ 34 కేసులో ఆరు నెలల వరకు బెయిల్ రావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీమెన్స్తో ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలులో జరిగిన దుర్వినియోగానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారు అనేది యెల్లో మీడియా అమాయకంగా అడుగుతున్న మరో ప్రశ్న. ఒకవేళ కేబినెట్ భేటీ జరిగిందనే అనుకున్నా అనంతరం వెలువడిన జీవోలో ఏమున్నది? ఈ స్కీమ్కు సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులను ఉచితంగా కేటా యించడానికి ముందుకు వచ్చింది. మిగిలిన పదిశాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే చాలని ఉన్నది. కేబినెట్ జరిగి ఉంటే ఇదే విషయాన్ని చెప్పి ఉంటారు. కానీ ఆచరణలో ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి మధ్యన జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్యాభివృద్ధి సంస్థ సదరు ఒప్పందంలో భాగస్వామి కావాలి. కానీ, కాలేదు. డిజైన్టెక్ అనే ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామిగా మారింది. సీమెన్స్ సంస్థ తర ఫున ఆ సంస్థ ఇండియా అధికారి దొంగసంతకంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది అతని రెగ్యులర్ సంతకం కాదనీ,దొంగ సంతకమనీ నిరూపణయింది. అతని ఉద్యోగం ఊడింది. ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ అధికారిక ప్రకటన చేసింది. న్యాయస్థానానికి కూడా లిఖిత పూర్వకంగా చెప్పింది. ఇదంతా బోగస్ వ్యవహారమనీ, దురుద్దేశ పూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఇవన్నీ సరైన కారణాలు కావా? మరో కీలకమైన విషయం – జీవోలో చెప్పినదాని ప్రకారం సీమెన్స్ సంస్థ 90 శాతం నిధుల్లో ఒక్క పైసా విడుదల చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం రూ.371 కోట్లను విడుదల చేయడం! దాన్ని డిజైన్టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఖాతాకు మళ్లించడం! ఇలా విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అధి కారులు నోట్ ఫైల్లో రాసినా చంద్రబాబు పట్టుబట్టి విడుదల చేయించారు. ఈ మేరకు నోట్ఫైళ్లలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. 13 చోట్ల సీఎం సంతకాలు చేశారని సీఐడీ ఆధారాలు చూపెట్టింది. స్కామ్ పూర్తిగా సీఎం కనుసన్నల్లో దురుద్దేశ పూర్వ కంగా జరిగిందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన గంటా సుబ్బారావు అనే వ్యక్తి, డిజైన్టెక్ కంపెనీ అధిపతి, సీమెన్స్ ఇండియాలోని ఉద్యోగి– ఈ ముగ్గురితో కలిసి కుట్రపూరితంగా నాటి ముఖ్య మంత్రి పథక రచన చేశారనడానికి కావల్సిన ఆధారాలు ఇవన్నీ! ఇక్కడే సీఆర్పీసీ సెక్షన్ 409, సెక్షన్ 34 వర్తిస్తున్నాయి. సెక్షన్ 409 అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్! నమ్మక ద్రోహానికి పాల్పడటం! ప్రజలు నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం గానీ, ఇతరుల ప్రయోజనాల కోసం గానీ వినియోగించడం!! ప్రజా ధనానికి పరిరక్షకుడిగా ఆయన్ను ప్రజలు నియమించారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆ ధనాన్ని షెల్ కంపెనీలకు తరలించడంలో కీలకపాత్రను పోషించారు. సెక్షన్ 34 – ఈ స్కామ్ వెనుకనున్న దురుద్దేశానికి వర్తిస్తుంది. ఈ రెండు సెక్షన్లూ రుజువైతే కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ‘సదరు స్కామ్ డబ్బులు బాబు జేబులోకే వెళ్లాయనేందుకు రుజువేమిటి? అది రుజువు చేయకుండా ఎలా కేసు పెడతారు? ఎలా అరెస్టు చేస్తార’ని మరో ప్రశ్నను టీడీపీ వారూ, యెల్లో మీడియా వారూ సంధిస్తున్నారు. బాబు మీద నమోదు చేసిన సీఆర్పీసీ 120బి, 107 సెక్షన్లు ఏం చెబుతున్నాయి? కుట్రలో భాగస్వామి అయితే చాలు సెక్షన్ 120బి వర్తిస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉండనక్కర్లేదు. అందుకు అనుమానం, ఆస్కా రం కలిగించే పరిస్థితులుంటే చాలు. అంటే సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ చాలు. 107 అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించడం. కనుక చంద్రబాబు జేబులోకి డబ్బులు వెళ్లాయా లేదా అనే విషయాన్ని అరెస్టుకు ముందో, రిమాండ్కు ముందో నిర్ధారణ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడో ఉదాహరణ చెప్పుకో వచ్చు. ‘ఏ’ అనే వ్యక్తి కుట్రపూరితంగా, దురుద్దేశంతో ‘బి’ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ‘బి’ బంధువులకు ఫోన్ చేసి ‘సి’అనే వ్యక్తికి డబ్బు చేరిస్తే విడుదల చేస్తానని చెప్పాడు. డబ్బు ‘సి’ చేతికి చేరుతుంది. డబ్బు నా చేతికి రాలేదు కనుక నేను నేరస్థుడిని కాదని ‘ఏ’ అనేవాడు బుకాయిస్తే చెల్లుతుందా? షెల్ కంపెనీల ద్వారా డబ్బును చంద్రబాబు గూటికి చేర్చడంలో ఆయన పీఏ శ్రీనివాస్ ముఖ్య భూమికను పోషించాడని సీఐడీ భావిస్తున్నది. అతడికి నోటీసులు ఇవ్వగానే దేశం విడిచి పారిపోయాడు. కుట్ర జరిగిందనడానికి ఇది మరో బలమైన సాక్ష్యం. రెండు రోజుల క్రితం ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ తరఫున వాదించిన ఏఏజీ సుధాకర్రెడ్డి ఓ కొత్త విష యాన్ని చెప్పారు. స్కామ్ సొమ్ములో ఓ 27 కోట్లు విరాళంగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరాయని ఆయన చెప్పారు. 27 కోట్ల విరాళం విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నిర్ధారించారు. ఈ ఆరోపణకు సీఐడీ వారు ఆధారాలు చూపగలిగితే తెలుగుదేశం పార్టీ ఆస్తులనూ, ఖాతాలనూ సీజ్ చేసే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే! ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఒక జీవచ్ఛవంలా తయారైంది. రక్తప్రసరణ దాదాపుగా నిలిచిపోయింది. సొంత పుత్రుడు, బావమరిది పార్టీని ఉద్ధరిస్తారనే నమ్మకాన్ని చంద్ర బాబు కూడా కోల్పోయి ఉంటారు. వైసీపీ వారు దత్తపుత్రుడిగా అభివర్ణించే పవన్ కల్యాణ్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పిలిపించుకున్నారు. చెవిలో ఏం చెప్పారో తెలియదు కానీ, బయటికి రాగానే పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఆయన పక్కన మామాఅల్లుళ్ళు చేతులు కట్టుకొని అనుచరుల్లా నిలబడిపోయారు. తాను ‘అలగా జనం’గా పరిగణించే వారి సమక్షంలో బాలయ్య బ్రాండ్ బ్లడ్డూ, బ్రీడూ తల వంచుకొని నిలబడాల్సి వచ్చింది. ఆ పూటకు అలా గడిచిపోయింది. తర్వాత మూడు వారాల పాటు చినబాబూ లేడు, పవన్బాబూ లేడు. బాలయ్య బాబు పెద్దగా సందడి చేయలేదు. చినబాబు ఢిల్లీలో దాక్కున్నారు. అరెస్టు భయంతో పారిపోయాడని పార్టీ శ్రేణులు భావించాయి. మొన్న రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్ళగానే చినబాబు రాజమండ్రికి తిరిగొచ్చారు. తీరా సీఎం రాష్ట్రానికి రాగానే, చినబాబు భార్యను తీసుకొని మళ్ళీ ఢిల్లీ బాట పట్టాడు. కార్యకర్తల నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. పార్టీలో కదలిక కోసం నానాతంటాలు పడవలసి వస్తున్నది. చివరికి బాబు సొంత సామాజిక వర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు. వారం రోజుల కిందనే మళ్లీ రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం పరిస్థితిపై బహిరంగ వ్యాఖ్యానాలు చేయవలసి వచ్చింది. ఆ పార్టీ పూర్తిగా బలహీన పడినందువల్లనే తాము యువరక్తం ఎక్కించవలసి వస్తున్నదని ఆయన సభలోనే ప్రకటించారు. తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా కృషిచేసినా పవన్ సభలు గతంతో పోలిస్తే బోసిపోతున్నాయి. రెండు పార్టీల పొత్తు పట్ల జనసేనలో వ్యతిరేకత, తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. జనస్పందన తగ్గడంతో పవన్ కూడా షాక్ తిన్నట్లున్నారు. గతంలో పదిహేను రోజులకో, నెలకో మాట మార్చేవాడు. ఇప్పుడు ప్రతిరోజూ మారుస్తున్నారు. ఒకరోజు ఎన్డీఏ నుంచి బయటకొచ్చానంటాడు. ఆ మరుసటి రోజే ఎన్డీఏలోనే ఉన్నానని అంటాడు. అవినీతి రెండు రకాలని ఓ కొత్త భాష్యాన్ని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ‘ఆమోదయోగ్యమైన’దేనట! ఇదెక్కడి దౌర్భాగ్యం! పైగా ప్రజలే అవినీతిపరులంటూ శాప నార్థాలు పెడుతున్నారు. ఆయన పూర్తిగా బ్యాలెన్స్ కోల్పో యారు. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న అస్త్రాలన్నీ ఇలా విఫలమవుతున్నాయి. ఈ స్థితిలో ఆయన ఇంకో ఆరు నెలలు జైల్లోనే ఉంటే పార్టీ బ్రెయిన్ డెడ్ ఖాయం. బయటకు వచ్చి అవయవదానం చేయవలసిందే! ఈ స్థితిని తప్పించడానికి యెల్లో మీడియా తెగ ప్రయాసపడుతున్నది. ‘ప్రజాస్వామ్యం కోసం’ అనే ముసుగులో మేధావుల పేరుతో కావలసినవారిని కొందరిని సమీకరించి ఒక సానుభూతి వాతావరణాన్ని సృష్టించడానికి తంటాలు పడు తున్నారు. అధినేత అవినీతికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లిస్తున్నది. అది పతనోన్ముఖాన వేగంగా జారిపోతున్నది. ఎలాగోలా బతికించాలని యెల్లో మీడియా తాపత్రయం. ‘అక్క ఆరాటమే గాని బావ బతికేట్టు లేడు!’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బ్రాండ్ బాబు బాగోతం!
