-
రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్
కర్నూలు జిల్లా: పల్లె పోరు ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబీకులే బరిలో నిలుస్తుండటంతో రసవత్తరంగా ఉంది. ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచ్ స్థానానికి మేనమామ (భార్య తండ్రి)తో అల్లుడు తలపడుతున్నాడు. బీసీ జనరల్కు రిజర్వేషన్ కావడంతో ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మామాఅల్లుడు శివశంకర్, విజయుడిని బరిలో నిలిపాయి. వీరు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..) -
కిరాతకం: వివాహం కావడం లేదని..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): ఇంట్లో దివ్యాంగురాలైన చిన్నారి ఉండటం వల్లనే తనకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ వ్యక్తి ఐదేళ్ల వయసున్న తన అన్న కుమార్తెను కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. హృదయవిదారకమైన ఈ అమానుష ఘటన తాలూకా పరిధిలోని అంగరేకనహళ్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శంకర్లు అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తికి ఐదేళ్ల వయసున్న చర్విత అనే కుమార్తె ఉంది. బాలిక పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇక శంకర్కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరలేదు. తన అన్న కుమార్తె దివ్యాంగురాలైనందున తనకు సంబంధాలు కుదరడం లేదని గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా తన వదిన ఎదురుగానే బాలిక గొంతుకోసి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడకక్కడే ప్రాణాలు వదిలింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టారు. -
దారుణం: వర్షంలో 11 నెలల బాబుతో..
సాక్షి, జే.పంగులూరు: తన భర్త పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటానని అత్తారింటికి వెళ్లిన కోడలిని, ‘‘నీవు మాకు పనికిరావు, మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ’’అత్త, మామ, బావలు కలసి కొట్టి బలవంతంగా బయటకు నెట్టేసిన సంఘటన మండలంలోని నూజిళ్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. 11 నెలల బిడ్డను పట్టుకొని వర్షంలో ఎటు వెళ్లాలో తెలియక, ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ రానివ్వక, వర్షంలోనే తడుస్తూ తన భర్త తనకు కావాలని, కాపురం నిలబెట్టాలని వేడుకుంది. అయినా భర్తతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో పుట్టింటికి చేరింది. బాధితురాలు మద్దినేని హరిణి అందించిన వివరాలు ప్రకారం మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన నాగుబోయిన ఆంజనేయులు కుమార్తె హరిణిని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన మద్దినేని శ్రీనివాసరావు కుమారుడు సుధీర్కి ఇచ్చి ఏడు సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. వారికి ఆరేళ్ల వయసున్న కుమారుడు చరణ్ శ్రేదీప్, మరో 11 నెలల వయసున్న బాబు ఉన్నారు. ప్రస్తుతం బాధితురాలు గ్రామంలోనే వలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. ఏడాది క్రితం అత్తమామలకు రెండు లక్షలు అప్పు కావాలంటే తన తండ్రితో మాట్లాడి వడ్డీకి రెండు లక్షలు తెచ్చి ఇచ్చింది. రెండు మూడు నెలల్లో తీసుకున్న డబ్బులు ఇస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇవ్వక పోవటంతో మా అత్తమామలను డబ్బులు అడిగింది. దీంతో ఆగస్టు 25 వ తేదీ మా అత్తమామ, బావలు భర్తతో కొట్టించి ఇంటిలో నుంచి బయటకు నెట్టేశారు. నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు, గ్రామ పెద్దలు నచ్చచెప్పి 15 రోజులు ఓపిక పడితే అత్తగారింటికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో బాధితురాలు వెనక్కు వచ్చింది. నెల రోజులైనా అత్తగారి ఇంటికి తీసుకొని వెళతామని చెప్పిన పెద్ద మనుషులు రాలేదు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు భారంగా ఉండలేక ఆదివారం 11 నెలల బాబుతో అత్తగారి ఇంటికి వచ్చింది. దీంతో అత్త అంజమ్మ, మామ శ్రీనివాసరావు, బావ గురుస్వామి దుర్భాషలు ఆడి ఇంటి నుంచి బయటకు నెట్టేసి, ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదని నీ దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోమంటూ తన్ని బయటకు నెట్టేశారు. వర్షంలో చేసేది లేక బాధితురాలు 11 నెలలు బాబును ఎత్తుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు భర్త కావాలని చెప్తున్నా ఎవ్వరూ వినటంలేదని, పోలీస్ స్టేషన్లో గాని, ఊరి పెద్ద మనుషులతో గానీ న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
విదేశాల్లో కొడుకు కోడలిపై మామ..
కామారెడ్డిక్రైం: తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు. అతని వేధింపులు భరించలేక కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కామారెడ్డి మండలం లింగాపూర్కు చెందిన 60 ఏళ్ల మల్లేశంకు కుమారుడు ఉన్నాడు. అతడు విదేశాల్లో ఉండడంతో కోడలు ఇంటి వద్దే ఉంటుంది. ఇదే అదనుగా కోడలిపై కన్నేశాడు మల్లేశం. లైంగిక వేధింపులకు యత్నించడంతో ఇటీవలే ఆమె ఆత్మహత్య యత్నానికి సైతం ఒడిగట్టినట్లు తెలిసింది. మామ బుద్ధి మారక పోవడంతో సమీప బంధువులకు చెప్పుకుని అంతా కలిసి ఆదివారం నిలదీశారు. అనంతరం దేవునిపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మల్లేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) -
మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్ వీడియో లీక్
సూరత్ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్లోని సూరల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్) నో చెప్పి, దూరం పెట్టిందని.. ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) -
కీచక మామ కోడలిపై..
కర్ణాటక,కృష్ణరాజపురం : కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కీచకమామ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన కోణనకుంటెలో వెలుగు చూసింది. 2014లో ఓ యువతి మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమైన కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు కొద్ది రోజులకే భర్త కుమార్ తండ్రి పళని నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని భర్త కుమార్ చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. దీంతో దంపతులు కోణనకుంటెలో వేరు కాపురం పెట్టారు. అయితే రెండు నెలల క్రితం ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో కుమార్ ఇంటికి రావడం మానేశాడు. ఈ తరుణంలో పళని భార్య సరస్వతి గురువారం ఆ యువతి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడింది. ఆమెను ఇంటి బయటకు లాక్కొచ్చి దుస్తులు చింపి అవమానించారు. లత ఫిర్యాదు మేరకు కోణనకుంటె పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మరోసారి దుమ్మరేపిన డాన్సింగ్ అంకుల్
సాక్షి, న్యూఢిల్లీ : మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? అదేనండి గతేడాదిలొ గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. అయితే ఈ సారి ఆయన ఒక మ్యూజిక్ ఆల్బంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వీడియోకి ‘ చాచా నాచ్’ అనే పేరు పెట్టారు. దీనిని ఇటీవలే యూట్యూబ్లో అప్లోడ్ చేయగా లక్ష మందికి పైగా వీక్షించారు.(అంకుల్... ఇరగదీశావ్ పో!) -
హస్తం గుర్తుకు ఓటెయ్యండి..
సాక్షి, కామారెడ్డి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ ఆర్గొండ కమలాకర్రావును ఓటు అభ్యర్థించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని దేవి విహార్లో కమలాకర్రావు నివసిస్తుంటారు. ఆదివారం దేవునిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు నీలం వెంకటి, సుధాకర్, నాగరాజు, మునీర్, ఆరిఫ్, నౌసిన్ తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి గతంలో కేసీఆర్ మేనమామ కమలాకర్రావుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన కరపత్రాన్ని చూసి, వారితో మాట్లాడి పంపించారు. -
మామయ్య ప్రపంచం
నాది చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చెల్లెలు, అమ్మమ్మ, మామయ్య. ఇదే నా ప్రపంచం. చిన్న చిన్న ప్రపంచాల్లోనే కొన్నిసార్లు చాలా పెద్ద కథలుంటాయి. మామయ్య గురించి చెప్పాలి. ఆయన ఈరోజు ఇంతలా ఎందుకు గుర్తొస్తున్నాడో చెప్పాలి. మామయ్యది ఒక పల్లెటూరు. అమ్మమ్మతో పాటు ఉండేవాడు. ఆదివారం వచ్చిందంటే మేమందరం అక్కడికి వెళ్లిపోయి సరదాగా గడిపేస్తుంటాం. ఈ ఆదివారం ఆయన ఇక్కడ లేకపోవడం, ఇంకే ఆదివారం ఉండడు అన్న ఆలోచనే ఎందుకో బాధను పెంచెస్తోంది.రాత్రిపూట ఆరుబయట ఇలా మంచం మీద పడుకొని ఉంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి నా ఆలోచనలు. మామయ్య ఎలా ఉండేవాడు! నన్ను, చెల్లిని చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమతో పెంచాడు. నాకు బాగా గుర్తు.. స్కూల్కెళ్లే తొలినాళ్లలో తనే రెడీ చేయించి మరీ స్కూల్కి తీసుకెళ్లేవాడు. మధ్యాహ్నం అయితే భోజనం దగ్గర గారం చేయడం నా పని. చెల్లి కూడా అచ్చం నాలాగే! అస్సలు తినేవాళ్లమే కాదు. మామయ్య పైకి చూపెట్టి, ‘‘చూడండి పిల్లలూ! ఈ ముద్ద మీరు తినకపోతే ఆ ఫ్యాన్ మీ మీద పడిపోతుంది’’ అనేవాడు. నిజానికి, అబద్ధానికి తేడా తెలియని ఆ వయసులో అది నిజమేనేమోనని భయంతో తినేసేవాళ్లం. మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఎన్నెన్ని కబుర్లు చెప్పేవాడో తల్చుకుంటే, ఇప్పుడు ఆయన పక్కనలేనందుకు కూడా కోప్పడాల్సింది ఆయన్నే కదా అనిపిస్తోంది. కోపమైనా, ఇష్టమైనా మామయ్య మీదే అలా చూపించేస్తాం నేను, చెల్లి. మేం చదువుల్లో ఒక్కో తరగతీ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కళ్లలో సంతోషం కనిపించేది. కొన్నిసార్లు సమయాలు ఎలా ఎలా గడిచిపోతాయో ఆలోచిస్తే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మామయ్య స్కూల్లో చేరిపించాడో లేదో, అలా పదోతరగతికి వచ్చేసినట్టు అనిపించింది.పదేళ్లలో ఈ ప్రపంచంలో, నాలో ఎన్ని మార్పులొచ్చినా మామయ్య ప్రపంచంలో ఏ మార్పూ రాలేదు. ఎప్పట్లాగే మేమే ఆయన ప్రపంచం. నా పదో తరగతి పూర్తయింది. కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన రోజులవి. పదో తరగతి వరకైతే ఇంటి దగ్గరే ఉండి చదవగలిగాను కానీ, ఇంటర్లో మంచి కాలేజీలో చేరాలి. బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి. అందుకు నేను విజయవాడ వెళ్లి తప్పక చదువుకోవాల్సిన పరిస్థితి.మామతో ఇదే మాట చెబితే, నా గడ్డం పట్టుకొని, ‘‘ఏరా కొడుకా! అంత దూరం పోవాలా? ఎలా ఉంటావో ఏమో మా అందర్నీ వదిలేసి!’’ అంటూ నా కళ్లకేసి చూశాడు. నాకప్పుడు అర్థం కాలేదు ఆ మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉందో! ‘‘ఉంటానులే మామా! నువ్వేం దిగులుపడకు.’’ అన్నాను ఎంతో కులాసాగా.‘నువ్వుంటావేమో తల్లీ! నేను ఉండలేనే’ అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వాడు.కాలేజీలో చేరి చదువుల్లో పడిపోయా. ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది. నా చిన్న ప్రపంచం చిన్న చిన్నగా పెరగడం మొదలైంది. ఆ మార్పును అర్థం చేసుకుంటుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది.సెలవులిచ్చారు. అంతకుముందు ఆదివారం వచ్చిందంటే నాకొక ఉత్సాహం ఉండేది. కాలేజీలో చేరాక మళ్లీ సంవత్సరానికి అంతే ఉత్సాహంతో ఆదివారం కోసం ఎదురుచూశా.ఎప్పట్లానే ఆ ఆదివారం ఊరికి వచ్చాం. కానీ ఈసారి ఎప్పటిలా లేడు మామయ్య. బక్కచిక్కిపోయి నీరసంగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడో ఎవ్వరూ చెప్పలేదు. మామయ్యను అంత దిగాలుగా చూడటం అదే మొదటిసారి. ఆ సాయంత్రమే తిరిగి ఇంటికెళ్లిపోయాం. ఒక రెండు రోజుల తరువాత మామ ఇంటికొచ్చాడు. ‘‘ఎప్పుడెళ్లాలి తల్లీ మళ్లీ కాలేజీకి?’’ అన్నాడు టీ తాగుతూ.‘‘రేపే’’ అన్నాను.టీ తాగడం అయ్యాక ‘‘సరే, నేను బయల్దేరుతాను’’ అంటూ పైకి లేచాడు. గడప వరకూ వెళ్లి వెనక్కి తిరిగి నా గడ్డం పట్టుకొని.. ‘‘రేపే వెళ్లిపోవాలా కొడుకా?’’ అన్నాడు దీనంగా. ఔనన్నట్లు తలూపాను. ఆ క్షణం తన కళ్లలో ప్రేమ, ఆప్యాయత, బాధ కన్నీటి చుక్కలా రాలిపడుతుంటే దాన్ని పట్టుకుని.. ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి ‘‘సరే నాన్నా! జాగ్రత్త. అప్పుడప్పుడు అయినా ఫోన్ చెయ్యొచ్చు కదా!’’ అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాను. మామయ్య మా ఫోన్ కోసం ఎంతెంత ఎదురుచూసేవాడో ఆ మాట తీరులో తెలిసిపోతుంది. కానీ అది అర్థమయ్యేసరికి ఈరోజు వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఆ రోజు మామయ్య వీధి చివరికెళ్లేవరకూ అలా చూస్తూనే ఉండిపోయా. సత్తువ లేని ఆ కాళ్లతో మామయ్య అలా ఎంతో ఆయాసంగా నడిచి వెళ్తోంటే ఏడుపు తన్నుకొచ్చింది. ‘మామయ్యని వదిలేసి ఎక్కడో ఎలా ఉంటున్నా నేను?’ అనిపించింది ఆ క్షణం. ఆ వెంటనే చదువుకోసం ఇవన్నీ తప్పవు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. చూస్తుండగానే అలాగే మరో సంవత్సరం కూడా గడిచిపోయింది. ఈసారి సెలవులకి మాత్రం మామ పరిస్థితి ఇంకా మారిపోయింది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. పెళ్లి, పిల్లలు ఏదీ లేకుండా మేమే ప్రపంచమై బతికాడు. తనకంటూ రూపాయి కూడబెట్టుకోలేదు. చేతికి రూపాయి వచ్చినా అది మా కోసమే ఖర్చు పెట్టాడు. మామే అయినా ఒక తండ్రి కంటే ఎక్కువ ప్రేమనే చూపించాడు మా మీద. ఆస్తి అంటూ ఏమీ లేకున్నా వాటన్నింటి కంటే మించిన ప్రేమ ఉంది మామ దగ్గర. అంతగా మమ్మల్ని ప్రేమించిన మామని అలా చూడలేక, ‘‘పద నువ్వు.. హాస్పిటల్కి..’’ అన్నాను. ‘‘నాకేమైందని?’’ అంటూ అలానే ఉండిపోయాడు. నాకు మామయ్య మీద అరోజు కోపమొచ్చింది. ఆయన కోసమే చెప్తుంటే ఇలా మాట్లాడతాడు ఏంటని ఆయనతో మాట్లాడొద్దనుకున్నా. మూడు నెలలు అలాగే గడిచిపోయాయి. నా చదువులు కూడా బాగా సాగుతున్నాయి. కాలేజీ మారింది. ఇంకో కొత్త ప్రపంచం ఇప్పుడు. ఈ కొత్త ప్రపంచం పరిచయమైన ఒకరోజు ఫోనొచ్చింది – ‘‘రేయ్ కొడుకా! ఇదిగో ఈ ఊళ్లోనే ఉన్నా. హాస్పిటల్కి వచ్చా. నువ్వు రాగలవా ఇక్కడికి!’’ అని అడిగాడు మామయ్య.నేను కోపంలోనే ‘‘రాలేను నేను’’ అన్నాను.ఆ తరువాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. నాన్న మామయ్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అ తర్వాత నేనే ఇంటికెళ్లి చూస్తే ఆయన పరిస్థితి అర్థమై దగ్గరికెళ్లి మాట్లాడలేకపోయా. ఏమీ తినలేకపోతున్నాడు. ఏం తిన్నా, ఏం తాగినా కడుపులో నిలవట్లేదు. ఏమీ మింగలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా తన బాధ మాతో ఎప్పుడూ పంచుకోలేదు. కొన్ని రోజులకి మళ్లీ ఊరెళ్లిపోయాడు. ఒకరోజు అనుకోకుండా నాన్న, చెల్లి వచ్చారు. ఇంత పొద్దున్నే ఏంటా? అనుకుంటూ ఆఫీస్ రూమ్ వైపుకు నడిచాను. ఏదో తెలియని బాధ వాళ్ల కళ్లలో. ఆ బాధకి కారణాన్ని నేను అడిగేలోపే నాన్న, ‘‘మామకి సీరియస్ అంట. వెంటనే బయలుదేరు’’ అన్నాడు. అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించగలుగుతున్నా. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. గేటు వైపుకి అడుగులు వడివడిగా సాగాయి. ఊరు చేరేవరకూ మామ జ్ఞాపకాలే. ఇంటికి ఆమడ దూరంలో ఉండగానే అంతమంది మనుషుల్ని చూడగానే మనసు కలవరపడింది. ఆగిపోతా అంటున్న నడకని కాదంటూ అడుగు ముందుకేశా. ప్రేమే ఊపిరై బతికే మామని ఊపిరి లేకుండా అలా చూసి నోటి వెంట మాట రాలేదు, కళ్లలో నీళ్లు తప్ప.ప్రేమతో గోరుముద్దలు తినిపించిన మామకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోయాననే బాధ. ‘‘రాగలవా?’’ అన్నప్పుడు ఎందుకు వెళ్లలేదు అనే కోపం నామీద నాకు. కానీ కోపం తనకెప్పుడూ లేదు నా మీద. ఎందుకంటే తనకి తెలిసింది.. ప్రేమించడం, అభిమానించడం.. అంతే. అందుకేనేమో తన జీవితంలోని చివరిరోజున కూడా అమ్మకి ఫోన్ చేసి ‘‘పిల్లలెలా ఉన్నారు? చూడాలని ఉంది.’’ అని అడిగాడు. మామయ్య మమ్మల్ని చూడాలని ఎవ్వర్నీ అడగని చూడాలనుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో తల్చుకున్నప్పుడల్లా ఇప్పుడున్న బాధంతా రెట్టింపవుతుంది. ఆ బాధలోనే మామయ్య తిరిగొస్తే బాగుండు అన్న ఆశ పుట్టుకొస్తుంది, మళ్లీ రాడని తెలిసినా! - హెప్సిబ -
మామా అని పిలవకుమా!
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కండల వీరుడు సల్మాన్ఖాన్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లోకి ఎప్పుడో ఎంటరయ్యారు. సల్మాన్ ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు కానీ ఆయన్ని చిన్నారులు అంకుల్ అని పిలుస్తుంటే తెగ ఫీలైపోతున్నారట. గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్లో సల్మాన్ ఫ్రెండ్స్ పిల్లలు అంకుల్ అని పిలిచారట. దీంతో సల్మాన్ చిన్నారులను పిలిచి ‘అలా పిలవద్దు’ అని ముద్దుగా చెప్పారట. కానీ పిడుగుల్లాంటి పిల్లలు పిలవద్దు అంటే ఆగుతారా? పైగా ఒక పని చేయవద్దు అంటే దాన్నే పనిగా పెట్టుకుంటారు పిల్లలు. సో.. అంకుల్ అని సరదాగా పిలుస్తూనే ఉన్నారట. ‘‘మీరు నన్ను అలా పిలిస్తే మీతో మీటింగ్స్ తగ్గిస్తా’’ అని సల్మాన్ చెప్పిన తర్వాత అంకుల్ అని పిలవడాన్ని తగ్గించారట పిల్లలు. సల్మాన్ భలే షరతు పెట్టారు కదా. ఇక సినిమాల విషయానికొస్తే... అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘భారత్’ సినిమాలో సల్మాన్ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్కు విడుదల కానుంది. -
మామ లైంగిక వేధింపులు
బనశంకరి : మామ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి జేసీ.నగర పీఎస్లో ఫిర్యాదు చేసింది. వివరాలు... గత ఏడాది జేసీ.నగర నివాసి అబ్దుల్హాదీ అనే యువకుడితో నగరానికి చెందిన యువతితో వివాహమైంది. అబ్దుల్హాదీ ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి పెళ్లి జరిపించారు. అయితే అబ్దుల్ నిరక్షరాస్యుడని తేలింది. ఇదిలా ఉంటే అబ్దుల్ తండ్రి రెహమాన్ కోడలిని లైంగికంగా వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది -
నడిరోడ్డుపై అల్లుడి దారుణహత్య
కోట: ప్రేమ వివాహం పగను రాజేసింది. కన్నబిడ్డను దూరం చేశాడని కక్ష పెంచుకున్న మామ చివరకు అల్లుడిని కడతేర్చి ఘటన సోమవారం చిట్టేడులో జరిగింది. వాకాడు సీఐ ఉప్పాల సత్యనారాయణ సమాచారం మేరకు.. చిట్టేడులో ఒకే వీధిలో నివాసం ఉంటున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన కొమ్మ రాజశేఖర్ (27) ముదిరాజ్ సామాజిక వర్గానికి యువతి నిరోషా ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని నాయుడుపేటలో కాపురం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి రామయ్య పలుమార్లు ఆవేశంగా రాజశేఖర్ కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ మాట్లాడినట్లు సమాచారం. సోమవారం స్నేహితుడు మృతి చెందడంతో చిట్టేడుకు వచ్చిన రాజశేఖర్ తన తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లాలని మరో స్నేహితుడి వాహనం తీసుకుని ఇంటి వద్దకు వచ్చాడు. రాజశేఖర్ వచ్చిన విషయం తెలుసుకున్న మామ రామయ్య కత్తి తీసుకుని కాపుగాశాడు. ఇంటి వద్ద బైక్ దిగిన వెంటనే రాజశేఖర్ను కత్తితో నరికినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని పసిగట్టిన రాజశేఖర్ వీధిలో పరుగెత్తేందుకు ప్రయత్నించగా మరోమారు మెడపై నరకడంతో కుప్పకూలాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజశేఖర్ను స్థానికులు కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో మృతదేహాన్ని ఇంటికి తెచ్చారు. ఇంటి ముందే బిడ్డ దారుణ హత్యకు గురవడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు కన్నీరు.. మున్నీరుగా రోదించారు. దారుణ ఘటన గ్రామస్తులను భయభ్రాతులకు గురి చేసింది. నిందితుడు అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నీ కోణాల్లో విచారణ జరుపుతామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాలిరెడ్డిపాళెంకు తరలించారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అంకుల్ డాన్స్..సోషల్ మీడియాలో హల్ చల్!
-
అంకుల్... ఇరగదీశావ్ పో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా హల్ చల్ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్గర్జ్(1987) చిత్రంలోని ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటకు ఆ వ్యక్తి డాన్స్ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్ చేస్తూ అతను చేసిన డాన్సింగ్ మూమెంట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మ్యాజిక్ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ గత రెండు రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్.. ఇలా ఏ ఫోన్లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్ సందండే. కానీ, ఇది ఎక్కడ జరిగింది? అసలా అంకుల్ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అఫ్కోర్స్ అది బయటపడటానికి కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు. -
వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు
బుచ్చిరెడ్డిపాళెం: తనను తల్లి, మేనమామలు వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారని, తట్టుకోలేక బంధువుల ఇంటికి వచ్చానని నందా గౌతమి(26) అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు మేనమామ మూర్తి(36)తో వివాహమైందని, తన తల్లి ఈశ్వరమ్మ తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తోందని వాపోయింది. దీంతో బుచ్చిరెడ్డిపాళెంలో మామ వరుసైన పరంధామయ్య ఇంటికి వచ్చానన్నారు. అయితే తన తల్లి, మేనమామతోపాటు మరికొందరు మూడు రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాళెంలోని మామ ఇంటికి వచ్చారని, అక్కడ మాటల నేపథ్యంలో తోపులాట జరిగిందని, అక్కడి నుంచి వెళ్లి దాడి చేసినట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని గౌతమి వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తనతోపాటు మరికొందరిపై పరంధామయ్య మరికొందరు దాడి చేసి గాయపరిచారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై ప్రసాద్రెడ్డిని సంప్రదించగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చేరారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం గౌతమి ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మేనమామ మరణం జీర్ణించుకోలేక..
కర్నూలు: మేనమామ మరణం జీర్ణించుకోలేని ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని అబ్బాస్నగర్లో నివాసముంటున్న ఎడ్వర్డ్ క్రిస్టఫర్ ఇంగ్లిష్ దినపత్రికలో ఏడీవీటీ ఇన్చార్జ్గా పనిచేసేవాడు. ఈయన భార్య ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె బ్లెస్సీ ఏంజలీనా (19) కర్నూలు శివారులోని ఓ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నందికొట్కూరుకు చెందిన ప్రభాకర్ (ఏంజలీనా మేనమామ) ఆకస్మికంగా మృతి చెందడంతో తండ్రితో కలసి అంత్యక్రియలకు వెళ్లి గురువారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వంట గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. గమనించిన సోదరుడు డేవిడ్ స్టాన్లీ వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కోడలికి అసభ్య ఎస్ఎంఎస్
సాక్షి, చెన్నై(టీ.నగర్) : కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపిన మామను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన తురైపాక్కంలో సంచలనం రేకెత్తించింది. చెన్నై గూడువాంజేరి సమీపానగల కన్నివాక్కంకు చెందిన కపాలీశ్వరన్ (52) కుమారుడు దీపక్ (26). ఇతని భార్య సురేఖ (25). వీరికి గత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాది వయసుగల దీక్షిత అనే కుమార్తె ఉంది. ఇలావుండగా సురేఖకు ఒక యువకునితో అక్రమ సంబంధం ఉన్నట్లు, వారిరువురూ కలిసి జీవించకూడదని, సురేఖ ఆత్మహత్య చేసుకోవాలని కపాలీశ్వరన్ సెల్ఫోన్కు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. దీని గురించి అతను కుమారుడితో చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడంతో దీపక్ చెంగల్పట్టు కోర్టులో విడాకులు కోరుతూ కేసు దాఖలు చేశారు. దీంతో ఒక్కియం తురైపాక్కంలో తన పుట్టింట్లో నివశిస్తున్న సురేఖ సెల్ఫోన్కు వరుసగా అసభ్య ఎస్ఎంఎస్లు వస్తుండేవి. దీనిగురించి తురైపాక్కం కన్నగినగర్ పోలీసులకు గత రెండు రోజుల క్రితం సురేఖ ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి సురేఖ సెల్ఫోన్కు వచ్చిన నెంబర్ల ఆధారంగా విచారణ జరిపారు. ఇందులో మామ కపాలీశ్వరన్ వేరొక సిమ్కార్డు ద్వారా సురేఖకు అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు తేలింది. దీంతో కపాలీశ్వరన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపగా అతను ఈ ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒప్పుకున్నాడు. అక్రమ సంబంధం ఎస్ఎంఎస్లో కుమారుడికి, కోడలికి తరచుగా గొడవలు జరిగేవని, దీంతో కుమారుడు విచారంతో కనిపించేవాడని, దీంతో కోడలికి అసభ్య ఎస్ఎంఎస్ పంపినట్లు కపాలీశ్వరన్ తెలిపాడు. దీంతో పోలీసులు కపాలీశ్వరన్ను అరెస్టు చేసి ఆలందూరు కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు. -
టీవీ చూసేందుకు వచ్చే బాలికపై అఘాయిత్యం
సాక్షి, మెదక్ : ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠిన చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ మృగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. కామవాంచ తీర్చుకునేందుకు వావీ వరుసలను మరిచిపోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కామాందులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బందువులే కదా అని సరదాగా టీవీ చూసేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఓ వివాహితుడు గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ మండలం పాతూర్ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పాతూర్ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను వరుసకు మామ అయిన అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వయస్సు ఉన్న కరుణాకర్ నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బంధువులు కదా అని టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నట్లు తెలిపారు. నాలుగు నెలలుగా ఆ బాలికపై అత్యాచారం చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఆ బాలిక కుటుంబీకులు ఇటీవలే స్వగ్రామానికి తిరిగివచ్చినట్లు వివరించారు. చివరకు బాలిక కుటుంబీకులకు విషయం తెలియడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కరుణాకర్కు భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. -
ఘాతుకం.. చావు బతుకుల్లో చిన్నారి
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత బాబాయే ఓ పసిపాపపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మృగం చేతిలో చితికిన చిన్నారి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. థాకూర్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నగర్ నిగమ్ ప్రాంతానికి చెందిన చిన్నారి తండ్రి కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. అతని సోదరుడు(20) హోలీ సందర్భంగా ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఆ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత పారిపోతున్న యువకుడిని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాపను కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో శస్త్ర చికిత్స అవసరమైందని.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
కూతురు బాధ చూడలేక..
ఉయ్యాలవాడ: మద్యానికి బానిసై నిత్యం కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన సోమవారం ఉయ్యాలవాడ మండలంలో చోటు చేసుకుంది. ఉయ్యాలవాడకు చెందిన కమతం చిన్నయ్య కుమారుడు రామకృష్ణ(45) 20 ఏళ్ల క్రితం ఆర్మీలో సైనికుడిగా చేరి దాదాపు 15 సంవత్సరాలు పలు చోట్ల విధులు నిర్వర్తించాడు. ఎనిదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొంది స్వగ్రామం చేసుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో వైఎస్ఆర్ జిల్లా దేవగుడి గ్రామానికి చెందిన బాలసుబ్బయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె సావిత్రమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఈమె మండలంలోని పుచ్చకాయలపల్లెలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తోంది. భర్త వేధింపులు అధికం కావడంతో ఆమె రెండు నెలల క్రితం నుంచి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తోంది. సోమవారం రామకృష్ణ భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు పుచ్చకాయలపల్లెకు చేరుకున్నాడు. కాగా తమ నాన్న చెబితే వెంట వస్తానని భార్య చెప్పడంతో ఇద్దరు కలిసి ఆటోలో మాయలూరు భారత్ పెట్రోల్ బంకులో వాచ్మెన్గా పనిచేస్తున్న బాలసుబ్బయ్య వద్దకు వెళ్లారు. తన కుమార్తెను పంపనని చెప్పడంతో మామ, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలసుబ్బయ్య పక్కనే ఉన్న ఇనుపరాడ్ తీసుకుని అల్లుడి తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎస్ఐ నిరంజన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మరుగుదొడ్డి కట్టనీయలేదని మామపై కోడలి ఫిర్యాదు
చిత్తూరు, పూతలపట్టు : మరుగుదొడ్డి కట్టనీయకుండా మామ అడ్డుకుంటున్నాడని ఓ కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యా దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పేటఅగ్రహారం దళితవాడకు చెందిన ఎర్రయ్య కుమారుడు బాబయ్య 20 ఏళ్ల క్రితం పీలేరుకు చెందిన విజయకుమారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బాబయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి విజయకుమారి తన కుమార్తెతో పాటు పూరిగుడిసెలో ఉంటూ కూలి చేసుకుని జీవనం సాగి స్తోంది. ప్రస్తుతం మరుగుదొడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలైన పింఛను, రేషన్ బియ్యం, ఇతర సౌకర్యాలు అందిస్తామని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా పింఛను కూడా ఇవ్వడం లేదు. తీరా మరుగుదొడ్డి నిర్మించుకోబోతే మామ ఎర్రయ్య అడ్డుపడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది ద్వారా గ్రామంలో విచారించిన ఎస్ఐ మురళీమోహన్ ఎర్రయ్యను పోలీస్స్టేషన్కు పిలిపించారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అడ్డుపడొద్దని హెచ్చరించి పంపారు. -
అల్లుడి మరణంతో ఆగిన మామ గుండె!
తన కుమార్తె జీవితానికి వెలుగు ఇస్తాడనుకున్న అల్లుడు తనకన్నా ముందే చనిపోయాడన్న మరణవార్తను విన్న ఆ మామ తనువుచాలించాడు. కిడ్నీ వ్యాధితో అల్లుడు మృతి చెందగా.. ఆ వార్త విన్న మామ తట్టుకోలేక కన్నుమూశాడు. ఒకే రోజు అల్లుడు, మామ మృతితో ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొరివంక గ్రామంలో ఈ రెండు హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలావున్నాయి. ఒడిశా: కవిటి మండలంలో బొరివంక గ్రామంలో ఒకే రోజు అల్లుడు, మామ మృతి చెందారు. కిడ్నీవ్యాధితో అల్లుడు డొంబురు బిసాయి ప్రాణాలు కోల్పోగా, ఆ వార్త విని తట్టుకోలేక మామ అప్పుడు పురియా తనువుచాలించాడు. గ్రామానికి చెందిన అప్పుడు పురియా తన కుమార్తె కమల బిసాయిను అదే గ్రామానికి చెందిన డొంబురు బిసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వీరికి ఎప్పటికీ పిల్లలు కలగకపోవడంతో ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. దీంతో భార్య కమల బిసాయి స్వయంగా తన భర్త జీవితంలో మరో మహిళకు సగభాగమిచ్చి రెండో పెళ్లి చేసింది. ఆ తండ్రీ కూతుళ్ల ఉదార మనస్తత్వానికి దేవుడు సైతం కరుణిస్తూ రెండో పెళ్లి చేసుకున్న డొంబురు బిసాయి భార్య హేమలతకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వీరికి శివకృష్ణ, సాయికృష్ణ అని పేర్లు పెట్టారు. ఆనందంగా ఉంటున్న ఆ కాపురంలో చేదు వార్త వినాల్సి వచ్చింది. డొంబురు బిసాయికి కిడ్నీ వ్యాధి సోకింది. అతడు ఈ వ్యాధితో బాధపడుతూ ఇటీవల చికిత్స పొందుతున్నాడు. తన కష్టార్జితాన్ని కొంతమొత్తం అమ్మేసి వైద్యం పొందుతున్నాడు. ఉన్న ఫళంగా రెండు రోజుల క్రితం ఇతడు కుప్పకూలిపోయాడు. వెంటనే బల్లిపుట్టుగకు చెందిన ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్ సాయంతో అతనిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున డొంబురు బిసాయి కన్నుమూశాడు. ఆ మరణవార్తను తెలుసుకున్న గ్రామంలో ఉన్న మామ అప్పుడు పురియా గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఒకే ఇంటిలో రెండు చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదవాతావరణం అలుముకుంది. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఇక మాకు దిక్కెవరంటూ రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఇంటికి పెద్ద దిక్కులుగా ఉన్న ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడ్డారు. ముందుగా మామ అప్పుడు పురియాకు గ్రామస్తుల సహాయంతో అంత్యక్రియలు జరిపారు. అనంతరం విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన డొంబురు బిసాయి మృతదేహానికి తర్వాత గ్రామస్తులంతా వెళ్లి అంత్యక్రియలు జరిపారు. -
బాలికను గర్భవతిని చేసిన మేనమామ
బుచ్చెయ్యపేట (చోడవరం): శారీరక మార్పులను చుట్టుపక్కలవారు గమనిస్తున్నారు.. కడుపు అలా ఎత్తుగా ఉందేమిటమ్మా అని బాలికను ప్రశ్నిస్తున్నారు.. ఏదో సాకు చెప్పి అమ్మ సర్దిచెప్పేది.. ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాచేసేది.. అబార్షన్ చేయించేందుకు పలు ఆస్పత్రులకు తిప్పడంతో ఈ విషయం బయటపడింది. తమకు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన ఐసీడీఎస్ అధికారులు బాలికను బాలసదనానికి తరలించారు. మేనమామే బాలిక గర్భానికి బాధ్యుడు కాగా.. కుటుంబ సభ్యులు వెనకేసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఐసీడీఎస్ అధికారులకు స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గౌరీపట్నం సోమరాజుకు ఆరేళ్ల క్రిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కలిగాక భార్య దేవితో విభేదాలు రావడంతో ఆమెను పుట్టింటికి పంపించేసి తన అక్క, బావ మాణిక్యం, చినబాబు ఇంట్లో మూడేళ్లుగా ఉంటున్నాడు. ఎనిమిదో తరగతి చదివి ఇంట్లో ఉంటున్న మేనకోడలిని మాయమాటలతో వశపరుచుకున్నాడు. గతంలో రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించారు. మూడోసారి గర్భం తీయించడానికి విశాఖ, అనకాపల్లి, రావికమతం, చోడవరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఎనిమిదో నెల రావడంతో వైద్య సిబ్బంది నిరాకరించారు. బాలికలో మార్పులను ఇరుగుపొరుగు వారు గుర్తించి అడగడంతో.. కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తీసుకెళుతున్నామని సోమరాజుతోపాటు తల్లి మాణిక్యం గ్రామస్తుల్ని నమ్మించేవారు. బాలిక బయట ఎక్కువగా తిరగకుండా పొలాల్లో, తోటల్లో ఎక్కువగా ఉంచుతున్నారని, ఒకవేళ పురుడు అయితే పుట్టిన బిడ్డ ఎవరి కంట పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు గ్రామస్తులు గ్రహించి ఐసీడీఎస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. బాధితురాలు కిశోర బాలిక కావడంతో గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పౌష్టికాహారం అందించేటపుడు ఆమె కడుపు చూసి అనుమానం వ్యక్తం చేసింది. శుక్రవారం రావికమతం ఐసీడీఎస్ పీవో మంగతాయారు తమ సిబ్బందితో వచ్చి బాలిక వాడుతున్న ఆసుపత్రి మందులు, డాక్టర్లు రాసిన రిపోర్టులను పరిశీలించి ఆమెకు ఎనిమిదో నెలగా గుర్తించారు. తల్లి మాణిక్యాన్ని, మేనమావ సోమరాజును నిలదీయగా కడుపులో కాయ పెరుగుతోందని, అందుకే ఆసుపత్రికి తిప్పుతున్నామని తప్పించుకోవడానికి చూశారు. ఐసీడీఎస్ సిబ్బంది వీరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాలిక జరిగినదంతా ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీవో తన కారులో పెందుర్తి చైల్డ్ వెల్ఫేర్ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ చేర్చుకోవడానికి నిబంధనలు అడ్డు రావడంతో భీమిలిలోని బాలసదన్కు తరలించారు. పీడీ ఆదేశం మేరకు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, శనివారం ఉదయం తల్లిదండ్రులను పిలిపించి విచారించిన అనంతరం పీడీ తగు నిర్ణయం తీసుకుంటారని పీవో చెప్పారు. -
పాపను చంపిన బాబాయికి యావజ్జీవం
ఒంగోలు క్రైం: అభం శుభం తెలియని సంవత్సరం ఏడు నెలల పాప కుందా ఆరాధ్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన నేరస్తుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మంగళవారం యావజ్జీవ శిక్ష విధించారు. స్థానిక జిల్లా కోర్టు భవనాల ప్రాంగణంలోని జిల్లా న్యాయమూర్తి కోర్టులో ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఒంగోలు నగరంలోని రాజాపానగల్రోడ్డులో నివాసం ఉంటున్న కుందా శ్రీధర్, సాహితీల కుమార్తె ఆరాధ్యను అత్యంత కిరాతకంగా సొంత బాబాయే హత్య చేశాడు. లోకమంటే కూడా తెలియని ఆ పాప ఆరాధ్య ఉసురు నిలువునా తీశాడు. ఆరాధ్య హత్య 2014 నవంబర్ 25న ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం పొలాల్లో జరిగింది. కేసును పూర్తి స్థాయిలో విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడైన కొండ్రు లక్ష్మినారాయణకు యావజ్జీవ కారగార శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా కూడా విధించారు. అప్పట్లో జిల్లాలోని ఈ ముక్కుపచ్చలారని కుందా ఆరాధ్య హత్య ఉదంతం పెను సంచలనం రేపింది. అప్పట్లో ఒంగోలు వన్టౌన్ íసీఐ బి.రవిచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలలోకెళితే... రాజాపానగల్రోడ్డులో నివాసం ఉంటున్న వడ్డెబోయిన నాగేంద్రరావు పెద్ద కుమార్తె సాహితీ. ఆమెను శ్రీధర్కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఆరాధ్య గారాలపట్టీ. అయితే సాహితీ సోదరి విశ్వాస్ సింధూజ ఉంది. సింధూజను టంగుటూరు మండలం పొందూరుకు చెందిన కొండ్రు లక్ష్మినారాయణకిచ్చి వివాహం చేశారు. ఈ నూతన దంపతులు కూడా రాజాపానగల్రోడ్డులోని మామ వడ్డెబోయిన నాగేంద్రరావు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే అక్క కూతురు అయిన ఆరాధ్యతో పిన్ని సింధూజ అత్యంత ప్రేమగా ఉండేది. రోజులో ఎక్కువ సమయం ముద్దు ముద్దుగా ఉన్న ఆరాధ్యతో గడుపుతూ ఉండేది. దీంతో తమ దాంపత్య ఏకాంతానికి భంగం వాటిల్లితుందని సింధూజ భర్త కొండ్రు లక్ష్మినారాయణ భావిస్తుండేవాడు. అది కాస్త ఆ ముక్కుపచ్చలారని ఆరాధ్యపై అసూయ, ద్వేషాలను లోలోపల పెంచుకుంటూ వచ్చాడు. అది కాస్త పాపను హతమార్చే స్థాయికి వచ్చి 2014 నవంబర్ 25న మిట్టమధ్యాహ్నం అమలు చేశాడు. తన ద్విచక్రవాహనంపై ఆరాధ్యను ఆడించుకుంటూ బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా సర్వేరెడ్డిపాలెం పొలాల్లోకి తీసుకెళ్ళి పాప గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పెట్రోలుపోసి తగులబెట్టాడు. అనంతరం ఏమి ఎరగనట్లు ఇంటికొచ్చేశాడు. పాప కనపడటం లేదని లక్ష్మినారాయణ భార్య సింధూజతో పాటు పాప తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులందరూ వెతకడం ప్రారంభించారు. తీరా ఆరాధ్యను బండి మీద తీసుకెళ్ళడానికి గమనించిన వారు పోలీసులకు అందజేశారు. పాప కనిపించటం లేదని పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటానికి పోలీస్స్టేషన్కు వస్తే వాళ్ళతో పాటు హంతకుడు కూడా కలిసి వచ్చాడు. తీరా సమాచారం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోనికి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో పోలీస్ అధికారులు పాపను హత్య చేసి తగులబెట్టిన ప్రాంతానికి నిందితునితో సహా అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆరాధ్య మృతదేహమేనని గుర్తించారు. ఆ తర్వాత కేసు విచారణ జిల్లా కోర్టులో కొనసాగింది. ఆ తర్వాత జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని నేరస్తుడికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శివరామకృష్ణ ప్రసాద్ వాధించారు. -
బాబాయి.. బాలిక హత్య?
అమృతలూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్ల బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం సంచలనం రేకెత్తించింది. అమృతలూరు–పెదపూడి గ్రామాల మధ్య తెనాలి–చెరుకుపల్లి ఆర్అండ్బీ రహదారి పక్కనే చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడి సతీష్ వివా హం అయి ఏడాది కూడా పూర్తి కాలేదు. సోదరులిద్దరూ గత కొన్నేళ్లుగా గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దల వివాహం ఈ ఏడాది మార్చి లో చేశారు. అయితే వివాహమైన కొద్ది కాలానికే కుటుంబాల మధ్య కలహాలు రావడంతో దంపతులిద్దరూ విడివిడిగా వారి గ్రామాల్లో ఉంటున్నారు. మధ్యలో భార్య తాలూకు పెద్దలు అమృతలూరులోని సతీష్ కుటుంబం వద్దకు వచ్చి మా ట్లాడినా వారి చర్చలు విఫమయ్యాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఏం జరిగింది? రాపర్ల సతీష్కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ. ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుపోÄయేవాడు. ఈ నేపథ్యంలో ఎరువుల షాపు కావడంతో తెనాలిలో ఆడిట్ ఉందని, దీపావళి సామగ్రిని పిల్లలకు తీసుకువస్తానని చరితాచౌదరిని మోటార్ సైకిల్పై ఎక్కించుకుని సోమవారం సాయంత్రం తెనాలికి పయనమయ్యాడు. రాత్రికి కూడా రాకపోవడంతో సతీష్కు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తెనాలి వైపు రోడ్డుకు ఇరువైపులా వెతుకులాట సాగించారు. అయినా వారి జాడ కనిపించలేదు. తెల్లారైనా ఇంటికి చేరుకుంటారని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పొలాల వైపు వెళ్తున్న కొందరు అమృతలూరు – పెదపూడి గ్రామాల మధ్యలో ఎత్తివేసిన వైన్ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్ మృతదేహాలను గుర్తించారు. వెంటనే గ్రామమంతటా తెలియడంతో అందరూ ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒంటిపై గాయాలు.. మృతుడు సతీష్ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్ఫోన్ ఉన్నాయి. అతని చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉన్నాయి. బలవంతంగా అతనిని కట్టివేసి ఏదైనా కూల్డ్రింక్లో సైనేడ్ కలిపి తాగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరినైనా గుర్తు పడుతుందేమోనని ముక్కుపచ్చలారని బాలికను కర్కశంగా చంపివేసి ఉంటారని భావిస్తున్నారు. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్ పూసి ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పలువురు ఇది హత్యేనని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో, పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనా స్థలికి గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్స్క్వాడ్ బృందం వచ్చి ఘటనా స్థలిలో ఉన్న ఆధారాలను సేకరించారు. ఆధారాల సేకరణ ఘటనా స్థలికి తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, తెనాలి వన్టౌన్ సీఐ బెల్లం శ్రీనివాసరావు, చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు, అమృతలూరు, చుండూరు ఎస్సైలు ఆర్ఎస్. శ్రీనివాస్, కె.విక్టర్లు, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఆర్ బ్రహ్మం సందర్శించి ఆధారాలను సేకరించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాలు, చేశారు. బాలికను పూడ్చి పెట్టారు. మృతుని సోదరుడు సురేష్బాబు ఫిర్యాదు మేరకు అమృతలూరు ఎస్ఐ ఆర్ఎస్ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు.