TPCC
-
నీ ముక్కు నేలకు రాస్తావా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ సృష్టించే సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుండుపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ, దొరల తెలంగాణ కావాలా?.. ప్రజల తెలంగాణ కావాలా?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4వేల పెన్షన్ ఇస్తాం. తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ మండలానికి చేసింది ఏమీ లేదని జాతీయస్థాయిలో శంషాబాద్కు పేరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేననన్నారు. శంషాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఔటర్ రింగ్రోడ్తో పాటు మెట్రో రైల్, సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్సేనన్నారు. జీవో 111 పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలను ప్రతిసారీ మోసం చేస్తూ ఎన్నికలను తెస్తున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవో 111 ఎత్తివేస్తామంటూ గెలుస్తున్నారన్నారు. బడా నాయకులు ఫామ్ హౌస్లు, విల్లాలు కట్టుకుంటే జీవో 111 వర్తించదు. కానీ అదే పేదోడు చిన్న ఇల్లు కడితే మాత్రం 111 జీవో అడ్డు వస్తుందని రేవంత్ మండిపడ్డారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నిరూపిస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్తో పాటు తాను కూడా నామినేషన్ ఉపసంహరిస్తామని లేదంటే.. 8 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే శంషాబాద్ బస్టాండ్ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తావా అంటూ కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. చదవండి: రేవంత్ మాటమార్చి బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్రావు -
ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్ ఆలోచన చేసినదే కాంగ్రెస్ పార్టీ అని, అసలు ఉచిత విద్యుత్ గురించి చెప్పుకొనే పేటెంట్ హక్కు తమ పార్టీకే ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. 2004లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్పైనే తొలి సంతకం చేశారని, రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిల ను రద్దు చేసి, రైతులపై ఉన్న అక్రమ కేసులను సైతం తొలగించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్పై బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రైతులకు 24 గంటల కరెంట్ వద్దు.. 3, 5 గంటలు చాలని అన్నట్టు దుష్ప్రచారం చేస్తు న్నారని.. తాను అలా ఎక్కడ అన్నానో నిరూ పించాలని సవాల్ విసిరారు.ఉమ్మడి పాల మూ రు జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నిర్వ హించిన ప్రజాగర్జన సభల్లో రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అలంపూర్ సాక్షిగా చెబుతున్నా.. ఏదైనా ఒక సబ్స్టేషన్కు వెళ్లి పరిశీలిద్దాం. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే నా నామినేషన్ వాపస్ తీసుకుంటా. లేకుంటే ఇదే నడిగడ్డ మీద సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలి. వస్తావా? లేక తీసేసిన అబ్రహమో, కొత్త అభ్యర్థి పేరు తెల్వదు గానీ దొరగారి గడీల బానిస వస్తాడా.. లేక కేటీ ఆర్ను పంపిస్తావా? కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. మిత్రుడు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, సీఎం సిద్ధరామయ్యతో నేను, అలంపూర్ సంపత్కుమార్ కూర్చొని మాట్లాడి తుమ్మిళ్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరిస్తాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా రూ.100 కోట్లతో జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? ముదిరాజ్లు అక్కర్లేదా? తెలంగాణలో 11 శాతం ఉన్న ముదిరాజ్లకు బీఆర్ఎస్ ఒక్క టికెట్ ఇవ్వలేదు. ఇవాళ ముదిరాజ్ల ఓట్లు అక్కర్లేకుండా పోయాయా? కేసీఆర్ సమాధానం చెప్పాలి. హేమాహేమీలు పోటీపడ్డా ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించేందుకే వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. మక్తల్లో వాకిటి శ్రీహరి, రాజేంద్రనగర్లో నరేందర్, గోషామహల్లో సునీతారావు, పటాన్చెరులో నీలం మధుకు టికెట్ ఇచ్చాం. ధరణి కంటే మెరుగైన విధానం తెస్తాం సీఎం కేసీఆర్ కుటుంబం ధరణిని దోపిడీకి వాడుకుంటోంది. ధరణి వారికి ఏటీఎంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొకొచ్చి భూములను కాపాడుతాం. ఎక్కడైతే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో అక్కడ కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది. ధరణి రద్దు చేస్తే రైతుబంధు పోతుందని అబద్ధాలు మాట్లాతున్నారు. ధరణి లాంటిది లేకుండానే వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ, బీమా సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ఇవ్వలేదా? లక్ష కోట్ల దోపిడీ జరిగింది ఎవరో పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగలగానే కూలిపోయిందట. కాళేశ్వరం పరిస్థితి అట్లా ఉంది. మేడిగడ్డ కడితే భూమిలోకి కుంగిపోయింది. అన్నారం కడితే ఫక్కున పగిలిపోయింది. సుందిళ్ల రేపోమాపో కూలేటట్టు ఉంది. ఇక మీ పాపం పండిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పటికే తప్పుడు వాగ్దానాలతో కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. పది వేల ఎకరాల భూములను అక్రమంగా సంపాదించుకున్నారు. ఆయన ఇంట్లో అల్లుడు, బిడ్డ, కొడుక్కు పదవులు ఇచ్చారు. మూడోసారి గెలిస్తే మనవడికి కూడా పదవి ఇచ్చేలా ఉన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే కేసీఆర్ను మళ్లీ గెలిపిస్తే కృష్ణా నదిలో ముంచేస్తారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి..’’ అని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సంపత్కుమార్, సరిత తిరుపతయ్య, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై కోదండరాంతో చర్చలు జరిపాం : రేవంత్ రెడ్డి
-
‘చేయి’స్తారా!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో తీవ్ర నిరసన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడిపై, అధిష్టానంపై మండిపడుతున్నారు. దొంగ సర్వేలు నిర్వహించి, వాటి పేరిట తమ వారికి టికెట్లు అమ్ముకున్నారని, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కాదని పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమను మోసం చేసిన వారిని ఎన్నికల్లో ఓడిస్తామంటూ కొందరు బహిరంగంగానే శపథం చేస్తున్నారు. పార్టీ తమకు న్యాయం చేస్తుందనే ఆశతో, ఎంతో ఉత్కంఠతో రెండో జాబితా కోసం ఎదురుచూసిన మరికొందరు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొందరు ఏదేమైనా బరిలోకి దిగుతామంటుంటే (రెబల్స్), మరికొందరు ఏకంగా రాజీనామాల బాట పట్టారు. మరోవైపు పలువురు నేతల అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాందీభవన్పై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి అనుచరులు కొందరు రాళ్ల దాడి చేశారు. తమ నేతకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ జెండాలను తగులపెట్టారు. ఇటుక పెళ్లలను విసరడంతో రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి రంధ్రం పడింది. పార్టీతో తెగదెంపులు: టికెట్ దక్కనందుకు నిరసనగా కాంగ్రెస్ అనుబంధ విభాగమైన మైనార్టీ సెల్ చైర్మన్ సోహైల్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీతో 34 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఖర్గేకు లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ తాళం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చేతుల్లో ఉందన్నారు. పాత కాంగ్రెస్ను రేవంత్రెడ్డి చంపేశారని ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత గాందీభవన్లో ఒక్కరు కూడా కనిపించరని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్రెడ్డి కూడా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కార్యకర్తలతో సమావేశమైన ఆయన తనకు పార్టీ అన్యాయం చేసిందని బోరుమన్నారు. ఆయన్ను చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. గత ఎన్నికల్లో తాను టికెట్ త్యాగం చేశానని, ఈసారి ఇస్తామని చెప్పి చివరకు డబ్బులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దిగుతానని, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావ్ను ఓడించి తీరతానని శపథం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పార్టీ నేత, ఎన్ఆర్ఐ విజయ్కుమార్రెడ్డి చెప్పారు. ముధోల్ కాంగ్రెస్ టికెట్ను ఎంతకు అమ్ముకున్నారో రేవంత్రెడ్డి చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న తనను ఇక్కడికి రప్పించి టికెట్ ఇస్తామని ఆశ చూపి పని చేయించుకున్నారని, ఇప్పుడు వేరే అభ్యర్థికి టికెట్ అమ్ముకుని తనను మోసం చేశారని ఆరోపించారు. కాగా ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసి తగులబెట్టారు. తిరుగుబాటు బావుటాలు టికెట్ దక్కని కాంగ్రెస్ ఆశావహులు కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరు పార్టీని ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వడ్డేపల్లి సుభాష్రెడ్డితో పాటు మునుగోడు టికెట్ రాని చల్లమల్ల కృష్ణారెడ్డి, హుస్నాబాద్ టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి, వరంగల్ వెస్ట్లో జంగా రాఘవరెడ్డి, ఆసిఫాబాద్లో ముందు నుంచి పనిచేస్తున్న తనను కాదని శ్యామ్నాయక్కు టికెట్ కేటాయిచండంపై మండిపడుతున్న ఆదివాసీ మహిళా నాయకురాలు మర్సుకోలు సరస్వతి స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉంటామని స్పష్టం చేశారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకట్రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా అధిష్టానం తనను వంచించిందని హుస్నాబాద్ నేత అలిగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నా.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్ననని, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. నాయిని రాజేందర్రెడ్డికి ఏ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి కేటాయించడంపై టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్, ముఖ్యనాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, సోమన్నగారి రవీందర్రెడ్డి రగిలిపోతున్నారు. హత్నూర మండలంలోని ఓ ఫాంహౌస్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తక్షణం అభ్యర్థిని మార్చాలని, లేకుంటే తమ ముగ్గురిలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి.. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. రాహుల్ సభను అడ్డుకుంటామంటున్నారు.. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా వచ్చే నెల 1న జడ్చర్లలో జరిగే రాహుల్గాంధీ బహిరంగ సభను అడ్డుకుంటామని తన అనుచరులు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చెప్పారు. కార్యకర్తలు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ టికెట్ స్థానికులకు ఇవ్వకుంటే రెండ్రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్సాగర్రావు వర్గీయులు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల అశోక్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆడె గజేందర్ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్ను వెనక్కి తీసుకుని, స్థానికులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అసంతృప్తి నేతలు పలువురు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోటీ బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నట్లు మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని, సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ తనకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించడం సమంజసం కాదని పీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ సభ్యుడు దండెం రాంరెడ్డి అన్నారు. మల్రెడ్డి రంగారెడ్డిని కొనసాగిస్తే తాపే రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఖాయమని స్పష్టం చేశారు. నిరాశలో యువనేతలు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించిన పలువురు యువ నేతలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, గిరిజన విభాగం అధ్యక్షులు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్లు ఈసారి తప్పకుండా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ వారికి అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. ముఖ్యంగా హుజూరాబాద్ టికెట్ను బల్మూరి వెంకట్కు కేటాయించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇచ్చి బలి పశువును చేశారని, ఆ తర్వాత కూడా పార్టీ కోసం ఎంత కష్టపడినా వెంకట్కు పార్టీ గుర్తింపు ఇవ్వలేదని అంటున్నారు. రేవంత్పై ఫిర్యాదుకు సిద్ధం టికెట్లు రాని నేతలు కొందరు పార్టీ నాయకత్వంపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపించడం గమనార్హం. మరోవైపు రేవంత్రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సిద్ధమయ్యారు. శనివారం లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో కొందరు నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల పట్ల రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆవేదనతో ఉన్న నేతలు ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. అద్దంకి దయాకర్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారని, తమ భవిష్యత్తు కార్యచరణపై సమాలోచనలు జరిపారని తెలుస్తోంది. రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు సమాచారం. అభ్యర్థిత్వాలను సమీక్షించండి: సీనియర్ల లేఖ టికెట్ల కేటాయింపు తీరుపై సీనియర్లలోనూ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ల ఖరారు ప్రాతిపదికకు అర్థం లేకుండా పోయిందని, ఏళ్ల తరబడి పార్టీని పట్టుకుని వేలాడిన వారిని పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వారికి పట్టం కట్టారని వాపోతున్నారు. కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి లేఖ రూపంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా పార్టీతో కలిసి నడుస్తున్న నేతలు, కేడర్లో అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రెండు జాబితాల్లో ప్రకటించిన అభ్యర్థులను చూస్తే ప్యారాచూట్లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని, పార్టీకి విధేయులుగా ఉండి ఎన్నికలను ఎదుర్కొనగలిగిన సత్తా ఉన్న నాయకులను పార్టీ అధిష్టానం విస్మరించిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. కేడర్ మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తొలి రెండు జాబితాల్లో ప్రకటించిన పేర్లను సమీక్షించాలి. అప్పుడే పార్టీ కేడర్లో విశ్వాసం పెరగడంతో పాటు పార్టీపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్కు పంపిన లేఖలో సీనియర్ నేతలు కోరారు. -
నాలుగు సీట్లను వామపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాబబుల్స్ జాబితా
-
Telangana: ఇంతకీ కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
ఇది జంపింగ్ జపాంగ్ల టైమ్. ఆ పార్టీలో సీటు రాకపోతే.. ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో సీటు రాకపోతే ఆ పార్టీలోకి..ఇలా పార్టీలన్నీ కప్పల తక్కెళ్ళ మాదిరిగా తయారయ్యాయి. గులాబీ పార్టీ టిక్కెట్లు ప్రకటించేసింది. కాంగ్రెస్ సగం ఇచ్చింది. బీజేపీ ఇంకా ప్రకటించలేదు. దీంతో పక్క పార్టీల్లోకి వెళ్ళే నాయకులు బిజీగా తయారయ్యారు. ముఖ్య నేతల దగ్గర కొందరు జాయిన్ అవుతుంటే.. మరికొందరు ఎక్కడికక్కడ స్థానికంగా తమకు అవకాశం ఉన్న పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆపరేషన్ లోకల్ అంటూ ముందుకు సాగుతోంది? ఇంతకీ కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? , ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా మారిపోయింది. గెలుపు గుర్రాలైతే ఎక్కడి నుంచి వచ్చారన్నది చూడకుండా టిక్కెట్లు ఇచ్చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సగం సీట్ల అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారు ఉన్నారని పార్టీలోని సీనియర్లు కొందరు రగిలిపోతున్నారు. తమకు సీట్లెందుకు ఇవ్వలేదని అగ్రనాయకత్వాన్ని ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని నిలదీస్తున్నారు. గాంధీభవన్లో కూడా ఆందోళనలు జరిగాయి. ఇక జనగాం టిక్కెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేవంత్రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో ఆయన సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక నాగర్కర్నూల్ టిక్కెట్ ఆశించిన మరో సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కూడా రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ నాగం ఛాలెంజ్ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం రాష్ట్రమంతా ఆశావహులు పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మీద రగలిపోతున్నారు. ఒకవైపు పార్టీలోని సీనియర్లు టిక్కెట్లు రాలేదని, ఇక రాబోదని నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తుంటే..మరోవైపు రేవంత్రెడ్డి జెట్ స్పీడ్లో ఇతర పార్టీల్లోని సీనియర్లను, టిక్కెట్లు రానివారిని కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. కొందరితో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యే స్థాయి నేతలను చేర్చుకుంది హస్తం పార్టీ. ఇక అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ కోసం ఆపరేషన్ లోకల్ పేరుతో అన్వేషణ మొదలు పెట్టింది హస్తం పార్టీ. ముఖ్యంగా అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఈ చేరికలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ ల నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు పలు పార్టీల నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతూ చేరికల స్పీడ్ పెంచారు కాంగ్రెస్ నేతలు. బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న ప్రాంతాల వివరాలను ఇప్పటికే సునీల్ కనుగోలు టీం పీసీసీకి రిపోర్ట్ అందించింది. దీంతో పార్టీ బలహీనంగా ఉన్న బూత్ లలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది టీ కాంగ్రెస్. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రోజూ పదుల సంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనూ చేరికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ జీహెఎంసీ కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్ తో పాటు ఆయన భార్య పూజిత , షాద్నగర్కు చెందిన సర్పంచులు ప్రతాప్, బాల్ రాజ్, గోపాల్, మంజుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ చెందిన ఎంపీపి హన్మంతురెడ్డితో పాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక నల్లగొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రమేష్ గౌడ్తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు , శశిథర్ రెడ్డితో పాటు పలువురు సర్పంచ్ లు, జెడ్పీటీసీ లు కాంగ్రెస్ లో చేరారు. ఇదే ఫార్ములా ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆకుల లలిత వంటి సీనియర్లతోనూ మంతనాలు జరుగుతున్నాయి. స్థానిక నేతల బలం పెరిగితే ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని టీ కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లోకల్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. -
తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీ
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోన్న కాంగ్రెస్.. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశంఉంది. ‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మద్యం, డబ్బుతో కేసీఆర్ సిద్ధం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసేలా అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలంటూ తాను విసిరిన సవాల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించకపోవడంతో ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. మునుగోడు, హుజూరాబాద్ తరహాలో మరోసారి మద్యం, డబ్బుతో ఎన్నికల్లో పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుందని, డబ్బు, మద్యం పంపిణీ చేయదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఎక్కడా మద్యం, డబ్బు పంచలేదు దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్ని కని ఆనాడు విశ్లేషకులు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. మునుగోడులో కూడా మద్యం ఏరులై పారిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండు చోట్లా చుక్క మందు కానీ, డబ్బు కానీ పంచలేద న్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధిని కేసీఆర్ పక్కనబెట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ను తన కుటుంబానికే పరిమితం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలి పేలా ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రవళిక మరణంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ప్రవళిక కుటుంబ సభ్యు లను తాను రాహుల్గాంధీ వద్దకు తీసుకెళ్లాలను కుంటే.. ప్రగతిభవన్లో బంధించారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలి రాష్ట్రంలో రిటైర్డ్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని, వీరికి ఎన్నికల నియ మావళి వర్తించదా? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. బంధువులు, కావలసిన కొందరు రిటైర్డ్ అధికారు లను ప్రైవేటు సైన్యంగా చేసుకొని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారని, కానీ 2 లక్షల ఉద్యోగాల ఊసు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని, అప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగులు కేసీఆర్పై కదం తొక్కాలని, 30 లక్షల నిరుద్యోగ యువకులు కాంగ్రెస్కు ఓటు వేయడంతో పాటు తల్లిదండ్రులతో కూడా వేయిస్తే 90 లక్షల ఓట్లతో పాటు 90 సీట్లు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకా లు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గోషామహల్లో ఎంఐఎం పోటీ చేయదా? కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎన్నికవుతూ వస్తున్న షబ్బీర్ అలీ అనే మైనారిటీ నేతను ఓడించేందుకు కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఓ మైనారిటీని ఓడించేందుకు పోటీ చేస్తున్న కేసీఆర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మద్దతివ్వడం వెనుకున్న ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఎంఐఎంను, ఒవైసీ కుటుంబాన్ని దూషించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల న్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ముగ్గురు ఒక్కటేనని, వారి ఒప్పందంలో భాగంగానే గోషా మహల్లో రాజాసింగ్పై ఎంఐఎం పోటీ చేయడం లేదని చెప్పారు. -
అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
Telangana Congress: 70 సీట్లు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఓ కొలిక్కి తెచ్చింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణాలు, ఆర్ధిక పరిస్థితులు, సర్వేలను బేరీజు వేసుకుంటూ దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరని మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై మరో సారి భేటీ అయి చర్చించాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం రాని స్థానాలకు ఇద్దరు చొప్పున పేర్లతో జాబితా సిద్ధం చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని.. వారు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేర్లను ఖరారు చేయాల ని తీర్మానించింది. ఇప్పటికే ఒక్కో పేరును ఖరారు చేసిన నియోజకవర్గాల జాబితాకు సీఈసీ అను మతి తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14 తర్వాత సీఈసీ భేటీ అయి అభ్యర్థుల జాబితాలను పరిశీలించనుందని.. ఈ నేపథ్యంలో ఈ నెల 16న లేక 18న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి ముఖ్య నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించడంతో.. ఆ బస్సు యాత్ర పూర్తయ్యాక అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఆలోచన కూడా ఉందని అంటున్నాయి. వాడీవేడిగా సమావేశం.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్రూమ్లో భేటీ అయింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెలలో ఖరారు చేసిన కొన్ని స్థానాలు సహా మొత్తంగా 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసి.. ఒక్కో పేరుతో జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీ ఆసాంతం నేతల వాదనలు, అభిప్రాయాలతో వాడీవేడీగానే జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని నియోజకవర్గాలపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఇంకొన్ని చోట్ల కుల సమీకరణాలపై ఎవరి వాదన వారే వినిపించడంతో సమావేశం హీటెక్కినట్టు పేర్కొన్నాయి. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్, జూబ్లీహిల్స్, ఆసిఫాబాద్, జనగాం, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, సికింద్రాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారు అంశంపై నేతలు వేర్వేరు పేర్లను సూచించినట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా గెలవగలిగే వారిని ఖరారు చేయాలని కొందరు సూచిస్తే.. సీనియారిటీ, పార్టీకి పనిచేసిన అనుభవం, ఆర్థిక, కుల సమీకరణాల ఆధారంగా ఎంపిక ఉండాలని ఇంకొందరు పట్టుబట్టినట్టు సమాచారం. ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలంటూ.. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమకారులు కాంగ్రెస్ వార్రూమ్ ముందు నిరసనకు దిగారు. టికెట్లు ఆశిస్తున్న కురువ విజయ్కుమార్ (గద్వాల), మానవతారాయ్ (సత్తుపల్లి), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్), ఇతర నేతలు అక్కడ ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తమకు టికెట్లు ఇవ్వాలని, ఉదయ్పూర్ డిక్లరేషన్ను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్రసింగ్ వారితో మాట్లాడి, అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీలైనంత త్వరగా తొలి జాబితా: ఠాక్రే ఆదివారం రాత్రి స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుందని.. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను సీఈసీకి అందిస్తామని చెప్పారు. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పీసీసీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. వచ్చిన అన్ని దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ భేటీలో పరిశీలించామని.. అన్నివర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నామని వివరించారు. అయితే టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీదే (సీఈసీ)నని చెప్పారు. కాగా.. త్వరలో సీఈసీ సమావేశం ఉండే అవకాశం ఉందని, వారం, పది రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు ఇలా.. (పీసీసీ వర్గాల సమాచారం మేరకు) 1. కొడంగల్ – రేవంత్రెడ్డి 2. హుజూర్నగర్ – ఉత్తమ్కుమార్రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. మధిర – భట్టి విక్రమార్క 5. మంథని – శ్రీధర్బాబు 6. జగిత్యాల – జీవన్రెడ్డి 7. ములుగు – సీతక్క 8. భద్రాచలం – పొదెం వీరయ్య 9. సంగారెడ్డి – జగ్గారెడ్డి 10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 11. అలంపూర్ – సంపత్కుమార్ 12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి 13. కామారెడ్డి – షబ్బీర్ అలీ 14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్రావు 15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి 16. పరిగి – రామ్మోహన్రెడ్డి 17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్కుమార్ 18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి 19. ఆలేరు – బీర్ల ఐలయ్య 20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్ 21. వేములవాడ – ఆది శ్రీనివాస్ 22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్కుమార్ 23. జడ్చర్ల – అనిరుధ్రెడ్డి 24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్ 25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్రావు 26. అచ్చంపేట – వంశీకృష్ణ 27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్ 28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ 29. మంచిర్యాల – ప్రేమ్సాగర్రావు 30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు 31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్రెడ్డి 32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ 33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ 34. షాద్నగర్ – వీర్లపల్లి శంకర్ 35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్ 36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్ 37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి 38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు 39. పటాన్చెరు – కాట శ్రీనివాస్గౌడ్ 40. సూర్యాపేట – ఆర్.దామోదర్రెడ్డి 41. గద్వాల – సరితా తిరుపతయ్య 42. నాగర్కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్రెడ్డి 43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్ 44. ముషీరాబాద్ – అంజన్కుమార్ యాదవ్ 45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్ 47. ముథోల్ – ఆనందరావు పటేల్ 48. బెల్లంపల్లి – గడ్డం వినోద్కుమార్ 49. ఇల్లెందు – కోరం కనకయ్య 50. చొప్పదండి – మేడిపల్లి సత్యం 51. నారాయణపేట – ఎర్ర శేఖర్ 52. రామగుండం – రాజ్ఠాకూర్ 53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్రెడ్డి 54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి 55. నిర్మల్ – శ్రీహరిరావు 56. భువనగిరి – కుంభం అనిల్కుమార్రెడ్డి 57. పెద్దపల్లి – విజయరమణారావు 58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి 59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ 60. మహబూబ్నగర్ – యెన్నం శ్రీనివాస్రెడ్డి 61. ఇబ్రహీంపట్నం – మల్రెడ్డి రంగారెడ్డి 62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు 63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్రెడ్డి 64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్ 66. తాండూర్ – వై.మనోహర్రెడ్డి 67. సిరిసిల్ల – కేకే మహేందర్రెడ్డి 68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్రెడ్డి 69. మల్కాజ్గిరి – మైనంపల్లి హన్మంతరావు 70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె) -
రావణుడిగా రాహుల్ మార్ఫింగ్ ఫోటో.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ ఫోటోలను మార్ఫింగ్ చేసి రావణుడిగా చిత్రీకరించి.. బీజేపీ నేతలు సోషలో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చదవండి: 15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర! -
ఇక టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం లేనట్టే
-
ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: హరీష్ రావు
-
‘కాంగ్రెస్ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’
హైదరాబాద్: వారంటీ లేని కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే కొడుకేమే పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రేవంత్రెడ్డి. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి,తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు. తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ… https://t.co/8UceqyxnLD — Revanth Reddy (@revanth_anumula) September 30, 2023 చదవండి: నేను పురుషులకంటే మెరుగ్గానే పనిచేస్తా: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
ఖరారుకు ముందే తకరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చేదీ ఇంకా ఖరారుకాక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారయ్యాయని భావిస్తున్న స్థానాల గురించిన సమాచారం బయటికి వస్తుండటంతో అసంతృప్తులు గళం విప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, లంబాడీ, ఆదివాసీ, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీకి బీసీ నేతలు ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని.. వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతోపాటు ఇప్పుడు హస్తిన బాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా.. ఆయన బెంగళూరులో ఉండటంతో వీలుకాలేదు. అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు.. గురువారం ఖర్గేను, వీలుంటే రాహుల్ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి, వారిని టికెట్ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీల్లో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో.. తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాకు మరో మూడు సీట్లివ్వండి ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40–50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 12 అసెంబ్లీ సీట్లకుతోడు కనీసం మరో 3 జనరల్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా లంబాడా, కోయ (ఆదివాసీ) సామాజిక వర్గాలకు ఏయే సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోథ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని.. ఆసిఫాబాద్లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని.. జనాభా ప్రాతిపదికన మరో మూడు జనరల్ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. బుజ్జగింపులు షురూ అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేను రంగంలోకి దింపింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాందీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్ వచ్చినా, రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ, ఇటు ఆందోళనతోనూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోచోట పది మంది.. కాంగ్రెస్ టికెట్ల కోసం పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు గట్టిగానే యత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబీయింగ్ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోవాలని కొందరు, పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరున్నట్టు సమాచారం. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది? దాన్ని చల్లార్చే యత్నాలు ఏమేరకు గట్టెక్కుతాయి? టికెట్లు రాక రోడ్డెక్కేనేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
కాంగ్రెస్లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. -
విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి. ఇక ఈరోజు (శనివారం) సాయంత్రం తాజ్కృష్ణ హోటల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హోటల్లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ cwc సమావేశం తర్వాత కానీ, రేపు సమావేశం ముందు కానీ అగ్ర నేతల సమయాన్ని భట్టి చేరకలుఉ ండనున్నాయి. పార్టీలో చేరనున్న నాయకులను సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పీసీసీ సమాచారం ఇచ్చింది. చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక -
రెండో రోజు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చే హామీల కూర్పుపై టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ వరుసగా రెండోరోజు సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన బుధవారం గాంధీభవన్లో జరిగిన ఈ సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు హాజరై మేనిఫెస్టోలో పొందుపర్చా ల్సిన అంశాలపై చర్చించారు. కాగా, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ ఫోరం ప్రతినిధులు గాంధీభవన్కు వచ్చి మేనిఫెస్టో కమిటీతో చర్చించారు. తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన, రాష్ట్రంలో చేపట్టాల్సిన కులగణన వంటి అంశాలపై కమిటీకి పలు సూచనలందించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్ గడ్డం ప్రసాద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు చార్జిషీట్ కమిటీ సమావేశం టీపీసీసీ చార్జిషీట్ కమిటీ భేటీ గురువారం గాంధీభవన్లో కమిటీ చైర్మన్ సంపత్కుమార్ అధ్యక్షతన జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జెట్టి కుసుమకుమార్ అధ్యక్షతన టీపీసీసీ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశం జరగనున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణలోనూ ‘గృహలక్ష్మి’?
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ల వర్షం కురిపించిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 17వ తేదీన తుక్కగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ఈ పథకాన్ని సోనియా గాంధీ చేత ప్రకటింపజేయాలని యోచిస్తోంది. కుటుంబ యజమాని హోదాలో ప్రతి మహిళకు నెలకు రూ.2వేల నగదు సాయం చేయడం ద్వారా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు అండగా నిలుస్తామని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా హిమాచల్ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల సంప్రదాయాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలలో ఏయే పథకాలను ప్రకటించాలన్న దానిపై టీపీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఓటు బ్యాంకు బ్రేక్ చేయాల్సిందే..! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వరుసగా మూడోసారి బీఆర్ఎస్కు ఓటేయాల్సి రావడం కూడా ప్రజలను ఆలోచింప చేస్తోందని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, పింఛన్, రైతుబంధు, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలు పెద్ద స్థాయిలోనే లబ్ధి పొందుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలు పెద్దగా పట్టని గ్రామీణ మహిళా లోకం ఆలోచనలు ఎలా ఉంటాయనే గుబులు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రూ.500కే గ్యాస్సిలిండర్ ఇస్తామని ప్రకటించడం ద్వారా మహిళలను ఆకర్షించాలని భావించింది. అయితే, ఈ కార్యక్రమం అమలు కోసం నిన్న మొన్నటి వరకు రూ.1,100 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కు ఇవ్వాలంటే ఆ మేరకు రూ.600 నగదు బదిలీ జరగాల్సి ఉంటుంది. ఎలాగూ నగదు బదిలీ చేయాల్సినందున కర్ణాటక తరహాలో రూ.2వేల నగదు సాయం అందించే గృహలక్ష్మి లాంటి పథకాన్ని ప్రకటిస్తే గంపగుత్తగా మహిళల ఓట్లు పొందే అవకాశముందని భావిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కచ్చితంగా బ్రేక్ చేయవచ్చనే ఆలోచనతోనే ఈ పథకాన్ని గ్యారంటీ కార్డు స్కీంలలో పొందుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఇక, రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, నెలకు రూ. 4 వేల పింఛన్ పథకాలను ఐదు స్కీంలలో చేరుస్తామని, మిగిలిన రెండింటిలో ఒకటి బీసీ వర్గాలకు, మరొకటి మైనార్టీ వర్గాలకు లేదంటే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రకటించే అవకాశముందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూ. లక్ష కోట్ల పైనే ఆదా చేయొచ్చు.. దీనిపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రూ.లక్ష కోట్లు పెట్టారు. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ డబ్బులన్నింటినీ సంక్షేమ పథకాలకు అమలు చేస్తే ఐదేళ్లు సంక్షేమ పాలన వర్ధిల్లుతుంది. వీటికి తోడు సెక్రటేరియట్కు పెట్టిన రూ.1,500 కోట్లు, మిషన్భగీరథకు వెచ్చించిన రూ.45 వేల కోట్లు... ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మరో లక్ష కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు. ఆ నిధులతో సంక్షేమాన్ని డబుల్ ఇంజిన్తో ముందుకు తీసుకెళ్లవచ్చు. పథకాలను ఆషామాషీగా ప్రకటించడం కాంగ్రెస్కు అలవాటు లేదు. నాడు రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ నుంచి నేటి కర్ణాటక పథకాల అమలు వరకు కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది. అన్ని లెక్కలు కట్టిన తర్వాతే ఈ పథకాలపై ప్రజలకు హామీ ఇస్తున్నాం. అందుకే తుక్కుగూడ సభలో సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ స్కీంలపై హామీ ఇప్పించబోతున్నాం. సోనియా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఎలా ఇచ్చారో ఈ హామీలను కూడా అలాగే నిజం చేస్తామనే భరోసా ప్రజల్లో కల్పిస్తాం.’ అని వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా? కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు అమల య్యేవి కావని, అధికారంలోకి వచ్చే అవకాశా లు లేనందునే రోజుకో డిక్లరేషన్ను ప్రకటిస్తు న్నారని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అర్థం లేకుండా పథకాలు ప్రకటిస్తున్నారని, ఇవన్నీ ఇచ్చాక అభివృద్ధి ఎలా చేస్తారనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఇందుకు దీటైన సమాధానం తమ దగ్గర ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము మొదటి నుంచీ ఆరోపిస్తున్న విధంగా పాలనలో అవినీతిని నిర్మూలించి, రిటైరయిన వారికి నామినేటెడ్ పదవుల పేరిట కోట్ల రూపాయల జీతాలను నివారిస్తే తమ పథకాల అమలు అసాధ్యమేమీ కాదని వారంటున్నారు. అలాగే పథకాల అమలులో పారదర్శకతతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకుంటే ఆయా పథకాలను ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చని చెబుతున్నారు. -
T Congress: అంతా హైకమాండ్ కంట్రోల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది. తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం! గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది. -
తాజ్ కృష్ణలో ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
నేడు మరోసారి భేటీకానున్న టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ
-
పేర్లు చూసి టిక్కు పెట్టాలా?..నామ్ కే వాస్తే లిస్ట్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోతపై మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాడీవేడిగా జరిగింది. సీనియర్ నేతలు కొందరు పలు అంశాలపై సందేహాల పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన ఆశావహుల జాబితాలో పేర్లు తప్ప ఎలాంటి సమాచారం లేకపోవడంపై జానారెడ్డి, జీవన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలేవీ లేకుండా కేవలం జాబితా ఇచ్చేసి టిక్కులు పెట్టమంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ టికెట్ల అంశంపై సీనియర్ నేతల మధ్య వాగి్వవాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీఈసీ వడపోత కార్యక్రమాన్ని సెపె్టంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేతృత్వంలో గాం«దీభవన్లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జీవన్రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బలరాం నాయక్, సంపత్కుమార్, వంశీచందర్రెడ్డి, ప్రేంసాగర్రావు, సునీతారావ్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావు, మిద్దెల జితేందర్లు పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారులో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి, ఇతర పారీ్టలతో పొత్తులు తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు. పేర్లిస్తే సరిపోతుందా? విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులందరికీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున టిక్ చేయాలని కోరారు. అయితే జాబితాలో కేవలం పేర్లు మాత్రమే ఉండటంపై జీవన్రెడ్డి, జానారెడ్డి, పొన్నాల తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు? అనే వివరాలు కూడా లేకుండా అభ్యర్థులను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఆశావహుల సీనియార్టీ, పారీ్టలో హోదా, పూర్వ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవ, కులం లాంటి వివరాలేవీ లేకుండా కేవలం పేర్లు చూసి టిక్ పెట్టాలంటే ఎలా పెడతామని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి, పొన్నాల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల విశ్లేషణ లేకుండా, ఏ ప్రాతిపదికన ఏ కులానికి టికెట్లు ఎన్ని ఇవ్వాలో నిర్ధారించకుండా, ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల ఓటర్లను అంచనా వేయకుండా టిక్కులు చేయడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నించారు. ఆశావహుల పూర్తి వివరాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సామాజిక వివరాలు ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర సర్వే వివరాలను కానీ, ఇప్పటికే ఏఐసీసీకి పంపిన వివరాలను కానీ జత చేయాలని పొన్నాల సూచించారు. యూత్కు ఎన్ని టికెట్లు? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చే టికెట్లను తొలి జాబితాలోనే ప్రకటించాలని అన్నారు. నియోజకవర్గాల్లో పని చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, ఎన్నికల్లో అన్ని విధాలా వారికి సాయం చేయాలని సూచించారు. యువకులకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే పక్షంలో తన కుమారుడు కూడా యూత్ కాంగ్రెస్లో చురుగ్గా పని చేస్తున్నందున తనతో పాటు తన కుమారుడికి అవకాశం కలి్పంచాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కోరారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని వీహెచ్, మహిళలకు తగిన అవకాశాలు కలి్పంచాలని రేణుకా చౌదరి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని, సెప్టెంబర్ 2న మరోమారు సమావేశమై అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించి వడపోత చేపట్టాలని పీఈసీ నిర్ణయించింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలనే అంశాలపై వచ్చే నెల 2న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని పీఈసీ నిర్ణయించింది. బీఆర్ఎస్కు కౌంటర్ వ్యూహం ఉండాలి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిపోయిందని, దళిత బంధు లాంటి పథకాల ద్వారా కొత్తగా నియోజకవర్గానికి మరో 10 వేల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటోందని, ఈ ఓటు బ్యాంకును కౌంటర్ చేసేలా పార్టీ వ్యూహం ఉండాలని, వీలున్నంత త్వరగా అభ్యర్థుల వడపోత ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పినట్లు సమాచారం. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని ఏఐసీసీని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తొలి జాబితా: మహేశ్కుమార్గౌడ్ సమావేశానంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్టు చెప్పారు. దరఖాçస్తుదారుల అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించేందుకు సెపె్టంబర్ 2న పీఈసీ మరోమారు సమావేశమవుతుందని తెలిపారు. 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, కమిటీ చైర్మన్ మురళీధరన్తో పాటు సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని స్థాయిల్లోని నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని చెప్పారు. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారి పేర్లు ఉండాలని పీఈసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పొత్తు పొరపాట్లు చేయొద్దు ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్తో పాటు ఇతర పారీ్టలతో పొత్తుల అంశంపై కూడా పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ‘గతంలో లాగా ఒక పార్టీ నుంచి ఇంకో పారీ్టకి ఓట్ల బదిలీ జరగడం లేదు. మనం పొత్తుల పేరుతో వెళ్లి సీట్లు త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అని వారు చెప్పినట్టు తెలిసింది. 60 చోట్ల భారీగా దరఖాస్తులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిస్తే.. 60 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 45 నియోజకవర్గాల్లో 10 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 5 నియోజకవర్గాల్లో 9 చొప్పున, 10 నియోజకవర్గాల్లో 8 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, జగిత్యాలలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా, మిగిలిన చోట్ల 2 నుంచి 7 వరకు వచ్చాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 32 దరఖాస్తులు రావడం గమనార్హం. -
టీపీసీసీకి దామోదర రాజనర్సింహ కమిటీ రిపోర్ట్