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ! తప్పించుకు తిరిగేవాడు దొరికితే సంచలనమే సుమీ!! చార్లెస్ శోభరాజ్ వంటి కరుడుగట్టిన నేరస్తుడు అరెస్టయితేనే అప్పట్లో అదో సంచలన వార్తయింది. అటువంటిది మన అతిపెద్దమనిషి చంద్రబాబు అరెస్టయితే సంచలనం కలగకుండా ఉంటుందా? ఆయనపై ఇప్పటివరకు కనీసం రెండు డజన్ల పెద్దస్థాయి అవి నీతి ఆరోపణలు వచ్చాయి. కనీసం ఒక్కదానిపై కూడా విచా రణ జరక్కుండా అడ్డుచక్రాన్ని గిరగిరా తిప్పి విసరడంతో ఆయన చూపుడు వేలు నేర్పరితనం ఇప్పటికే రికార్డు పుటల్లోకి ఎక్కింది. చంద్రబాబును సెంట్రల్ జైలుకు పంపించిన అభియో గాలు ఇప్పుడు న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నాయి. కనుక వాటి మీద చర్చను పక్కనపెడితే, ఆయన అరెస్టు మాత్రం పెద్ద వార్తే అయింది. పెద్ద వార్తల చుట్టూ అనేక పిల్ల వార్తలూ, పిట్టకథలూ, ఉపాఖ్యానాలు, వ్యాఖ్యానాలు చేరిపోవడం సహజం. అలా చేరిపోయిన వాటిలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఇద్దరు నాయకుల రాజకీయ వ్యాఖ్యానాలు మరో చర్చకు దారితీశాయి. ఐటీ ఉద్యోగుల పేరుతో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు రెండు, మూడు ఊరేగింపులు చేశారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం చెబుతూ ‘పక్క రాష్ట్ర రాజకీయ అంశంపై ఇక్కడెందుకు నిరసనలు? ఐటీ కారిడార్లో శాంతిభద్రతల సమస్య సృష్టించడమెందు క’ని ప్రశ్నించారు. వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దానిపై స్పందించారు. చంద్రబాబు జాతీయ నాయకుడనీ, ఆయన కోసం ఎక్కడైనా ఆందోళన చేయవచ్చనీ చెబుతూనే ‘బీఆర్ఎస్కు ఆంధ్ర వాళ్ల ఓట్లు కావాలి గానీ, వాళ్ల సమస్యలు అక్కర్లేదా’ అని వ్యాఖ్యానించారు. ఈ చర్చలో అంతర్లీనంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి – ఐటీ రంగ అభివృద్ధికీ, హైదరాబాద్ అభి వృద్ధికీ మారుపేరుగా చంద్రబాబును ప్రస్తావిస్తూ ఒక ఫేక్ బ్రాండ్ ఇమేజ్ను గత పాతికేళ్లుగా యెల్లో మీడియా పోషించు కుంటూ వస్తున్నది. దాని కొనసాగింపుగానే ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబును తమ తాతపాదుల వారిగా తలపోస్తు న్నారనే భ్రాంతిని సృష్టించడం కోసం ఈ ర్యాలీలను తెలుగు దేశం పార్టీ నిర్వహించింది. ఈ ర్యాలీల్లో కూడా ఒక సామాజిక వర్గమే ప్రధాన భూమికను పోషించిందన్న మాట కూడా ఒక నిష్ఠుర సత్యం. ఇక రెండో అంశం – తెలంగాణలో ఆంధ్రావాళ్ల ఓట్లు. సెటిలర్ల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో, బాబు కనుసైగల అజమాయిషీలో ఉన్నట్టు కూడా యెల్లో మీడియా మరో భ్రాంతి జనిత బ్రాండ్ను సృష్టించింది. ఇద్దరు తెలంగాణ నాయకుల వ్యాఖ్యలు యథాలాపమా, ఆలోచనాపూర్వకమా అనే విషయం వారికి మాత్రమే తెలుసు. కానీ ఆచరణలో అవి స్పష్టమైన పాత్రనే నిర్వహించాయి. చంద్రబాబు మీద కప్పిన ఫేక్ బ్రాండ్ ముసుగును తొలగించే ప్రయత్నం కేటీఆర్ వ్యాఖ్యల్లో కనిపిస్తే, ఆ ముసుగును కాపాడే అంతరార్థం రేవంత్రెడ్డి మాటల్లో ధ్వనించింది. రేవంత్రెడ్డికి పూర్వాశ్రమంలో చంద్రబాబుతో ఉన్న సాహచర్యం కారణంగా అలా కావాలని మాట్లాడి ఉండవచ్చేమో! చంద్రబాబు పట్ల ఆయన సానుకూల స్పందన పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఆ నకిలీ బ్రాండ్ ముసుగును తొలగించడం బీఆర్ఎస్కు కచ్చితంగా ఒక రాజకీయ అవసరం. తమ హయాంలో జరిగిన నగరాభివృద్ధినీ, ఐటీ పురోగతినీ కూడా యథేచ్ఛగా యెల్లో మీడియా చంద్రబాబు ఖాతాలో వేస్తుంటే ఏ ప్రభుత్వమైనా ఎంతకాలం భరిస్తుంది? తెలుగుదేశం పార్టీ నేతలకు తమిళ సినిమారంగ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు. ఎన్టీఆర్కు వెన్ను పోటు పొడిచిన సమయంలో ఆయన హైదరాబాద్కు వచ్చి మరీ చంద్రబాబు గ్యాంగ్కు మద్దతు పలికిన సంగతి చాలా మందికి గుర్తే. ఆయన ఈమధ్య మాట్లాడుతూ హైదరాబాద్కు వెళ్తే న్యూయార్క్కు వెళ్లినట్లుంటుందని చెబుతూ, అందుకు చంద్రబాబే కారకుడని ఓ వీరతాడును ఆయన మెడలో వేశారు. ఈ పదేళ్లలో హైదరాబాద్లో జరిగిన పరిణామాలకూ, ఇరవయ్యేళ్ల కిందనే తోక ముడిచిన చంద్రబాబుకూ ఏరకమైన సంబంధముంటుంది? ఇటువంటి ఘటనలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సహజంగానే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఆ అసౌకర్యమే కేటీఆర్ మాటల్లో వెల్లడై ఉండవచ్చు. యెల్లో మీడియాను మాత్రమే అనుసరించే వారి మెదళ్లలో ఈ ఫేక్ బ్రాండ్ గుజ్జు ఎంత నిండిందో తెలియజెప్పే ఉదంత మొకటి ఈమధ్యనే మీడియాలో కనిపించింది. బాబు అరెస్టుకు నిరసన తెలియజేస్తున్న ‘ఐటీ ఉద్యోగుల్లో’ ఒక యువతి ముందు మన యెల్లో మీడియా మైకు పెట్టింది. ‘‘సీబీఎన్ అరెస్టును తెలంగాణ ప్రభుత్వం ఖండించలేదండీ! ఎందుకంటే ఇప్పుడు సీబీఎన్ బయటకొస్తే ఆటోమేటిక్గా ఏపీ డెవలపయిపోతుంది. తెలంగాణ వెనకబడుతుంది. అందుకని వాళ్లు ఖండించరు’’. ఆహా ఎంత పరిణతి! సాక్షాత్తూ జ్ఞాన సరస్వతీ దేవి ఉపదేశమా ఇది. ‘‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ ... ... ... సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా!’’ మనం మరోసారి అక్షరాభ్యాసం చేయాల్సిందే. నిన్నటిదాకా ఆయన బయటే ఉన్నాడు కదమ్మా. ఐదేళ్లు అధికారంలో కూడా ఉన్నాడు కదమ్మా. మరి ఆటోమేటిగ్గా ఏపీ అగ్రస్థానంలోకి ఎందుకు దూసుకెళ్లలేదు తల్లీ అనే సహజమైన ప్రశ్న కూడా ఆ దిగ్భ్రాంతి క్షణాన ఎవరికీ జనించి ఉండదు. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార సాధనాల (మీడియా) ద్వారా ప్రజాభిప్రాయాన్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయో (manufacturing consent) తెలియజెప్పే సిద్ధాంత పత్రాన్ని అమెరికా మేధావులు నోమ్ చోమ్స్కీ, ఎడ్వర్డ్ హెర్మాన్లు వెలువరించారు. ఏపీలో చంద్ర బాబు అధికారంలోకి రాకపూర్వమే అమెరికా పరిస్థితులను అధ్యయనం చేసి వారు ఈ థియరీని ప్రతిపాదించారు. కానీ, ప్రస్తుత మన యెల్లో మీడియా కర్మాగారాలను, వాటి ఉత్ప త్తులను చూసి ఉంటే పరిశోధన పక్కనపెట్టి మూర్ఛ పోయేవారు. ఈ కర్మాగారాల్లో తయారైన అతి ముఖ్యమైన ఉత్పత్తి ‘బ్రాండ్ బాబు’! ఐటీకి ఆద్యుడుగా, అభివృద్ధికి రోల్మోడల్గా, హైదరాబాద్ నిర్మాతగా బ్రాండ్ బాబును ప్రచారంలో పెట్టారు. ఇప్పుడీ బ్రాండ్ బాబు ఇమేజిపై పోస్ట్మార్టమ్ జరిగి తీరాలి. వర్తమాన చరిత్రకు జరుగుతున్న వక్రీకరణను సరిచేయవలసిన బాధ్యత కూడా వర్తమాన సమాజానిదే! హైదరాబాద్లోనే కాదు, మొత్తం దేశంలో కూడా ఐటీ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది మన తెలుగుజాతి కీర్తికిరీటం పీవీ నరసింహారావుకే దక్కాలి. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో హైదరా బాద్ మొదటిది. చంద్రబాబు నిర్మించినట్టుగా మనం చదువు కుంటున్న హైటెక్ సిటీ లేదా సైబర్ టవర్స్కు 1993లోనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోనే పెద్దవైన ఐదు ఐటీ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్స్ (టెక్ మహేంద్ర) 1987లోనే ఏర్పాటైంది. 1995లో జరిగిన వెన్నుపోటు పట్టాభిషేకం నాటికి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ది మూడో స్థానం. 2004లో చంద్ర బాబు గద్దె దిగేనాటికి నాలుగో స్థానం. ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో మళ్లీ మూడో స్థానానికి ఎగబాకింది. ఐటీ ఎగుమతుల్లో ఇప్పుడు హైదరాబాద్ది దేశంలో రెండో స్థానం. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, క్వాల్కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు వాటి అతిపెద్ద క్యాంపస్లను (అమెరికా వెలుపల) హైదరాబాద్లో చంద్రబాబు అనంతర కాలంలోనే ఏర్పాటు చేశాయి. ఐటీ రంగం విస్తృతమవుతున్న నేపథ్యంలో నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్తగా 11 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతినిస్తే, వాటికి వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో యెల్లో మీడియా ఆధ్వర్యంలో, కమ్యూనిస్టుల తోడ్పాటుతో, పెద్ద ఉద్యమాన్ని లేవదీసి వాటిని ఆపేశారు. చంద్రబాబు గద్దెనెక్కగానే ఏకంగా 30 కాలేజీలను ప్రారంభించారు. ఎవరూ కిమ్మనలేదు. ఆ పదకొండు ఎవరికి చెందినవి, ఈ 30 ఎవరివి అనేది ఒక ప్రత్యేక రాజకీయ – సామాజిక అధ్యయనాంశం. ఇప్పుడు అప్రస్తుతం. వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇంజనీరింగ్ మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో వీసాల కోసం అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని వైఎస్ హైదరా బాద్లో ఏర్పాటు చేయించారు. ఇవన్నీ వాస్తవాలు! చెరిపేస్తే చెరిగిపోయేవి కావు. ఎవరైనా రికార్డులను పరిశీలించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డును, శంషాబాద్ ఎయిర్పోర్టును కూడా యెల్లో మీడియా బాబు ఖాతాలోనే వేస్తున్నది. బాబు సంగతి సరేసరి. ‘సెల్ఫోన్ కనిపెట్టింది కూడా నేనే’ అనే స్థాయికి చేరిన వైపరీత్యం ఆయన మనస్తత్వానిది. ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేసిందీ, కొత్త ఎయిర్పోర్టును ప్రారంభించిందీ కూడా వైఎస్సార్ హయాంలోనే! ఔటర్ రింగ్రోడ్డు కోసం భూసేకరణ దగ్గర్నుంచీ రోడ్డు నిర్మాణం 90 శాతం పూర్తయింది కూడా వైఎస్సార్ హయాంలోనే! ఇక ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ఎయిర్పోర్టు నుంచి నగరానికి వస్తున్నప్పుడు రజనీ కాంత్కు కనిపించిన న్యూయార్క్ దృశ్యం ఈ అయిదేళ్లలో ఆవిష్కృతమైన పరిణామం. పీవీ నరసింహారావుకు, వైఎస్సార్కు, కేసీఆర్కూ దక్కా ల్సిన ఘనతలను కూడా బరబరా లాక్కుని చంద్రబాబుకు కట్టబెట్టే సమాచార గూండాగిరీకి యెల్లో మీడియా పాల్పడు తున్నది. అది ప్రజాభిప్రాయ ‘ఉత్పత్తి’ దశను దాటి ప్రజాభి ప్రాయ ‘రిగ్గింగ్’ దశకు చేరుకున్నది. అందులో భాగమే తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న సెటిలర్లంతా బాబు వర్గమే అనే ప్రచారం. బాబు వర్గం అంటే వారి ఉద్దేశం ప్రకారం టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం. సెటిలర్లలో వారు సింహభాగం ఉంటారు. మిగిలిన వారిని ప్రభావితం చేస్తారని వారి ఉద్దేశం. ఈ తప్పుడు లెక్కలతోనే తెలంగాణ రాజకీయ పార్టీలను యెల్లో మీడియా దబాయి స్తున్నది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయ బోయే నాయకులను బెదిరించి చంద్రబాబు అరెస్టును ఖండించే ప్రకటనలు యెల్లో మీడియా చేయిస్తున్నది. కానీ వారు చెబుతున్న లెక్కలు వాస్తవమేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం దాదాపు ఇరవై లక్షలమంది ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్లు ఉన్నారు. వీరిలో ఇరవై శాతం వరకు కమ్మవారుంటారని అంచనా. పదిహేను శాతం రెడ్లు, పదిహేను శాతం కాపులు. బీసీలు ముప్పయ్ శాతం. మిగిలిన ఇరవై శాతం ఇతరులు. ఇవి వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. యెల్లో మీడియా దబాయింపు ప్రకారం ఇరవై శాతం సామాజిక వర్గం చెప్పుచేతుల్లోనే ఎనభై శాతం మసలుకుంటున్నట్టు లెక్క. వాస్తవానికి ఆంధ్రా సెటిలర్లు అనేది ఒక ఓటు బ్యాంకు ఎంతమాత్రమూ కాదు. ఎవరి రాజ కీయ అభిప్రాయాలు వారివి. కులాల లెక్కలు కూడా చెల్లవు. అసలు ఆంధ్రప్రదేశ్లోనే కుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాజకీయ పోరాటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గ పోరాటంగా మార్చివేశారు. పేదలకూ – పెత్తందార్లకూ మధ్య యుద్ధంగా ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇంకా తెలుగు దేశం పార్టీ మాత్రమే ఒక్క కులాన్ని పట్టుకుని వేలాడుతున్నది. అటువంటి విభజనే సెటిలర్లలో కొంతమేరకు ఉండవచ్చు. లేదా స్థానిక అంశాల ఆధారంగా వారి మద్దతు ఉండవచ్చు. సెటిలర్లపై చంద్రబాబు ప్రభావం అనేది యెల్లో మీడియా ఉత్పత్తి చేస్తున్న భ్రాంతి మాత్రమే. తెలంగాణ ప్రజలకు చంద్ర బాబులో ఇప్పటికీ ఒక సామాజిక విధ్వంసకుడు కన్పిస్తాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్నదో లేక మరోసారి బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడుతున్నదో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వికసించిన విద్వత్తేజం!
మూడు దశాబ్దాల అమానవీయ రాజకీయ వ్యవస్థ తన మరణ వాఙ్మూలాన్ని లిఖించవలసిన పరిస్థితులు పొడసూపు తున్నాయి. సమతామమతలతో కూడిన ఒక సరికొత్త సామాజిక పొందిక తన జనన నమోదుకు గుర్తుగా జేగంట మోగిస్తున్నది. ఎట్టకేలకు మన కపట రాజనీతి సామ్రాట్టు చట్టం చేతికి చిక్కి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పెత్తందారీ పరిపాలన పాపాలు ఒక్కొక్కటిగా బోనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మరో కొత్తకోణం ఆవిష్కృత మవుతున్నది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని మనకాలపు మాకియవెలీ న్యాయాధికారి ఎదుట బుకాయిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఒక అబ్బురం చోటుచేసుకున్నది. పెత్తందారీ పాలనలో అణగారిపోయిన పేదవర్గాల్లో మొగ్గతొడిగిన బాల్యం అంతర్జాతీయ వేదిక మీద గొంతు సవరించుకున్నది. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పదిమంది బాలలు ఐక్యరాజ్యసమితి వేదికలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఎలుగెత్తారు. విఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ధైర్యంగా మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో తమ కళ్లెదుటనే విప్పారుతున్న మరో ప్రపంచపు కాంతి కిరణాలను గురించి వివరంగా చెప్పారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, సరిగ్గా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ బకలోరియేట్ (ఐబీ) సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో క్రమానుగతంగా ఐబీ సిలబస్ను ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే పాఠశాల విద్యా సిలబస్ ఇది. ఈ విధానంలో చదువుకునే పిల్లలపై మానసిక ఒత్తిడి ఉండదు. వారిలోని సృజనశీలతను వెలికితీసే విధంగా ఉంటుంది. హేతుబద్ధమైన స్వతంత్ర ఆలోచనా ధోరణి అలవడుతుంది. తార్కిక వివేచన అబ్బుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభగ్రాహ్యం చేసుకోగల నైపుణ్యం ఒంటబడుతుంది. ప్రపంచం మొత్తం మీద మూడు వేల స్కూళ్లలో, భారతదేశంలో రెండొందల కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఈ సిలబస్ అందుబాటులో ఉన్నది. చదివే క్లాసును బట్టి, స్కూల్ స్థాయిని బట్టి ఏటా ఆరు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లోని అత్యంత సంపన్నులైన వారి పిల్లలకు మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉన్నది. వైఎస్ జగన్ ప్రభుత్వం అంత ఖరీదైన విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేబోతున్నది. మొదటి సంవత్సరం ఒకటో క్లాసుతో ప్రారంభించి ఏటా ఒక క్లాసును పెంచుకుంటూ వెళ్తారని సమాచారం. ఇదొక నిశ్శబ్ద విప్లవం. వచ్చే పన్నెండేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకమైన ఐబీ గొడుగు కిందకు వస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై లక్షలమందిని ఐబీ విద్యావిధానం తీర్చి దిద్దుతున్నది. ఏపీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడే యాభై లక్షల మంది చదువుతున్నారు. ఇంకో పన్నెండేళ్ల తరువాత ఎంత మంది ఉంటారో అంచనా వేయగలిగితే ఇప్పుడు పడిన అడుగు ఎంత విప్లవాత్మకమైనదో అర్థమవుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఐబీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుం దనుకున్నా కూడా బహుశా సగంమంది ఏపీలోనే ఉంటారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య – వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్లు పనిచేసిన కాలంలోనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం ప్రారంభమైంది. విభజిత రాష్ట్రంలోనూ అదే పంథా కొనసాగింది. ఫలితంగా పేదపిల్లలకు నాణ్యమైన చదువు లభించక ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోయారు. చాలామంది డ్రాపవుట్లుగా మిగిలి పోయారు. మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల కోసం రుణభారంలో కూరుకుపోవడం సర్వ సాధారణమై పోయింది. ఆ పరిస్థితిని ‘నాడు–నేడు’ కార్య క్రమం చక్కదిద్దిందనేది మన కళ్లముందటే కదలాడుతున్న చరిత్ర. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతోనే ఆగిపోలేదు. పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిషు మీడియంతోపాటు సీబీఎస్ఇ సిలబస్ను కూడా ప్రవేశ పెట్టారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ప్రకటించిన జగన్మోహన్రెడ్డి ఆ ఆస్తి విలువను అనేక రెట్లు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టారు. అప్పటికే కనాకష్టం మీద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివిస్తున్న తల్లులను నిరుత్సాహపరచకుండా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వారికి కూడా వర్తింపజేశారు. ఇంగ్లిషు మీడియంలోకి పిల్లలు సులభంగా ప్రవేశించడానికి వీలుగా ఒకటి నుంచి పదో క్లాసు వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందరికీ అందజేస్తున్నారు. ‘విద్యాకానుక’ కింద పాఠ్య పుస్తకాలతోపాటు మూడు జతల యూనిఫాం, నోట్బుక్కులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బూట్లు, బెల్టును కూడా స్కూళ్లు తెరిచే తొలిరోజు నాటికే ఉచితంగా అందజేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల మీది నుంచి పిల్లల చదువు భారాన్ని పూర్తిగా తొలగించి జగన్ ప్రభుత్వం తన భుజాలపైకి ఎత్తుకున్నది. ఇంగ్లిష్ మీడియంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు ముందడుగు వేయడం కోసం డిజిటల్ బోధనా విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో విస్తృతంగా ప్రవేశ పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 8వ తరగతి నుంచి ఆపైన చదివే విద్యార్థులకు ట్యాబ్లను అందజేసింది. పాఠ్యాంశాల్లో తమ ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ట్యాబ్ల ద్వారా ఖరీదైన ‘బైజూస్’ కంటెంట్ను అందు బాటులోకి తెచ్చింది. ఆరు నుంచి పదో క్లాస్ వరకు అన్ని తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఒక్క ఉదాహరణ చాలు – చంద్రబాబు పరిపాలనా కాలంలో మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఆ యాభై శాతం మంది కూడా మరో గత్యంతరం లేక మిగిలి పోయినవారే! నాలుగేళ్లలో అది 60 శాతానికి పెరిగింది. ‘అమ్మ ఒడి’ కూడా అందుతున్న నేపథ్యంలో పెద్దక్లాసు పిల్లలు మధ్యలో స్కూల్ మారడం ఇష్టంలేక ఉండిపోతున్నారు. లేకుంటే ఈ శాతం మరింత పెరిగేది. ఒకటి నుంచి ఎనిమిదో క్లాస్ వరకు లెక్కిస్తే చేరికలు చంద్రబాబు హయాంలో 75 శాతం గరిష్ఠంగా ఉండగా ఇప్పుడది 100 శాతాన్ని దాటింది. అంటే హౌస్ఫుల్, ఎక్స్ట్రా బెంచ్ అన్నమాట! జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు ఉన్నత విద్యారంగాన్ని ఉద్దీపనం చేశాయి. ఎంతగా అంటే జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగం చేరికల్లో 3.8 శాతం పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్లో 14.81 శాతం నమోదైంది. ఇది చాలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి! 2018–19లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 37 వేలమందికి ఉద్యోగాలు లభిస్తే 2022–23లో ఒక లక్షా 20 వేలమందికి ఉద్యోగాలు లభించాయి. చేరికల్లోనూ, నియామ కాల్లోనూ నాలుగేళ్లలో నాలుగు రెట్లు ప్రగతి. ‘మేం బాలికలం, ఈ ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధంగా ఉన్నామ’ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులో ఏపీ బాలిక రాజేశ్వరి సభావేదిక మీది నుంచి ప్రకటించింది. ఈ ప్రకటన హాజరైన సభికులను ముగ్ధుల్ని చేసింది. రాజేశ్వరి ఏపీలోని నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని. ఆంగ్లభాషలో అనర్గళంగా, నిర్భయంగా అంతర్జాతీయ వేదికపై మాట్లాడటం చాలామంది గమనించి ఉండవచ్చు. మరో ఏపీ బాలిక షేక్ అమ్మజాన్ కూడా అంతే ధాటిగా మాట్లాడి ఆకట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగేళ్లలో ప్రారంభమైన విద్యా విప్లవం రాజేశ్వరి, అమ్మజాన్ వంటి వందలాదిమంది పేదింటి బిడ్డల్ని నాయ కత్వ శ్రేణుల్లో నిలబెట్టింది. ఆధిపత్య శక్తులు లేదా పెత్తందారీ వర్గాలు ఏరకమైన విప్లవాన్నీ సహించవు. విద్యావిప్లవాన్ని కూడా సహించలేదు. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినప్పుడే సాంస్కృతిక దాడికి పూనుకున్నారు. దీన్ని తెలుగు భాషపై జరుగుతున్న దాడిగా చిత్రించేందుకు చంద్రబాబు – యెల్లో మీడియా తెగ ప్రయాస పడ్డారు. తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ పేదల పిల్లల్ని మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని శాసిస్తున్న పెత్తందారీ శక్తుల అంతరంగాన్ని జనం గమనించారు. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కూడా యెల్లో మీడియా అవాకులు చెవాకులు పేలడం తాజా ఉదాహరణ. ఇప్పుడు సర్వహంగులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లపై పెత్తందారుల కన్ను పడింది. పొరపాటున అధికారంలోకి వస్తే ఈ స్కూళ్ల నిర్వహణను నారాయణ సంస్థలకు అప్పగించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అప్పుడిక నారా యణకు ఫీజులు చెల్లించి చదువుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వ స్కూల్ భవనాలనూ, స్థలాలనూ నారాయణకు అప్పగించే ప్రయత్నం జరిగింది. మరోసారి చంద్రబాబు గెలిచి ఉంటే పేద పిల్లలకు చెట్టుకింది చదువులే మిగిలి ఉండేవి. ఈ పరిస్థితి ఒక్క విద్యారంగానికే పరిమితమైనది కాదు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుకున్న వైద్యం, వ్యవసాయ రంగాలపై కూడా పెత్తందారీ శక్తులు కన్నేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు భిన్న ప్రయోజనాల పట్ల వైరుద్ధ్యంగా, ఆ వైరుద్ధ్యం పోరాటంగా రూపుదిద్దుకున్నాయి. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి పెత్తందార్లను మేపే విధానం చంద్రబాబు పార్టీది. ఆయన పద్నాలుగేళ్ల పాలనలో అనేకమార్లు రుజువైన నగ్నసత్యమిది. పెత్తందారీ శక్తుల కరదీపికగా యెల్లో మీడియా పనిచేస్తున్నదని కూడా పలుమార్లు రుజువైంది. బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకులపై హీనంగా, అవమానకరంగా బ్యానర్ వార్తలు వండి వార్చిన నేపథ్యం ఈ మీడియాది. కనుక పేద ప్రజలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యామ్నాయ ఎజెండాను భుజాన వేసుకున్న జగన్మోహన్రెడ్డిని ఏమాత్రం సహించే స్థితిలో రాష్ట్రంలోని పెత్తందార్ల పార్టీ, వారి మీడియా లేదన్నది ఒక బహిరంగ రహస్యం. రాష్ట్ర రాజకీయ పోరాటాల అంతస్సారం ఇదే. పెత్తందారీ వర్గాలు, పేదల ప్రయోజనాలకు మధ్య వైరుద్ధ్యం, పోరాటం. ఈ సారాన్ని పేదలు, బలహీనవర్గాల ప్రజలు గ్రహించారు గనుకనే చంద్రబాబు కూటమికి భవిష్యత్తుపై బెంగ పట్టుకున్నది. అన్నిరకాల అవకాశవాద పొత్తుల కోసం అర్రులు చాస్తున్నది ఈ బెంగతోనే! ఈ నేపథ్యంలో వచ్చిన అవినీతి కేసును సానుభూతి కోసం ఉపయోగించుకు నేందుకు ఆ కూటమి పడరాని పాట్లు పడుతున్నది. కానీ, జనస్పందన శూన్యం. అవినీతిలో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానాలు కూడా భావించడంతో వారు ఆశించిన సానుభూతి రావడం లేదు. కనీసం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు సైతం వీధుల్లోకి రాని దైన్యం ఆ పార్టీని వెన్నాడుతున్నది. కేవలం చంద్రబాబు సొంత సామాజికవర్గం యువతీ యువకుల్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడక్కడా ప్రదర్శనలు చేసి మమ అనిపిస్తున్నారు. నిజానికి యాభయ్యేళ్లకు పూర్వం వరకు ప్రగతిశీల భావాలతో పరుగుతీసిన సామాజిక వర్గమే అది. కానీ చంద్రబాబు బ్రాండ్ స్వార్థ సంకుచిత రాజకీయాలు, యెల్లో మీడియా పెద్దల అవసరాల కోసం జనజీవన స్రవంతి నుంచి ఆ పాయను వేరుచేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కళాత్మక చౌర్యం
చతుష్షష్టి కళల్లో హస్తలాఘవం కూడా ఒకటి. దానర్థం దొంగతనమేనని మృచ్ఛకటికం నాటకంలోని శర్విలకుడు అనే దొంగ అభిప్రాయం. కనుక చాకచక్యంగా, కళాత్మకంగా చేసే దొంగతనాన్ని చోరకళగా భావించాలని వాదిస్తాడు. ఓ తెలుగు సినిమాలోని బ్రహ్మానందం పాత్ర కూడా ఇటువంటి అభిప్రా యాన్నే వ్యక్తం చేస్తుంది. జైలు గదిలో తనతోపాటున్న బ్రహ్మాజీని ఏం చేశావని బ్రహ్మానందం అడుగుతాడు. ఫోర్జరీ అంటాడు బ్రహ్మాజీ. ‘ఫోర్జరీ అంటే ఆర్ట్... ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా?’ అంటూ వాపోతాడు బ్రహ్మానందం. ఇప్పుడు తెలుగు దేశం, దాని మిత్రపక్షాలవారు, యెల్లో మీడియా బాస్లు కూడా ఇదేవిధంగా వాపోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద చంద్రబాబు ప్రమేయంతో జరిగిన ఒక స్కామ్పై సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. 371 కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ఈ స్కామ్లో 241 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరిన వైనాన్ని సీఐడీ నిర్ధారించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు ఆయనను నంద్యాలలో అరెస్టు చేసింది. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేసే ఫామ్పై (ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్) ఆయన సంతకాన్ని తీసు కున్న దృశ్యం టీవీల్లో కనిపించింది. కానీ తనకు కారణం చెప్ప కుండా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి హెలికాప్టర్లో తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అందుకు ఆయన నిరాకరించారు. అరెస్టు చేసిన ఇరవై నాలుగ్గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి ఉన్నందువల్ల, ఈలోగా సీఐడీ వారు ప్రశ్నించే సమయం ఇవ్వకూడదన్న వ్యూహంతో ఆయన వ్యవహరించి నట్టు కనిపించింది. అందుకే హెలికాప్టర్లో కాకుండా తన వాహనంలోనే వస్తానని భీష్మించుకున్నారు. పోలీసులు ఆయన మాటను గౌరవించారు. మొదట అరెస్టవడానికి ఆయన సమ్మ తించలేదు. మొండికేసే ప్రయత్నం చేశారు. కానీ, తప్పక పోవడంతో తన వాహనంలోకి ఎక్కి కూర్చున్నారు. రోడ్డు మార్గాన నెమ్మదిగా వెళ్తుంటే తన అరెస్ట్ వార్త దావానలంగా వ్యాపించకపోతుందా, వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు దండయాత్రకు రాకపోతారా? జనాన్ని చూసి జడుసుకొని అల్లూరి సీతారామరాజును విడిచిపెట్టి వెళ్లినట్టు పోలీసులు తనను కూడా వదిలేసి తోకముడవకపోతారా అనే రవ్వంత ఆశ కూడా ఏ మూలో ఉండవచ్చు. మార్గమధ్యంలో దండయాత్రలూ, దండుయాత్రలూ ఎదురు కాలేదు కానీ, ఆయన కోరుకున్నట్టుగానే బాగా ఆలస్యమైంది. సీఐడీ అధికారుల ప్రశ్నలకు సహాయ నిరా కరణలో కొంత సమయాన్ని, విశ్రాంతి పేరుతో కొంత సమ యాన్ని బాబు కరిగించారని సమాచారం. బాబు విజయవాడకు చేరుకోకముందే ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ల బృందం చేరుకున్నది. కోర్టులో హోరాహోరీగా వాదప్రతివాదాలు జరిగాయి. పది గంటలపాటు జడ్జి ఈ వాదనల్ని విన్నారు. ఇరువైపుల నుంచీ పలు సందర్భాల్లో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరకు ప్రభుత్వ న్యాయవాది వాదన, రిమాండ్ రిపోర్ట్ అంశాలతో ఏకీభవించి చంద్రబాబును రిమాండ్కు పంపారు. హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించిన కేసు కాబట్టేమో, సుదీర్ఘ సమయం వాదోపవాదాలు జరిగినా సరే జడ్జి ఓపిగ్గా విన్నారు. తీర్పు వెలువడిన మరుక్షణం నుంచే తెలుగుదేశం – యెల్లో కూటమి, దాని సోషల్ మీడియా బృందాలు వాటి వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. జడ్జి మీద వ్యక్తిగతంగా దాడుల్ని ఎక్కుపెట్టారు. ఎక్కడి నుంచి వెతికి పట్టుకున్నారో తెలియదు, అది నిజమో కాదో కూడా తెలియదు గానీ, జడ్జిగారిది బీసీ సామాజికవర్గంగా తేల్చేశారు. ఇంకేముంది... యెల్లో కూటమి పెత్తందారీ దురహంకారం బుసలు కొట్టింది. ‘బీసీలు జడ్జీలుగా పనికిరారు, వారిని నియమించకండి’ అంటూ కేంద్ర న్యాయశాఖకు లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడాయన అనుచర గణాలు ఆయన ఆదర్శాన్ని అందిపుచ్చుకొని విశృంఖలంగా చెలరేగి పోతున్నాయి. తీర్పు చెప్పే న్యాయమూర్తుల్లో, ప్రాణం పోసే డాక్టర్లలో, శాంతిభద్రతలు కాపాడే పోలీసుల్లో కూడా కులం నీడల్ని వెతికిపట్టుకునే దౌర్భాగ్యపు పెత్తందారీ దురహంకార సంప్రదాయాన్ని చంద్రబాబు కూటమి పెంచి పోషిస్తున్నది. పొరపాటున అవతలివారు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, మైనా రిటీలో అని తేలితే వారి ప్రతిష్ఠ మీద రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయ పరమైనది మాత్రమే కాదు... అది సామాజిక, సాంస్కృతిక విలువల పోరాటం కూడా! ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టించిన స్కిల్ కేసు వివరాలను మరోసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తన అనుచరులను తీసుకొచ్చి సంస్థ పగ్గాలను అందించారు. ఈ సంస్థకూ, డిజైన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థకూ, జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకూ మధ్యన ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని వెల్లడిస్తూ మరో జీవోను విడుదల చేశారు. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు సహకరిస్తుంది. ఇందుకోసం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల కొనుగోలు కోసం 3,300 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 90 శాతాన్ని సీమెన్స్ సంస్థ గ్రాంట్– ఇన్–ఎయిడ్గా (ఉచిత సహాయం) సమకూరుస్తుంది. ప్రభుత్వం తరఫున 10 శాతం కింద 330 కోట్లను సమ కూర్చాలి. జీఎస్టీ చెల్లింపులతో కలిపి అది 371 కోట్లు అవుతుంది. ఈమేరకు కుదిరిన ఒప్పంద పత్రంలో మాత్రం గ్రాంట్–ఇన్–ఎయిడ్ ప్రస్తావన గానీ, కుదిరిన తేదీగానీ ఏమీ లేవు. ప్రభుత్వ వాటాగా 371 కోట్లను తక్షణం డిజైన్టెక్ సంస్థకు విడుదల చేయాలని పైనుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. సీమెన్స్ వాటా విడుదల కాకుండానే పది శాతాన్ని ఏకమొత్తంగా విడు దల చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థికశాఖ అధికారులు నోటు ఫైళ్లపై కామెంట్లు రాసినా ఖాతరు చేయలేదు. పదేపదే పైనుంచి ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శులు నోటుఫైళ్లపై రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత డిజైన్టెక్ సంస్థకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డబ్బులు వెళ్ళాయి. అసలీ డిజైన్ టెక్ సంస్థ పాత్ర ఏమిటి? నేరుగా ఏపీఎస్ఎస్డీసీనే సీమెన్స్ సంస్థతో వ్యవహారం నడపవచ్చు గదా! 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్లను పిలవకుండా ఉండడానికి సీమెన్స్ ఉచిత సాయం కథ ముందుకు తెచ్చారు. ఉచిత సాయం 90 శాతం కింద సాంకేతిక సహకారాన్ని అందిస్తారని మధ్యలో కథ మార్చారు. ఈ డిజైన్టెక్ అనే సంస్థది బ్రోకరేజీ పాత్ర. ఈ సంస్థకు చేరిన 371 కోట్లలో 59 కోట్లు వెచ్చించి సీమెన్స్ కంపెనీ నుంచి ఏపీఎస్ఎస్డీసీకి అవసరమైన పరికరాలను, సాఫ్ట్వేర్ను తెప్పించారు. ఈ కొనుగోలు జస్ట్ షాపింగ్ లాంటిదే. ఎవరైనా కొనుక్కో వచ్చు. ఒప్పందాలతో పనిలేదు. స్కిల్ సెంటర్ల కోసం మొత్తంగా చేసిన ఖర్చు ఇదే. దీనికే 3,300 కోట్ల బిల్డప్ ఇచ్చారు. టెండర్ల గోల లేకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కథను అల్లుకొచ్చారు. డిజైన్ టెక్ సంస్థ మిగిలిన సొమ్ములో 241 కోట్లను పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి తరలించింది. ఇది పుణె కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఆ సొమ్ము ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, సింగపూర్లోని కంపెనీకి తరలివెళ్లింది. వాటి వివరా లను కూడా సీఐడీ తన రిపోర్టులో పొందుపర్చింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మొత్తం ప్రాజెక్టు వ్యయా నికి సరిపోయేలా నకిలీ ఇన్వాయిస్లను కూడా ఈ పుణె కంపెనీ సమీకరించుకున్నది. దీనికి బ్రోకరేజీ ఫీజు వసూలు చేసి ఉండ వచ్చు. ఇదిగో ఈ షెల్ కంపెనీల మీద జీఎస్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. అప్పటికింకా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. జీఎస్టీ అధికారులు ఈ నకిలీ వ్యవహారాలను రాష్ట్ర ఏసీబీకి ఉప్పందించారు. ఏసీబీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. సూత్రధారి తానే కనుక ఆయన మౌనం వహించారు. ఏసీబీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. మౌనంగా నోట్ ఫైళ్లతో సహా సంబంధిత డాక్యుమెంట్లను కాల్చేయాలని ఆదేశించారు. తదనంతరం రంగంలోకి దిగిన ఈడీ ఈ మనీల్యాండరింగ్ వ్యవహారాన్ని మొత్తం నిర్ధారించింది. సీమెన్స్ కంపెనీకి ఇండియా విభాగం చీఫ్గా ఉన్న సుమన్ బోస్తో సహా డిజైన్టెక్ ఎంపీ వికాస్ కన్వీల్కర్, మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ సుమన్ బోస్ అసలు పేరు సౌమ్యాద్రి బోస్గానూ, డిజైన్టెక్ ద్వారా ఏపీతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమన్ బోస్గా సంతకం చేసినట్టుగానూ ఈడీ గుర్తించింది. దొంగ సంతకం దొంగ స్కీమ్కు రుజువు కదా! ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ విభాగం ఈ కేసులో దర్యాప్తు చేయడానికి పూర్వమే కేంద్ర జీఎస్టీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఈ స్కామ్ను పసిగట్టాయి. ఆ కారణంగా సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్ ఉద్యోగం కూడా ఊడింది. ఈ కేసు మొత్తంలో అన్నిటికంటే ప్రధానమైన అంశం – సీమెన్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)కి 2022, ఫిబ్రవరి మూడో తేదీ నాడు రాసిన లేఖ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాము ఎటువంటి ఒప్పందం చేసుకోలేదనీ, అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ తమ దగ్గర ఏమీ లేదని ఆ లేఖలో కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ స్వయంగా ఇటువంటి స్కీమ్ లేదని చెబుతుంటే మన చినబాబు, పెదబాబు, యెల్లో మీడియా మాత్రం ఉందని దబాయిస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఒక జాతీయ మీడియా చానల్లో కూర్చొని లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఉత్తర కుమారుడు యుద్ధానికి బయల్దేరితే జనించినంత ఆసక్తి చినబాబు మీడియా డిబేట్లపై జనించింది. కష్టంగా కొన్ని విషయాలు చెప్పాడాయన. అన్నీ టెక్నికల్ విష యాలే! గుజరాత్లో సీమెన్స్ కంపెనీ ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ను అమలు చేసిందనీ, దాన్ని పరిశీలించాకనే తాము ఒప్పందం చేసుకున్నామనీ లోకేశ్ చెప్పాడు. గుజరాత్లో జరిగిన ఒప్పంద పత్రంపై సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసిన వ్యక్తి ఏపీ ఒప్పందంపై సుమన్ బోస్ అని చేశాడు. అక్రమ పథకానికి అక్రమ సంతకం, సక్రమ పథకానికి సక్రమ సంతకం అన్న మాట. చివరకు అతను కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. మామూలుగా తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బెదరగొట్టే విధంగా విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వామి చినబాబు విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శించాడు. మొదటి ఒకటి రెండు ప్రశ్నలు కొంచెం గట్టిగా అడగ్గానే లోకేశ్ కంగారుపడ్డట్టు కనిపించాడు. దాంతో ఆర్ణబ్ కొంచెం నెమ్మదించాడు. ‘లవకుశ’ సినిమాలో ‘ముక్కుపచ్చారని మునికుమారుల చంపకూడదని నే గొంకుచుంటి’ అనే పద్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్టీ రామారావు ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ గోస్వామిలో కనిపించాయి. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ తప్పు చేస్తే చైర్మన్ ఎలా బాధ్యుడవుతాడు అని లోకేశ్ ఎదురు ప్రశ్న వేశాడు. అంటే మేనేజర్ స్థాయిలో తప్పు జరిగినట్టు అంగీకరిస్తున్నారా అనే సరికి చినబాబు ఖంగుతిన్నారు. స్కామ్ జరిగితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందో సీఐడీ నిరూపించాలి కదా, అలా నిరూపించ లేదని ఆయన ఆఖరి బాణం వదిలారు. నిరూపించకపోవడమేమిటీ? సీఐడీ నిక్షేపంగా నిరూపిస్తు న్నది. ఈడీ కూడా నిర్ధారిస్తున్నది. షెల్ కంపెనీల ద్వారా సింగ పూర్, దుబాయ్లకు డబ్బు చేరిన తర్వాత కథలోకి యోగేశ్ గుప్తా ఎంట్రీ ఇస్తాడు. ఆయన హవాలా మార్గంలో దేశానికి తరలించి, మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేస్తారు. పార్థసాని హైదరాబాద్లో పెండ్యాల శ్రీనివాస్కు (చంద్రబాబు పీఏ) అందజేస్తారు. శ్రీనివాస్ ద్వారా ప్యాలెస్ డెన్కు ఆ డబ్బు చేరుతుంది. సరిగ్గా ఇవే పేర్లు, ఇదే మోడస్ ఆపరెండీని మనం ఐటీ శాఖ వెలుగులోకి తెచ్చిన స్కామ్లో కూడా చూశాము. అమరావతిలోని తాత్కాలిక సచివాలయం భవనం కాంట్రాక్టు ఇచ్చినందుకు గాను పల్లోంజీ సంస్థ చెల్లించిన 118 కోట్ల ముడుపులను (600 కోట్ల పనికి) ఇదే పద్ధతిలో తరలించినట్టు ఐటీ శాఖ కనిపెట్టింది. స్కిల్ స్కామ్లో విచారణ కోసం పై ముగ్గురికీ నోటీసులివ్వగానే వారు అందుబాటులో లేకుండా మాయమయ్యారు. యోగేశ్ గుప్తా కనిపించడం లేదు. మనోజ్ పార్థసాని దుబాయ్కీ, పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకూ ఉడాయించారు. స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసు కోవాలన్న ఆసక్తి నిజంగానే లోకేశ్బాబుకు ఉంటే ఆ ముగ్గుర్నీ పిలిపించి సీఐడీకి అప్పగిస్తే సరిపోతుంది. గడచిన మూడు దశాబ్దాలుగా ఎవరికీ దొరక్కుండా కళాత్మకంగా నెగ్గుకొస్తున్న ‘స్కామింగ్‘లో ఇప్పుడు తడబడట మేమిటని యెల్లో కూటమి విస్తుపోతున్నది. ఈ కేసులో అరెస్ట యిన దగ్గర్నుంచీ ఈ శిబిరం నుంచి సాంకేతిక అభ్యంతరాలే తప్ప దొంగతనం జరిగిందా లేదా అనే అసలు విషయం జోలికి వెళ్లడం లేదు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదు గనుక స్కామ్తో తనకు సంబంధం లేదని బాబు వాదిస్తున్నారు. ఇదో వితండవాదం. నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే అనుమానితుల పేర్లతో వేసేది ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్). దర్యాప్తు క్రమంలో అసలు నేరస్తుడు బయట పడొచ్చు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు గనుక అసలు నేరస్తుడిని వదిలేస్తారా?.. నవ్విపోతారు. ఈ వ్యవహారంలో తన పాత్ర లేదనీ, ఎవరినీ ప్రభావితం చేయలేదనీ ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ అడుగడుగునా ఈ వ్యవహారంలో ఆయన పాత్రను సీఐడీ దర్యాప్తు నిగ్గుదేల్చింది. ఎపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, నిబంధనలకు విరుద్ధంగా తన మనుషుల్ని దానిలో జొప్పించడం వరకు ఆయనదే ప్రధాన భూమిక. హడావిడిగా ప్రభుత్వ వాటాను వెంటపడి విడుదల చేయించిందే నాటి ముఖ్యమంత్రి. ఇందు కోసం సంబంధిత ఫైళ్లలో 13 చోట్ల ఆయన సంతకాలు చేసిన విషయాన్ని సీఐడీ రుజువు చేసింది. విద్యాశాఖతో సంబంధం లేకుండా నిధుల విడుదలకు ప్రత్యేక గ్రీన్ఛానల్ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అప్పుడు ఆర్థిక శాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నది. ఇవన్నీ ఎవరు చెబితే చేశారు? అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తనను అరెస్టు చేయడం కుదరదనీ, తన మీద ఐపీసీ 409 సెక్షన్పై కేసు బనాయించడం చెల్లదనీ వాదిస్తున్నారు. అంతే తప్ప స్కామ్ జరగలేదని వాదించడం లేదు. ఈ రెండు అంశా లపై ఏసీబీ కోర్టులో విస్తృతంగా వాదప్రతివాదాలు జరిగాయి. గౌరవ న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆయనలో వణుకు మొదలైందని సమాచారం. ఈ స్కామ్తోనే కేసులు ఆగవని, మరో అరడజన్ కేసుల్లో తాను ఇరుక్కోవడం ఖాయ మని భావిస్తున్నారట! చట్టానికి దొరక్కుండా కొల్లగొట్టే తన కౌశలం ఎందుకిలా కొడిగట్టిందో అర్థంకావడం లేదు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్తో సహా బాలకృష్ణ, లోకేశ్ వెళ్లి కలిశారు. ఆయనతో రాజకీయాలేవో మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత చేసిన వీరవిక్రమ ధీర గంభీర స్టేట్మెంట్ మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఆయన ప్రకటనలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది – వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయి. రెండో అంశం – ఇకపై వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పడం! వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభైమందికి ఎప్పుడో తెలుసు. అంత ఆవేశంగా చెప్పవలసిన కొత్త విషయమేమున్నది ఇందులో! బహుశా జైల్లో చంద్రబాబు ఉపదేశించిన మంత్ర ప్రభావం వల్ల కావచ్చు. ఆయన మాత్రం చాలా ఆవేశపడ్డారు. యుద్ధం స్టోరీ కూడా పాతదే. పేద ప్రజల సాధికారత ఉద్యమంపైన పెత్తందార్ల తరఫున ప్రతిపక్ష శిబిరం ఎప్పటినుంచో యుద్ధం చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన కోసం సాగుతున్న యత్నాలపైనా యుద్ధం ప్రకటించింది. మహిళల పేర్ల మీద ఇళ్లు కట్టించి ఇస్తుంటే యుద్ధ సైరన్ వినిపించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే రణభేరి మోగించింది. పెత్తందార్లు యుద్ధం ఆపిందెప్పుడు? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్!
చేసిన పాపాలు శాపాలై వెంటాడతాయంటారు. ఎన్నెన్ని శాపాలు మనల్ని వెంటాడుతున్నాయో లెక్కవేసి చూశారా బాబుగారూ ఎప్పుడైనా? ఎన్టీ రామారావు గుర్తున్నారా? ఎలా మరిచిపోగలరు? ఈమధ్యనే పురందేశ్వరి కుటుంబంతో కుదిరిన రాజీకి గుర్తుగా సహకుటుంబస్య ఓ చెల్లని బిళ్లను ఆవిష్కరించారు గదా! ఆయనకు మీరూ, మీ సహ నిందితుడైన పత్రికాధిపతి జాయింటుగా చేసిన నమ్మకద్రోహం గుర్తున్నదా? పొడి చిన వెన్నుపోటు జ్ఞాపకమున్నదా? ఆయన చేసిన ఆర్తనాదాలు, పెట్టిన శాపనార్థాలు జ్ఞాపకమున్నాయా? ఆలస్యమైనా సరే ఏ జన్మలో చేసిన పాపపుణ్యాల ఆవర్జా ఖాతాలను ఆ జన్మలోనే ముగించాలి. ఇది మీ సహనిందితునికి కూడా వర్తిస్తుంది. వంగవీటి మోహనరంగారావు గుర్తున్నారా? కోస్తాంధ్ర నడిగడ్డ మీద ఆయన పొందిన ప్రజాదరణ ఎప్పుడైనా జ్ఞాపకమొస్తున్నదా? అది మీకు కంటగింపుగా మారడం నిజం కాదా? హరిరామజోగయ్యను అడగండి చెబుతారు. మల్లెల బాబ్జీ కూడా తెలుసు కదా! డేర్ డెవిల్ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ గుర్తే కదా! ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు తెలిసినవాడే కదా! ఇటువంటి వారి ఆత్మలు కూడా ఎవరినో శపించాయనీ, ఆ శాపాలు లక్ష్యసాధన కోసం ఈ గాలిలో తిరుగుతూనే ఉన్నాయని ఆంధ్ర ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. తొలివిడత తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో వ్యవసాయం దండగ అనేది బాబు ఫిలాసఫీ. అందుకు అనుగుణమైన విధానాలు అవలంబించిన ఫలితంగా తెలుగు నాట పంటపొలాలన్నీ మృత్యు బీళ్లుగా మారిన సంగతి ఆయన కూడా మరిచిపోయి ఉండరు. ఆ కాలంలో వేలాదిమంది రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మరికొన్ని వేలమంది పురుగుల మందును ఆశ్రయించారు. వారి కుటుంబాలు ఎంత క్షోభించాయో, ఎంత రోదించాయో, ఎంత శపించాయో ఆయనకెట్లా తెలుస్తుంది? తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. రైతు ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన బషీర్బాగ్ దారుణం గుర్తున్నదా బాబూ! మీ సర్కార్ తుపాకుల గర్జనకు నేలకొరిగిన రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వాముల కుటుంబాలనడగండి, మిమ్మల్ని ఏమని దీవిస్తారో? క్షతగాత్రులైన డజన్లకొద్దీ యువతీ యువకులను అడగండి, వారు ఎలుగెత్తి మిమ్మల్ని ఏమని సంబోధిస్తారో! మీ ప్రభుత్వం చేసిన కాల్దరి కాల్పుల అమానుషత్వానికి రైతులు చేసిన హాహాకారం మీ చెవుల్లో ప్రతిధ్వనించడం లేదా? నాగరికతకే మాయని మచ్చను తెచ్చిన ఉదంతం కాల్మనీ సెక్స్ రాకెట్. మహిళలకు అప్పులిచ్చి సమయానికి చెల్లించని వారిపై లైంగిక దాడులకు పాల్పడిన కీచకస్వామ్యానికి కర్తకర్మ క్రియలైన దుర్మార్గులను శిక్షించడానికి బదులు వారికి మీరు వీరతాళ్లు వేసి సత్కరించారు. బాధిత కుటుంబాలు శపించకుండా ఎట్లా ఉంటాయి. నయీమ్ అనే రాక్షసుడికి ప్రాణప్రతిష్ఠ చేసి, గిట్టని వారి మీదకు, ఉద్యమకారుల మీదకు అతడి ముఠాను ఉసిగొల్పిందెవరు? మనకేమీ సంబంధం లేదా బాబు గారూ? కానీ అతని బాధితులైన వందలాది కుటుంబాల వారు ఇప్పటికీ నయీమ్తోపాటు మిమ్మల్ని కూడా స్మరించుకుంటున్నారు. మీ అమానుష పాలనలోని కొన్ని మచ్చుతునకలు మాత్రమే ఇవి. ఇక అవినీతి కథలు కోకొల్లలు. వచ్చిన ప్రతి అవినీతి కథనూ వెంటనే కంచికి పంపడంలో బాబు ప్రావీణ్యం సాధించారు. కానీ ఇప్పుడు కంచి హౌస్ఫుల్. ఎప్పటికప్పుడు కథల పంచనామా జరిగి తీరవలసిందే! ఇప్పుడు బాబును అరెస్టు చేసిన కేసులో తాను దొంగతనం చేసినట్టు ఆయనకు తెలుసు. అన్ని ఆధారాలతో సహా దొరికి పోయానని కూడా తెలుసు. కానీ అలవాటు ప్రకారం ఆయన బుకాయింపులనే ఆశ్రయించారు. అవినీతికి సంబంధించిన ఆరోపణలను ఎదుర్కోవడంలో ఆయనకు ఒక విజయవంత మైన వ్యూహం ఉన్నది. యెల్లో మీడియా సహకారంతో ఒళ్లంతా నోరు చేసుకొని అదిలించడం, బెదిరించడం మొదటిదశ. ఆరోపణలు చేసినవారు విజయవంతంగా ఈ దశను దాట గలిగితే తనకున్న వ్యవస్థల నియంత్రణా నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. న్యాయస్థానాల్లోనూ, దర్యాప్తు సంస్థల్లోనూ కేసు కదలకుండా ఉండేందుకు స్టే భిక్షను యాచిస్తారు. ఈ విధంగా సాఫీగా సాగిపోతున్న ఆయన అవినీతి జీవనయాత్రకు సడన్గా ఒక పెద్ద కుదుపు. వాములు మింగే స్వామికి గడ్డిపోచ ఫలహారం అంటారు. మన స్కాములు మింగే స్వామికి రెండు ఫలహారం గడ్డిపోచలే గొంతుకు అడ్డంపడి బండారం బయటపెట్టాయి. అలా బయట పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలేనన్న విషయం ఇక్కడ గమనించాలి. ఒక స్కామ్ను ఇన్కమ్ట్యాక్స్ వారు పట్టు కున్నారు. ముంబైలో మనోజ్ వాసుదేవ పార్థసాని అసోసియేట్స్ సంస్థలో వారు వేరే కేసులో సోదాలు చేస్తుండగా ఈ తీగ దొరికింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కాంట్రాక్టును దక్కిచుకున్న షాపూర్జీ పల్లోంజి సంస్థకూ, ముఖ్యమంత్రికీ మధ్య ఈ పార్థసానిది బ్రోకరేజీ పాత్ర. అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 600 కోట్ల కాంట్రాక్టును ఇచ్చినందుకు గాను 119 కోట్ల రూపాయలను ముడుపులుగా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు ఐటీ వారికి పక్కా ఆధారాలు దొరికాయి. దాంతో వారు బాబుకు నోటీసులు పంపించారు. ఈ కేసులో కూడా బాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా బుకాయించడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ, కేసు నుంచి బయటపడటం బాబుకు సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పట్టపగటి నిలువు దోపిడీతో సమానం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వాలని సంకల్పిస్తున్నట్టు ఒక జీవోను విడుదల చేశారు. ఇందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ అనే మల్టీనేషనల్ సంస్థతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు. కానీ జీవోలో చెప్పిన దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అనే కొత్త సంస్థను విద్యాశాఖకు బదులుగా రంగంలోకి దించారు. సీమెన్స్, ఎస్డీసీ, డిజైన్ టెక్ అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం 3,300 కోట్ల రూపాయల విలువైన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు 90 శాతం నిధులు గ్రాంట్–ఇన్–ఎయిడ్గా సీమెన్స్ అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం సమకూరిస్తే చాలు. ఒక ప్రైవేట్ సంస్థ మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసం మూడు వేల కోట్లు ఉదారంగా ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోవద్దు. స్కామ్లంటేనే ఇలాంటి అనేక ఆశ్చర్యాలుంటాయి. సీమెన్స్ నుంచి ఒక్క పైసా విడుదల కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్టెక్ కంపెనీకి తన వాటా పది శాతంతోపాటు జీఎస్టీ కలిపి రూ.371 కోట్లను విడుదల చేసింది. అయితే ఈ ఫైలుపై సంతకం చేయడానికి నాటి ఛీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం సీమెన్స్ నుంచి నిధులు విడుదలైతే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయాలి. ఇది ఆనవాయితీ. కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్చేసి విడుదల చేయాలని చెప్పడంతో సీఎస్ ఆ విషయాన్ని స్పష్టంగా ఫైల్పై పేర్కొని విడుదల చేశారు. ఇంత కంటే స్పష్టమైన ఆధారం ఏముంటుంది? సీమెన్స్తో ఒప్పందం ఒక డ్రామా అని రుజువైంది. సీమెన్స్ తరఫున ఇండియా విభాగం హెడ్ను రంగంలోకి దించి బాబు కథ నడిపించారు. విషయం అసలు కంపెనీకి తెలియగానే ఇండియా హెడ్ రాజీ నామా చేశారు. ఈ ఒప్పందంతో తమ సంస్థకు సంబంధం లేదని సీమెన్స్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం డిజైన్టెక్ సంస్థకు విడుదల చేసిన నిధుల్లో రూ.241 కోట్లు చంద్రబాబు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా సింగపూర్, దుబాయ్లలోని ఖాతాలకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో ముంబైకి చేరాయి. ఆ క్యాష్ను యోగేశ్ గుప్తా తీసుకుని మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందజేశారు. మనోజ్ హైదరాబాద్కు తెచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అప్పగించారు. పెండ్యాల శ్రీనివాస్ జూబిలీహిల్స్ ప్యాలెస్కు చేర్చారు. ఐటీ కుంభకోణంలో కూడా మనకు అచ్చంగా ఇవే పేర్లు కనిపించాయి. ఐటీ నోటీసుల విషయం మీడియా ద్వారా బహిర్గతం కాగానే మనోజ్ దుబాయికి, శ్రీనివాస్ అమెరికాకు పారిపోయినట్టు సమా చారం. యోగేశ్ గుప్తా అడ్రస్ లేడు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం చంద్రబాబు అధికారంలో ఉండగానే వెలుగు చూసింది. డిజైన్టెక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను చెల్లించడం కోసం పుణేలో వుండే షెల్ కంపెనీల నుంచి నకిలీ ఇన్వాయిస్లను తెప్పించింది. ఈ కుంభకోణం 2015లో జరిగింది. 2018లో పుణే షెల్ కంపెనీలపై జీఎస్టీ అధికారులు జరిపిన సోదాల్లో మన నకిలీ ఇన్వాయిస్ల భాగోతం బయటపడింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఏసీబీకి జీఎస్టీ ఆధికారులు చేరవేశారు. ఏసీబీ కూడా ఈ విష యాన్ని అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. కానీ సీఎం మౌనాన్ని అర్థం చేసుకున్న ఏసీబీ ఈ కేసులో ముందుకు వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను వెలుగులోకి తెచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి కొన్ని అరెస్టులు చేసింది. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న ఘటన పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ‘నన్ను అరెస్టు చేస్తారట. ప్రజలంతా నా చుట్టూ రక్షణగా నిలబడా’లంటూ అప్పట్లో బహిరంగ సభల్లో చంద్రబాబు విజ్ఞప్తులు చేయడం కూడా తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే ముఖ్యమంత్రి. అప్పుడున్న ఆరోపణల కొనసాగింపే ఈ రోజున జరిగిన పరిణామం. దీనికి రాజకీయ రంగు పులిమి జగన్ ప్రభుత్వ కక్షసాధింపుగా కొందరు వ్యాఖ్యానించడాన్ని విజ్ఞతా రాహిత్యంగానే భావించాలి. రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో మాత్రమే కాదు... ఫైబర్ నెట్లో కూడా చంద్రబాబు దొరికిన దొంగ! మరో అరడజన్ స్కాముల్లో కచ్చితంగా దొరకనున్న నిందితుడు!! అందుకే ఆయన్ను అరెస్టు భయం వెన్నాడుతున్నది. ఢిల్లీ పెద్దల మద్దతు కోసం ఏడాది కాలంగా బాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా అందుకే! ఎన్టీఆర్ కూతురే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నందున అవసరమైతే ఆ సాకుతో తన పార్టీని విలీనం చేస్తానన్నంత దాకా చంద్రబాబు వెళ్లినట్టు సమాచారం. ఈ బిస్కట్తోనే దగ్గుబాటి కుటుంబాన్ని ఆయన దారిలోకి తెచ్చుకున్నట్టు వినికిడి. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మళ్లీ సరికొత్తగా మోసపోవడమే దగ్గుబాటి కుటుంబం ప్రత్యేకత కాబోలు. ఢిల్లీ రాయబారం సీన్ పండ లేదమో! మొన్నటికి మొన్న కూడా బహిరంగ సభల్లో ‘నన్ను అరెస్టు చేస్తారట తమ్ముళ్లూ’... అంటూ మొరపెట్టుకున్నారు. ‘నేను నిప్పులా బతికినవాడిని. నన్నెవరూ తాకలేర’ని బీరాలు పోవడం కూడా చూశాము. నిప్పు కథలూ, పప్పు కథలూ నెమ్మదిగా క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడులతోపాటు లోకేశ్ పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కుంభకోణాల్లో కూడా లోకేశ్ పాత్ర సందేహాలకు అతీతంగా రుజువైనట్టు విశ్వసనీయ సమాచారం. నేడో రేపో చినబాబు అరెస్టు కూడా తప్పకపోవచ్చు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కాళ్ల బేరం ఖరీదెంత?
‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అది ఎగిరే రాబందుల గురించి మాత్రమే. వేలాది మందిని పీడించి పిప్పిచేసిన పెత్తందారీ రాబందుల సంగతి కాదు. లక్షలాది మంది మూలుగల్ని పీల్చేసిన రాజకీయ రాబందుల విషయం కాదు. ఈ రాబందులకు ఒక్క గాలివాన చాలదు. ఇంకో ప్రచండ మారుతం కావాలి. ఝంఝానిలం పరివ్యాప్తం కావాలి. దావానలమై దహించాలి. కానీ, మొదటి గాలివాన లోంచే రానున్న ముప్పును ఆఘ్రాణించే నేర్పు వీటి నాసికలకున్నది. ఆ గ్రహింపు రాగానే వాటి రెక్కల పొగరు తాత్కాలికంగా ముడుచుకుపోతుంది. నక్క వినయాలు ఒంటబడతాయి. నంగినంగి మాట్లాడే కుటిలత్వం, వంగివంగి ప్రణమిల్లే అతి వినయం అలవాటవుతాయి. ఆతడనేక స్కాములయందు ఆరియు తేరిన వృద్ధ రాజకీయ వృకోదరుడు. మొదటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వంలోనే అవి నీతి కేసులపై 20 స్టేలు తెచ్చుకోగలిగిన తాంత్రికుడు. రెండో దఫా ఐదేళ్ల పాలనలో మరో డజన్ స్కాములకు వ్యూహకర్త. ఈసారి లెక్క లక్షల కోట్లలో! ఎందుకో మంత్రం పారట్లేదేమో నన్న అనుమానం మొదలైంది. ముప్పు ముంచుకొస్తున్నదని ముక్కుపుటాలు హెచ్చరిస్తున్నవి. గుండె లోతుల్లోంచి తీతువు కూత వినిపిస్తున్నది. ఎక్కడో ఒక జంబూకం ఊళ వేస్తున్నది. సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త వేగంగా స్పందించారు. ఎక్కడె క్కడో తీగలు కలిపారు. ఫలితంగా సమీప బంధువుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించింది. ఆమె సహకారంతో మరోసారి ఢిల్లీ ‘పవర్’ హౌస్లో పాదం మోపారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎదుట వంగివంగి విన్నపాలు చేసుకున్నారు. తన కంటే ఎంతో చిన్నదైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట చేతులు కట్టుకొని నిలుచున్నారు.. క్లాస్ టీచర్ ఎదుట పనిష్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్ మాదిరిగా! ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందన్న విషయం తెలిసిందే! ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు చంద్రబాబుకు ఒక నోటీసు ఇచ్చారు. దీనిపై ఒక వార్త ‘హిందూస్థాన్ టైమ్స్’లో వచ్చింది. మరుసటి రోజున ‘దక్కన్ క్రానికల్’లో నోటీస్ కాపీతో సహా మరింత వివరంగా వార్త అచ్చయ్యింది. అయినా చంద్రబాబు నుంచి గానీ, ఆయన పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు. యెల్లో మీడియా కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నది. ఎందుకంటే బుకాయించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. చడీచప్పుడు లేకుండా స్టే తెచ్చుకోవాలి. స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుది గిన్నిస్ రికార్డు. మొన్నటి నోటీసు కంటే ముందే ఐటీ శాఖ చంద్రబాబుకు ఇంకో నోటీసు ఇచ్చింది. రెండింటి సారాంశం ఒక్కటే. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టులు పొందిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు అందుకు ముడుపుల కింద చెల్లించిన రూ.118 కోట్లు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరాయి. ఈ ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించలేదు. ఐటీ శాఖ వారు ముంబయ్లో మనోజ్ వాసు దేవ్ పార్ధసాని అసోసియేట్స్ సంస్థలో సోదా చేసినప్పుడు వారికి అనుకోకుండా చంద్రబాబు తీగ దొరికింది. ఆనవాయితీ ప్రకారం వారు చంద్రబాబుకు నోటీసు పంపించారు. తనకు ముడుపులు వచ్చాయా, లేదా అనే విషయాల జోలికి వెళ్లకుండా టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఐటీ శాఖకు సమాధానం ఇచ్చారు. తనకు నోటీసు ఇచ్చిన అధికారి పరిధి లోకి తాను రాననే దబాయింపు తప్ప కేసు మెరిట్ జోలికి చంద్రబాబు వెళ్లలేదు. చంద్రబాబు తన మీద వచ్చిన అన్ని రకాల కేసుల్లోనూ ఇటువంటి టెక్నికల్ పాయింట్లను వాడు కోవడం, వ్యవస్థలను లిటిగేషన్లతో ప్రభావితం చేయడం వంటి పద్ధతుల ద్వారానే స్టేలు పొందుతూ వచ్చారు, అయితే ఈ కేసులో బాబు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఐటీ శాఖ రెండో నోటీసు ఇచ్చింది. ఈ 118 కోట్ల రూపాయల ముడుపులు అనేవి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. వేరే కేసులో సోదాలు జరుపుతుండగా యథాలాపంగా దొరికింది మాత్రమే. దీనిమీద మరికొంత ముందుకెళ్లిన ఐటీ అధికారులకు విస్తుపోయే ఆధారాలు లభించినట్లు సమాచారం. అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలోనే బాబు అందుకున్న ముడుపులు వేల కోట్లలో ఉన్నాయట! వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులు సేకరించారు. నోటీసులకు సంబంధించిన 118 కోట్ల రూపాయలను వెల్లడించనందుకు గాను అంతకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. పన్నెండు శాతం వడ్డీ అదనం. ఆదాయం పన్ను శాఖ నోటీసులను గౌరవించి చంద్రబాబు ఆ పెనాల్టీని చెల్లిస్తే ముఖ్యమంత్రిగా ఉండి లంచాలను తీసుకున్నట్టు అంగీకరించినట్టే! అలా అంగీకరించినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8ఏ ప్రకారం అధికార పదవులకు అనర్హుడవుతాడు. దాంతోపాటు ఐపీసీ సెక్షన్ 409ని కూడా ప్రయోగించవచ్చు. నేరపూరిత విశ్వాస ఘాతుకానికి గాను పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం కింద పదేళ్ల జైలు, జరిమానా వేయవచ్చు. మనీలాండరింగ్ చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చు. ఈ లంచాల్లో భాగంగానే ఆయన జూబ్లీ హిల్స్ ఇంటిని నిర్మించినట్టు రుజువైతే బినామీ చట్టం కింద ఆ ఇంటి మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. నోటీసులకు స్పందించకపోతే కూడా జైలుశిక్షకు ఆస్కారము న్నది. కనుక ముందుకు వెళ్లలేడు, వెనక్కు వెళ్లలేడు. ఇప్పుడాయ నకు కావలసింది స్టే! చంద్రబాబు, ఆయన గురువు రామోజీల తిరుమంత్రం స్టే! సాంకేతిక కారణాలు చూపి దబాయించడం రామోజీకి పెన్నుతో పెట్టిన విద్య. దాన్ని ఆయన వెన్నతో పెట్టి చంద్రబాబుకు నేర్పించారు. ఆయన ఈ కళలో పరిపూర్ణత సంపాదించి వ్యవస్థలను నియంత్రించగలగడం దాకా ఎదిగారు. తాజాగా చిట్ఫండ్స్ కేసులోనూ రామోజీది ఇదే వరస! చిట్ఫండ్స్ చట్టాన్ని రామోజీ దారుణంగా ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆధారాలను చూపిస్తున్నది. రామోజీ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించానని గానీ, ఉల్లంఘించలేదని గానీ చెప్పరు. ఎవరూ ఫిర్యాదు చేయందే కేసెట్లా పెడతారని వాదిస్తారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చనేది గురుశిష్యుల సిద్ధాంతం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ చంద్రబాబు అడ్డంగా బుక్కయిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో బేరమాడుతూ చంద్రబాబు మనిషి రేవంత్రెడ్డి ఉన్నారు. అక్కడ డబ్బుల బ్యాగ్ చేతులు మారిన వీడియో ఉన్నది. చంద్రబాబును ఎమ్మెల్యేతో మాట్లాడించడం కోసం రేవంత్రెడ్డి ఫోన్ కలిపిన దృశ్యం ఉన్నది. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ’ అన్న బాబు కంఠస్వరం వినిపించింది. అంత చక్కటి ఇంగ్లిష్ ఈ దేశంలో బాబు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని కేటీఆర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఉన్నది. అయినా సరే అసలు విషయాన్ని వదిలేసి ‘నా ఫోన్ను ఎట్లా ట్యాప్ చేస్తార’న్న బాబు దబాయింపు కూడా జ్ఞాపకం ఉన్నది. ఇదే పద్ధతిలో ఇప్పటిదాకా ఆయన ఇరవై స్టేలు తెచ్చు కున్నారు. ఆయన అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీపార్వతి రెండుసార్లు వేసిన కేసుల్లో రెండు స్టేలు. ఐఎమ్జీ భారత్ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన కేసులో స్టే. ఏలేరు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తెచ్చుకున్న స్టే. ఇంకా మద్యం ముడుపుల కేసు – వగైరాలు ఈ స్టేల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడెందుకో తాజా ఐటీ కేసు కొంచెం భిన్నంగా తోస్తున్నది. ఈ నోటీసుల వ్యవహారం బయటకు రాకుండా, ఐటీ అధికారులు ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకైతే ఫలితాలనివ్వలేదు. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి ఐటీ నోటీసులు మరికొన్ని రావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఇటువంటిదే! ఈ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా ప్రయాణం చేసి బాబు గారింటికి చేరుకున్నాయి. ఇక్కడ స్కిల్లూ లేదు, డెవలప్మెంటూ లేదు. ఇప్పటికే ఈడీ రంగప్రవేశం చేసి నలుగురిని అరెస్టు చేసింది. రాజధాని కుంభకోణాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పురాణంగా ఈ స్కామ్ చరిత్ర పుటల కెక్కబోతున్నది. ల్యాండ్ పూలింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్, పూలింగ్ పరిధి నుంచి తప్పించినందుకు క్విడ్ ప్రో కో ప్యాలెస్, అసైన్డ్ కుంభకోణం, సింగపూర్ కన్సా ర్టియం... ఇలా అనేక ఉప కుంభకోణాలతో కూడిన భారీ స్కామ్ ఇది. ఈ కేసుల్లోనే ఇరుక్కున్న సింగపూర్ మంత్రి, బాబు మిత్రుడు ఈశ్వరన్ ఇప్పటికే అరెస్టయ్యాడు. ఇంకో డజన్ స్కామ్లు విచారణ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఐటీ కేసు ముందుకు కదలడమంటే కేసుల తేనెతుట్టెను కదిలించినట్టే! కనుక అదిక్కడ ఆగాలి. స్టే మంత్రం ఫలించాలి. అందుకోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఆంతరంగిక సమాచారం. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనన్ని తిట్లు తిట్టిన బాబు ఆ తర్వాత ఎవరూ పొగడని స్థాయిలో పొగుడుతున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరిపోయి బీజేపీ – జనసేనల తోడ్పాటుతో అధికారంలోకి రాగలిగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని బాబు భావిస్తున్నట్టు విని కిడి. బీజేపీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థతో కేంద్రం చేయించిన సర్వేలో జగన్మోహన్రెడ్డికి 53 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో బాబు అవినీతి భారాన్ని మోయడం కంటే జనసేన – బీజేపీ కూటమిగా ఏర్పడితే 2029 ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థి కూటమిగా అవతరించవచ్చని దాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ స్థాయికి తగ్గయినా సరే కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ – జనసేనలకు కలిపి 75 అసెంబ్లీ సీట్లు, 12 లోక్సభ సీట్లను తాజాగా ప్రతిపాదించారట. పార్టీలోని విశ్వస నీయ వర్గాల ద్వారా ఇంకా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తున్నది. ఆయన ఎంత నిస్పృహలో ఉన్నారంటే, ‘తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తే, పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా వెనకాడకపోవచ్చ’ని చెబుతున్నారు. ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడితే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని ఉన్న శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రస్వామి తాయెత్తు విజన్!
తర్కంతో కొట్టలేనప్పుడు తాయెత్తుల మహిమను చూపాలి. పేదలు, బాధితులు, దగాపడిన తమ్ముళ్ల కంటిపాపల్లో కాంతి కిరణం మెరిసినప్పుడల్లా పెత్తందారీ హేతువులోంచి ఓ బేతాళుడు నిద్రలేస్తాడు. ఓం హ్రీం అంటూ ఆవులిస్తాడు. నయా పెత్తందారీవర్గపు ఉంపుడు సిద్ధాంతకర్త నారా చంద్రబాబు నాయుడులోంచి తాజా తేనెపూత విజన్తోపాటు ఓ బేతాళుడు కూడా బయటికొచ్చాడు. మహిళా లోకంపై మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆడబిడ్డలందరికీ ఆయన మంత్రించిన రాఖీలు ఇస్తాడట! వాటిని 45 రోజులు పూజగదిలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబును తలుచుకోవాలట! అనంతరంచేతికి కట్టుకోవాలి. అప్పుడు వారికి అష్టసిరులు ఒనగూరు తాయట! మంత్రదండం సాయంతో నారా చంద్రస్వామి ఈ రకంగా మహిళా సాధికారత సాధిస్తారన్న మాట.. నిత్యానంద స్వామి కైలాసాన్ని సృష్టించినట్టు! ఆగస్టు పదిహేనో తేదీనాడు చంద్రబాబు ‘విజన్– 2047’ పేరుతో విశాఖపట్టణంలో ఒక కాగితాల కట్టను విడుదల చేశారు. దాన్ని తన ఆలోచనగా చెప్పుకున్నారు. మామూలుగా పంద్రాగస్టు కార్యక్రమాలను కవర్ చేసేటప్పుడు తొలి ప్రాధా న్యాన్ని ప్రధానమంత్రికిస్తూ అదే స్థాయిలో రెండో ప్రాధాన్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికివ్వడం ప్రాంతీయ మీడియాలో ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ యెల్లో మీడియా మాత్రం ముఖ్య మంత్రిని పక్కకునెట్టి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్కు అగ్ర స్థానాన్ని ఇచ్చింది. ఇంతకూ ఇందులో ఏమంది? 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు నిండు తాయి. అప్పటికి దేశం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం ‘విజన్ – 2047’ను రూపొందించింది. ఆ ఏడాది కిందటి ఆలోచనలోంచి ఓ పిడికెడు మాదాకబళాన్ని తీసుకొచ్చి కొంచెం వెచ్చచేసి బాబు వడ్డించారు. పోనీ దాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తూ అనుసృజన చేసినా బాగుండేది. కానీ, ‘దేశ్ కీ నేతా’ హోదాకు ఇంచు కూడా తగ్గేందుకు బాబు సిద్ధ పడలేదు. బహుశా ‘రాజ్య్ (రాష్ట్ర) కీ నేతా’ హోదా మరోసారి దక్కే అవకాశం లేదని గట్టిగా నమ్మారేమో! ఇంకో పాతికేళ్లలో దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఏ హోదాతోనో చెప్పలేదు. ‘ఆప్ కౌన్ హై’ అని అడిగే అవసరం ఎవరికీ లేదు. తనకు యాభై అయిదేళ్లు నిండకముందే నాలుగు శతాబ్దాల పైచిలుకు వయసుతో హైదరాబాద్ను సృష్టించిన వ్యక్తికి ఏదైనా సాధ్యమేనని సరిపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ పవర్, రోబోటిక్స్ వగైరా తాజా పదజాలాన్ని ఆయన విజన్లో విరివిగా ఉపయోగించారు. అబ్బో మా బాబుగారికి చాలా విషయాలు తెలుసునని అనుయాయులు మురిసిపోవడానికి తప్ప సామా జిక చింతన ఏ కోశానా అందులో లేదు. ఇంటర్లో బైపీసీ చదివితే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగవచ్చనే ఒక గొప్ప ఉప దేశాన్ని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అనుగ్రహించారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న విజన్కు తాను కూడా ఇలా కోరస్ పాడితే ఆయన మెప్పు పొందవచ్చన్న తహతహ ఒక కారణం కావచ్చు. తనను గొప్ప విజనరీగా భజన చేస్తున్న యెల్లో మీడియాలో ఆత్మవిశ్వాసం నింపడం మరో కారణం కావచ్చు. ఈ రెండు అవసరాల కోసం చంద్రబాబు పంద్రాగస్టు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆయనకు పెద్దగా విశ్వాసం లేదు. ఎందుకంటే తన మొదటి విజన్ (2020) ఆర్థికంగా తనకు లబ్ధి చేకూర్చినా, రాజకీయంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక తెలుగు సమాజానికైతే ఆ విజన్ సృష్టించిన విధ్వంసం మరిచిపోలేని ఒక మహా విషాదం. చంద్రబాబు తన ‘విజన్–2020’ సారాంశంతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రచురించారు. తెలుగులో దాని పేరు ‘మనసులో మాట’. దాని పేరును బట్టే ఆ పుస్తకంలోని అభిప్రాయాలు చంద్రబాబుకు స్వాభావికమైన విగా, ఆయన నమ్మకాలుగా భావించాలి. ఉచిత పథకాలను ఈ పుస్తకంలో ఈసడించుకున్నారు. ఉచిత విద్యుత్ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు బుద్ధిగా మసలుకోవాలని (అప్పు డాయన అధికారంలో ఉన్నారు), ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరే కించకూడదని సుద్దులు చెప్పారు. ఉద్యోగాలు పర్మనెంటయితే వారికి బాధ్యత ఉండదని, అందువల్ల కాంట్రాక్టు పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టారు. విద్య, వైద్యం ఏదీ ఉచితంగా అందుబాటులో ఉంచకూడదని గట్టిగా వాదించారు. ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీల వసూలు ప్రారంభించారు. పేదవాడికి జ్వరం వచ్చినా డబ్బులు చెల్లించనిదే మందుబిళ్ల కూడా దొరకని దుర్మార్గ పరిస్థితి ఏర్పడింది. సర్కారు బడులను పాడుబెట్టి చదువు‘కొనలేని’ ఒక తరాన్ని మొత్తం విద్యకు దూరం చేశారు. మధ్యతరగతి ప్రజలు సైతం చదువుల ఖర్చులు భరించలేక అప్పుల ఊబిలోకి దిగబడిపోయారు. వ్యవసాయం దండగ అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రైతాంగంలో అదే అభిప్రాయం వ్యాప్తి చెందేలా చేశారు. రైతు కూలీలు భూబంధం నుంచి బయటపడితేనే సంపన్నుల పనులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయన కోరుకున్న ట్టుగానే లక్షలాది రైతు కూలీలు పొలం బంధాన్ని తెంచు కున్నారు. పొట్టకూటి కోసం వలస బాటలు పట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూలీ తల్లులు చంటిబిడ్డల నోటికి పాలపీకలు పెట్టిన కల్లు సీసాలను అందించారు. కల్లు మత్తులో ఆ బిడ్డ నిద్రపోయి తల్లి కోసం ఏడ్వదని వారు అలా తల పోసేవారు. మాటలకందని ఆ మహాదైన్యం అప్పుడు ఎక్కడ చూసినా కనిపించేది. వలసబాట పట్టకుండా మొండికేసి వ్యవసాయం చేసిన వారు బాబు విధానాల ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. బిడ్డలు వలసపోగా మిగిలిన అవ్వాతాతలు అంబలి కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తే! ఈ దుఃస్థితికే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే పాటలో అద్దంపట్టిన సంగతి తెలిసిందే. ఈ కన్నీటికి కారణం చంద్రబాబు విజన్. ఆ కన్నీటిపై ఐటీ పన్నీరు చల్లి ‘ఇదీ చంద్రబాబు విజన్’ అని ఆయన అనుకూలవర్గం ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. తాను ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడం వల్లనే ఐటీ నిపుణులు పెరిగారని ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతకంటే ఐదేళ్లు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రకటిస్తే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. హైటెక్ సిటీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధమైందని చంద్రబాబే స్వయంగా ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. రెడీగా ఉన్న ప్రణాళికను అమలు చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఆయన ఆలస్యం చేశారు. ఇదీ జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను యెల్లో మీడియా మసిపూసి మారేడుకాయలు చేసింది. ఒక సామాజిక విధ్వంస కుడికి విజనరీ ముసుగువేసి చరిత్రలో నిలబెట్టింది. ఇది చరిత్రలో జరిగిన ఒక ద్రోహం. బాబు విజన్తో కన్నీరు పెట్టిన పల్లెసీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ చిగురించడం మొదలైంది. రైతు మళ్లీ నాగలి పట్టాడు. వైద్యం పేదలకు చేరువైంది. జన సంక్షేమ విజన్కు ప్రాధాన్యం లభించింది. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ – పవన్ పొత్తులతో వెంట్రుకవాసి విజయాన్ని సాధించగలిగాడు. ఈ గెలుపు కోసం తన మనసులోని మాటను దాచిపెట్టాడు. సంక్షేమ ఎజెండాను ఎత్తుకోవడమే కాదు అలవిగాని హామీలతో తన ఎన్నికల మేని ఫెస్టోను నింపేశారు. గెలిచిన తర్వాత రాజధాని పేరుతో భూదోపిడీకి, పోలవరాన్ని ఏటీఎమ్గా వాడేందుకు పరిమిత మయ్యారు. అదిగో అల్లదిగో అంటూ రాజధాని గ్రాఫిక్స్ను ప్రచారంలో పెడితే, ‘ఇది కదా విజన్’ అంటూ యెల్లో మీడియా పరవశించిపోయింది. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తడ బాటూ, శషభిషలూ లేని స్పష్టమైన పేదల అనుకూల ఎజెండాను తలకెత్తుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల పురోగతి కోసం, అన్ని వర్గాల్లోని మహిళల సాధికారత కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, అధికార వికేంద్రీ కరణ కోసం ఒక ఉద్యమాన్నే ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అడ్డువస్తున్న పెత్తందారీ వ్యవస్థపై జగన్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. వ్యవస్థలోని అన్ని పార్శా్వల్లో ఈ పెత్తందారీ వ్యవస్థ ఊడలు దించి బలోపేతమై ఉన్నది. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ వ్యవస్థపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసించలేదు. పెత్తందారీ వ్యవస్థతో తలపడటం, ఓడించడం ద్వారానే పేదల విముక్తి సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం అందుకు బరిగీసి నిలబడి ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ తన సహస్ర బాహువులతో జగన్ ప్రభుత్వంపై విషం చల్లుతున్నది. దశకంఠాలతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. తమ ఎన్నికల మేనిఫెస్టోను గడప గడపకూ పంపిణీ చేస్తూ తాము ఎన్ని హామీలను నెరవేర్చామో పరిశీలించి పరిపాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోను కనబడకుండా మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టోకు పటంకట్టి ఊరేగిస్తూ ‘మేం చేయని పనేమిటో చెప్పండ’ని పిలుపునిస్తున్న జగన్ ప్రభుత్వం ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ద్వంద్వ యుద్ధానికి తలపడటం సాధ్య మయ్యే పనేనా? కాదు కనుకనే మాయోపాయాలు, దుష్ప్రచారాలు, కుతంత్రాలు వేయి పడగలెత్తి బుసకొడుతున్నాయి. బాబుకు వేసిన విజనరీ ముసుగు జారిపోకుండా మొన్న ప్రకటించిన ఎంగిలి విజన్ ఒక పడగ. తాయెత్తు మహిమలు ప్రచారం చేయడం, మూఢనమ్మకాలను వ్యాపింపజేయడం ఇంకో పడగ. భారత రాజ్యాంగం 51వ అధికరణం ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం పౌరుల ప్రా«థమిక విధి. అందుకు విరుద్ధంగా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడే మూఢ నమ్మకాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ ద్రోహమవుతుంది. పైగా వాటికి ఆయన రాఖీలని పేరు పెట్టారు. మంత్రించి ఇచ్చేవి తాయెత్తులవుతాయి గానీ రాఖీలెట్లా అవు తాయి? అయినా తమ సాధికారతకు కట్టుబడిన వాళ్లకు, తమకు రక్షణగా నిలబడిన వాళ్లకు మహిళలే స్వయంగా రక్షాబంధనాలు కడతారు తప్ప మంత్రగాళ్లకు కాదు గదా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హింసా సంస్కృతి ఏ సందేశానికి?
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్ శక్తిమంతంగా పనిచేస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్ ఇంజన్తో, అంటే రెండో ఇంజన్ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు. వాస్తవానికి మణిపుర్లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్ ఇంజన్’ పవర్తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్ – ఆరెస్సెస్. మూడవ ఇంజన్ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్. 1999లో బీజేపీ, ఆరెస్సెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్కు అప్పగించినట్లు కనిపిస్తోంది. రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్ అయిన ఆరెస్సెస్ ప్రమేయం లేకుండా... మణిపుర్లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్ ఇంజన్. స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’. ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్సంఘ్ చాలక్ మాట్లాడుతున్నారు. మణిపుర్లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు! నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్ నింపిన ఆ ఇంజన్కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్ ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మణిపుర్లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్కు, అక్కడ నుంచి మద్రాస్లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
ఫీల్గుడ్ తుపాకీ పేలుతుందా?
ఆర్థిక అసమానతలు మనుషుల మధ్యనే కాదు. ఎకరాల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షలకు ఎకరం లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొన్న సర్కారు వారి పాటలో ‘కోకాపేట’ కనకం మాత్రం వందకోట్ల కిరీటాన్ని ధరించింది. హైదరాబాద్ నగరానికి పడమటి దిక్కున ఔటర్ రింగ్రోడ్డును ఆనుకుని ఈ కోకాపేట వేంచేసి ఉన్నది. ఇప్పుడీ కోకాపేట ఒక దేవకన్యలా మెరిసిపోతున్నది. ‘దివినే వదిలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అని పాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఔటర్ రింగ్రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే కోకాపేట తేజస్సు తెలిసి వస్తుంది. బొంగుళూరు నుంచి పెద్దఅంబర్పేట మీదుగా కీసర, మేడ్చల్ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా లేరట! గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు వెల్లడైన విషయమిది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఒన్ జీవో (జీవో 111) సామ్రాజ్యం కూడా కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల ఆ ‘విముక్త’ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్ చేస్తూ కోకాపేట ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ అసహజత్వం అర్థం కావాలంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా అవగాహన ఉండాలి. గంటగంటకూ గమ్యాన్ని మార్చుకునే తుపాన్ల సృష్టికి మన బంగాళాఖాతం పెట్టింది పేరు. బెంగాల్, బంగ్లాదేశ్లను కలిపి చూసినా వాటి ఉమ్మడి సముద్ర తీరం కంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వంద కిలోమీటర్లు ఎక్కువ. అయినా ‘బే ఆఫ్ బెంగాల్’ అన్నారు గానీ, ‘బే ఆఫ్ ఆంధ్రా’ అనలేదు ఎందుకో! ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుత ప్రసంగం కావచ్చు. బంగాళాఖాతం తుపాన్ల మాదిరిగానే తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా గత ఏడాది కాలంగా రకరకాల మార్పులకు లోనైంది. ఇప్పుడిప్పుడే తీరం దాటి గమ్యం చేరినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సర్వే బృందాలు వర్ధిల్లడానికి అవకాశమిచ్చింది. సెఫాలజీ ఒక ఉపాధి అవకాశంగా విస్తరించింది. రాజకీయ పార్టీలు ఒకటో రెండో మూడో బృందాలను నియమించుకున్నాయి. జాతీయ బృందాలతోపాటు ప్రాంతీయ, స్థానిక టీమ్లు కూడా పనిచేశాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా తమ బలం మీద అంచనా కోసం సర్వేలు చేసుకున్నారు. గోడ దూకుదామనుకున్న వాళ్లు కూడా సర్వేలు చేసుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా పార్టీ మారినవారు మళ్లీ వాతావరణ మార్పులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంగా ఈ సర్వే బృందాలు ఇస్తున్న నివేదికలను స్థూలంగా పరిశీలిస్తే, సీట్ల సంఖ్యలో తేడాలు కనబడుతున్నాయే తప్ప, ట్రెండ్లో తేడాల్లేవు. ఈ మేరకు సర్వేలు సరిగ్గానే జరిగినట్టు అనుకోవాలి. మొదట్లో బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనబడింది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. ఇంకేముంది కొద్ది రోజుల్లో మిగిలిన పార్టీల్లోని ముఖ్యనేతలంతా బీజేపీలో చేరిపోతారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చాలామంది ప్రగాఢంగా నమ్మారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెమ్మదిగా కమలం వైపు కదులుతున్న సూచనలు కనిపించాయి. కానీ కేసీఆర్ చాణక్యాన్ని అంచనా వేయడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఆ పార్టీకి అత్యంత కీలక నాయకుడైన బీఎల్ సంతోష్ జుట్టును కేసీఆర్ దొరకబుచ్చుకోవడంతో అది చేష్టలుడిగిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వెనుక బీఎల్ సంతోష్ ప్రమేయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిరూపణ చేయగలిగింది. దాని అడుగులు నెమ్మదించాయి. పులి మీద పుట్రలా కర్ణాటక ఫలితాలు. ఇంతటితో ఈ సంవత్సరపు తొలి అంకం సమాప్తం. రెండో అంకంలో కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకోవడం మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫలితాలు అందజేసిన ఆక్సిజన్ అందుక్కారణం. బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విస్తృతి ఎక్కువ. ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీ కూడా! కేసీఆర్ను వ్యతిరేకించే వారిలో చాలామంది బీజేపీతో సౌకర్యంగా ఉండలేరు. కాంగ్రెస్తో ఆ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రతి పల్లెలో కాంగ్రెస్ జెండాను ఎత్తుకోవడానికి కనీసం పదిమందైనా ఇప్పటికీ మిగిలే ఉన్నారు. మైనారిటీ ఓటర్లకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ఒక చాయిస్గా ఉంటుంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలుంటాయన్న అంచనాలు వెలువడ్డాయి. కొన్ని వలసలు జరిగాయి కూడా! ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ కనీసం 30 సీట్లు గెలుచుకుంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి. మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకో 30 గెలిచినా చాలని అనుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ’ అంటారు. రాజకీయాల్లో అస్సలు జరగవు. కాంగ్రెస్ పార్టీ బలమైన స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెద్దపెద్ద వలలు వేసి కూర్చున్నదనే సంగతి అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటి పోయింది. అంతఃకలహాలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వ లక్షణమే కావచ్చు. కానీ ఇప్పుడున్నంత తీవ్రస్థాయి వైరుద్ధ్యాలు మునుపెన్నడూ లేవని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం ఓడించడానికి కూడా వెనకాడనంత తీవ్రస్థాయిలో వైరుద్ధ్యాలున్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరికి నాయకత్వం అప్పగించినా ఇంకొందరు పార్టీ మారడానికి వెనుకాడని పరిస్థితులున్నాయని చెబుతున్నారు. పార్టీ కీలక నాయకుడే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో కీలక నేత కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. 35 నుంచి 40 స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటూ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక ఇవ్వడంలోనూ, ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాని లీకులివ్వడంలోనూ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హస్తం ఉండవచ్చని సీనియర్ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క కాపురమంతా కలహాల సంతగా సాగుతుండగానే ఏలిన్నాటి శని మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ను చంద్రబాబు తగులుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరిందనుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చివరి రెండు నెలల్లో తలకిందులు కావడానికి ఆ పార్టీకి తెలుగుదేశంతో కుదిరిన పొత్తే కారణమని పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్రెడ్డి ఇప్పటికీ బాబుకు సన్నిహితుడేనని కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ టీవీ’ అనే న్యూస్ ఛానల్ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నదని చెబుతున్నారు. ఈ ఛానల్ తెలంగాణలో రేవంత్కూ, ఏపీలో చంద్రబాబుకూ ప్రచారం చేసిపెడుతున్నది. కాంగ్రెస్కు బలమైన స్థావరాలుగా పేరున్న ప్రాంతాల్లో, వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘తానా’ (అమెరికా) సభల్లో రేవంత్ పాల్గొనడం, అక్కడ చేసిన ఉపన్యాసం కూడా కాంగ్రెస్ వర్గాలతోపాటు తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి అనాలోచితంగా చేసిన కామెంట్ కూడా కాంగ్రెస్కు పెద్ద మైనస్గా మారింది. రేవంత్ కామెంట్ను తనకు అనుకూలమైన రీతిలో ఎడిట్ చేసి బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టింది. ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదనే మెసేజ్ను ఇరవై నాలుగ్గంటలలోపే ప్రతి రైతు చెంతకూ చేరవేసిన బీఆర్ఎస్ తన సంస్థాగత బలాన్ని మరోసారి చాటి చెప్పింది. నష్టనివారణ కోసం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్లలో హడావిడి చేసి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రికార్డులేవో చూపించబోయారు. కానీ రైతులెవరూ దాన్ని పట్టించుకోలేదు. తనకు సరిపోయే కరెంటు వస్తున్నప్పుడు అది ఇరవై నాలుగ్గంటలా? పన్నెండు గంటలా అనే లెక్కలెవరికి కావాలి? చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ వెలవెలబోయింది. కాంగ్రెస్కు సంఖ్యాబలం లేమి ఒక కారణమైతే కావచ్చు గానీ గేమ్లో చివరి గోల్ను కూడా బీఆర్ఎస్ కొట్టిందనేది ఒక వాస్తవం. గతంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో నెలరోజులుగా ఫీల్గుడ్ వాతావరణం క్రమంగా ఆవరిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్, బీజేపీల స్వయంకృతాపరాధాలు, వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. బీఆర్ఎస్తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం మేరకే బీజేపీ కొంత వెనక్కు తగ్గిందనే ప్రచారం కూడా బలంగానే ఉన్నది. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ – బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి ఏర్పడితే సహజంగానే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుంది. అది దాని రాజకీయ అవసరం. ఇంకో అతి ముఖ్యమైన విషయం నాయకత్వ సమస్య. కేసీఆర్కు ధీటైన నాయకుడు ప్రతిపక్షాల్లో కంచుకాగడా వేసుకొని వెతికినా ఎవరూ కనిపించరు. ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తాజాగా జరిగిన అన్ని గ్రూపుల సర్వేల్లోనూ వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ గెలిచే సీట్లలో దాదాపు సగం సీట్లు గెలిచి కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందట! బీజేపీ మూడో స్థానంతో సర్దుకోవచ్చంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి రెండు మూడు స్థానాలు మారతాయట! రెండో స్థానంలోకి బీజేపీ చేరుతుంది. ఫీల్గుడ్ వాతావరణం మొదలైన తర్వాతనే కేసీఆర్ మరింత దూకుడును పెంచి వరసగా తాయిలాలను ప్రకటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. బొటాబొటీగా కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే ఆ ప్రభావం లోక్సభపై కూడా పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత డబుల్ డిజిట్ను తాకకపోతే బాగుండదనే ఆభిప్రాయం ఉండవచ్చు. 2018 ఎన్నికల వాగ్దానమైన రైతు రుణమాఫీ కొంతమేరకు చేసిన అనంతరం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ దాన్ని కిందకు దించి పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించారు. చేతివృత్తుల వారికి లక్ష సాయం, మైనారిటీలకు లక్ష సాయం, వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా వరస వరాలను ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం! ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు అది సాధ్యం కాదని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే బాట పట్టారు. పనిలో పనిగా కోకాపేట సమ్మోహనాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎందుకు చేసినట్టు? ఎకరా వందకోట్ల చొప్పున మూడున్నర ఎకరాల బిట్టు కొన్నవాళ్లు ఎన్ని అంతస్థులు కడితే గిట్టుబాటు అవుతుంది? మొత్తం ఎన్ని వేల ఫ్లాట్లు కట్టాలి? చదరపు అడుగుకు ఎంత ధర పెడితే గిట్టుబాటు అవుతుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేయగలిగినవారు వేల సంఖ్యలో వారికి దొరుకుతారా? మూడున్నర ఎకరాల్లో వేల కుటుంబాలుంటే పర్యావరణ సమస్యలు ఏర్పడవా? ఇలాంటివన్నీ మనలాంటి అల్పజీవులకు కలిగే సందేహాలు. ప్రభువుల లెక్క వేరు. బుల్లెట్ దిగిందా లేదా! ‘హైదరాబాద్ షైనింగ్’ అనే ప్రచారం బాగా పనిచేస్తే బుల్లెట్ దిగినట్టే! ఈ షైనింగ్, ఫీల్గుడ్లతో ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఒక్కోసారి ఈ ప్రచారం వికటించవచ్చు. వాజపేయి ప్రభుత్వం కూడా ఫీల్గుడ్ తుపాకీ ట్రిగ్గర్ నొక్కి ఎన్నికలకు వెళ్లింది. తుపాకీ పేలలేదు, బుల్లెట్ దిగలేదు. ఈ తుపాకీ పేలుతుందేమో చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నా దేశం నగ్నదేహమా?
అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది. మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్ (ఓబీసీ), కుకీ (ఎస్టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది. కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు. చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఒక దశలో ఇంఫాల్ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్ ప్రశ్నించింది. ఆమె మైతేయ్ తెగ మహిళ. స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది. కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్ ఆర్మీ... రేప్ అజ్’ అనే బ్యాన ర్తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది. తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది. మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి? మణిపుర ఘటనలు ‘డబుల్ ఇంజన్’ సర్కార్ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్... సంఘ్ పరివార్! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్ మహిళను కుకీ తెగవారు రేప్ చేశారని ఒక ఫేక్ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు. దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు. జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది. నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు. ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇంటిదొంగ – ఈశ్వరన్!
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తొలగింపు, అరెస్ట్ వార్తలు మన దగ్గర కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఇందుకు మూడు కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి అత్యల్పంగా కనిపించే సింగపూర్లో అవినీతి ఆరోపణలపై ఒక మంత్రి అరెస్ట్ కావడం మొదటి కారణం. రెండవది ఈశ్వరన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. మూడో కారణం మరీ ముఖ్యమైనది. ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్లోబల్æ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరన్ కూడా భాగస్వామి. అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియానికి చంద్రబాబు అప్పగించారు. ఈ ఒప్పందం కోసం ఈశ్వరన్, ఆయన సింగపూర్ టీమ్ పలుమార్లు విజయవాడకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్లు కూడా సింగపూర్లో పర్యటించారు. చివరికి 2017లో ఒప్పందం కుదిరింది. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నాటకం రక్తికట్టింది. ఆయనతోపాటు పాల్గొన్న సింగపూర్ ‘అధికారులు’ కూడా ఆ తర్వాత తమ అవతారాలను మార్చడం వింతగొలిపే విషయం. అసెండస్ – సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ఫ్ అనే ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఇవి ప్రభుత్వ కంపెనీలేనని బాబు సర్కార్ బుకాయించింది. సింగపూర్లో చాలా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థల వాటా అంతో ఇంతో ఉంటుంది. సెంబ్ కార్ప్లో కూడా టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉన్నది. కానీ మెజారిటీ వాటా ప్రైవేట్దే! ఈ టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్కు ఒక మూడేళ్లపాటు ఈశ్వరన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. సెంబ్కార్ప్లో టుమాసెక్ పెట్టుబడి వెనుక ఆయన పలుకుబడి ఉపయోగపడి ఉండవచ్చు. సెంబ్కార్ప్పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండవచ్చు. సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆరోజుల్లోనే పలువురు ముక్కున వేలేసుకున్నారు. సింగపూర్ కన్సార్టియం, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) ఏర్పాటయింది. ఈ సంస్థకు ప్రభుత్వం 1691 ఎకరాల భూమిని అప్పగించింది. కనీస ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఈ మొత్తం భూమి కనీస విలువ 6,764 కోట్లు. ఇంత విలువ చేసే భూమిని ఏడీపీకి ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఇందులో 250 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు ఉచితంగా కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసుకుని వారే అమ్మేసుకోవచ్చు. ఈ మొత్తం భూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బాబు సర్కార్ అంగీకరించింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కమిటీ (సీసీడీఎంసీ) తన వాటా కింద 221 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. భూమి విలువతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 12,485 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం పెట్టే ఖర్చు ఒక్క రూపాయి కూడా లేదు. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా వేసి విక్రయించడానికి ఇంకో 3,137 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 306 కోట్ల ఖర్చును సింగపూర్ కన్సార్టియం భరిస్తుంది. మొత్తం పెట్టుబడిలో కన్సార్టియం ఖర్చుపెట్టేది సుమారు రెండు శాతం! కానీ వ్యాపారంలో దాని వాటా 58 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం మాత్రమే. సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు ఈ ఒప్పందం సరైన ఉదాహణ. ఇది కాకుండా మరో 250 ఎకరాల భూమి కన్సార్టియంకు ఉచితంగా దక్కుతుంది. అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మి వ్యాపారం చేసే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)ది కాదు. ఇందుకోసం మరో మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అమరావతి మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో విజయవాడ అడ్రస్తో ఆర్వోసీలో రిజిస్టరయింది. దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బెంజిమిన్ యాప్ నియుక్తులయ్యారు. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో యాప్ సింగపూర్ ప్రభుత్వ అధికారి హోదాలో పాల్గొన్నారు. చివరికి విజయవాడలో రిజిస్టరయిన కంపెనీకి ఈవోగా అవతారం మారింది. అమరావతి కుంభకోణంలో ఇటువంటి వింతలు ఇంకెన్నో బయటపడాల్సి ఉన్నది. చంద్రబాబు – ఈశ్వరన్ల మధ్య పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. సింగపూర్లో చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది. ఈశ్వరన్ పదవీచ్యుతి, అరెస్ట్ వెనుక కూడా ఓ హోటల్ కనెక్షన్ ఉన్నది. ఆంగ్ బెంగ్ సెంగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్. అవినీతి, అక్రమ వ్యవహారాల ఆరోపణపై ఆంగ్ను సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) అరెస్ట్ చేసింది. అతడిని విచారిస్తున్న నేపథ్యంలోనే ఈశ్వరన్ తీగ దర్యాప్తు సంస్థకు దొరికింది. ఆంగ్ బెంగ్ సెంగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్ర హోటళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయట. ఇవన్నీ ఆంగ్ సొంతం కావు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, సంపన్నుల సొమ్ముతో భారీ హోటళ్లు నిర్మించి వాటిని తాను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయా? ఉంటే అవి సింగపూర్లోనే ఉన్నాయా? లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చంద్రబాఋకు ఈశ్వరన్తో ఉన్న బంధం, ఈశ్వరన్కు హోటల్ ప్రాపర్టీస్ అధిపతి ఆంగ్తో అనుమానాస్పద కనెక్షన్ను బట్టి చూస్తే చంద్రబాబు హోటళ్ల ప్రచారానికి బలం చేకూరుతున్నది. ఆంగ్ బెంగ్ సెంగ్పై వచ్చిన ఆరోపణలేమిటి? వాటితో ఈశ్వరన్కు ఉన్న సంబంధమేమిటి? అసలు ఈశ్వరన్ను పట్టడానికే ఆంగ్ను ఎరగా వేశారా? ఈశ్వరన్పై జరగనున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది? ఆ దర్యాప్తుకు అమరావతి తీగ తగులుతుందా లేదా? తగిలితే చంద్రబాబు భవిష్యత్తేమిటి? వగైరా ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు. సింగపూర్ దర్యాప్తులో అమరావతి కోణం తగిలినా తగలకపోయినా, ఈ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఆర్జించాలనుకున్న చంద్రబాబు కల మాత్రం కరిగిపోయినట్టే భావించాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ను ఎదుర్కోవడానికి చంద్రబాబు దగ్గర పనికొచ్చే అస్త్రాలేమీ లేవు. అమరావతినీ, రాజధానినీ ఒక మిడిల్క్లాస్ సెంటిమెంట్గా మార్చి రంగంలో నిలబడేందుకు బాబు దళం ఆపసోపాలు పడుతున్నది. సింగపూర్ దర్యాప్తులో అమరావతి తీగ తగిలితే, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైతే సెంటిమెంట్ పప్పులుడకవు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎదురుదెబ్బలు వరసగా తగులుతున్నాయి. అధికార వైసీపీ కులమతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో గణనీయంగా బలపడింది. ఇటీవల జరిగిన రెండు మూడు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైసీపీ ఓటింగ్ బలం 51 నుంచి 55 శాతం వరకు ఉంటుందని ఆ సర్వేలు ప్రకటించాయి. నిజానికి సర్వేలు కూడా అవసరం లేదు. పేదలు – పెత్తందార్ల ప్రయోజనాల నడుమ విభజన రేఖ ఏర్పడింది. ప్రతిపక్షం పేదల వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే తీసుకుంటున్నది. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారిన వలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో పాఠాలు చెప్పొద్దని అభాసుపాలైంది. ప్రాణాంతకమైన మద్యం ధరలు తగ్గించాలని కోరుతున్నది. పేదలకు ఇళ్లు కట్టించడంపై కోర్టులకెక్కుతున్నది. దశాబ్దాల తర్వాత వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయతలపెడితే హర్షించలేకపోతున్నది. ఆరోగ్య విప్లవంపై అవాకులు పేలుతున్నది. ఈ తరహా ఆత్మహత్యాసదృశ వైఖరితో ప్రతిపక్షం తనను తాను హననం చేసుకుంటున్నది. ముప్పాతిక శాతం ప్రజల హృదయాల నుంచి వెలివేతకు గురవుతున్నది. మరోపక్క తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ గురుతుల్యునిగా, రక్షకునిగా నిలబడుతున్న రామోజీ పాపభాండం బద్దలైంది. ‘మార్గదర్శి’ పేరుతో చేసిన చట్టవిరుద్ధ నిర్వాకం మెడకు చుట్టుకుంటున్నది. ముదివయసు విచక్షణను కోల్పోయింది. అడ్డగోలు రాతలతో యెల్లో మీడియా విశ్వసనీయతను జారవిడుచుకున్నది. రెండు వారాలకే వారాహి యాత్ర రోత పుట్టించింది. నటుడి మనోధృతిపై జనంలో శంక మొదలైంది. ఒక ప్రయోగం నిష్ఫలమైంది. ఇప్పుడు బాబు కూటమికి ఎటుచూస్తే అటు చీకటి. పటు నిరాశ. అన్నీ దుశ్శకునములే! కొసరుగా ఇప్పుడీ సింగపూర్ పీడకల!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com