trade unions
-
నేడు ఉక్కు పోరాట కమిటీ 5కె రన్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం నానాటికి బలపడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలంటూ విశాఖలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఇప్పటికే కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై స్టీల్ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పోరాట కమిటీ సారథ్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. శనివారం జరిగిన దీక్షల్లో ఉక్కు ఎల్ఎంఎంఎం, డబ్ల్యూఆర్ఎం అర్ ఎస్ అండ్ ఆర్ ఎస్ విభాగాల కార్మీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపిన హీరో చిరంజీవికి కార్మిక సంఘాలు, పోరాట కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లే ముందు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే కూర్మన్నపాలెం కూడలి నుంచి గాజువాక వరకు ఆదివారం 7 గంటలకు 5కె రన్ చేపట్టనున్నారు. అలాగే 15వ తేదీన పరిపాలన భవనం వద్ద ధర్నా, 20న కేంద్ర కారి్మక సంఘాల సారధ్యంలో ఢిల్లీలో అఖిలపక్షాల నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి రాజశేఖర్ తెలిపారు. ఉక్కు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు తెలుగు తల్లి విగ్రహం కూడలి నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్ వరకు సైలెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సీ కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. అదే విధంగా ఉక్కునగరం క్వార్టర్లలో రాత్రి 7 గంటల నుంచి 7.15 వరకు విద్యుత్ దీపాల్ని ఆపి.. నిరసన తెలపాలని నిర్ణయించారు. అదేవిధంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్లో శనివారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాణాలైనా అరి్పస్తాం.. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు. -
కేంద్ర బడ్జెట్పై కార్మిక సంఘాల కన్నెర్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక కార్మిక సంఘాలు పోరాట బాట పట్టనున్నారు. ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలనే డిమాండ్పై 10 కార్మిక సంఘాలు ఆందోళనలు చేయనున్నాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనల్లో భాగంగా బుధవారం భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్స్ను ప్రతులను దగ్ధం చేస్తామని ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్లో తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్పై ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
నవంబర్ 26 సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన లోక్సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
సింగరేణి ప్రైవేటీకరణ దుర్మార్గచర్య
సాక్షి, హైదరాబాద్: సింగరేణి, దాని పరిధిలోని 11 బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పార్టీల రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కరోనా పరిస్థితుల ముసుగులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ను తెరమీదకు తెచ్చారని, లాభాల బాట లో ఉన్న సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు కార్మిక సంఘాలతో కలసి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ అంశంపై గవర్నర్, సీఎం, సీఎస్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై స్పందించిన సీఎం కేసీఆర్, సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని నేతలు ప్రశ్నించారు. బుధ, గురువారాల్లో కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలకు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం మఖ్దూం భవన్లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోతుందని, ప్రజాస్వామ్యాన్ని ప్రైవేట్ శక్తులు శాసించే పరిస్థితి వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం బడాబాబుల చేతుల్లో బందీ అయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. సింగరేణి పరిరక్షణకు విశాల ఉద్యమాన్ని చేపట్టాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చాడ ధ్వజమెత్తారు. సమావేశంలో ఎల్.రమణ (టీటీడీపీ), డీజీ నరసింహారావు (సీపీఎం), కె.గోవర్ధన్, రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), వివిధ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ తీసుకోరే..
సాక్షి, హైదరాబాద్: ‘బస్సులో టికెట్ తీసుకోకుంటే ఇక బాధ్యత ప్రయాణికుడిదే. ప్రయాణికులకు విధించే పెనాల్టీలు పెంచండి. టికెట్ తీసుకోనందుకు ప్రయాణికులనే పూర్తి బాధ్యులను చేయండి.’ఇదీ ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం. దీనికి సంబంధించి ఉత్తర్వులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ చర్యతో ప్రయాణికుల్లో భయం కలిగి టికెట్ తీసుకోని వారి సంఖ్య బాగా తగ్గాలి. కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఇటీవల క్రమం తప్పకుండా చెకింగ్స్ చేయిస్తుండటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సమస్య హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు గతేడాది మార్చిలో ఉప్పల్ డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన పెనాల్టీ మొత్తం రూ. 450కాగా, మేలో రూ. వెయ్యిగా నమోదైంది. కానీ ఈ సంవత్సరం జనవరిలో అదే డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీగా వసూలైన మొత్తం రూ. 58 వేలుగా, ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఆ మొత్తం రూ. 31 వేలుగా నమోదైంది. ఇక హైదరాబాద్ రీజియన్ పరిధిలో జనవరిలో ఆ మొత్తం రూ. 2.5 లక్షలుగా రికార్డయింది. ఫిబ్రవరి ప్రథమార్థంలో ఇప్పటివరకు రూ. 85 వేలుగా నమోదైంది. దీన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లో 10వ నంబర్ బస్సు తిరిగే మార్గంలో 24 డిపోలకు చెందిన 70 మంది సిబ్బంది ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసింది. వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. కిం కర్తవ్యం?: గతంలో ఇలాంటి ప్రయాణికులు చెకింగ్లో పట్టుబడితే కండక్టర్లకు మెమోలు జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లో సస్పెండ్ కూడా చేసేవారు. ఇది వారి ఉద్యోగ భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కార్మిక సంఘాలు అప్పట్లో తీవ్రంగా పరిగణించాయి. ఇటీవలి సమ్మె నోటీసులో కూడా ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాయి. అయితే చర్యలు తీసుకుంటారన్న భయంతో కండక్టర్లు టికెట్ల జారీలో అప్రమత్తంగా ఉండేవారు. కిక్కిరిసిన బస్సుల్లో తప్ప మిగతా బస్సుల్లో ప్రయాణికులు ఠంచన్గా టికెట్ తీసుకొనేవారు. తాజాగా టికెట్లెస్ ప్రయాణాలు పెరిగిపోవడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చకు దారితీస్తోంది. -
విద్యుత్ చార్జీలు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, డిస్కంలను పరిరక్షించేందుకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాల్సిందేనని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.రాష్ట్రంలో భారీగా పెరిగిన డిమాండ్కు తగ్గట్టు విద్యు త్ సరఫరా చేసేందుకు డిస్కంలు భారీగా వ్యయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేయనున్న ప్రతిపాదనలను ఆమోదించాలని రాష్ట్ర విద్యుత్ ని యంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు విద్యుత్ రాయితీలు విడుదల చేయించాలని కోరాయి. గత నెల 29న ఈఆర్సీ నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం సమావేశంలో ఉద్యోగ, కార్మిక సంఘాల నేత లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని చార్జీల పెంపు తప్పనిసరని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో చర్చించిన విషయాల(మీటింగ్ మినిట్స్)ను ఈఆర్సీ బుధవారం బహిర్గతం చేసింది. డిస్కంల ప్రయోజనాల పరిరక్షణకు విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి అని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ అధ్యక్షుడు జి.సాయిబాబు సమావేశంలో డిమాండ్ చేశారు. ఆర్థిక నష్టాల్లో ఉన్నామని డిస్కంల యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశాల్లో పేర్కొంటున్నా యని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు కె.ప్రకాశ్ తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచితే డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ (327) అధ్యక్షుడు ఈ.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకూ డి స్కంల వద్ద డబ్బులుండడం లేదని, వీటి కోసం కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాలని కోరారు. -
బెంగాల్లో బంద్ హింసాత్మకం
కోల్కతా: ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు బుధవారం జరిగిన భారత్ బంద్ బెంగాల్లో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు బలవంతంగా బంద్ చేయించారు. పలు ప్రాంతాల్లో బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే లైన్లపై ఆందోళనలు జరగడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మాల్డాలోని సుజాపూర్, బుర్ద్వాన్ జిల్లాలో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం, టైర్లు కాల్చేయడంతోపాటు ప్రభుత్వ బస్సులతోపాటు ఒక పోలీస్ వ్యాన్సహా పలు ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపై నాటుబాంబులతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్కు పాల్పడగా, మరికొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారాసాత్, నార్త్ 24 పరగణ ప్రాంతాల్లోని కొన్ని రైల్వే ట్రాక్లపై పోలీసులు కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు. -
నేడు దేశవ్యాప్త సమ్మె
-
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్లో తీర్మానించాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం బంద్లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
ఆ సమ్మెలో 25 కోట్ల మంది
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టనున్న అఖిల భారత సమ్మెను భారీగా విజయవంతం చేయాలని పోరాట సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక" విధానాలకు నిరసనగా జనవరి 8 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మందికి తక్కువ కాకుంటా పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం తెలిపాయి. జనవరి 2, 2020న తమ డిమాండ్లపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందనీ, దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు (సిటియు) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఫలితంగా నిజ వేతనాలు పడిపోయాయననీ, అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కూడా వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ పేర్కొన్నాయి. అలాగే బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం తరువాత 93,600 టెలికాం కార్మికులు ఇప్పటికే విఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) కింద ఉద్యోగాలను కోల్పోయారని విమర్శించాయి. ప్రత్యామ్నాయ విధానాల కోసమే దేశ కార్మికవర్గం ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నాయి. దీంతో పాటు, రైల్వేలలో ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తి యూనిట్ల కార్పొరేటైజేషన్, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అలాగే జెఎన్యూలో చెలరేగిన హింసను కార్మిక సంఘాలు ఖండించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావం తెలిపారు. 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతోపాటు ‘గ్రామీణ భారత్ బంద్’ పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి. కాగా 2020 జనవరి 8 న దేశవ్యాప్త సమ్మెకు గత సెప్టెంబర్లో కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 3న మీడియాతో ఐక్యవేదిక నాయకులు -
ఆర్టీసీ ఒకటేనా.. రెండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ విభజన పెద్ద వివాదాంశం. అధికారులు, కార్మిక సంఘాలు ఒకరి వాదనను ఒకరు ఖండిస్తూ ఫిర్యాదులతో హోరెత్తించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో రెండు ఆర్టీసీలు ఏర్పాటు కావడంతో అందరూ వివాదాలను ‘మరిచిపోయారు’. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ సందర్భంగా సంస్థ ఉనికినే హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ అప్పట్లో జరిగిందేమిటి, ఇప్పుడెందుకు ఇది వివాదంగా మారింది? పీటముడి ఇక్కడే... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆర్టీసీ బస్సులు, సిబ్బంది విభజన విషయంలో పెద్దగా సమస్య లేకున్నా ఆస్తుల విషయంలో పేచీ ఏర్పడింది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రం, మియాపూర్లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్... ఇలా 14 ఆస్తులను 58:42 దామాషాలో పంచుకోవాలని ఏపీ అధికారులు, కార్మిక సంఘాలు పేర్కొనగా హైదరాబాద్లో ఆర్టీసీ నిజాం కాలం నుంచి వచ్చిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఆర్టీసీ సాంకేతికంగా ఉమ్మడిగా ఉండేందుకు ఇదే కారణమైంది. కమిటీ సిఫార్సులు ఇచ్చినా... రాష్ట్రం విడిపోయాక రెండుసార్లు ఆర్టీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. తొలి సమావేశంలో ఆర్టీసీ ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు వైపుల నుంచి రెండు నివేదికలు అందాయి. వాటిని ఇరుపక్షాలూ పరస్పరం వ్యతిరేకించాయి. ఆ తర్వాత రెండో బోర్డు సమావేశం నాటికి షీలాభిడే కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే అందులో హెడ్ క్వార్టర్స్ నిర్వచనం ఆంధ్ర నివేదిక ఆధారంగా చేసినట్లు ఉందంటూ తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా ఆ సిఫార్సులు లేవంటూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశం వెలువడలేదు. పాలనాపరమైన వ్యవహారాల కోసం... ఆర్టీసీ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం సొంతంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన కమిటీ పాలనాపరమైన వెసులుబాటు కోసం రెండు వేర్వేరు కార్పొరేషన్లు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2016 ఏప్రిల్ 27న ప్రభుత్వ ఉత్తర్వు నం.31 ద్వారా ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ఆ ప్రతిని షీలాభిడే కమిటీకి పంపారు. సాంకేతికంగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆర్టీసీ ఉన్నా ఈ వెసులుబాటుతో విడివిడిగా ఏర్పాటయ్యాయి. జేఎండీ టు ఎండీ... రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఉమ్మడి ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సాంబశివరావు ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడ్డా.. విజయవాడ కేంద్రంగా ఆయన ఆధ్వర్యంలోనే రెండు ఆర్టీసీలు కొనసాగాయి. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ సారథిగా జేఎండీ పోస్టు ఏర్పాటైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో దీని ప్రస్తావన ఉన్నందునే తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీని ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఆర్టీసీ ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును ప్రభుత్వం 2014 ఆగస్టులో ఏడాది కాలానికి ఈ పోస్టులో నియమించింది. ఏడాది తర్వాత ఆయనకు ప్రభుత్వం మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కానీ 2016 ఏప్రిల్లో ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి సోమారపు సత్యనారాయణను చైర్మన్గా నియమించింది. చైర్మన్ ఉండి ఎండీ పోస్టు లేకపోవడం వెలితిగా ఉండటంతో అప్పటివరకు జేఎండీగా ఉన్న రమణారావును అదే సంవత్సరం జూన్ 16న ఎండీగా నియమించింది. కేంద్రం వాదనే మా మాట ‘ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. సాంకేతికంగా విభజన జరగనందున కేంద్రం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నట్లే. ఇప్పుడున్న బస్సులు, సిబ్బంది దానికి చెందిన వారే. విభజనే జరగని సంస్థలో కొంత భాగాన్ని ఎలా ప్రైవేటీకరిస్తారు? కేంద్రం అనుమతి లేకుండా ఎలా ప్రైవేటీకరిస్తారు? మొన్న కోర్టులో వినిపించిన కేంద్రం వాదననే మేం బలపరుస్తున్నాం’ – ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి కేంద్రం ఇరుకున పడదా? మోదీ ప్రభుత్వం ఫేమ్ పథకం కింద బ్యాటరీ బస్సులు మంజూరు చేస్తోంది. తొలి విడతలో తెలంగాణ ఆర్టీసీకి 40 ఏసీ బస్సులిచ్చింది. రెండో విడతలో ఏపీకి 300, తెలంగాణ ఆర్టీసీకి 325 కేటాయించింది. మరి సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీకి విడివిడిగా ఎలా కేటాయించింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది. అది ఇరుకున పడే విషయమే కదా? – న్యాయ నిపుణులు -
‘విలీనం’ కాకుంటే ఉద్యమమే
సాక్షి, హైదరాబాద్ : సిబ్బందికి వేతనాలు చెల్లించే స్థితిలో కూడా లేనంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ మరోసారి సమ్మె దిశగా సాగుతోంది. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను తెరపైకి తెచ్చిన కార్మిక సంఘాలు వరసపెట్టి సమ్మె నోటీసులు జారీ చేస్తున్నాయి. 2017తో ముగిసిన వేతన సవరణ ఒప్పందాన్ని పునరుద్ధరించటంలో జరుగుతున్న జాప్యం కూడా కార్మికుల ఆగ్రహానికి కారణమవుతోంది. వీటితో పాటు అంతర్గత నియామకాలు, డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత లాంటి మరో 12 డిమాండ్లను కూడా పేర్కొంటూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్లు నోటీసులు ఇవ్వగా, గుర్తింపు పొందిన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ గురువారం నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటుండటంతో ఆర్టీసీలో ఉద్యమ సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో నీళ్లు చల్లినా.... ఆర్టీసీలో ప్రధానంగా వినిపించే డిమాండ్ వేతన సవరణ. 2015లో సిబ్బందికి ప్రభుత్వం భారీ వేతన సవరణను ప్రకటించింది. అనూహ్యంగా 44 శాతం ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంత భారీగా ఇవ్వటం పట్ల కార్మిక సంఘాలే ఆశ్చర్యపోయాయి. ఒకేసారి ఆర్టీసీపై దాదాపు రూ.850 కోట్ల వార్షిక భారం పడటం, దానికి సరిపడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీ కుదేలవుతూ ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. నాటి వేతన సవరణ ఒప్పందం 2017తో ముగిసింది. తర్వాత ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించకుండా 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఫిట్మెంట్ ఊసు లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలోనే వినిపించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే అవకాశం ఉందన్న ఆందోళన కార్మికుల్లో ఇప్పుడు నెలకొంది. దీంతో సర్కారు అలాంటి నిర్ణయం తీసుకోకుండా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే...పోరాట పంథానే... ప్రభుత్వంలో విలీనం చేయకుంటే పోరాట పంథా తప్పదని ఎంప్లాయీస్ యూనియర్, టీజేఎంయూ నేతలు రాజిరెడ్డి, హన్మంతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. గురువారం తమ కార్యాచరణను ప్రకటి స్తామని టీఎంయూ నేత థామస్రెడ్డి వెల్లడించారు. గుర్తింపు సంఘం టీఎంయూ ఒంటెద్దు పోకడ లకు వెళ్లకుండా అన్ని సంఘాలను కూడగట్టుకుని సంయుక్త కార్యాచరణకు దిగితేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి కార్మికులకు న్యాయం జరుగుతుందని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు అన్నారు. -
ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రికార్డు సృష్టించింది. కాకపోతే నష్టాల్లో! రూ.వేయికోట్ల నష్టాల మార్కుకు చేరువైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాని ఏకంగా రూ.928.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ నివేదించింది. ఆర్టీసీ ఆవిర్భవించిన 8 దశాబ్దాల చరిత్రలో ఇదే అతి భారీనష్టం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలో స్వల్ప లాభాలు నమోదు చేసిన ప్రగతిరథం నష్టాల బాట వీడనుందనే ఆశ కల్పించింది. కానీ, ఆ తర్వాత క్రమంగా ఏ యేటికాయేడు నష్టాల ఊబిలోకే పరుగులు పెట్టింది. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించటమే గగనంగా మారింది. ఆరేళ్లుగా సిబ్బంది నియామకాలు లేకపోవటంతో డ్రైవర్ల కొర త ఏర్పడింది. కొంతకాలంగా అద్దె బస్సులనే తీసుకుంటోంది. 600 బ్యాటరీ బస్సులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించిన ఆర్టీసీ.. వాటిని కూడా అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాలనుకుంది. దీంతో అద్దె బస్సుల సంఖ్య పెరిగి ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.312 కోట్ల ఆదాయం పెరిగినా... ఈసారి ఆర్టీసీలో ఏకంగా రూ.312 కోట్ల మేర ఆదాయం పెరిగినా నష్టాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నియంత్రించలేని ఖర్చులు పెరగటంతో నష్టాలు కూడా నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.4,570 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.4,882 కోట్లుగా తేలింది. అంటే అంతకుముందు సంవత్స రం కంటే రూ.312 కోట్ల ఆదాయం పెరిగింది. బస్సుచార్జీలు పెంచకున్నా ఆదాయం పెరగడం విశేషం. కొంప ముంచిన వడ్డీ, డీజిల్, ఐఆర్ ఆర్టీసీకి రూ.3,500 కోట్లకుపైగా బ్యాంకు అప్పులున్నాయి. వడ్డీ భారం రూ.181 కోట్లు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే రూ.16 కోట్లు ఎక్కువ. తాజా నష్టాల్లో డీజిల్ వాటా పెద్దదే. చమురు రూపంలో రూ.1,384 కోట్లు ఖర్చయింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ.192.33 కోట్లు ఎక్కువ. గతేడాది ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి మధ్యంతర భృతి(ఐఆర్)ని 16 శాతంగా ప్రకటించిం ది. ఇది వెంటనే అమలులోకి రావటంతో వేతన భారం కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరంలో వేత నాల రూపంలో రూ.2,381 కోట్లు చెల్లించారు. ఇది అంతకుముందు ఏడాదికంటే రూ.127.77 కోట్లు ఎక్కువ. మోటారు వెహికిల్ టాక్స్ రూ.174 కోట్లు. ఇలా అన్నీ కలిపి అంతకుముందు సంవత్సరం నష్టాల కంటే రూ.179.76 కోట్లను పెంచుకుని రూ.వేయి కోట్లకు చేరువైంది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా... ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం తొలి త్రైమాసిక నష్టాలను చూస్తే ఏప్రిల్లోనే రూ.38.23 కోట్లు, మేలో రూ.37.96 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ (రూ.34 కోట్లు), మే(రూ.26 కోట్ల) కంటే చాలా ఎక్కువ. - తెలంగాణలో వేయి గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి బస్సులు నడపాలంటే కనీసం 1,500 కొత్త బస్సులు కొనాలి. మూడు వేల మంది అదనపు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. - 3 వేల బస్సులు డొక్కుగా మారి నడవటానికి యోగ్యంగా లేవు. వాటిని రీప్లేస్ చేయాలంటే కొత్త బస్సులు కొనాలి. -
స్తంభించిన ప్రజా రవాణా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ప్రకటించిన రెండ్రోజుల భారత్ బంద్ బుధవారంతో ముగిసింది. బంద్ సందర్భంగా కేరళ, పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను అడ్డుకోగా, బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రవాణా, విద్యుత్ సరఫరా, మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. బెంగాల్ లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై రాళ్లవర్షం కురిపించారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై దాడిచేశారు. తిరువనంతపురం–హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్, వేనాడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆందోళనకారులు తిరువనంతపురంలో అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో కేరళలో వాణిజ్య సముదాయాలు, షాపులు రెండో రోజూ మూతపడ్డాయి. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోగా, తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆగిపోయిన 20 వేల కోట్ల లావాదేవీలు గోవాలో ప్రైవేటు బస్సులు, ట్యాక్సీల యాజమాన్యాలు బంద్లో పాల్గొనడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబైలో అక్కడి రోడ్డు రవాణా సంస్థ ‘బెస్ట్’ జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో నిరవధిక బంద్కు దిగడంతో లక్షలాది మంది ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాశారు. అలాగే బెంగళూరులో రద్దీగా ఉండే మేజిస్టిక్ బస్టాండ్లోనూ వామపక్ష ట్రేడ్ యూనియన్లు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నాయి. ఈ బంద్ లో ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసో సియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) పాలొ ్గనడంతో రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే ప్రభు త్వ రంగ ఎస్బీఐతో పాటు ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
బ్యాంకింగ్పై బంద్ ప్రభావం పాక్షికం
న్యూఢిల్లీ: ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రెండు రోజుల బంద్తో మంగళవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఒక వర్గం ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) ప్రాబల్యం ఉన్న బ్యాంకుల్లో బంద్ ప్రభావం కనిపించింది. అయితే, బ్యాంకింగ్ రంగంలోని మిగతా ఏడు యూనియన్లు బంద్లో పాల్గొనకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీఈఏ, బీఈఎఫ్ఐల్లో సభ్యత్వమున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో వాటి ప్రాబల్యమున్న పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ 10 కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ, జీతభత్యాల పెంపు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గత నెల 21న, 26న సమ్మెకు దిగాయి. -
స్తంభించిన రవాణా, బ్యాంకింగ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది. -
ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు. ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్ చేశారు. -
కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
– డీసీఎల్ మహేశ్వర కుమార్ – 212 మందికి రూ.60,2400 మంజూరు చేయాలని ప్రతిపాదన కర్నూలు (రాజ్విహార్): కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, చైర్మన్ యు.మహేశ్వర కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ దరఖాస్తులపై ఏసీఎల్, ఏఎల్ఓ, కార్మిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను కార్మికుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ట్రేడ్ యూనియన్ల నాయకులు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ క్రమంలో 212 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించాలని కోరుతూ రూ.60,2400 మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనల పంపించారు. ఇందులో భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో మెటర్నిటీ (కాన్పు) అలవెన్స్ కింద 154 మందికి రూ.20వేలు చొప్పున రూ.30.80లక్షలు కావాలని, పెళ్లిళ్లకు 33 మందికి రూ.10వేల చొప్పు రూ.3.30లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.12.40లక్షలు (ముగ్గురికి), తాత్కాలిక వైకల్యం రూ.2400(ఒకరు), సహజ మరణానికి రూ.13.50లక్షలు(21 మంది) చొప్పున పంపించారు. కార్యక్రమంలో ఏసీఎల్ శేషగిరి రావు, ఏఎల్ఓలు కేషన్న, సుందరేష్, సుబ్బారెడ్డి, విల్సన్, హేమాచారి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు 98.. నేడు 16
సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య బోణిచేయని మూడు జాతీయ సంఘాలు ప్రధాన యూనియన్ల వెంటే కార్మికులు తాజా ఎన్నికల్లో మెజార్టీ అనుమానమే మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పుణ్యమా అని సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు 98కి పైగా ఉన్న సంఘాలు 18 ఏళ్ల క్రితం ఎన్నికలు మొదలు కావడంతో బరిలోకి దిగే సంఘాల సంఖ్య క్రమేణ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పేరుకు 32 సంఘాలున్నా ఆరో దఫా ఎన్నికల్లో పాల్గొనడానికి వివరాలు అందజేసింది 16 సంఘాలే. 2012లో జరిగిన ఎన్నికల్లో కేవలం 9 సంఘాలకు మాత్రమే ఓట్లు వచ్చాయి. సింగరేణిలో మొదటిసారి ఎన్నికలు 1998 సెప్టెంబర్ 14న జరిగాయి. నాటి నుంచి 2012 జూన్ 28 వరకు ఐదు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన సంఘాలైన ఐఎన్టీయూసీకి ఒక్కసారి, ఏఐటీయూసీ మూడుసార్లు, టీబీజీకేఎస్కు ఒక్కసారి కార్మికులు పట్టం కట్టారు. హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ వంటి జాతీయ సంఘాలు గుర్తింపు హోదా కోసం కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయారు. హెచ్ఎంఎస్ ఒక్కటే ప్రాతినిధ్య సంఘంగా రామగుండం రీజియన్లో ఉనికిని చాటుకుంటోంది. వీటితో పాటు టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ ఆరంభంలోనే శూరత్వం చూపింది. మొదటి ఎన్నికల్లో బెల్లంపల్లి, కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా గెలిచింది. ఆ తరువాత నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ యూనియన్ మెజార్టీ 2012 ఎన్నికల నాటికి 39 ఓట్లకు పడిపోయింది. ఐఎఫ్టీయూ ఐదుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాతినిధ్య సంఘానికే పరిమితమైపోయింది. 1998లో కొర్పొరేట్, 2001లో ఆర్జీ-1, 2 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల ఆదరించారు. ఈ సంఘం మెజార్టీ సైతం వందల సంఖ్యకు పడిపోయింది. ఇక ఏఐఎఫ్టీయూ, ఎస్జీకేఎస్(సింగరేణి గని కార్మిక సంఘం) వంటి సంఘాలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు. ఆ మూడు బలాలుంటేనే అధికారం జాతీయ సంఘాలుగా చెప్పుకుంటున్న బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్కు జాతీయ స్థాయిలో ఆర్థిక, అంగ బలం ఉన్నప్పటికీ సింగరేణిలో మాత్రం పట్టు సాధించలేక పోయారు. వేజ్బోర్డులో కీలకపాత్ర పోషించే ఈ సంఘాలు కార్మికుల అభిమానాన్ని మాత్రం చూరగొనలేకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పట్టును స్థానికంగా సద్వినియోగం చేసుకోలేక పోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన నాయకత్వ లోపమే ప్రధానంగా కనబడుతోంది. మిగతా జాతీయ సంఘాలకు సింగరేణిలో ఉన్న బలమైన క్యాడర్ ఈ సంఘాలకు లేకపోవడం ముఖ్య కారణం. సమస్యలపై స్పందించే గుణమూ తక్కువే. హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ వంటి సంఘాలు ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం ఉండటంతో పాటు ఆయా సంఘాలకు మాతృ పార్టీలు లేకపోవడం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేకపోవడం వల్లే వెనుకబడిపోతున్నాయనే అభిప్రాయాలు ఉన్నారుు. ఆర్థిక వనరులూ తక్కువే. సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండి కూడా తన అనుబంధ సంఘాన్ని బలోపేతం చేయకుండానే ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. పోరాట చరిత్ర ఉన్న ఏఐటీయూసీ సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్కు 6,587 ఓట్ల తేడాతో అధికారం అప్పగించింది. సింగరేణిలో అధికారం చేజిక్కించుకోవాలంటే పోరాటంతో పాటు అంగ, అర్థ బలం అవసరమే. ఈ మూడు ఉన్న సంఘాలనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఆదరించారని చెప్పవచ్చు. ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయా సంఘాలు సాధించిన మెజార్టీ వివరాలు యూనియన్ 1998 2001 2003 2007 2012 హెచ్ఎంఎస్ 3,784 2,434 1,583 4,099 5,983 సీఐటీయూ 3,257 5.237 -- 1.291 0,099 బీఎంఎస్ 2,021 0,519 -- 0,184 0,189 టీఎన్టీయూసీ 2,596 9,788 7,609 1,212 0,039 ఐఎఫ్టీయూ 12,674 14,883 3,179 0,720 0,373 ఏఐఎఫ్టీయూ 0,777 0,024 -- -- -- -
వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?
మొదలైన ‘గుర్తింపు’ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అంటున్న అధికారులు డిపెండెంట్ల ఆశలపై నీలినీడలు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారసత్వ ఉద్యోగా ల ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాల పరిస్థితి ఎలా ఉన్నా.. 2012లో జరిగిన 5వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామనే ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నా రు. టీబీజీకేఎస్ తన గుర్తింపు కాలపరిమితి నాలుగేళ్లలో ఆ హామీని నెరవేర్చలేకపోయింది. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం.. ఇదిగో .. అదిగో వస్తున్నాయంటూ నాయకు లు నమ్మబలికారు. ముఖ్యమంత్రిని కలిశామని, ఆయన ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని గనులపైకి వచ్చిన ప్రతీసారి చెప్పారు. ఆచరణలో మాత్రం పెట్టలేక పోయూరు. నాలుగు జిల్లాల కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం సాధారణ ఎన్నికల్లో ఇదే హామీని వళ్లించారుు. చివరకు పుణ్యకాలం పూర్తరుుంది. తిరిగి ఆరవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఆదే హామీతో ముందుకు వస్తోంది. ఈ ప్రభావం టీబీజీకేఎస్ పై తీవ్రంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో.. ఒకప్పుడు బొగ్గుగనుల్లో విధులు నిర్వర్తించి రావడానికి కాలినడకే దిక్కు. భూగర్భంలో కిలోమీటర్ల కొద్ది నడక కారణంగా 50 సంవత్సరాల వయసు పైబడిన కార్మికుల లో ఎక్కువ శాతం మంది మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడేవారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి బానిసయ్యేవారు. ఈ నేపథ్యంలో కార్మికులు విధులకు ఎక్కువగా గైర్హాజరయ్యేవారు. ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడేది. ఆలోచించిన యాజమాన్యం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యంతో పనిచేయ ని కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని నిర్ణయించింది. 1981 జూన్ 21వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1998 జూన్ 6 వరకు వారసత్వ ఉద్యోగాలను కొనసాగించారు. తర్వాత కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ వేగవంతం కావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ఎక్కువగా యంత్రాల తోనే చేపడుతున్నారు. దీంతో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం నిలిపివేసింది. కేవలం మరణించిన, పూర్తిగా పనిచేయలేక అనారోగ్యంతో ఉన్న, గనుల్లో ప్రమాదాలకు గురైన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా నెలకు 25 ఉద్యోగాల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించింది. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
‘తూర్పు’న సమ్మె విజయవంతం సాక్షి, రాజమహేంద్రవరం: కార్మిక చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ, కాకినాడ పోర్టు ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. జిల్లా అంతటా బ్యాంకులు మూతపడ్డాయి. కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు ర్యాలీల్లో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోటలోని ప్రైవేట్ సంస్థ రాక్ సిరామిక్స్ కంపెనీ 12 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా సమ్మె జరిగింది. బెజవాడలో ప్రశాంతంగా సమ్మె.. విజయవాడ: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కోర్కెల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడ నగరంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు , బ్యాంకుల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వేలాదిమంది విధులను బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళనకారులు నినదించారు. విజయవాడ రథం సెంటర్ నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అసంఘటిత రంగంలోని కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, గఫూర్ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు కూడా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ నాయకత్వం వహించారు. సమ్మెలో పాల్గొన్న ఆందోళనకారులు పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బ్యాంకులు పని చేయలేదు. మున్సిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. గుడివాడ, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నం, ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం కనిపించింది. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
పాల్గొననున్న పలు సంఘాలు మూతపడనున్న వ్యాపార, విద్యాసంస్థలు న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో సమ్మె జరగనుంది. సమ్మెలో జిల్లాలోని పలు కార్మిక సంఘాలు పాలు పంచుకోనున్నాయి. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా సమ్మెకు దిగుతుండగా.. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. కాగా, సమ్మె సందర్భంగా శుక్రవారం వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు మూతపడనుండగా, రవాణా వ్యవస్థ నిలిచిపోయే అవకాశముంది. సమ్మె విజయవంతంతో సమాధానం చెప్పాలి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే యత్నాలతో పాటు కార్మికులను గందరగోళానికి గురిచేసేందుకు కేంద్రప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు సమ్మెను విజయవంతం చేయడం ద్వారా దీటైన జవాబు చెప్పాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్లోని జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ, బ్యాంక్ తదితర రంగాల్లో ఎఫ్డీఐలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఏ సమస్యను పరిష్కరించకుండా కేంద్రమంత్రులు కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు బి.చక్రపాణి, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి.. వివిధ కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి విజయ్ఖన్నా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ల్యాదళ్ల శరత్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు రవికుమార్, ప్రశాంత్, అశోక్, సురేష్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు. తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాల ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, ప్రతీ పోస్టాఫీస్ 8 గంటల డ్యూటీ కేటాయించాలనే తదితర డిమాండ్లతో శుక్రవారం సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ వర్కింగ్ ప్రసిడెండ్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. - నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. – కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఇవ్వాలి. – కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. – అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. – కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి. – కార్మిక చట్టాల సవరణను ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలో వాటా అమ్మకాన్ని నిలిపి వేయాలి. – రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్డీఐలను అనుమంతించొద్దు. – రోడ్డు రవాణా, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిచుకోవాలి. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలను విధిగా అమలుచేస్తూనే పెన్షన్ గ్యారంటీ ఇవ్వాలి. – 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజస్ట్రేషన్ పూర్తి చేయాలి. విద్యారణ్యపురి : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల బాధ్యులు కె.సోమశేఖర్, బద్దం వెంకటరెడ్డి, ఎస్.కుమారస్వామి, యూ.అశోక్, కడారి భోగేశ్వర్, టి.సుదర్శనం, టి.లింగారెడ్డి, సుధాకర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ సంఘాలు ఏకం
10న గోదావరిఖనికి సంజీవరెడ్డి రాక అధికారికంగా ప్రకటించే అవకాశం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఒక్కటికానున్నాయి. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒకే బ్యానర్పై కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా కొనసాగుతున్న జనక్ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎస్.నర్సింహారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సెప్టెంబర్ 10వ తేదీన గోదావరిఖనిలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి హాజరవుతున్నందున పెద్ద ఎత్తున క్యాడర్ను సమీకరించే పనిలో రెండు యూనియన్ల నాయకత్వం నిమగ్నమైంది. ఎస్సీఎంఎల్యూ ఆస్తుల పరిరక్షణపై దృష్టి ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్(ఎస్సీఎంఎల్యూ)కు మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన బి.వెంకట్రావు ఈనెల 18న టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్లో చేరి ఆ యూనియన్కు అధ్యక్షుడయ్యాడు. ఈ నేపథ్యంలో యూనియన్కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా త్యాగరాజన్ను నియమిస్తూ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం యూనియన్ పేరుతో కొత్తగూడెం, మణుగూరు, సెంటినరీకాలనీలో సొంత భవనాలున్నాయొ. బెల్లంపల్లి మినహా మిగతా అన్ని ఏరియాల్లో సింగరేణి సంస్థ క్వార్టర్లను సమకూర్చింది. ఈ నేపథ్యంలో యూనియన్కు చెందిన ఆస్తులను, కార్యాలయాలను కాపాడుకునేందుకు కొత్త కార్యవర్గం దృష్టి సారించింది.