Advertisement
TRS leaders
-
రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తెలుసు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గత కొద్ది రోజులుగా మాట్లాడిన తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గురువారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు అని, టెంట్, స్టంట్, ప్రెజెంట్, ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందని ఎద్దేవాచేశారు. రేవంత్ తొక్కుతా అంటున్నాడు.. వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత లోతు తొక్కగలమో తెలుసా? అని ధ్వజమెత్తారు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయాలనే యోచనలో భాగంగా సోనియా, రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశానన్నారు. రేవంత్ మాటలు శ్రుతి మించితే ఏం చేయాలో తమకు తెలుసునని, కాంగ్రెస్లో పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడేమే రేవంత్ వైఖరి అని ఆరోపించారు. -
టీఆర్ఎస్ అవినీతిపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఏడున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న టీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వారి అవి నీతి కార్యకలాపాలపై నివేదికలు రూపొందిం చాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీన్ని ఆధారాలతోసహా నిరూపిం చేలా నియోజకవర్గాల సమన్వయకర్తలు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం ఇందిరాభవన్లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కార్యక్రమం కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాని నేతలకు నోటీసులిచ్చి వివరణ కోరాలని, ఆసక్తి లేని వారిని ఇబ్బంది పెట్టి పనిచేయించు కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల విచారణకు డిమాండ్ చేయాలని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హామీలను అమలుచేయడంలో ఎలా విఫలమయ్యారో వివరించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, ఇదే ఊపును అధికారంలోకి వచ్చేవరకు కొనసాగిం చాలని మాణిక్యం చెప్పారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు: రేవంత్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 72 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్ లో వరదలు వచ్చిన ప్పుడు రూ.10వేలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలోని 30 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారో ప్రశ్నించాలన్నారు. సమన్వయకర్తలే ప్రచారం చేయాలి: భట్టి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసే బాధ్యత నియో జకవర్గాల సమన్వయకర్తలదేనని అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, అజారు ద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, పొడెం వీరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల
సాక్షి, కరీంనగర్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందని.. ప్రజలు హక్కుదారులు కాదు.. బిచ్చగాళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. తమ హక్కుల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దేనినైనా ధ్వంసం చేయడానికి వెనుకాడమన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు. కులం, మతంతో తనకు సంబంధం లేదు, పార్టీ కార్యకర్తలు వారి ఆలోచనతో సంబంధం ఉంటుందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవే: బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవేనన్నారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో, కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బీజేపీ. తెలంగాణ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం. మాట తప్పిన సీఎంను అడ్రస్ లేకుండా చేయాలి. తెలంగాణలో మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. చదవండి: Huzurabad: ‘సాగర్’ ఫార్మూలాతో ఈటలకు చెక్.. బాస్ ప్లాన్ ఇదేనా? తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత -
Huzurabad: చిలక పలుకుల మంత్రులకు ఆత్మగౌరవం ఉందా?
సాక్షి, కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాషాయ కండువాతో తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. ఈటల దంపతుల తొలి రోజు ప్రచారం బీజేపీకి కొత్త ఊపునివ్వగా.. గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు కాదనన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. చదవండి: Huzurabad: టార్గెట్ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా?’’ అంటూ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ‘‘బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప. ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని’’ పల్లా నిప్పులు చెరిగారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల ప్రయత్నాలు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు. చదవండి: Etela Rajender: టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్ -
సై అంటే సై.. నాయకుల సోషల్ యుద్ధం
సాక్షి,వేములవాడ: రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రమేశ్బాబు ‘వంద పడకలే కాదు.. వంద సమాధానాలు’ అంటూ సామాజిక మధ్యమంలో కరపత్రం పోస్టు చేశారు. దీంతో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ‘ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి’ అని మరో కరపత్రం పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. కాగా వేములవాడ శివారులోని తిప్పాపూర్లో రూ.22.50 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోందన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో 3,900 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలిందని, వారిని గుర్తించి కిట్లు అందించామని తెలిపారు. వంద పడకల ఆస్పత్రి ప్రారంభంతో వేములవాడ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు దరి చేరాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 50పడకలతో కోవిడ్–19 సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. చదవండి: ఒక్క చాన్స్.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు -
‘సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, సిరిసిల్ల: అండగా నిలవాల్సిన సొంత పార్టీ నాయకులే తన వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ లింగం రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి తక్కళ్ల సుందర్ తాడూరు గ్రామ శివారు సర్వే నంబర్ 1147లో ఎకరం 22 గుంటలు వ్యవసాయ భూమిని 1985లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. అప్పటినుంచి కాస్తులో తామే ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఆ భూమి తమదేనని టీఆర్ఎస్ నాయకుడు కుర్మ రాజయ్య తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తనకు రూ.70 వేలు ఇస్తేనే భూమిని వదిలేస్తానని డిమాండ్ చేయడంతో గతేడాది రూ.30వేలు చెల్లించానని తెలిపారు. ప్రస్తుత సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ అన్న అనంతరెడ్డి ఆ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరికి తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అండగా ఉన్నాడని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే ఇలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుంటానని ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మండల టీఆర్ఎస్లో చిచ్చు రేపుతుందో? లేదా టీ కప్పులో తుపానులా సద్దుమణుగుతుందోనని టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగసులు పెడుతున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్రెడ్డి గుడ్న్యూస్ కన్నీరు పెడుతున్న లింగం రాణి -
వారికి వారే మాట్లాడుకొని వెళ్లారు!
సాక్షి, హైదరాబాద్: లింగోజీగూడ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కోసం పలువురు కార్పొరేటర్లతోపాటు బీజేపీ ముఖ్య నేతలు రాంచందర్రావు, శేఖర్రావు తదితరులు టీఆర్ఎస్ నేతలను, మంత్రి కేటీఆర్ను కలిసిన విషయంలో వారికి వారే సొంతంగా నిర్ణయం తీసుకొని వెళ్లారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను ఆయనకు అందజేసింది. ఈ విషయంపై బండి సంజయ్కి సమాచారం ఇవ్వకపోవడం పొరపాటేనని నేతలు కమిటీ ముందు ఒప్పుకున్నారు. అయితే నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. చదవండి: మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్ అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
టీఆర్ఎస్ నాయకులపై ఎంపీ అరవింద్ ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, అక్కడ ఇరు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ పసుపు బోర్డును కేంద్రమే ఏర్పాటు చేస్తే, ఆ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టతనిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం.. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే సహాయం చేస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్టెన్షన్ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్లో భేటీ నిర్వహించారు. ఈ సందర్భగా టీఆర్ఎస్లోని కొంతమంది పార్టీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుంటాం అంటే కుదరదని, అందరూ కలిసి ప్రచారం చేయాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సమావేశానికి ఎవరెవరు రాలేదో తనకు తెలుసని అన్నారు. పదవుల కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని, అవకాశాన్ని బట్టి పదవులు అవే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం ‘కేటీఆర్ పీఏ’నంటూ ఫోన్.. డబ్బు డిమాండ్ -
ఎమ్మెల్యేలకు చెక్.. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు..!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపక్ష పోకడలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న వారిని, పార్టీకి అంకితమైన, నిరంతరం ప్రజల్లో ఉంటున్నవారిని గుర్తించి వారి సేవలకు తగిన ‘గుర్తింపు’నిచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి దానికీ ఎమ్మెల్యే ‘ప్రాపకం’పై ఆధారపడే పరిస్థితి పార్టీకి వ్యవస్థాగతంగా మంచిది కాదని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్ మీద ఎమ్మెల్యేలు చెలాయిస్తున్న అపరిమిత పెత్తనానికి కత్తెర వేస్తూ పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతమవుతూ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడంతో టీఆర్ఎస్ను అన్ని స్థాయిల్లోనూ పటిష్టం చేయా లనే నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు సమాచారం. పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ, సంస్థాగత శిక్షణ, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం వంటి సంస్థాగత విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. చదవండి: (టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం) తెరమీదకు జిల్లా కమిటీల ఏర్పాటు పార్టీపరంగా గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గం మాత్రమే ఉంటుందని గతంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గం, అనుబంధ సంఘాలను రద్దు చేయడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలకు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. 2019 జూలైలో పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటైనా కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలకు ఎదురులేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో నేతల నడుమ అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి నడుమ ఆధిపత్య పోరు సాగుతుండగా ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల కేడర్ గ్రూపులుగా విడిపోవడం... విభేదాల పరిష్కారం, పనిచేసే కేడర్కు గుర్తింపు వంటి అంశాలపై దృష్టి పెట్టే యంత్రాంగమంటూ ప్రత్యేకంగా ఏదీ లేకపోవడంతో నష్టం జరుగుతున్నట్లు పార్టీ అధినేత గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. భారీగా ప్లీనరీ... 2019 జూన్, జూలై మాసాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా 65 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ సభ్యత్వం కాల పరిమితి రెండేళ్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో పార్టీ ప్లీనరీ తర్వాత సభ్యత్వ పునరుద్దరణ చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్లో కేసీఆర్ ప్రారంభించగా, మిగతా చోట్ల కూడా ఏప్రిల్లోగా ప్రారంభించి సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 27నాటికి టీఆర్ఎస్ 20వ వసంతంలోకి అడుగు పెట్టగా కరోనా నేపథ్యంలో సాదాసీదాగా కార్యక్రమం జరిగిపోయింది. కాబట్టి ఈ ఏడాది ప్లీనరీని ఆర్భాటంగా నిర్వహించాలనే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో ఆదివారం జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి కొత్తరూపు.. సుమారు మూడున్నరేళ్ల క్రితం 2017 అక్టోబర్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రస్థాయిలో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది డిప్యూటీ కార్యదర్శులతో ఏర్పాటైన రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికల సమయంలోనే క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలోని సత్య వతి రాథోడ్కు మంత్రి పదవి దక్కగా, పి.రాములు, బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కగా, భూపతిరెడ్డి, సపాన్దేవ్ వంటి నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీని బలో పేతం చేయాలని భావిస్తున్న కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు అన్ని స్థాయిల్లో పార్టీలో చేరడంతో అధికారిక పదవులు దక్కని వారికి పార్టీ కమిటీల్లో చోటు కల్పించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.. రేపే సమావేశం
సారు పిలిసిండు... అందరినీ రమ్మన్నడు. రొటీన్ మీటింగేనా? బీజేపీపై వైఖరి చెబుతడా? భారీ ప్లీనరీ పెడదమంటాడా? రాబోయే ఎన్నికల్లో ఎట్ల కొట్లాడుదమో చెప్తాడా? హు... హుహూ! ఇప్పుడివేవి జనం మదిలో లేవు. టీఆర్ఎస్ శ్రేణుల్లో అంతకన్నా లేవు. సమయం వచ్చేసిందా? కబ్ బనేగా? స్పష్టత ఇచ్చేస్తారా? అందరిలోనూ ఇదే టెన్షన్. ఎవరు? ఏమవుతారనే... ముచ్చట అందరికీ ఎరుకే. సంకేతాలిచ్చి సరిపెడతారా? సరాసరి ప్రకటనే వచ్చేస్తుందా? అధికారిక ‘ముద్ర’పడుతుందా? సంచలనాలేమీ లేకుండా ఆనవాయితీగా అధినేత దిశానిర్దేశంతో ముగుస్తుందా? చూద్దాం... ఆదివారం దాకా!! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య క్షులు హాజరవుతారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా... ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: (నేడు రాష్ట్రానికి మాణిక్కం ఠాగూర్) సీఎం పీఠంపై కేటీఆర్.. అంతటా అదే చర్చ ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జన్మదినం కాగా, మరుసటి రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మంత్రి ఈటెల రాజేందర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ప్రకటనలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టడం ఖాయమని, ఫిబ్రవరి లేదా మే నెలలో సీఎం మార్పు ఖాయమని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం మార్పునకు సంబంధించిన ప్రచారం ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి నష్టం కూడా జరిగే అవకాశమున్నందున ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా సంకేతాలు ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే అటు పార్టీలో, బయటా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. వివాదాస్పద నేతలకు హెచ్చరికలు ఇటీవలి కాలంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలు వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా పార్టీ కొంత మేర ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు ఖమ్మం జిల్లాతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు తరచూ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతల నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కట్టు తప్పుతోందనే భావన నెలకొంది. చదవండి: (ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం) ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో బీజేపీతో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం, అక్కడక్కడా దాడులకు కూడా దారితీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ పట్ల టీఆర్ఎస్ వైఖరిపై కూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత జరిగిన సీఎం ఢిల్లీ పర్యటన, వ్యవసాయ చట్టాలు, బడ్జెట్ తదితర అంశాలపై టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్న వైఖరిపైనా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు. స్తబ్దుగా పార్టీ కార్యకలాపాలు ఇటీవలి కాలంలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు మినహా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే ఎన్నికలు వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాలపై అంతగా దృష్టి సారించడం లేదనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో ఉంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు లేకపోవడం, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుండటంతో పార్టీ కార్యకలాపాలు స్తబ్దుగా మారాయి. లోక్సభ ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 27న భారీగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వ పునరుద్దరణ వంటి అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత భీమేశ్వర్రావును మావోయిస్టులు హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖ, దాడికి ఉపయోగించిన కత్తి -
ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: సొంత నిధులతో ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులను సమకూర్చేందుకు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సోమవారం ప్రగతిభవన్లో కలసి విరాళాల చెక్కులను అందజేశారు. సొంత నిధులతో ఆరు అంబులెన్సులను సమకూరుస్తానంటూ ఇటీవల కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంబులెన్సులకు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో మొత్తంగా వంద అంబులెన్సులను సమకూర్చాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మనోహర్రెడ్డి (పెద్దపల్లి) రెండు చొప్పున, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు ఒకటి, నవీన్కుమార్ రెండు చొప్పున అంబులెన్సులు సమకూరుస్తున్నారు. మరో టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి కూడా ఒక అంబులెన్సుకు సంబంధించిన చెక్కును కేటీఆర్కు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా అంబులెన్సు కొనుగోలుకు చెక్కును ఇచ్చినట్లు శంభీపూర్ రాజు వెల్లడించారు. -
పోటాపోటీ నిరసనలు
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. -
తెలంగాణ డిప్యూటీ స్పీకర్కు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్లో హోం క్వారంటైన్లో ఉన్నారు. (తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్) తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో కరోనా సోకిన నేతల్లో పద్మారావు అయిదవ వ్యక్తి. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజే తెలంగాణలో 973 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,394 కేసులు నమోదవ్వగా 253 మంది మృత్యువాతపడ్డారు. కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 5,582 ఉండగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (మళ్లీ లాక్డౌన్.. సిద్ధంగా ఉన్నారా?) -
పదవుల ‘కల’వరం.. ఎప్పుడో పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెరమీదకు వస్తున్నా తరచూ వాయిదా పడుతోంది. వరుస ఎన్నికలు వీటికి అవరోధంగా మారాయి. తాజాగా సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి ముగిశాక పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదిన్నరగా ఒకటీ అరా మినహా నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పోవడంతో పార్టీ లో పదవుల కోసం పోటీ నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది శాసనసభ్యులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. సీనియర్లకు హామీ ఇచ్చిన అధిష్టానం రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 3 విడతల్లో మంత్రివర్గాన్ని విస్తరించారు. తనతో పాటు మరో 16 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో వివిధ సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించారు. అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యమిస్తామంటూ గతేడాది జరిగిన మూడో విడత కేబి నెట్ విస్తరణ సందర్భంగా సంకేతా లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం, మాజీ హోంమంత్రి నాయి ని, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, జూపల్లి, తుమ్మ ల నాగేశ్వర్రావు, బాజిరెడ్డి గోవర్ధన్తో సహా మొత్తం 12 మంది పేర్లను ప్రస్తావిస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సుమారు 90 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఉండ గా గతేడాది అక్టోబర్ నాటికి 95% పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈ పదవులను ఆశిస్తూ సీఎం కేసీఆర్తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఒకటీ అరా పదవుల భర్తీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ను అసెంబ్లీలో, బి. వెంకటేశ్వర్లును మండలిలో చీఫ్ విప్లుగా నియమించారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఆయాచితం శ్రీధర్ ను కొనసాగించారు. మాజీ ఎంపీ బి. వినోద్కుమార్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కేబినెట్ హోదాలో నియమించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అడ్వొకేట్ శ్రీరంగారావును టీఎస్ఈఆర్సీ చైర్మన్గా నియమించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ను టెస్కో చైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించినా ఉత్తర్వులు రాలేదు. రైతు సమన్వయ సమితి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డికి మండలి చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుధీర్ రెడ్డిని నియమించారు. కార్పొరేషన్లలో ఖాళీగా పదవులు రోడ్డు రవాణా సంస్థ, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ, మిషన్ భగీరథ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా కమిషన్ వంటి కీలక సంస్థల్లో చైర్మన్, పాలక మండలి సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో మార్కె ట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో ఖాళీగా ఉన్నాయి. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సుమారు 4 వేల వరకు నామినేటెడ్ పదవుల భర్తీకి అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పార్టీ నేతలు, కేడర్ను సంతృప్తి పరిచేలా పదవులను భర్తీ చేయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నేతలు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తుండటంతో, వీరిలో కొందరికి పార్టీ పదవులను కట్టబెట్టడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశముందని సమాచారం. -
‘సహకార’ బరి.. డీసీసీబీ పీఠంపై గురి
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక మండలి ఎన్నికలు పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో డీసీసీబీ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ నేతలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. పీఏసీఎస్ డైరెక్టర్లుగా, ఆ తర్వాత పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికైతేనే డీసీసీబీ అధ్యక్ష పీఠానికి పోటీపడే అవకాశం ఉం టుంది. దీంతో డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు పీఏసీఎస్ స్థాయి లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తమ వంతు ప్రయత్నా లు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 905 పీఏసీఎస్ల పరిధిలోని 12,100 డైరెక్టర్ స్థానాలకు శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. సోమవారం ఉపసంహరణకు గడువు ఉండటంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్య క్ష పదవిని ఆశిస్తున్న నేతలు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన సహకార ఎన్నికల్లో తెలంగాణలోని 9పూర్వపు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరంగల్ మిన హా మిగతా 8 జిల్లాల డీసీసీబీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో టీఆర్ఎస్లో చేరిన డీసీసీబీ అధ్యక్షుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు మరోమారు అదే పదవిని ఆశిస్తూ సహకార ఎన్నికల్లో పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు దాఖ లు చేశారు. మరో వారంలో పీఏసీఎస్ స్థాయిలో ఎన్నిక పూర్తవ్వనుండటంతో, డీసీసీబీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ముఖ్యనేతలతో సమావేశాలు జరపాల్సిందిగా సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన –ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం పూర్తికాగా, త్వరలో ఇతర జిల్లాల నేతలు కూడా భేటీ కానున్నారు. మెదక్ డీసీసీబీ బరిలో పద్మా దేవేందర్రెడ్డి భర్త మెదక్ డీసీసీబీ పదవిని ఆశిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు చిట్టి దేవేందర్రెడ్డి కొండపాక సొసైటీ పరిధిలో మరోమారు పోటీ చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి భర్త కూడా కోనాపూర్ సొసైటీ నుంచి బరిలోకి దిగారు. గతంలో రెండు పర్యాయాలు వరుసగా కోనాపూర్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వగా, ప్రస్తుతం మూడోసారి పోటీ చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్నిహితుడు మార్నేని రవీందర్రావు సింగారం సొసైటీ పరిధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ డీసీసీబీ అధ్యక్ష పదవిని మరోమారు ఆశిస్తూ ఎం.దామోదర్ రెడ్డి తలమడుగు పీఏసీఎస్ నుంచి పోటీ చేస్తుం డగా, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి తాంసి పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పదవిని ఆశిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బి.మనోహర్రెడ్డి కుల్కచర్ల పీఏసీఎస్ పరిధిలో డైరెక్టర్గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేటీఆర్ను కలిసిన ఔత్సాహికులు డీసీసీబీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న పలువురు టీఆర్ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా, రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్గా పనిచేసిన కొండూరు రవీందర్రావు మరోమారు అదే పదవిని ఆశిస్తూ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్ పరిధిలో డైరక్టర్ స్థానానికి నామినేషన్ వేశారు. గతంలో టెస్కాబ్ చైర్మన్గా స్వల్ప కాలం పనిచేసిన ఎడవెళ్లి విజయేందర్రెడ్డి నల్గొండ డీసీసీబీ అధ్యక్ష పదవిని దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్రెడ్డి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సొసైటీ డైరక్టర్గా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కుమారుడు భాస్కర్రెడ్డి దేశాయిపేట పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ డీసీసీబీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కొడంగల్ పీఏసీఎస్ పరిధిలో పోటీకి దిగారు. -
చైర్మన్ పీఠంపై గురి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ స్థానంపై అధికార టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతలు గురిపెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగా తమ పరిధిలోని సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు డైరెక్టర్లుగా నామినేషన్లు వేశారు. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్గా ఎన్నికై, సొసైటీ చైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ రేసులో ఉన్న నాయకులు తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చైర్మన్ రేసులో ఉన్న కొందరు నేతలు తమ సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో డీసీసీబీతో పాటు, డీసీఎంఎస్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రేసులో పలువురు.. డీసీసీబీ చైర్మన్ రేసులో ప్రధానంగా పోచారం భాస్కర్రెడ్డి, కుంట రమేశ్రెడ్డి, బిగాల కృష్ణమూర్తి గుప్తా, మార గంగారెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కుమారుడు భాస్కర్రెడ్డి ఆశిస్తున్న దేశాయిపేట్ సొసైటీ డైరెక్టర్ల స్థానాలు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్న భాస్కర్రెడ్డి డీసీసీబీ చైర్మన్తో పాటు, టీఎస్ కాబ్ పదవి రేసులో కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పటికే ఏకగ్రీవమైన వేల్పూర్ సొసైటీ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశాలున్న కుంట రమేశ్రెడ్డి డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువైన రమేశ్రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిని ఆశిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అంకాపూర్ సహకార సంఘం చైర్మన్గా పనిచేసిన మార గంగారెడ్డి, బోధన్కు చెందిన గిర్దావార్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో మార గంగారెడ్డి కేటీఆర్ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చివరి వరకు ఇవేవీ కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవి విషయంలో అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది త్వరలోనే తేలనుంది. డీసీసీబీ దక్కకపోతే డీసీఎంఎస్ డీసీసీబీ ప్రయత్నాల్లో ఉన్న నేతలు ఆ పదవి దక్కని పక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీబీ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనుండగా, డీసీఎంఎస్ మాత్రం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. -
‘ఆ బిల్లును వ్యతిరేకిస్తే..పాకిస్తాన్కు మద్దతిచ్చినట్లే’
సాక్షి, ఆదిలాబాద్: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..దేశంలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేసే చట్టం కాదని.. టెర్రరిస్టులకు, చొరబాటుదారులకు అందులో చోటు కల్పించలేదని వివరించారు. బిల్లును వ్యతిరేకించే వారు పాకిస్తాన్కు మద్దతిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలకు మాయామాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ఓట్లు కోసం బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందువులంతా ఒక్కటై మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును మోదీకి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు.. ఆదిలాబాద్ స్థానిక నేతలు పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బు కేంద్రానిది..సోకులు టీఆర్ఎస్ వాళ్లదని విమర్శించారు. టీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. గెలిచేవారికే మున్సిపల్ టికెట్లు ఇస్తామని, పైరవీకారులకు టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. సర్వేలు ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని బాపురావు వెల్లడించారు. -
అమరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం జలాలతో అమరుల స్తూపానికి అభిషేకం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనను గుర్తు చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో కలసి సోమవారం గోదావరిఖని నుంచి గోదావరి నీటితో భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కుకు చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలసి అమరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అమరుల కల నెరవేరిందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. -
డజను కార్పొరేషన్లకు కేబినెట్ హోదా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావస్తోంది. రికార్డు స్థాయిలో 89 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు, ఇతర పార్టీల శాసనసభ్యుల చేరికతో ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్కు 104 మంది సభ్యుల బలం ఉంది. 40 మంది సభ్యులు ఉండే శాసన మండలిలోనూ టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉండటంతో మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అయితే గత ఏడాది డిసెంబర్ 13న రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగిన మూడో విడత మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిమండలి సభ్యుల సంఖ్య సీఎం కేసీఆర్తో కలుపుకుని 18కి చేరుకుంది. మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించాల్సి రావడంతో పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన ముఖ్య నేతలకు మంత్రివర్గంలో సీఎం చోటు క ల్పించలేకపోయారు. దీంతో పలు కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవులు టీఆర్ఎస్ వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు హౌజింగ్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, టీఎస్ఐఐసీ సంస్థల పాలక మండళ్ల చైర్మన్ల పదవీ కాలాన్ని మాత్రమే సీఎం కేసీఆర్ పొడిగించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్రెడ్డిని నియమించారు. మంత్రివర్గంలో చోటు ఆశించిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, శాసన మండలి చైర్మన్ పదవి అప్పగించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో నియమించారు. కేబినెట్లో స్థానం ఆశించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్, శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లును ప్రభుత్వ చీఫ్ విప్గా నియమిస్తూ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విప్లుగా, శానసన సభ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. తాజాగా శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి చైర్మన్గా నియమించారు. మరో డజను మందికి కేబినెట్ హోదా? పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, కొందరికి కేబినెట్ హోదా కూడా కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల 29 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ జాబితాలో మూసీనది పరివాహక (రివర్ఫ్రంట్) అభివృద్ధి కార్పొరేషన్ (ఎంఆర్డీసీ), రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థ, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ), హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, అధికార భాషా కమిషన్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సంఘం (టీఆర్ఈఐ), హజ్ కమిషన్, సాహిత్య అకాడమీ, టీఎస్జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ డిస్కమ్ చైర్మన్లు కేబినెట్ హోదా జాబితాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉన్నా, కేబినెట్ హోదా పదవులను బాజిరెడ్డి గోవర్దన్, జోగు రామన్న, రెడ్యా నాయక్, తుమ్మల నాగేశ్వరరావు, పద్మా దేవేందర్రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
యాదాద్రిలో ప్రొటోకాల్ పంచాయితీ
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఒకరు మహిళ అధికారి.. మరొకరు మహిళ ప్రజాప్రతినిధి.. వారిద్దరి మధ్య నువ్వానేనా అన్న తరహాలో వార్ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు ఇవ్వడం లేదంటూ అధికారిపై గతంలో మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్నటివరకు ఈ ప్రొటోకాల్ విషయం లోలోపలనే ఉన్నా.. శనివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆ ప్రజాప్రతినిధితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె అనుచరులంతా ఆ అధికారిపై ఉన్నతస్థాయి అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి.. ఆలయానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఏవీ చేసినా ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చిన సీఎస్ జోషి దృష్టికి తీసుకెళ్లారు. అసలేమీ జరిగిందంటే... యాదాద్రి దేవస్థానం ఆధీనంలో ఉన్న నల్లపోచమ్మవాడలోని గోశాలను మల్లాపురం మార్గంలో ఉన్న దేవస్థానం బావి వద్ద నూతనంగా నిర్మించిన తులసీ వనానికి తరలించారు. కొంతకాలంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. శనివారం తులసీ వనంలో నిర్మించిన నూతన గోశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు వచ్చిన సీఎస్ జోషితో ప్రారంభించాలని అధికారులు అంతా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రారంభోత్సవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అనుచరులు అడ్డుకుంటారని చేయలేదు. పూలతో అలంకరణతోపాటు టెంకాయలు, ప్రారంభో త్సవ రిబ్బన్ కూడా సిద్ధం చేసి చివరికి ప్రారంభం చేయకుండా వాటిని తొలగించడంతో అక్కడున్న ఆచార్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులు రావడంతోనే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కనీసం ప్రొటోకాల్ పాటించకుండానే గోశాలను ఎలా ప్రారంభిస్తారో చూడాలని ఈఓ గీతారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున గోశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు ప్రారంభోత్స వానికి సిద్ధం చేసిన రిబ్బన్ను తొలగించి, అలంకరణ మాత్రమే ఉంచారు. ప్రజాప్రతినిధులు గొడవకు దిగుతారనే ముందుగా గ్రహించిన ఈఓ గీతారెడ్డి ప్రారంభోత్సవం రద్దు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎలాంటి ప్రారంభోత్సవం లేనప్పుడు హంగులు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కూడా ఈఓ గీతారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా ఉన్న గొంగిడి సునితామహేందర్రెడ్డికి ప్రొటోకాల్ పాటించడం లేదని, రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో కరపత్రాలపై విప్ సునీత పేరు ముద్రించడంలో తప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆమెను సరిగా ఆహ్వానించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపై చర్యలు తీసుకోవాలి.. ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్న ఆలయ ఈఓ గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్గౌడ్ల ఆధ్వర్యంలో సీఎస్ జోషికి వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, కానీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లను ఆహ్వానించకుండా అగౌరవపరుస్తున్నారని తెలిపారు. ఈఓ వచ్చిన నాటినుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకో రాయికి పూజలు చేస్తాం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన ప్రతి రోజూ ఒక రాయికి పూజలు చేస్తాం. వాటన్నింటికి పిలవాలని లేదు. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవంతోనే మిగతా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగలేదు. పాత గోశాలను మల్లాపురం రోడ్డులో నూతనంగా నిర్మితం గోశాలకు తరలించాలని వైటీడీఏ అధికారులు ఆదేశించారు. కానీ దీనికి ఎవరిని మేము పిలవలేదు. –గీతారెడ్డి, ఈఓ, యాదాద్రి దేవస్థానం ఆహ్వానం అందలేదు.. వాస్తవమే యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన గోశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు. ఇది వాస్తవమే. గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి సంఘటనలకు మమ్మల్ని ఆహ్వానించలేదు. అయినా మేము ఎక్కడ కూడా ఈఓను ఇబ్బంది పెట్టలేదు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రొటోకాల్ విషయాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. – గొంగిడి సునితామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే -
టీఆర్ఎస్కు మావోయిస్టుల హెచ్చరిక
సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్బీ పోలీసులు ఇన్ఫార్మర్గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు. అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్ పిలుపునిచ్చారు. -
అభివృద్ధి చేయకుండా ఓట్లెలా అడుగుతారు: ఉత్తమ్
అనంతగిరి: టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వెంకట్రాంపురం, వాయిలసింగారం, త్రిపురవరం, చనుపల్లి గ్రామాలలో ఆదివారం ఆయన పరిషత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రతి గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, ఇంటికో ఉద్యోగం, రైతుల రుణమాఫీపై ఇచ్చిన హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్ర కేబినెట్లో ఉన్నత స్థాయిలో తెలంగాణ రథసారథులు ఉంటారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. డబ్బుకోసం పార్టీ మారిన రాజకీయ నాయకులు తల దించుకునేలా ప్రజల నిర్ణయం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వాసు, ముస్కు శ్రీనివాసరెడ్డి, బుర్రా సుధారాణి, పుల్లారెడ్డి పాల్గొన్నార