-
UN: ఉక్రెయిన్పై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన
న్యూయార్క్: రష్యాతో యుద్ధం కారణంగా చిధ్రమైన ఉక్రెయిన్కు, దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ శరణార్థులకు సాయం చేయాల్సిందిగా భాగస్వామ్య దేశాలను ఐక్యరాజ్య సమితి(యూఎన్) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ను ఆదుకోవడానికి కనీసం 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని యూఎన్ తెలిపింది. ‘రష్యాతో సుదీర్ఘ యుద్ధం కారణంగా వందల వేల సంఖ్యలో చిన్న పిల్లలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దారుణమైన పరిస్థితుల వల్లే ఉక్రెయిన్కు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉక్రెయిన్ జనాభాలోని 40 శాతం అంటే కోటి నలభైఆరు లక్షల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 33 లక్షల మంది ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో బిక్కబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు. 4.2 బిలియన్ డాలర్లలో 3.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్కు కావాల్సి ఉండగా 1.1 బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ శరణార్థులకు అవసరమని యూఎన్ వెల్లడించింది. శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశాలకు ఈ సాయం అందిస్తామని తెలిపింది. శరణార్థులకు తాము తిరిగి ఉక్రెయిన్ రావాలన్న భావన కలగకుండా ఉండాలంటే వారిని కష్టాల నుంచి గట్టెక్కించాల్సి ఉందని యూఎన్ అధికారి ఫిలిప్పో గ్రాండి అభిప్రాయపడ్డారు. కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి 63 లక్షల మంది ఇతర దేశాలకు పారిపోయారు. మరో నలభై లక్షల మంది దేశంలోనే చెల్లాచెదురయ్యారు. వీరిలో ఒక లక్ష మంది దాకా చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఇదీచదవండి.. బద్దలైన అగ్ని పర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం -
Shombi Sharp: ప్రపంచానికి భారత్ అవసరం
న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై పెట్టుబడుల పరంగా భారత్ కంపెనీలు ముందున్నందున ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్యసమితి భారత రెసిడెంట్ కోర్డినేటర్ శొంబిషార్ప్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఢిల్లీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శొంబి మాట్లాడారు. భారత ప్రయాణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనివార్యమంటూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో వ్యాపారాలు ముందున్నట్టు చెప్పారు. సీఎస్ఆర్ విషయంలో, భారత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రపంచంలో సగానికి సగం దేశాలు విద్య, ఆరోగ్యం కంటే తమ అప్పులు తీర్చడానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంగా భారత్ నాయకత్వ పాత్ర పోషించింది’’అని శొంబి పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం లాభాల్లోని కంపెనీలు క్రితం మూడేళ్ల కాలంలోని సగటు లాభాల నుంచి 2 శాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం (సీఎస్ఆర్) వ్యయం చేయాల్సి ఉంటుంది. -
Israel Hamas war: భారత్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) జనరల్ అసెంబ్లీలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ స్పందించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఒక ప్రమాదకరమైన మానవతా సంక్షోభంగా ఆమె అభివర్ణించారు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం చర్చల ద్వారానే సాధ్యమన్నారు. ‘ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో చిన్న పిల్లలు, మహిళలు మరణించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఎంత మాత్రం అంగీకారం కాదు. అయితే ఈ యుద్ధానికి అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడి కారణమని కూడా మాకు తెలుసు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ క్షమించదు. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు భారత్ తరపున ఇప్పటికే 70 టన్నుల వివిధ రకాల సహాయ సామాగ్రిని పంపించాం. వీటిలో 16.5 టన్నుల మందులున్నాయి’ అని కంబోజ్ వివరించారు. ఇదీచదవండి.. సౌత్కొరియాకు కిమ్ మళ్లీ వార్నింగ్ -
Israel Hamas War: గాజాపై యూఎన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
రమల్లా: గాజా డెత్ ప్లేస్గా మారిందని ఐక్యరాజ్య సమితి హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నిరంతర బాంబుదాడులతో గాజా ఇక నివాసానికి ఎంత మాత్రం అనుకూలమైన ప్రాంతం కాదని ఆయన చెప్పారు. ‘మూడు నెలల క్రితం అక్టోబర్ 7న గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి గాజా మరణ ప్రదేశంగా మారింది. ఇక్కడి ప్రజల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వారు రోజూ భయంతో బతుకుతున్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నా. మానవత పునాదుల మీద జరుగుతున్న ఈ దాడులను రానున్న తరాలు కూడా మరిచిపోవు’ అని గ్రిఫిత్ అన్నారు.ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే గాజా మొత్తం శిథిలాలతో నిండిపోయింది. గడిచిన 24 గంటల్లో గాజాలోని సుమారు 100 లక్ష్యాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. ఇదీచదవండి.. ఆ కూటమి దేశాలకు హౌతీ గ్రూపు వార్నింగ్ -
Gaza: ‘యూఎన్’ కాన్వాయ్పై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు
గాజా: యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన పాలస్తీనా శరణార్థులకు సాయం చేసేందుకు వెళ్లిన ఐక్యరాజ్య సమితి(యునైటెడ్ నేషన్స్) బృందానికి చెందిన కాన్వాయ్పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. కాన్వాయ్ గాజా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ మృతి చెందలేదని యూఎన్ అధికారులు తెలిపారు. ‘ఉత్తర గాజాలో సహాయక చర్యల కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మా కాన్వాయ్పై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిగింది. సైన్యం చెప్పిన రూట్లోనే మేం ప్రయాణిస్తున్నాం. ఈ కాల్పుల్లో మా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అయితే ఒక వాహనం మాత్రం డ్యామేజ్ అయింది’ అని యూఎన్ బృందం డైరెక్టర్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు. గాజా ప్రజలకు, వారికి సాయం చేయాలనుకున్న వారికి అసాధ్యమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని యూఎన్ హ్యుమానిటేరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ఎక్స్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగినప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా గాజాలోని కొంత భాగాన్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదీచదవండి..చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా..? -
గాజాలో భయం భయం
ఖాన్ యూనిస్: గాజా్రస్టిప్లో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైనికులు ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి. ఈ మూడు నగరాల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు చిక్కుకుపోయారు. దక్షిణ గాజాలో 6 లక్షల మందికి పైగా ఉన్నారని, వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలోని శరణార్థి శిబిరాలన్నీ ఇప్పటికే బాధితులతో నిండిపోయాయని, ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరికీ దిక్కుతోచడం లేదని పేర్కొంది. ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఖాన్ యూనిస్ సిటీపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం బాంబుల వర్షం కురిపించింది. హమాస్ ముఖ్యనేతలంతా ఖాన్ యూనిస్లో మాటు వేశారని, వారిని బంధించక తప్పదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. -
చేసిన బాసలు చెదిరిపోతే ఎలా?
‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) సమావేశాలు దుబాయ్లో ప్రారంభమయ్యాయి. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా పుడమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.అంత స్థాయికి చేరడం భూమిని కాష్ఠం చేసినట్లే. ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. వాతావరణం విషయంలో ఎన్నో రికార్డులు బద్ధలైన సంవత్సరం ఇది.ఇంకో నెల మాత్రమే ఉన్న 2023లో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు ఉద్దేశించిన ‘కాప్– 28’ సమావేశాలూ మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ప్రమాద ఘంటికలూ వినిపిస్తున్న తరుణమిది! ఐక్యరాజ్య సమితి సమావేశం (కాప్–28) ఇంకోటి దుబాయ్లో నవంబరు 30వ తేదీ మొదలైంది. ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలూ, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచదేశాలన్నీ కూర్చుని సమీక్షి స్తారిక్కడ. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒకటి 2015 నాటి ‘ప్యారిస్ ఒప్పందం’. అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాలు కోకొల్లలు. అన్నింటి లక్ష్యం మాత్రం ఒక్కటే. సురక్షితమైన భూమి! ఈ అంతర్జాతీయ నిర్ణయాలు, చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు 2,100 నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగి పోతాయి. అయితే ఇప్పుడేదో చాలా గొప్పగా జరిగిపోతుందని కాదు. ఎందుకంటే భూమి ఇప్పటికీ ప్రమాదం నుంచి బయటపడలేదు మరి!ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ కూడా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం. 2021 నాటి ‘గ్లాస్ గౌ’ సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతిన బూనింది! షరతుల్లేని వాగ్దానాల విషయానికి వస్తే... ఇవి కూడా పూర్తిస్థాయిలో అమలైన పక్షంలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 2.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఐపీసీసీ 2022 నాటి నివేదిక కూడా దేశాల ఆర్థికసాయంలో మూడు నుంచి ఆరు రెట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. భూమి సగటు ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీ సెల్సియస్కు పెరగ డమంటే భూమిని కాష్ఠం చేసినట్లే! ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఇది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే దుబాయ్లో మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఐరాస వాతావరణ చర్చలే సరిపోవు... వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే కేవలం చర్చలు సరిపోవు. ప్యారిస్ ఒప్పందం ఏకాభిప్రాయంపై ఏర్పడని కారణంగా... నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల మనం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించ లేకపోయాం. ఈ ఒప్పందంలో కేవలం కొన్ని వాగ్దానాలూ, ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. కొంత వినూత్నంగా ఆలోచించ గలిగితే ఇంతకంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ పట్టించు కున్నది కొందరే! ఏదో ప్రజల ఆందోళనను కొంత నెమ్మదింప జేసేందుకా అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలైతే జారీ అయ్యాయి. ఈ ప్రకటనలు మఖలో వచ్చి పుబ్బలో పోయే రకాలు. 2021లో జరిగిన గ్లాస్గౌ సమావేశాల్లో... ‘దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి’ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తొలగించాలన్న విషయానికి భారత్ అభ్యంతరం తెలిపింది. ఫలితంగా దశలవారీగా అన్న పదం వచ్చి చేరింది. అయితే భారత్లోనే కాదు... చాలా దేశాల్లోనూ బొగ్గు వాడకం తగ్గనూ లేదు. పూర్తిగా నిలిచిపోనూ లేదు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం. భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐరాస చర్చలు ఈ అంశంపై నియమ నిబంధనలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. దుబాయ్లో జరిగే చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి. అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి. కాప్–28 లక్ష్యం ఇదే కావాలి. తొలిసారి ప్రపంచస్థాయి సమీక్ష... దుబాయ్లో జరుగుతున్న కాప్–28 సమావేశాల్లో మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టనున్నారు. ‘గ్లోబల్ స్టాక్ టేక్’ ద్వారా ప్యారిస్ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికి మనం సాధించింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధ మయ్యాయి. ఆశయాలకు, ఆచ రణకు మధ్య అంతరాన్ని విస్ప ష్టంగా ఈ నివేదికల్లో పేర్కొ న్నారు. కాప్–28 ఇంకో ముంద డుగు వేసి ప్రపంచం నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విష యాన్ని స్పష్టం చేయాలి. ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని, ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమన్న విషయాన్ని సుస్పష్టం చేయాలి. కాప్–28 ద్వారా ప్రపంచానికి అందించాల్సిన సందేశం ఇంకోటి కూడా ఉంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, అందుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టక పోవడం మంచిది. ఎందుకంటే గతంలో కాప్ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకన్నట్లు భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతికిలబడ్డాయి కాబట్టి! ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. జాతీయ రాజకీయాలు పరిస్థి తులు (కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అంశాల) అసలైన, ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయే కానీ.. అంతర్జాతీయ ఒత్తిడి కాదు. ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞాన, మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మన విశ్వాసం మరింత పెరుగుతుంది. మరింత ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది. లక్ష్యాలకన్నా ఆచరణ మిన్న వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొంచెం పట్టువిడుపు ధోరణి అవసరం. మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్ర దాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్–28 వేదికగా పిలుపునివ్వాలి. దీనికీ శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకూ మధ్య పొంతన కుదిరేలా చూడాలి. అంటే.. లక్ష్యాలను నిర్దేశించడం కాకుండా మార్పు జరిగేందుకు, సక్రమ అమలుకు పూనికగా నిలవాలి అని అర్థం. దీనికి అదనంగా కాప్–28 బాధ్యతల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు. దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలో సమదృష్టి పాటించడం అవసరం. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది. ఇది కొంత విధ్వంసాన్నయితే సృష్టిస్తుంది. దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏర్పాట్లు అవసరం. ప్రత్యామ్నాయ జీవ నోపాధులతో పాటు తమదన్న భావనను కల్పించడం కీలక మవుతుంది. కాప్–28 సమా వేశాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి అమలును చురు కుగా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి. ఐక్యరాజ్య సమితి పరిధిలో.. బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలనేవి ప్రభుత్వాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆచరించినప్పుడు వాటికి సార్థకత. అలాగే ఈ చర్యలు ప్రభావశీలంగా ఉండాలంటే భాగస్వాములందరి చర్యలూ, తోడ్పాటు అత్యవసరం. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాతావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. అంతర్జాతీయ కోర్టుల్లోనూ హై ప్రొఫైల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఇదంతా బాధ్యత ఎవరిదన్న విషయంపైనే! దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా తాము చేసిన వాగ్దానాలు కచ్చితంగా, సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి. తద్వారా మానవాళిని పరిరక్షించాలి. లావణ్యా రాజమణి వ్యాసకర్త ప్రొఫెసర్,ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ లా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్హౌస్వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
2023.. అత్యంత వేడి సంవత్సరం !
దుబాయ్: నెల రోజుల్లో ముగిసిపోనున్న 2023 ఏడాది.. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గురువారం నివేదించింది. నివేదిక తాలూకు వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి పిటేరీ టాలస్ చెప్పారు. ‘‘ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కి సంభవించిన ‘ఎల్నినో’ పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రి సెల్సియస్ను దాటనుంది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే నాలుగేళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే వీలుంది. ఆ తర్వాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
వీకే నరేష్కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
పీకల మీదకొచ్చింది!
ముప్పు ముంచుకొచ్చినప్పుడు కాని మేలుకోకపోతే కష్టమే. పరిస్థితి చూస్తే అలానే ఉంది. పర్యావరణ మార్పులపై సంబంధిత పక్షాల సదస్సు తాజా సమావేశం (కాప్–28) ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 12 దాకా దుబాయ్లో జరగనుంది. ఏటేటా ఐరాస ఆధ్వర్యంలో ఇది మొక్కుబడి తంతుగా మారిపోతున్న వేళ కొద్దిరోజులుగా వివిధ నివేదికలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితి విషమించిందని వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు తొలి సారిగా ఈ నవంబర్ 17న పారిశ్రామికీకరణ మునుపటి హద్దు దాటి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగా యన్న వార్త ఆందోళన రేపుతోంది. పుడమిపై కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు తాము పెట్టుకున్న లక్ష్యాల గురి తప్పుతూనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఎప్పటికప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రతిన చేస్తున్నా, నష్టనివారణకు నిధుల కొరత పీడిస్తూనే ఉంది. ఆహార అభద్రత మొదలు వ్యాధుల దాకా అనేక రకాలుగా వాతావరణ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యంలో దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని దెబ్బ తీస్తున్నాయి. ఆ నేపథ్యంలో వాతావరణ మార్పులపై తాజా నివేదికలు అలజడి సృష్టిస్తున్నాయి. పుడమి మీది ఒక శాతం అత్యంత ధనికులే మొత్తం ప్రపంచ జనాభాలోని 66 శాతం మంది కలగజేసేటంత భూతాపానికి కారణమని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తేల్చింది. ఇక, ‘కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ అంటూ గత వారం లాన్సెట్ వెలువరించిన 8వ వార్షిక నివేదిక ప్రజారోగ్యం, ఆరోగ్య రక్షణ వ్యవస్థలపై పడే ప్రభావాన్ని కళ్ళకు కట్టింది. పర్యావరణ మార్పుకు ప్రధాన కారణాలైన శిలాజ ఇంధనాల వినియోగం లాంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆరోగ్యానికే పెను ప్రమాదమని లాన్సెట్ నివేదిక హెచ్చరిస్తోంది. భారత్కు సంబంధించి ఈ నివేదిక చెప్పిన అంశాలు, చేస్తున్న హెచ్చరికలు ఆలోచన రేపుతున్నాయి. మన దేశంలో 1986 – 2005 మధ్య కాలంతో పోలిస్తే, 2018 – 2022 మధ్య కాలంలో సగటు వేసవి ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగాయట. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రత పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తోంది. ఈ వాతావరణ పరిస్థితులు మలేరియా, డెంగ్యూ కేసుల్ని పెంచుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో గ్యాస్ట్రో ఎంటరైటిస్, సెప్సిస్, కలరాలకు సానుకూలంగా తయారవుతున్నాయి. అలాగే, ‘బ్రోకెన్ రికార్డ్’ శీర్షికన ఐరాసా వెల్లడించిన తాజా నివేదిక సైతం పరిమితులు దాటి గ్రీన్హౌస్ వాయువుల విడుదల పెరిగిన కథను వివరించింది. వెరసి, ఉష్ణోగ్రతలు పారిశ్రామికీరణకు ముందు స్థాయి కన్నా 2 డిగ్రీలు, వీలుంటే 1.5 డిగ్రీలు మించి పెరగరాదని 2015 నాటి ప్యారిస్ ఒప్పందం (పీఏ)లో చేసుకున్న బాసలు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. నికరంగా కర్బన ఉద్గారాలు లేని ‘నెట్ జీరో’కు కట్టుబడతామని అనేక దేశాలు మాట ఇస్తున్నా, అది ‘విశ్వసనీయంగా’ లేదని తాజా నివేదిక తేల్చేసింది. భూతాపం పెంపును 1.5 డిగ్రీల లోపలకు నియంత్రించే అవకాశాలు నూటికి పద్నాలుగు వంతులేనట! 2021తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువగా 2022లో ప్రపంచమంతా కలసి 57.4 బిలియన్ల కర్బన ఉద్గారాలను వెలువరించిందని లెక్క. అలాగే, కరోనాలో 4.7 శాతం తగ్గిన ఉద్గారాలు ఈ ఏడాది మళ్ళీ కరోనా ముందు స్థాయికి చేరిపోవచ్చని అంచనా. నిజానికి, పర్యావరణ మార్పు, ధనిక – బీద అసమానతలు విడదీయరాని జంట. ప్రధానంగా ధనిక దేశాల పాపానికి పేద దేశాలు బలి అవుతున్నాయి. పర్యావరణ మార్పు ప్రభావాన్ని మోస్తున్నాయి. ధనిక దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలనీ, చేసిన నష్టానికి పరిహారం చెల్లించాలనీ కాప్28 లాంటి చోట్ల పేద దేశాలు ఒత్తిడి తెస్తున్నది అందుకే. కానీ, అతి తక్కువ సంఖ్యలోని ఆ ధనిక దేశాలే ప్రపంచ పర్యావరణ విధానాన్ని నిర్ణయిస్తుండడంతో పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. ఈజిప్ట్లో నిరుడు కాప్27 సదస్సులో ‘నష్ట పరిహార నిధి’ని ఏర్పాటు చేయాలంటూ ఒప్పందం కుదిరింది. స్వీయ కర్బన ఉద్గారాలు తక్కువే అయినా ధనిక దేశాల ఉద్గారాలతో నష్టపోతున్న బీద దేశాలను పర్యావరణ మార్పు ప్రభావాల నుంచి కాపాడేందుకు ఈ నిధిని ఉద్దేశించారు. ఆలోచన మంచిదైనా, ఆచరణకు వచ్చే సరికి ఆ నిధి ద్వారా డబ్బులు ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేలనే లేదు. ఇంకా చిత్రమేమిటంటే– పర్యావరణానికి తూట్లు పొడిచే భారీ చమురు ప్రణాళికలు వేస్తున్న దుబాయ్లో కాప్28 సమావేశం జరగనుండడం! అలాగే, వాతావరణ సంక్షోభం, ప్రకృతి సంక్షోభం... ఈ రెంటినీ భిన్నమైన సవాళ్ళుగా భావిస్తూ, స్పందిస్తున్నాం. వాటి వల్ల సమాజంలో తలెత్తే సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచమంతా చేస్తున్న ప్రమాదకరమైన తప్పు అదే! తీవ్ర వాతావరణ ఘటనలతో వర్ధమాన దేశాల్లో బాలికలకు నాణ్యమైన విద్య దెబ్బ తింటోందని ప్లాన్ ఇంటర్నేషనల్ నివేదిక మాట. పర్యావరణ బాధిత 30 దేశాల్లో ఏటా కనీసం 1.25 కోట్ల మంది బాలికలు అర్ధంతరంగా చదువుకు గుడ్బై చెప్పడానికి వాతావరణ మార్పులు కారణమవుతాయని ‘మలాలా ఫండ్’ సైతం హెచ్చరిస్తోంది. ఇలాంటి గణాంకాలెన్నో వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం. అందుకే, పర్యావరణ మార్పు గురించి మాటల కన్నా చేతలు ముఖ్యం. రానున్న దుబాయ్ సదస్సు లోనూ ప్యారిస్ ఒప్పందం తాలుకు అమలు తీరుతెన్నులపై ప్రపంచం మళ్ళీ చర్చిస్తుంది. ఈసారైనా మాటలు తగ్గించి, చేతలపై దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే, పర్యావరణంపై ప్రపంచం ఇప్పటికే గాడి తప్పింది. దుష్ఫలితాలూ చూస్తోంది. తాజా హెచ్చరికలు పెడచెవిన పెడితే మరిన్ని కష్టాలు తప్పవు. ప్రపంచానికి పరిష్కారం ఎడారి దేశంలోనూ ఎండమావిగా మారితేనే మానవాళికి నష్టం. -
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
మొత్తం మానవాళికే సమస్య!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది. పూర్వ సగటు ఉష్ణోగ్రతల కంటే 2023లో 1.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల సదస్సు కోసం ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు సమావేశమవుతున్నప్పుడు, ఇంతకంటే కీలక సమస్య వేరేదీ లేదు. ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలలో వరద బీభత్సం విదితమే. దేశమంతటా వర్షాలు సకాలంలో పడలేదు. వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. పంటల విస్తీర్ణం, దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) లోని అన్ని సభ్యత్వ పక్షాలు దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశం కానున్నాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి ‘గ్లోబల్ స్టాక్ టేక్’ (జీఎస్టీ) పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ జీఎస్టీ లక్ష్యం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గేనా? 2023 సెప్టెంబర్లో విడుదలైన మొదటి జీఎస్టీ అధ్యయన ఫలితం, స్పష్టంగా ఉన్నది: ప్రపంచం మొత్తం అనుకున్న లక్ష్యం నుంచి దారి తప్పింది. ఈ నేపథ్యంలో దుబాయ్లో జరగనున్న ‘కాప్ 28’(కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్– భాగస్వామ్య పక్షాల 28వ సమావేశం)లో దీని దిద్దుబాటు మీద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. అనేక చర్యల మీద ఏకాభిప్రాయం లేదు. ఈ నివేదిక వల్ల కొన్ని చర్యల పైన విశాల ఒప్పందాలు జరుగుతాయని అంచనా. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు చేయాలనే లక్ష్యం ఒకటి కాగా, శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీగా తగ్గించే లక్ష్యం పైన చర్చలు వివాదాస్పదంగా ఉన్నాయి. దుబాయ్ సమావేశం అధ్యక్షుడు ఒక చమురు కంపెనీ అధిపతి అయిన నేపథ్యంలో చమురు ఉపయోగం తగ్గించడానికి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. రెండవ పెద్ద అంశం, ‘నష్టం మరియు హాని’. పేద దేశాలు, వెనుకబడిన దేశాల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ ఉండడంతో భూగోళ కాలుష్యానికి కారక దేశాలు నష్ట పరిహారం అందించాలని చర్చలు జరుగుతున్నాయి. గత కాప్ 27 సమావేశంలో ఆఫ్రికన్ దేశాలు పట్టుబట్టి నష్టం మరియు హాని పరిహార నిధి ఏర్పాటును తీర్మానం చేశాయి. అటువంటి నిధిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆ సమావేశ పురోగతిగా వర్ణించారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని ఏర్పాటు విషయం దశలలో తేలాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి ఈ విషయం మీద సమావేశాలు జరుగు తున్నాయి. పురోగతి ఆశాజనకంగానే ఉన్నది. కర్బన ఉద్గారాల వల్ల భౌగోళిక కాలుష్యం పెరిగి, సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణ మార్పులు జరిగి నష్టపోతున్న దేశాలు, ప్రాంతాలు వాటిని ఎదుర్కొనే ప్రతి చర్యల మీద నిధులు సొంతంగా పెట్టుకునే సామర్థ్యం లేక ఈ ప్రపంచ నిధి గురించి ఆలోచించాయి. భారత దేశంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో విపరీత వర్షాల వల్ల నదీ ప్రవాహం పెరిగి కొన్ని ఆనకట్టలు కొట్టుకుపోయి జరిగిన ఆస్తి నష్టం అంచనా లక్ష కోట్ల రూపాయలు. ఇటువంటి నష్ట భర్తీకి, పునర్నిర్మాణానికి సొమ్ములు ప్రపంచ నిధి నుంచి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ ఆ నిధికి డబ్బులు ఎవరు, ఎంత ఇవ్వాలి అనే విషయం నుంచి ఎవరికి, ఏ విధంగా,ఎంత ఇవ్వాలి అనే వరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నష్ట పరిహార నిధి పూర్తి స్థాయి ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. వేగంగా నిర్ణయించాలని పేద దేశాల ఆకాంక్ష. ధనిక దేశాలకు ఈ నిధి ఏర్పాటు ఇష్టం లేదు. అది తమ ఆర్థిక రంగం మీద భారం అవుతుంది అని వారి భావన. ఆహార, ఆరోగ్యాలపై ప్రభావం 2023 అంతటా వివిధ రూపాల్లో (రెండవ గ్లాస్గో సంభాషణ, ప్రత్యేక వర్క్ షాప్లు, మంత్రుల సంప్రదింపులతో సహా) దీనిపై చర్చలు జరిగాయి. కాల పరిమితులతో కూడిన లక్ష్యసాధన, అర్హత ప్రమాణాలు, ఆర్థిక వనరులు వంటి విషయాలపైన ఆలోచనలను రూపొందించడానికి ఒక పరివర్తన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పని చిన్నదేమీ కాదు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పట్టింది. పరివర్తన కమిటీ పని తీరును పరిశీలిస్తే, పరిష్కరించ వలసిన సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా, విభేదాలను పరిష్క రించడానికి రాజకీయ మార్గదర్శకత్వం అవసరమని తెలుస్తుంది. యూఎన్ఎఫ్సీసీసీ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, ఎస్బీఐ, ఎస్బీఎస్టీఏలకు సంబంధించిన ఐదు భారీ అంశాలతో పాటు అనేక ఇతర సమస్యలను కాప్ 28 ప్రస్తావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాప్ 28 సమావేశ అధ్యక్ష (యూఏఈ) పాత్ర కీలకం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ మార్పులకు, ఆహారం, ఆరోగ్యానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకుని, తగిన చర్యల మీద దృష్టి పెంచడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. స్థూలంగా, వాతావరణ మార్పుల సదస్సు అంటే కేవలం చెట్లు, అడవులు, కాలుష్యం గురించే కాదు. ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ అభివృద్ధి విధానాలు, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలి మార్పులతో సహా సమస్త మానవాళి చర్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సామాజిక న్యాయం, సమానత్వం, సహకారం, గౌరవం, మానవ హక్కులు వంటి సూత్రాలు విధిగా ఉంటాయి. భారతదేశం పాత్ర భారతదేశం వహించే పాత్ర కూడా అనేక అంతర్జాతీయ సమావేశాల మాదిరిగానే కాప్ 28 సదస్సులో కూడా ముఖ్యమైన అంశంగా మారుతున్నది. నిర్ణయాలు తీసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు, అంతర్గతంగా ఎదురు అవుతున్న ప్రకృతిపరమైన నష్టాలకు భారత ప్రతినిధి వర్గం పని తీరును కూడా నిశితంగా గమనించాల్సి ఉన్నది. ఈ ప్రతినిధి వర్గంలో ఎవరు ఉంటారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన సందేశం లేదా ఆదేశాలు ఏమిటి అని మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వారధిగా, అమెరికా దేశాల కూటమికీ, రష్యా, చైనా దేశాల కూటమికీ మధ్య కీలకంగా పరిణమించిన భారత్ ఈ సదస్సులో వ్యవహరించే తీరు మీద ఆసక్తి ఉన్నది. ‘అభివృద్ధి’ మార్గం వివాదస్పదం అవుతున్న సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, పేదరికం, అనారోగ్యం,ఆకలి వంటి అంశాలను పరిష్కరించే వివిధ మార్గాలు, చర్యలు కూడా అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి లోను అవుతున్నాయి. కాబట్టి అక్కడ జరిగేది వేరు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. మన రాజకీయ వ్యవస్థ, ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ అంశాల మీద తమ పరిజ్ఞానం పెంచుకుంటేబాగుంటుంది. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
ఇరాక్తో ఒకలా! ఇజ్రాయెల్తో మరోలా!!
పాలస్తీనాలో భాగమైన గాజా రాజ్యరహిత పరిస్థితి... దాన్ని పాలిస్తున్న హమాస్ను తీవ్రవాదంలోకి నెట్టింది. ఇజ్రాయెల్లోని పాలస్తీనా బందీలను వదలమన్న ఐక్య రాజ్య సమితి 194వ తీర్మానాన్ని ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. పైగా పాలస్తీనాను ఆక్ర మించింది. తీవ్ర నిరసనలతో 2023 అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార యుద్ధానికి దిగింది. ఈ చర్యను అనేక దేశాలు ఖండించాయి. గతంలో భద్రతా మండలి 1441వ తీర్మానాన్ని 2002 నవంబర్ 8న ఏకగ్రీవంగా ఆమోదించింది. అనేక తీర్మానాల్లో నిర్ధారించినట్లు తన నిరాయుధీకరణ బాధ్యత నిర్వహణకు సద్దాం హుస్సేన్కు ఈ తీర్మానం తుది అవకాశాన్నిచ్చింది. 687వ తీర్మాన యుద్ధ విరమణ ఆదేశాన్ని ఇరాక్ పాటించలేదనీ, విధ్వంసక నిషిద్ధ ఆయుధాలను సంపాదించి, నిషేధిత క్షిపణులను తయారు చేసిందనీ, 1990–91లో కువైట్ ఆక్రమణలో తన సైనిక దోపిడీకి పరిహారం నిరాకరించిందనీ ఆరోపించింది. ఇరాక్ తప్పుడు వ్యాఖ్యానాలు, సమర్థనలు, ఈ తీర్మాన అమలు వైఫల్యం ఇరాక్ బాధ్యతల ఉల్లంఘన అని హెచ్చ రించింది. ఈ తీర్మానంలో ఇరాక్పై యుద్ధ ప్రసక్తి లేదు. ఐరాస పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీ కమిషన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలను ఇరాక్ అనుమతించాలని పేర్కొన్నారు. 2002 సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్లు్య. బుష్ ఐరాస సాధారణ సభలో ఇరాక్ తప్పు లను చదివారు. ఆ తప్పులు: ఐరాస భద్రతా సమితి 1373వ (ఉగ్రవాద నిరోధక) తీర్మానాన్ని ఇరాక్ ఉల్లంఘించింది. ఇరాన్, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకున్న అల్ ఖైదా ఉగ్రవాదులు ఇరాక్లో ఉన్నారు. ఐరాస మానవ హక్కుల కమిషన్ 2001లో ఇరాక్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను గమనించింది. ఇరాక్లో జీవ, రసాయన ఆయుధాలు, దీర్ఘ లక్ష్య క్షిప ణుల తయారీ, ఉపయోగం ఐరాస తీర్మానాల అతిక్రమణ. ఐరాస పథకం ఆహారానికి చమురు డబ్బుతో ఇరాక్ ఆయుధాల కొనుగోలు. భద్రతా మండలిలో వీటో హక్కు, శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్లకు ఇరాక్పై అమెరికా యుద్ధానికి దిగుతుందన్న అనుమానముంది. తీర్మానంలో తీవ్ర పరిణామాలు, పాదార్థిక ఉల్లంఘనలు వంటి పదాలు యుద్ధానికి దారితీయరాదని, ఇరాక్పై చర్యకు మరొక తీర్మానం అవసరమని రష్యా, ఫ్రాన్స్లు వాదించాయి. 1441వ తీర్మాన ముసాయిదాను తయారుచేసిన అమెరికా, ఇంగ్లండ్లు, తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఏకైక అరబ్బు దేశం సిరియా, ఈ తీర్మాన లక్ష్యం ఇరాక్ నిరాయుధీకరణని, దానికి ఇరాక్ సహకరించకపోతే భద్రతా మండలి తర్వాతి కార్యక్రమాన్ని నిర్ణయించాలని అన్నాయి. ఇరాక్ 2002 నవంబర్ పదమూడున తీర్మానాన్ని అంగీకరించింది. అమెరికా (ఐరాస) తీర్మాన ఆరోపణలు రుజువు కాలేదని ఐరాస తనిఖీ అధికారులు 2002 నవంబర్లో నివేదించారు. అదే ఏడాది డిసెంబర్లో ఇరాక్ 12 వేల పేజీల ఆయుధ నివేదికను ఇచ్చింది. ఏ ఐరాస సభ్య దేశమూ యుద్ధానికి అనుకూలం కాదు. అమెరికా, ఇంగ్లండ్లు చాలా తారుమారు పనులు చేశాయి. ఒకటి రెండు దేశాలు ఐరాస భద్రతా మండలిని ఆదేశించలేవని ఐరాస సభ్య దేశాలు ప్రకటించాయి. ఇరాక్పై యుద్ధం అసమ్మతమని న్యాయ కోవిదులు తమ అభిప్రాయాలను తెలిపారు. అయినా 2003 మార్చి 19న అమెరికా ఇరాక్పై యుద్ధానికి దిగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు ఇరాక్పై యుద్ధం చేశాయి. 2003 మే వరకు వరకు యుద్ధం సాగింది. ఇరాక్ సర్వనాశనమైంది. సద్దాం హుస్సే న్ను బంధించి ఉరిదీశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇరాక్పై యుద్ధం చట్టవ్యతిరేకమనీ, ఐరాస వ్యవస్థాపక ఒప్పంద ఉల్లంఘననీ 2004 సెప్టెంబర్లో ప్రకటించారు. యుద్ధనివారణ కోసం ఐరాస సభ్య దేశాలు ఒక దేశంపై మరొక దేశం దాడిని ఆపాలన్నది రెండవ ప్రపంచ యుద్ధ విధ్వంసం తర్వాత ఏర్పడ్డ ఐరాస ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ ఐరాస సభ్య దేశం. పాలæ స్తీనా, వాటికన్ నగరం ఐరాస పరిశీలన దేశాలు. యుద్ధ నిరోధంలో పాలస్తీనా కంటే ఇజ్రాయెల్పై ఎక్కువ బాధ్యత ఉంది. అంతర్జాతీయ మానవత్వ చట్టాలను పాటించి, మానవత్వంతో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలనీ, ప్రజలకు అత్యవసర ఆహార, ఔషధాలను అందించాలనీ, బందీలను వదలాలనీ ఐరాస సర్వసభ్య సాధారణ సభ 2023 అక్టోబర్ 27న తీర్మానించింది. ఈనాటికీ ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ అమలు చేయలేదు. యుద్ధాన్ని ఆపలేదు. అమెరికా... ఇజ్రాయెల్ పక్షం వహిస్తోంది. కనీసం తాత్కా లిక విరామాన్ని పాటించమని అమెరికా మిత్ర దేశాలే కోరాయి. ఐరాస 1441వ తీర్మాన చట్టవ్యతిరేక దుర్వినియోగానికి, ఐరాస ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డ అమెరికా, అలాగే ఇరాక్పై యుద్ధంలో పాల్గొన్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పోలండ్లు నేటి ఐరాస తీర్మానాన్ని ఎందుకు అమలు చేయించవు? ఇరాక్ను కక్షతో శిక్షించిన అమెరికా మానవత్వంతో ఇజ్రాయెల్ను ఎందుకు దండించదు? సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 9490 20 4545 -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్కు హితవు పలికారు. ఇజ్రాయెల్కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
రాష్ట్ర వృద్ధుల్లో 31.6 శాతం మందికి ఆరోగ్య బీమా
సాక్షి, హైదరాబాద్: వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6 శాతంగా ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2 శాతం కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటం గమనార్హం. మిజోరంలో దేశంలోనే అత్యధికంగా 66.5 శాతం మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉండగా అతితక్కువగా జమ్మూకశ్మీర్లో 0.2 శాతం మందికే ఉంది. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్–2023 నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించగా కేంద్ర సామాజిక, సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరం, ఒడిశా, ఛత్తీస్గఢ్, మేఘాలయా, అస్సాం, గోవా, రాజస్తాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4 శాతం వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడంలేదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేటు ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55 శాతం వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహన లేదు. తెలంగాణలో రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నవారు 30.7 శాతం మంది ఉన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 10 శాతం ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2021లో 11 శాతం వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుంది. 60 ఏళ్లకు పైబడినవారిలో జీవన ఆయుర్ధా యం 2015–19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3 శాతం, పురుషుల్లో 17.3 శాతం. 75 ఏళ్ల తర్వాత తెలంగాణలో సగటున అదనంగా 8.7 ఏళ్లు జీవిస్తున్నారు. తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారిలో పనిచేయలేని స్థితిలో ఉన్నవారు 14.6 శాతం మంది. ఇండియాలో 23.8 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8 శాతం, ఇండియా 21.7 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో ఎలాంటి ఆదాయం లేనివారు తెలంగాణలో 11 శాతం ఉన్నారు. ఇండియా 18.7 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే వృద్ధులు ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఎక్కువ కాలం బతుకుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండటం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కనీ్వనర్, తెలంగాణ -
Israel-Hamas War: తీర్మానానికి భారత్ దూరం
ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్లో పాల్గొనలేదు. అయితే ఉగ్రవాదం మానవాళి పట్ల ఎప్పటికీ మాయని మచ్చేనని భారత్ పునరుద్ఘాటించింది. ‘‘ఉగ్రవాదానికి సరిహద్దుల్లేవు. జాతి, జాతీయత లేవు. అందుకే కారణమేదైనా సరే, మతిలేని ఉగ్రవాద చర్యలకు ఎవరూ మద్దతివ్వరాదు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కతాటిపై ఉండాలి’’అని పిలుపునిచి్చంది. ఇజ్రాయెల్, హమాస్ తక్షణం పోరుకు స్వస్తి చెప్పాలని తీర్మానం పిలుపునిచి్చంది. గాజాకు అన్ని రకాల సాయం నిరి్నరోధంగా, పూర్తిస్థాయిలో, సురక్షితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బందీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాన్ని జోర్డాన్ రూపొందించింది. అందులో హమాస్ పేరును ప్రస్తావించకపోవడాన్ని అమెరికా తప్పుబట్టింది. చర్చలతోనే పరిష్కారం: భారత్ ఐరాసలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తీర్మానంపై చర్చలో భారత్ తరఫున పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడికి దిగడం ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన పరిణామమన్నారు. దాన్ని అందరూ ఖండించాల్సి ఉందని చెప్పారు. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ‘అలాగాకుండా పలు దేశాలు పరస్పరం హింసాకాండకు దిగుతుండటం ఆందోళనకరం. మానవతా విలువలకు పాతరేసే స్థాయిలో హింస, ప్రాణ నష్టం చోటుచేసుకుంటుండటం శోచనీయం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసను మార్గంగా చేసుకోవడం శాశ్వత పరిష్కారాలు ఇవ్వజాలదు’అని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ విషయంలో దేశాలు పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టాలి’అని పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగని చర్చలు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశమిచ్చాయని అభిప్రాయపడ్డారు. తక్షణం బందీలను విడిచిపెట్టాలని హమాస్కు సూచించారు. గాజాకు భారత్ కూడా మానవతా సాయం అందించిందని పటేల్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే ఘర్షణకు పరిష్కారమన్నది ముందునుంచీ భారత్ వైఖరి అని స్పష్టం చేశారు. 38 టన్నుల మేరకు ఔషధాలు, పరికరాలు, నిత్యావసరాలను పంపినట్టు చెప్పారు. ఇరుపక్షాలు హింసకు స్వస్తి చెప్పి తక్షణం నేరుగా చర్చలు మొదలు పెట్టాలని కోరారు. హమాస్ పేరు ప్రస్తావించనందుకే...! ఐరాసలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించనందుకే దానిపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్తో పాటు కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాలు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి కెనడా ప్రతిపాదించిన కీలక సవరణకు భారత్ మద్దతిచ్చింది. ‘‘ఇజ్రాయెల్పై హమాస్ దాడిని, వందల మందిని బందీలుగా తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని తీర్మానంలో చేర్చాలని భారత్ కోరింది. భారత్తో పాటు మొత్తం 87 దేశాలు సవరణకు అనుకూలంగా, 55 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో సవరణ ఆమోదం పొందలేదు. -
సామూహిక శిక్షగా మారిన యుద్ధం
పశ్చిమాసియా ప్రాంతపు ప్రస్తుత నిత్యాగ్నిహోత్రాన్ని డాంబికాల మధ్య జరుగుతున్న యుద్ధం అని అంటే అతిశయోక్తేమీ కాదు. గాజాలో హమాస్ను కట్టడి చేశామని తమకు తాము సర్ది చెప్పుకునే ఇజ్రాయెలీలు ఒకవైపు.. ఇజ్రాయెల్తో వివిధ అరబ్ దేశాల సంబంధాలు సాధారణ స్థితికి వస్తే – అది కూడా పాలస్తీనా అంశంతో సంబంధం లేకుండా జరిగిపోతే – ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ రాజకీయాలకు అక్కరకొస్తుందని అమెరికన్లు మరోవైపు భావిస్తున్నారు. కానీ నిత్య నిరాశావాది, స్వప్రయోజనాలే మిన్న అనుకునే నెతన్యాహూ రాజకీయాలు ఇజ్రాయెల్ ప్రయోజనాలను దెబ్బ తీశాయనడంలో సందేహం లేదు. ఒకరకంగా ఆయన హమాస్ ఆటలో పావు అయ్యారని చెప్పవచ్చు. ఇజ్రాయెల్కున్న ఆత్మరక్షణ హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ ఉగ్రవాదుల దాడి యూదుల చరిత్రలోనే తీవ్రమైనదని అందరూ అంగీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది. గాజా స్ట్రిప్కు నీరు, విద్యుత్తు, ఆహారం అన్నింటిని బంద్ చేసింది. పైగా ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇందులో కొన్ని జిల్లాలకు జిల్లాలు నేలమట్టమై పోయాయి. అయితే చర్యల ద్వారా హమాస్ను గాజా స్ట్రిప్ నుంచి ఎలా తీసివేస్తారన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో ఇజ్రాయెల్ ప్రణాళికలు మొత్తం బెడిసికొడుతూండగా ప్రస్తుతం అది కొత్త, విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఇకనైనా కొంచెం ఆచి తూచి ముందడుగు వేయాలని మిత్రదేశాలే సూచిస్తూండటం ఇందుకు నిదర్శం. అమెరికాకు అనుభవమే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితికి, సెప్టెంబరు 11న అల్ఖైదా ఉగ్రవాదుల దాడి తరువాత అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితికి సారూప్యం కనిపిస్తుంది. అప్పట్లో అమెరికా గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజమ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మహా యుద్ధాన్ని ఒక్కసారి సమీక్షిస్తే అమెరికా అఫ్గానిస్తాన్ లో యుద్ధాన్ని కోరుకుందని, అదే సమయంలో ఇరాక్తో యుద్ధాన్ని ఎంచుకుందని చెప్పాల్సి వస్తుంది. రెండూ అమెరికాకు తలనొప్పి మిగిల్చిన మాటైతే నిజం. బాధితులు అఫ్గానిస్తాన్, ఇరాక్ ప్రజలు మాత్రమే. ఇప్పుడు ఇజ్రాయెల్ నేతలు కూడా ప్రజల బాధలు పట్టించుకునే స్థితిలో కనిపించడం లేదు. గాజాను సమూలంగా నేలమట్టం చేశాక, దాంతో సంబంధా లన్నీ తెంచేస్తామని ఇజ్రాయెలీ జనరళ్లు చెబుతున్నారు. అయినా సరే.. ఇజ్రాయెల్ పొరుగునే 20 లక్షల మంది బాధతప్త జనాభా ఉంటుంది. ఏదో ఒక ప్రాంతాన్ని మిలటరీ చర్యలకు అతీతంగా ఉంచినా సరే. ఇజ్రాయెల్ ఏర్పాటు ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ల గొట్టబడిన వారి శాపనార్థాలు ఇజ్రాయెల్కు తగులుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా అసమ్మతిని, వ్యతిరేకతను అణచివేసేందుకు సైనిక చర్య లనే ఆసరాగా చేసుకుంది ఇజ్రాయెల్. రహస్య గూఢచార వ్యవస్థ సాయంతో దాడులను ముందస్తుగా అణచివేస్తోందనీ అంటారు. ఇజ్రాయెల్ తన భద్రత చర్యల్లో భాగంగా 1967లో వెస్ట్బ్యాంక్, గాజాస్ట్రిప్లలోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది కూడా. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఏర్పాటు కారణంగా నిర్వాసితులైన పాలస్తీని యన్లు ఎక్కువగా ఉంటారు. అంటే బలవంతంగా తమ ఇళ్ల నుంచి గెంటివేయబడిన వారన్నమాట. ఈ రకమైన చర్యలు ఇప్పటికీ కొన సాగుతున్నాయి. ఎలాగైతే ఉగ్రవాదాన్ని తమ ప్రతిచర్యగా హమాస్ ఎంచుకుందో.. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనియన్లను వారి స్వస్థలాల నుంచి తరిమేయడాన్ని ఒక పనిగా పెట్టుకుంది. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ వాటిని ఎదుర్కొనేందుకు పాలస్తీనా మొత్తమ్మీద శక్తిమంతమైన గూఢచార వ్యవస్థను, వేగులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ అరబ్ దేశా లతోపాటు ఇరాన్ వరకూ వ్యాపించి ఉంది. గాజా చుట్టూ దుర్భేద్య మైన అత్యాధునిక ఏర్పాట్లు చేసుకున్నా హమాస్ ఇటీవల జరిపిన దాడి ఇజ్రాయెల్ శక్తియుక్తులను తక్కువ చేసి చూపుతోంది. పోటాపోటీగా హమాస్ పాలస్తీనాపై 38 ఏళ్ల ఆక్రమణ ముగిసిన రెండేళ్లకు అంటే 2005 లోనే హమాస్ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల పొడవైన ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై నాలుగుసార్లు వైమానిక, భూతల దాడులు చేసింది. 2008లో మూడు వారాలపాటు కొనసాగిన యుద్ధంలో వెయ్యిమంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెల్ తరఫున 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత 2012లో ఇజ్రాయెలీలు గాజా స్ట్రిప్పై ఎనిమిది రోజులపాటు తీవ్రస్థాయి దాడులు చేశారు. అలాగే 2014లో ఆరువారాలపాటు జరిగిన యుద్ధంలో మరోసారి వైమానిక, భూతల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు రెండు వేల మంది పాలస్తీ నీయులు మరణించగా ఇజ్రాయెలీల ప్రాణనష్టమూ ఎక్కువగానే ఉందని అంచనా. 2021లో మొత్తం 11 రోజులపాటు మరోసారి ఇరు పక్షాల మధ్య యుద్ధం జరగ్గా హమాస్ రాకెట్లతో ఇజ్రాయెలీ పట్ట ణాలపై దాడులకు తెగబడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాను వైమా నిక, క్షిపణి దాడులతో అతలాకుతలం చేసింది. పాలస్తీనా తరఫున పోరాడిన 250 మంది, ఇజ్రాయెలీలు 13 మంది ప్రాణాలు కోల్పో యారు. తాజాగా ఈ ఏడాది మొదలైన ఘర్షణలో జరిగిన నష్టంపై ఇంకా మదింపు జరగలేదు. కాకపోతే ప్రాణనష్టం ఇరువైపులా పది వేలు ఆ పైమాటే అంటున్నారు. హింసకు హింసే సమాధానం అన్నట్టుగా సాగుతున్నాయి ఈ వ్యవహారాలు. ఈ నెల మొదట్లో జరిగిన హమాస్ దాడిలో ఇజ్రా యెల్కు జరిగిన ప్రాణనష్టాన్ని పరిగణించినా హమాస్ చేతుల్లోని బందీలను దృష్టిలో ఉంచుకున్నా ఈసారి యుద్ధం అంత ఆషామాషీగా ముగిసేది కాదని అర్థమవుతుంది. పాలస్తీనా మరోసారి దాడికి దిగ కుండా గట్టిగా బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే చాలాసార్లు ఇలా తీవ్రస్థాయిలో పాలస్తీనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. వాటి ఫలితాల ఆధారంగా మిలటరీ మార్గం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాజాలదని ఇజ్రాయెల్ ఇప్పటికే గుర్తించి ఉండాలి. రాజనీతిజ్ఞతా తోడవ్వాలి గాజాలో హమాస్ ప్రాభవాన్ని తగ్గించేందుకు ఒకవైపున మిలటరీ దాడులు, ఇంకోవైపున రాజకీయ చర్యలు అత్యవసరమవుతాయి. ప్రతీకార దాడులు కేవలం హమాస్ కేంద్రంగా జరిగేలా ఇజ్రాయెల్ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలస్తీనీయులకు భారీ ప్రాణ నష్టం జరగడం, ఇబ్బందులకు గురికావడం హింసాత్మక చక్రం గిర్రున తిరిగేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ అర్థం చేసు కోవాలి. ఆత్మరక్షణ విషయంలో ఇజ్రాయెల్కు ఉన్న హక్కును ఎవరూ కాదనరు. కానీ ప్రజలను నిర్బంధంలో ఉంచడం, ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా చేయడం అనేది ‘సామూహిక శిక్ష’ కిందకు వస్తుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది నేరం. ప్రస్తుతం ఇజ్రా యెల్ జరుపుతున్న బాంబుదాడుల్లో విచక్షణ అనేది ఏదీ లేదన్నది సుస్పష్టం. ఇక హమాస్ అమాయక ప్రజలను రక్షణ కవచంగా ఉప యోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా యుద్ధ నియ మాలను పాటించేలా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చర్యలు తీసు కోవాలి. లేదంటే దక్షిణార్ధ గోళ దేశాలు పాశ్చాత్య దేశాల విషయంలో దురభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలు పాశ్చాత్యదేశాలు కేవలం తమ అనుకూలతకు తగ్గట్టుగా మలచుకుంటాయని ఇవి భావించే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్, దాని ప్రధాన మద్దతుదారైన అమెరికా.. పశ్చిమా సియా అనేది ఒకప్పటి అమెరికా ఆధిపత్యం చలాయిస్తున్న ప్రాంతాల్లో ఒకటి కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఇజ్రాయెల్ కూడా ఈజిప్టు, సౌదీ అరేబియా, ఖతార్... బహుశా ఇరాన్ తోనూ దీర్ఘకాలిక రక్షణ దృష్ట్యా రాజకీయపరమైన పరిష్కారాలు చేసుకోవడం మేలు. మనోజ్ జోషీ వ్యాసకర్త అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సమితి సంస్కరణకు వేళయింది!
అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా గుర్తింపు పొందింది. ‘యుఎన్ చార్టర్’గా ప్రసిద్ధి చెందిన ఒడంబడిక 1945లో అమల్లోకి రావడాన్ని ఇది సూచిస్తోంది. ఐరాస చార్టర్ పీఠికలో ఉన్న ప్రాథమిక లక్ష్యాలు ఏమిటంటే, ‘తరువాతి తరాలను యుద్ధ శాపం నుండి రక్షించడం’, ‘మానవుల ప్రాథమిక హక్కులపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించడం’, ‘సామాజిక పురోగతినీ, విస్తృతమైన స్వేచ్ఛలో మెరుగైన జీవన ప్రమాణాలనూ ప్రోత్సహించడం’. అయితే నేడు ఈ లక్ష్యాలు.. పెరుగుతున్న ఐక్యరాజ్యసమితి అసమర్ధత కారణంగా ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. కనుక ఐక్యరాజ్య సమితిని సంస్కరించడం కోసం ఐరాస చార్టర్ నిబంధనలను సమీక్షించడానికి సమయం వచ్చేసినట్లే అనుకోవాలి. ఐక్యరాజ్యసమితి ప్రధానంగా శాంతి భద్ర తలు; సామాజిక, ఆర్థిక అభివృద్ధి, మానవ హక్కులు అనే మూడు విస్తృత మూలాలపై ఆధారపడి ఉంటోంది. ప్రారంభం నుండి శాంతి భద్రతల విషయంలో ఐరాస తన నిరాశా జనకమైన పాత్ర కారణంగానే తనపై ప్రజల అవగాహనను బలంగా ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇది ఐరాస సభ్య దేశాలను సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధనలో దాని తోడ్పాటు నుండి, ప్రాథమిక మానవ హక్కులు, స్వేచ్ఛల పరిరక్షణ విషయంలో అది సాధించిన ముఖ్యమైన విజయాల నుండి దృష్టిని మరల్చింది. అంతర్జాతీయ శాంతిభద్రతలను నిర్వహించడం అనే ‘ప్రాథమిక బాధ్యత’ను ఐరాస భద్రతా మండలికి చార్టర్లోని ఆర్టికల్ 24 అప్పగించింది. ఆర్టికల్ 25 ప్రకారం యూఎన్ఎస్సీ నిర్ణయాలకు ఐరాసలోని అన్ని సభ్య దేశాలూ కట్టుబడి ఉంటాయి. ఆర్టికల్ 27.3 ప్రకారం ఈ నిర్ణయాలకు ఆర్టికల్ 23 ప్రకారం ఐదుగురు శాశ్వత సభ్యులు... చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ‘సమ్మతి ఓట్లు’ అవసరం. లేకుంటే వీటో అవుతోంది. నిజానికి ఐక్యరాజ్యసమితి చార్టర్లో భాగంగా వీటో అనేది లేదు. చర్చలు జరపడానికి, చార్టర్ను స్వీకరించడానికి శాన్ఫ్రాన్సిస్కో సద స్సులో పాల్గొనడానికి దేశాలను ఆహ్వానిస్తున్నప్పుడు పి5 దేశాల తర పున అమెరికా ముందస్తు షరతుగా దీనిని ఒప్పందంలో చేర్చడం జరిగింది. భారతదేశం తరపున చార్టర్పై సంతకం చేసిన భారత ప్రతి నిధి బృందం నాయకుడు సర్ ఎ. రామస్వామి ముదలియార్ వీటోను తాత్కాలిక ‘రక్షణ’ యంత్రాంగంగా చేర్చడానికి ‘అనిష్ట పూర్వకంగానే’ అంగీకరించినట్లు రికార్డుల్లో ఉంది, దానికి ప్రతిఫలంగా చార్టర్ అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత, అంటే 1955 నాటికి అన్ని నిబంధనల సమీక్ష జరగాల్సి ఉంటుంది (ఆర్టికల్ 109). ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత ఐరాస శాంతి భద్రతల స్తంభం కిందికి కుంగిపోయినట్లు 2005 సెప్టెంబరులో ఐరాస 60వ వార్షికోత్సవ శిఖ రాగ్ర సమావేశంలో ప్రపంచ నాయకులు స్పష్టంగా గుర్తించారు. ‘భద్ర తాసమితిని మరింత విస్తృత స్థాయి ప్రతినిధిగా, సమర్థవంతంగా, పారదర్శకంగా మలచడానికి, దాని ప్రభావాన్ని, దాని నిర్ణయాల చట్ట బద్ధతను, అమలును మరింతగా మెరుగుపరచడం కోసం భద్రతా సమితిలో ముందస్తు సంస్కరణలకు పిలుపునిస్తూ ఆ నాయకులు చేసిన ప్రకటనను జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది, అయితే పద్దెనిమిది సంవత్సరాల తరువాత కూడా, ఈ ఆమోదం నెరవేరలేదు, ప్రధానంగా భద్రతా సమితిలో సంస్కరణకు అయిదు శాశ్వత సభ్య దేశాల వ్యతిరేకతే దీనికి కారణం (ఏకగ్రీవ ప్రకటనలో పి5 భాగమే అయినప్పటికీ). భద్రతామండలి సంస్కరణలను వ్యతిరేకించడం ద్వారా 5 శాశ్వత సభ్యదేశాలు మండలి అసమర్థతను మరింత తీవ్రతరం చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ లో రాజకీయ పరిష్కారం కోసం (భద్రతాసమితి 2202వ తీర్మానం, 2015 ఫిబ్రవరి 17), అఫ్గానిస్తాన్ లో రాజకీయ పరిష్కారం కోసం (భద్రతా సమితి 2513వ తీర్మానం, 2020 మార్చి 10) ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించి నప్పటికీ, వాటిని అమలు చేయకపోవడం పట్ల భద్రతా మండలి ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. దీనివల్ల లక్షలాది మంది ప్రజలు ప్రతికూల ప్రభావాలకు గురవుతున్నారు. ప్రస్తుతం భద్రతా మండలి అజెండాలో ఉన్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఐరోపాలలో 50కి పైగా సంఘర్షణలను పరిష్కరించడంలో 5 శాశ్వత సభ్యదేశాలు నిస్సహాయంగా ఉంటు న్నాయి. దౌత్యపరమైన చర్చల కోసం వాతావరణాన్ని సృష్టించేందుకు 6.3 బిలియన్ డాలర్ల వార్షిక వ్యయంతో 85,500 మంది ఐరాస శాంతి పరిరక్షకులను భద్రతామండలి మోహరించిన 12 సంఘర్షణలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ సంఘర్షణల ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తుల సంఖ్య 2015లో 60 మిలియన్ల నుండి 2022 నాటికి 314 మిలియన్లకు పెరిగింది. ఒకవైపు తన అసమర్థత పెరుగుతున్నప్పటికీ... తీవ్రవాదం, డిజి టల్ సమస్యలు, వాతావరణ మార్పుల వంటి ప్రపంచ సవాళ్లను కూడా తన పరిధిలోకి తీసుకురావడానికి భద్రతామండలి ప్రయత్నించింది. భద్రతామండలి నైపుణ్యం, వనరుల కొరత అనేది నాటో వంటి ఐరాసయేతర కూటములు ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించడానికి తలు పులు తెరిచింది. ఈ ధోరణి ఐరాస చార్టర్కి చెందిన సమర్థవంతమైన పనితీరును విచ్ఛిన్నం చేస్తోంది. 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేసిన 50 మంది సభ్యులలో ఒకరిగా భారతదేశ లక్ష్యం ఏమిటంటే ఐరాసను సంస్కరించడమే కానీ దాని స్థానాన్ని భర్తీ చేయడం కాదు. భారతదేశ సమగ్ర విధానం శాంతి భద్రతలు, అభివృద్ధి మధ్య అంగీకృత పరస్పర సంబంధంపై నిర్మితమైంది, ఇది బహు పాక్షికతలోకి ‘మానవ–కేంద్రీకృత‘ దృక్పథాన్ని తీసుకువస్తుంది. భద్ర తాసమితి కోసం, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఏఎస్ఓసీ) కోసం మొదటి చార్టర్ సంస్కరణలను సర్వసభ్య సమావేశం విజయవంతంగా ఆమోదించిన 1963 నాటి నుండి, ఐక్య రాజ్యసమితిలో భారతదేశ ట్రాక్ రికార్డ్ అటువంటి సంస్కరణవాద పాత్రను పోషించడానికి తన విశ్వసనీయతను కలిగి ఉంది. ఈ రోజు ఐరాస ప్రధాన ఎజెండా ఏమిటంటే దాని 17 నిలకడైన అభివృద్ధి లక్ష్యాలతో కూడిన సస్టెయినబుల్ డెవలప్మెంట్పై 2030 ఎజెండా. 2015 సెప్టెంబరులో యూఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ విశ్వవ్యాప్త ఫ్రేమ్వర్క్.. అభివృద్ధి పాటు శాంతి భద్రతలను పెంపొందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు (ఎస్డీజీ గోల్ నెం. 16.8) బహుపాక్షిక నిర్ణయాధికారంలో, ముఖ్యంగా భద్రతా మండలిలో మెరుగైన, సమాన భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి. ఎజెండా 2030 అనేది ఎస్డీజీలను అమలు చేయడానికీ, భాగస్వామ్యాల (ఎస్డీజీ 17) ద్వారా బహుపాక్షిక ఆర్థిక ప్రవాహాలనూ, తగిన సాంకేతిక పరిజ్ఞానాన్నీ బదిలీ చేయడానికి కట్టుబడి ఉంది. అసమానతలను తగ్గించడానికి (ఎస్డీజీ 10) నిబద్ధత వహిస్తూనే, ఇది పేదరికాన్ని నిర్మూలించడం (ఎస్డీజీ 1), ఆహార భద్రత (ఎస్డీజీ 2), ఆరోగ్యం (ఎస్డీజీ 3), విద్య (ఎస్డీజీ 4),లింగ సమానత్వం (ఎస్డీజీ 5) వంటి ప్రధాన మానవ హక్కులను సమర్థిస్తుంది. సంస్కరించబడిన ఐక్యరాజ్యసమితి ఈ కట్టుబాట్లను దాని చార్టర్ నిబంధనలలో ఏకీకృతం చేయాలి. ఐరాస చార్టర్కు ఈ సవరణలు ఎలా చేయవచ్చు? చార్టర్ ఆర్టికల్ 109 జనరల్ కాన్ఫరెన్ ్స ద్వారా చేయొచ్చు. అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఐరాస జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు, భద్రతామండలిలో 9 నిశ్చయా త్మక ఓట్లు (పీ5కి ఎటువంటి వీటో అధికారం లేకుండా) అవసరం. 2024 సెప్టెంబరులో జరిగే ఐరాస ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో పాల్గొనడానికి భారతదేశం సిద్ధమవుతున్నందున, ఈ ఫ్రేమ్వర్క్ను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఐరాస సెక్రటరీ జనరల్కి చెందిన ఉన్నత స్థాయి సలహా మండలి సిఫార్సు చేసిన విధంగా, 21వ శతాబ్దానికి సంస్థను ‘ప్రయోజనం కోసం సరిపోయేలా‘ చేయడానికి ఐరాస సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సదస్సు సిఫార్సు చేయాలి. 2025లో జరిగే ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం ఈ సదస్సును నిర్వహించడానికి తగిన సందర్భం. అశోక్ ముఖర్జీ వ్యాసకర్త ఐరాసలో భారత్ మాజీ శాశ్వత సభ్యులు -
బాధితుల గోడు వినేదెవరు?
ఒకప్పుడు ప్రపంపంచంలో తన కంటూ ఒక చిరునామా లేని జాతి అది. అనేక రకాలుగా చరిత్రలో అవమానాలూ, బాధలూ ఎదుర్కొని చివరికి పాలస్తీనియన్ల చెంతకు చేరింది. తాము ఉండడానికి కాసింత స్థలం అడిగింది. తమ పవిత్ర గ్రంథం ఆ ప్రాంతం తమ పూర్వీకులదని చెబుతోందనీ,అందువల్ల ఈ ప్రాతం తమదేననీ పేచీపెట్టి పాలస్తీనియన్లతో కయ్యానికి దిగింది. అమెరికా వెన్నుదన్నుతో ఐక్యరాజ్యసమితి చేత తాను ఆక్రమించు కున్న ప్రాంతాన్ని 1947లో ఒక దేశంగా ప్రకటింపజేసుకొంది. ఆ జాతే యూదు జాతి. వారిదేశమే ‘ఇజ్రాయెల్’. ఇక ఆతిథ్యం ఇచ్చి మోసపోయిన అరబ్ ప్రజలు మాత్రం ‘పాలస్తీనా’ పేరుతో ఉన్న అతి చిన్న ప్రాంతానికి పరిమితమై అనేక అగచాట్లు పడుతూ ఇజ్రాయెల్పై దాడులకు దిగుతున్నారు. మానవాళిని పట్టి పీడిస్తున్న యుద్ధాలు మానవత్వాన్ని మట్టుపెడుతున్నాయి. జంతు దశ నుంచి నాగరికత కలిగిన ఆధునిక మానవునిగా ఎదిగిన మాన వుడు తాను అభివృద్ధి చేసుకున్న ఆయుధాలు, శాస్త్త్ర విజ్ఞానంతో తన అభివృద్ధిని తానే నాశనం చేసుకొంటున్నాడు. ఇందుకు తాజా ఉదాహరణ ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య చెలరేగిన ప్రస్తుత యుద్ధం. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా వంటి అగ్రరాజ్య హస్తం ఉండడం మామూలయ్యింది. ఇజ్రాయెల్ను మొదటి నుంచీ అమెరికా అన్ని విధాలా వెనకేసుకొస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను భౌగోళికంగా గుర్తించకుండా కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్య సమితితో ప్రకటన చేయించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇజ్రాయెల్తో పాటుగా పాలస్తీనాను కూడా భౌగోళికంగా గుర్తించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదు. వారి నిర్లక్ష్య ఫలితమే నేడు ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ రిపబ్లిక్ అయిన తర్వాత పాలస్తీనియన్లు ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించటం అనంతరం పాల స్తీనా ఓడిపోవటం జరిగింది. అయితే అప్పటినుంచీ పాలస్తీనా ప్రజల్లో అసంతృప్తి, ఆవేశం, అస్థిరత గూడు కట్టుకోవడం క్రమంగా పెరిగింది. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా పాలస్తీనా తిరుగుబాటు దారులు ఇజ్రాయెల్పై దాడిచేసి హింసకు పాల్పడుతున్నారు. అందులో భాగమే ఇటీవల వందలాది రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ను బెంబేలెత్తించిన ఘటనను చూడాలి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు మద్దతుగా ఐదు అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగాయి. కాని, ఇజ్రా యెల్ అరబ్ దేశాలపై విజయం సాధించింది. ఐక్యరాజ్య సమితి పాల స్తీనా సమస్యను ప్రపంచ శాంతి భద్రతల సమస్యగా పరిగణించి పరిష్కరించకపోవటం చారిత్రక తప్పిదంగా చెప్పుకోవాలి. తమ సొంత భూభాగంలోనే ఒక మూల పరాయి వాళ్లుగా జీవించవలసి రావడం, గాజాను దాటాలంటే ఇజ్రాయెల్ ఆధికారుల అనుమతి తీసుకోవలసి ఉండడం, తనిఖీల పేరుతో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం ఇబ్బంది పెట్టడం, తమ ఆంక్షలను ధిక్కరిస్తే అమాన వీయంగా చంపివేయడం, ఇళ్లను కూల్చడం వంటి అనేక అంశాలు స్వతంత్ర పాలస్తీనా కోరికను మరింత బలపడేలా చేసింది. గాజాలోని ‘‘అల్ అఖ్సా’’ మసీదులోకి వెళ్ళాలంటే కూడా ఇజ్రాయెల్ పోలీసుల అనుమతి తీసుకొని రావాల్సి ఉండటం పాలస్తీనియన్లకు అత్యంత బాధ కల్గిస్తున్న విషయం. ఈ క్రమంలోనే ‘పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్’, ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’, ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్’ వంటి సంస్థలు ఆవిర్భవించాయి. యాసర్ అరాఫత్ నేతృత్వంలో (1969–2004) ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య 1993, 1995లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి. దీంతో 1994లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షిమన్ పెరెస్, పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్లకు నోబెల్ శాంతి బహుమతి సంయుక్తంగా లభించింది. అయితే 1995లో రాబిన్ హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో 2004లో యాసర్ అరాఫత్ అనుమానాస్పదంగా మరణించాడు. ఫలితంగా సమస్య మళ్ళీ మొదటి కొచ్చింది. రెండు వైపులా రైట్ వింగ్కు చెందిన వారు సమస్యను ప్రస్తుత స్థితికి సాగదీస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యను రెండు ప్రాంతాల మధ్య మత ఘర్షణలుగా చూడడం సరికాదు. పాలస్తీనియన్లు భౌగోళికమైన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటంగా మాత్రమే పరిగ ణించాలి. ‘భద్రతలను కలిగి ఉండటం వలన వ్యక్తిలో ఉద్భవించే మానసిక ప్రశాంతతయే స్వేచ్చ’ అంటాడు అమెరికన్ రాజకీయవేత్త మాంటెస్క్యూ. ఇక్కడ పాలస్తీనీయన్లు అభద్రతాభావానికి గురైన సందర్భంలోంచి వచ్చినదే నేటి ‘హమాస్’ సంస్థ. ‘ఆరు భద్రతా మండలి తీర్మానాల’నూ, 1993 పాలస్తీనాతో జరిగిన ‘‘ఓస్లో’’ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. పైగా ఐక్యరాజ్యసమితి లోని వీటో అధికారం కల్గిన దేశాల మద్దతుతో తరచుగా ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను ఉగ్రవాదం పేరుతో వేధించటం, చంపటం, పాల స్తీనా భూభాగాన్ని ఆక్రమించటం చేసింది. పాలస్తీనాతో ఘర్షణ తలెత్తిన దాదాపు ప్రతిసారీ ఎంతో కొంత వారి భూభాగాన్ని ఆక్రమించడం పనిగా పెట్టుకొంది ఇజ్రాయెల్ ఆ విధంగా ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విస్తరిస్తూపోయి పాలస్తీనా ప్రజలను కొన్ని మైళ్ల భూభాగానికి పరిమితం చేసింది. అందుకే పాలస్తీనియన్లలో ఇజ్రా యెల్ అంటే విపరీతమైన ద్వేషం! ఆ ద్వేషం మరోసారి ప్రకోపించి ఇజ్రాయెల్పై తాజా దాడికి దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెత న్యాహూ ఈ సందర్భాన్ని అచ్చమైన రాజకీయ నాయకునిగా తనకు అనుకూలంగా మలచుకొంటున్నాడని విశ్లేషకుల మాట. తనపై ప్రజలలో పెరుగుతున్న అసమ్మతిని పాలస్తీనియన్లపై భీకర యుద్ధం చేయడం ద్వారా తగ్గించి, వారిని మళ్ళీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అభిప్రాయం. యుద్ధం ఎవరి వైపు నుండి మొద లైనా నష్టపోయేది సాధారణ పౌరులే, సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, ఇతర భవనాలూ పేకమేడల్లా కూలుతున్న దృశ్యాలూ, శిథిల భవనాల్లోంచి వినిపిస్తున్న చిన్న పిల్లల, మహిళల, వృద్ధుల హాహాకారాలూ మనసును చలింపజేసే విధంగా ఉన్నాయి. ప్రపంచ శాంతి కోసం పుట్టుకొచ్చిన ఐక్యరాజ్య సమితి కోరలు లేని సింహం అయినందు వల్లనే ఇవాళ ప్రపంచంలో అనేక చోట్ల అశాంతి, అభద్రతలు రాజ్యమేలుతున్నాయి, ఒక్క ఇజ్రాయెల్ – పాలస్తీనా ప్రాంతమే కాదు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, చైనా – వియత్నాం సమస్య, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, చైనా – అమె రికా, ఉత్తర కొరియా – అమెరికాల మధ్య కొనసాగుతున్న వివా దాలూ, అలాగే భారత్ – చైనా సరిహద్దు వివాదం, భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ‘కశ్మీర్’ సరిహద్దు వివాదం... వంటివన్నీ ఐక్య రాజ్యసమితి నిష్క్రియాపరత్వం, బలహీనతల కారణంగా భవిష్య త్తులో ఏదో ఒకరోజు అగ్ని పర్వతం బద్దలైనట్లుగా హింసకు దారి తీసేవే అనేది విశ్లేషకుల అంచనా. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలపై జరిగిన దాడి తర్వాత అమెరికా ‘అల్ ఖైదా’ ఉగ్రవాదు లపై యుద్ధం పేరుతో ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టడం పైకి చూడడానికి బాగానే ఉన్నా ఈ పని చేయవలసింది ఐక్యరాజ్యసమితి. కానీ అమెరికా ఆర్థిక సహాయంపై అధికంగా ఆధారపడి ఉన్న ఐరాస నోరు మెదపకుండా ఉండిపోయింది. అలాగే ఇరాక్ ప్రమాదకర జీవ రసాయన ఆయుధాలు తయారు చేసిందని దానిపై దాడిచేసి పాలకుడైన సద్దాం హుస్సేన్ను ఉరితీయించడం వంటి దుశ్చర్యలు సూపర్ పవర్గా ఎదిగిన దేశం తన ఇష్టం వచ్చినట్లు చిన్న దేశా లపైనా, ప్రజా ఉద్యమాలపైనా ఉక్కుపాదం మోపిందని చెప్పడానికి ఉదాహరణ. ఐక్యరాజ్య సమితి బలంగా ఉంటే ఇటువంటి సంఘ టనలు చోటు చేసుకునేవేనా? ఇక ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య దగ్గరకు వస్తే... దీన్ని అత్యంత పాధాన్యం గల అంతర్జాతీయ సమస్యగా అన్ని దేశాలూ పరిగణించాలి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి కొంత వరకూ పాలస్తీనియన్లకు అండగా నిలిచే అవకాశం ఉంది. పది సంవత్సరాల పాలస్తీనా బాలిక నేలమట్టమైన ఇంటి ముందు నిలబడి ‘నేను ఏం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? నా వాళ్ళందరూ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి’ అని ప్రపంచాన్ని ప్రశ్నించింది. దీనికి ఎవరు, ఏమని సమా ధానం చెబుతారు ఆ చిట్టి తల్లికి? డా‘‘ మహ్మద్ హసన్ వ్యాసకర్త నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకుడు -
ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన మన ‘నాడు-నేడు’.. శభాష్ ఏపీ..!
ప్రపంచ గుర్తింపు సాధించిన మన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధకు అరుదైన గుర్తింపు లభించింది. ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల పర్యటనను తమ వెబ్సైట్లో ఐక్యరాజ్య సమితి పబ్లిష్ చేసింది. తద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన విద్యావిధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపును ఐక్యరాజ్యసమితి ఇచ్చినట్టయింది. మన రాష్ట్ర విధాన్ని తన సైట్లో ప్రచురించిన యుఎన్ ప్రపంచశాంతి, సమాజంలో మార్పు కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్ధ, ఏపీలో అమలవుతున్న బాలికా విద్యా, జెండర్ ఈక్వాలిటీ, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ (అందరికి సమానవిద్య) నచ్చి తమ వెబ్ సైట్ లో ప్రమోట్ చేసేందుకు ఒక ఆర్టికల్ ను (సంచికను) ప్రచురించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు మన ఏపీ రాష్ట్రానికి దక్కడం ఎంతో గొప్ప విషయం. దేశచరిత్రలో తోలి సారిగా.. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకను ప్రపంచ వేదిక, యూఎన్ లో వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున పంపించిన పదిమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్య సమితి వెబ్ సైట్ ఇంపాక్ట్ స్టోరీస్ లిస్ట్ లో దీన్ని లిస్ట్ చేశారు యుఎన్ అధికారులు. సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను అమెరికాలోని పలు అంతర్జాతీయ మీటింగ్ ల కోసం పంపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పదిరోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అమెరికా న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ లో జరిగిన SDG సమ్మిట్, యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు నాడు-నేడు స్లాల్ను సందర్శించిన లచ్చెజర స్టోవ్ జులైలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు – నాడు - నేడు నవరత్నాల స్టాల్ ను ఏర్పాటు చేశారు యుఎన్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్. ఈ స్టాల్ ను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లచ్చెజర స్టోవ్ సందర్శించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలను కొనియాడారు. ఏదేమైనా ఏపీ విద్యార్ధుల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించి తమ వెబ్ సైట్ లో ప్రచురించడం చాలా గొప్ప విషయం. ఇది చదవండి: ‘మందిరం చూడండి.. మానవత్వానికి అండగా నిలవండి’ -
..భూమార్గం పట్టిద్దాం!
‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య. ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ.. భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట. సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం. ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి. ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే. కంప్యూటర్ రికార్డు తప్పనిసరి పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది. కంప్యూటరీకరణ అవసరమా? భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది. భూవినియోగ విధానం ఉండాలి భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. - మేకల కళ్యాణ్ చక్రవర్తి -
ఇజ్రాయెల్ ‘హెచ్చరిక’ మరీ డేంజరస్
ఐక్యరాజ్య సమితి: పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం మాట్లాడారు. ‘ పది లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం. యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెల్సిందే. జనావాసాలు మాత్రమేకాదు ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకూ ఇదే అలి్టమేటమ్ వర్తిస్తుంది. అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. యుద్ధవాతావరణంలో ఇంతటి భారీ వలసలు క్షేమం కాదు. ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 34 దాడి ఘటనల్లో 11 మంది ఆరోగ్యసిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వలసలు ఇజ్రాయెల్ దాడులతో 7వ తేదీæ నుంచి ఇప్పటిదాకా 4,23,000కుపైగా స్వస్థలాలను వదిలిపోయారని ఐరాస రిలీఫ్, రెఫ్యూజీ విభాగం తెలిపింది. వీరిలో 2,70,000కుపైగా ఐరాస శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరికి అత్యవసర ఆరోగ్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రులపైనా రాకెట్ దాడులు జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా ఉండనుందని తెలుస్తోంది. -
ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం