-
దర్శనాల కోసం దళారులను సంప్రదించొద్దు
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం దళారులను సంప్రదించవద్దని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఫోన్ నంబర్లతో కూడిన సమాచారంతో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు టీటీడీ కొన్ని టికెట్లను కేటాయించింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలియజేసింది. టూరిజం విభాగాల ద్వారా రావాలనుకునే భక్తులు నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు టూరిజం వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇస్తామని చెప్పి భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. -
భారత్లో జెన్జెడ్లు..థాయ్లాండ్ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్లాండ్కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్బీఎన్బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్లు థాయ్లాండ్లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్లాండ్ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్లాండ్కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్బీఎన్బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్బీఎన్బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో జెన్జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్లాండ్తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్లాండ్లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్బీఎన్బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
‘క్రూయిజ్’కు పెరుగుతున్న క్రేజ్
సాక్షి, అమరావతి: పర్యాటకుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆసక్తి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికల ఫలితంగా క్రూయిజ్ పర్యాటకం దేశంలో ఆల్టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల మంది క్రూయిజ్లో ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం. ఇది కరోనా ముందు 2019–20లో 4.20 లక్షల మంది క్రూయిజ్ ఫుట్ఫాల్తో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. ఈ క్రమంలోనే 2041 నాటికి 40లక్షల మందిని క్రూయిజ్లో పర్యటించేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.లోతైన సముద్ర క్రూయిజ్లు, తీర ప్రాంత క్రూయిజ్లు, రివర్ క్రూయిజ్లు, యాచ్ క్రూయిజ్లలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.45 వేల కోట్ల పెట్టుబడితో రివర్ క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం కోర్డెలియా, కోస్టా క్రూయిజ్ వంటి క్రూయిజ్ లైన్లు ప్రస్తుతం అరేబియా సముద్రంలో దేశీయ విహార యాత్రలను నిర్వహిస్తున్నాయి.దేశీయంగా పెరుగుదల..గడిచిన ఆర్థిక సంవత్సరంలో 80 శాతం మంది దేశీయంగానే ప్రయాణించారు. ఇందులో 29వేల మంది మాత్రమే అంతర్జాతీయ పర్యటనలు చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం ఇంకా కోవిడ్కు మునుపటి స్థాయిలో చేరకపోవడంతో విదేశీ పర్యాటకులు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ పర్యాటకులలో క్రూయిజ్లకు ఆదరణ పెరుగుతోంది. 2019–20లో 50 శాతం దేశీయ, 50 శాతం అంతర్జాతీయ క్రూయిజ్ పర్యటనలు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే తాజాగా దేశీయ పర్యాటకులు దాదాపు 85శాతం పెరిగారు. సింగపూర్ వంటి దేశాలలో క్రూయిజ్ పరిశ్రమకు భారతీయ పర్యాటకులు కీలకంగా ఉన్నారు. అయితే అబుదాబి కూడా భారతీయ పర్యాటకులను తన క్రూయిజ్ ఆఫర్లకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.క్రూయిజ్ పర్యటనలు ఇలా..ముంబై, గోవా, న్యూ మంగళూరు, కొచ్చి, విశాఖ పోర్టులకు అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ల రాక పెరుగుతోంది. దేశీయ క్రూయిజ్లు ముంబై–గోవా, ముంబై–డయ్యూ, ముంబై–కొచ్చి, ముంబై–లక్ష ద్వీప్, ముంబై–హై సీస్, చెన్నై–వైజాగ్ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. నది క్రూయిజ్ టూరిజం కోసం తొమ్మిది జలమార్గాలను గుర్తించారు. వాటిలో గంగానదిపై వారణాసి–హలి్దయా, బ్రహ్మపుత్రలోని ధుబ్రి–సాదియా మార్గాలున్నాయి. గుజరాత్ తీర్థయాత్ర పర్యటనలు, పశ్చిమ తీర సాంస్కృతిక, సుందరమైన పర్యటనలు, సౌత్ కోస్ట్ ఆయుర్వేద వెల్నెస్ పర్యటనలు, తూర్పు తీర వారసత్వ పర్యటనలు వంటి థీమ్–ఆధారిత పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.అందుబాటులో విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్..దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం అందుబాటులో ఉంది. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులకు విశేష సేవలందిస్తోంది. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సుమారు 2వేల మంది ప్రయాణికులకుపైగా సామర్థ్యం ఉన్న నౌకలకు వసతి కల్పిస్తోంది. -
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
మా మనమడు మొదటిసారి కాలేజీలో చేరుతున్న సందర్భంగా కుటుంబంతో కలిసి నేనూ జనవరి మొదటి వారంలో లబ్బాక్ ( Lubbock )లోని టెక్సస్ టెక్ ( Texas Tech ) యూనివర్సిటీకి కారులో షికారులాగా బయలుదేరాం. లబ్బాక్ ఏమిటీ అందం చందం లేని పేరు అన్నాను మా మనవరాలితో. ఆమె వెంటనే పొంగిపోతూ చెప్పిన సమాధానం ‘ తాతా ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ అఫ్ ఫేమస్ రాక్ ఎన్ రోల్ లెజెండ్ బడ్డీ హోలీ ( Buddy Holly )’ అని. ఏమిటో ఏది అడిగినా మ్యూజిక్ భాషలోనే జవాబు చెబుతుంది అనుకున్నాను మనసులోనే. ఎటు చూసినా అంతా హిస్పానిక్భూమి కొరత లేని దేశం యూఎస్. టెక్సస్ టెక్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణమే దాదాపు రెండువేల ఎకరాల్లో ఉంది. అయినా ఓపిక చేసుకొని కొన్ని ముఖ్యమైన భవనాలు తిరిగి చూసాము. ఎటు చూసినా అంతా హిస్పానిక్ వాతావరణం, ఇందులో చదువుకునే అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది హిస్పానిక్స్నేట. అందుకే దీన్ని హిస్పానిక్ సర్వీసింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. మా వాడు చేరింది ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ రోజంతా ప్రాక్టీస్ చేసేది మాత్రం చెస్. క్రియేటివ్ సిటీగా..మరునాడు మా కారు న్యూ మెక్సికో రాజధాని ‘సాంత ఫె ( Santa fe )’ వెళ్ళింది. అక్కడి మారియేట్ హోటల్లో మా బస. సాంత ఫె ఒకప్పటి ( 1610 ) స్పానిష్ వాళ్ళ కాలనీ , సాంగ్రెడ్ క్రిస్టో పర్వతాల దగ్గరున్న 400 సంవత్సరాల నాటి పట్టణం. అన్నీ పూబ్లో స్టైల్ నిర్మాణాలు. అవి కళాసంస్కృతులకు ప్రసిద్ధి గాంచినవి. అందుకేనేమో యునెస్కో దీన్ని ఒక ‘ ప్రపంచ స్థాయి క్రియేటివ్ సిటీ ’ గా గుర్తించింది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా మార్చ్ నెలలో వస్తారట.మేము కొంచెం ముందే వెళ్ళాం. ఎంతైనా మంచు ప్రాంతం కదా చలి ఎక్కువగానే ఉంది. నాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమే. అయినా ఆ చలిని లెక్కచేయకుండా 5 వ తేదీ నాడు అందరితోకలిసి సాంత ఫె సమీపంలో నేనూ స్కీయింగ్ చేశాను. మావాళ్లు హెచ్చరిస్తున్నా పర్వాలేదు అని ప్రత్యేక పొడుగు చెక్క పాదుకలు ( Long flat runners అవే skis ) షూతో కలిపి వేసుకొని రెండుసార్లు జారిపడ్డా ఏమీ కానట్టు నవ్వుతూ, పడిలేచిన కెరటంలా లేచి, ఆ ఐస్ మీద చిన్నప్పుడు బడిలో జారుడు బండ ఆడినట్టు సరదాగా జారుతూ పిల్లలతో ఔరా! అనిపించుకున్నా. చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్మా విహారయాత్ర చివరి రోజు మేము సాంత ఫెలో చూసింది ఓ చిత్ర విచిత్రమైన ఎగ్జిబిషన్ ‘మియో వోల్ఫ్ ’ ( Meo wolf ). ఇక్కడ అడుగు పెట్టగానే మాకు స్వాగతం చెప్పింది ఓ రాక్షసాకార రోబోట్. ఈ మ్యూజియంలోకి ప్రవేశించిన వారు ఈ భూలోకాన్ని మరిచి ‘మరో ప్రపంచం’లోకి ( శ్రీ శ్రీ చెప్పింది కాదు సుమా ! ) వెళ్ళిపోతారన్నారు. దాదాపు వంద మంది కళాకారులు సృష్టించిన విద్యుత్ వెలుగుల వింత ప్రపంచం ఇది. ఆర్ట్ & టెక్నాలజీ రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనశాలను చూస్తే అర్థమౌతుంది. మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇలాంటిది పెడితే సంవత్సరం పొడుగునా జనం వచ్చి చూసి ఆనందిస్తారు కదా! అనిపించింది. House of Eternal Returnగా వర్ణించిన ఈ రంగుల ప్రపంచంలో ఒక పూట గడిపి ఎట్లాగయితేనేం బయటపడ్డాం. నాలుగు రోజులకే లాడ్జింగ్, హోటల్ లతో విసుగెత్తి , ఇంటిమీద బెంగ పెట్టుకొని డాలస్ బాట పట్టాం ! వేముల ప్రభాకర్(చదవండి: మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?) -
నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
విజయవాడ కృష్ణా నదిలో ‘సీ ప్లేన్’ ఎక్కి నేరుగా కాకినాడ వద్ద దిగాలనుకుంటున్నారా.. లేదా విశాఖ రుషికొండ నుంచి బయలుదేరి నేరుగా కోనసీమ వెళదామనుకుంటున్నారా.. బహుశా మీ కల త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, మాల్దీవుల వంటి దేశాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి గాంచిన ‘సీ ప్లేన్’లు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ–కాకినాడ, కాకినాడ– రుషికొండ, కోనసీమ–విశాఖపట్నం, రుషికొండ–లంబసింగికి హాయిగా సీ ప్లేన్లో రయ్యిన దూసుకుపోయే అవకాశం కలుగుతుంది. తొలి దశలో ప్రతిపాదించిన 40 నిమిషాల ప్రయాణ షెడ్యూల్ విజయవాడ–కాకినాడ, కాకినాడ–రుíÙకొండ, రుషికొండ–లంబసింగి, లంబసింగి–రుషికొండ, రుషికొండ–కోనసీమ, కోనసీమ–విశాఖపట్నం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక గమ్యస్థానాల మధ్య దూరాన్ని చెరిపేసేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. అపార జలవనరుల మీదుగా ఆకాశంలో విహరిస్తూ సహజసిద్ధ పర్యాటక అందాలను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలోకి ‘సీ ప్లేన్’ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలను ఒకదానికొకటి అనుసంధానించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘సీ ప్లేన్’ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి దశలో 9–10 మంది ప్రయాణ సామర్థ్యంతో ఆరు ప్రాంతాల్లో రెండు ‘ఫ్లోటింగ్ ఎయిర్ క్రాఫ్ట్’లు నడిపేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు చేసింది. ప్రయాణికుల ఆసక్తికి అనుగుణంగా 19–20 సీట్లు ఉండే సర్విసులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా డిమాండ్.. ‘సీ ప్లేన్’ సేవలపై అంతర్జాతీయంగా పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. మాల్దీవుల పర్యాటకంలో ఫ్లోటింగ్ ఎయిర్క్రాఫ్ట్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, కెనడాలోనూ పెద్ద సంఖ్యలో సీ ప్లేన్లు పని చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో 48 శాతం సీ ప్లేన్ సేవలు నడుస్తున్నాయి. ఆ తర్వాత కెనడాలో 34 శాతం, ఐరోపాలో 8 శాతం, ఆ్రస్టేలియాలో 4 శాతం, ఇతర ప్రాంతాల్లో 6 శాతం సేవలు అందిస్తున్నాయి. కాగా, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. హోటళ్లు, పర్యాటక ప్రాంతాలకు గంట దూరంలోనే విమాన సేవలుండాలనే ప్రాథమిక అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. అందుకే సీ ప్లేన్ సేవలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించాం. ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని నీటి వ్యవస్థలను సీ ప్లేన్లకు ల్యాండింగ్ గ్రౌండ్గా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేస్తాం’ అని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్లో 26 శాతం, ఉత్తరప్రదేశ్లో 24 శాతం, బీహార్లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిగొచ్చిన మాల్దీవ్స్.. ప్లీజ్ అంటూ భారత్కు అభ్యర్థన
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో.. అక్కడి పర్యాటకం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత్ను బతిమాలడం మొదట్టింది. తమ దేశ పర్యాటకంలో మళ్లీ భాగం కావాలని మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్ను కోరారు. సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మాక్కూడా ఓ చరిత్ర ఉంది. మాల్దీవుల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్యానికి భారత్తో కలిసి పని చేయాలని ఉంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాం. భారత్ నుంచి వచ్చేవారికి మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతుంది. దయ చేసి భారతీయులు మాల్దీవుల పర్యాటకంలో తిరిగి మళ్లీ భాగం కావాలని కోరుతున్నా. మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యటకం ఆధారపడి ఉంటుంది’ అని ఇబ్రహీం ఫైసల్ భారత్ను కోరారు.ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ మంత్రల వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఇక నుంచి తాము మాల్దీవుల పర్యటన రద్దు చేసుకుంటామని పలువురు భారతీయ ప్రముఖులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి మాల్దీవులు పర్యాటకం దెబ్బతింది. మరోవైపు.. చైనా అనుకూల వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు విధానాల వల్ల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లో ఉన్న భారతీ సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని మొయిజ్జు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో కొంత మంది సైనికులు భారత్కు వచ్చారు. -
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగాఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకాశంలో అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. ఖగోళ శాస్త్ర వెంచర్ డార్క్ స్కై ప్రిజర్వేషన్ పాలసీని రూపొందించడం, ఏడాది పొడవునా ప్రాంతమంతటా అమలు చేయనుంది. దీనిపై ప్రచారం అవగాహన కల్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. వాలంటీర్లను ,డార్క్ స్కై అంబాసిడర్లనుతయారు చేస్తుంది. అంతేకాదుఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీ కూడా నిర్వహిస్తుంది. రాత్రి ఆకాశంలోని అందాలను ఫోటో తీసిన వారికి ఆకర్షణీయమైన రివార్డులు కూడా అందిస్తుంది.అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా 'నక్షత్ర సభ'ను తీసుకొచ్చింది. ఇందులో స్టార్ గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్లో ప్రారంభమవుతుంది.ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు, లడఖ్లోని పాంగోంగ్ సరస్సు వద్ద, సందర్శకులు పగటిపూట సరస్సు అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తారు. రాత్రి వేళలో,స్థానికులు వారి సంప్రదాయాలు , జానపద కథలను పంచుకుంటూ నక్షత్రరాశులను గుర్తించడానికి వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలోని ప్రముఖ ఆస్ట్రో-టూరిజం కంపెనీ స్టార్స్కేప్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్లతో పాటు నిపుణులతో సెమినార్లు, వెబ్నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. -
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
ఖైదీలా కాకుండా టూరిస్ట్గా సందర్శించే జైళ్లు ఇవే!
ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి. ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. తీహార్ జైలు, ఢిల్లీ భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు. సంగారెడ్డి జైలు, హైదరాబాద్ హైదరాబాద్లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట. వైపర్ ఐలాండ్, అండమాన్ ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు. (చదవండి: మహారాజ్ ప్యాలెస్లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
Fact Check: పర్యాటకంపై రామోజీ నాటకం
సాక్షి, అమరావతి : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈనాడు రామోజీరావు. నిత్యం తన క్షుద్ర పత్రికలో వండివారుస్తున్న అశుద్ధ కథనాలు చూసి పాఠకులు ఛీకొడుతున్నా ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా బాబు పల్లకిని మోయడమే పనిగా పెట్టుకున్నారు. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు కథనాలతో అప్పట్లో ప్రజల్ని మభ్యపెట్టిన బాబు మాదిరిగా రామోజీ కూడా ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు రంగరించి తన ఈనాడులో అభూతకల్పనలను అచ్చోస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో టూరిజం రంగంపై ఆయన కక్కింది కూడా అక్షరాల విషమే. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినా.. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘లేపాక్షి’ ఘనత సాధించినా.. అలాగే, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాత్కాలిక జాబితాలోనూ ఏపీ చోటు దక్కించుకున్నా.. విశాఖలోని రుషికొండ బీచ్కు వరల్డ్ ఫేమస్ ‘బ్లూఫ్లాగ్’ సర్టిఫికేషన్ రావడంతో అక్కడ వరుసగా నాలుగేళ్లుగా బ్లూఫ్లాగ్ జెండా రెపరెపలాడుతున్నా.. అలాగే.. గతేడాది జీఐఎస్ సదస్సుల్లో ఏకంగా రూ.17వేల కోట్లకు పైగా పెట్టుబడులు పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తినా బాబు జాకీ లిఫ్టర్ రామోజీకి ఇవేమీ కనపడవు. నిజానికి.. ఇదంతా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక పాలసీని సీఎం వైఎస్ జగన్ తీసుకురావడంవల్లే పెట్టుబడిదారులు క్యూ కట్టారనేది ఎవరూ కాదనలేని సత్యం. కరోనా రెండేళ్ల కాలం మినహా.. మిగిలిన మూడేళ్లలోనే ఇది సాధ్యపడింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఏపీ పర్యాటకానికి దక్కిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ పర్యాటకం మొత్తం ఏపీ వైపు చూస్తుంటే.. కళ్లకు టీడీపీ గంతలు కట్టుకున్న గురవింద రామోజీ మాత్రం కళ్లుండీ కబోదిలా నటిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచిని చెప్పకపోగా.. ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశాన్ని భుజానకెత్తుకుని టన్నుల కొద్దీ అసత్యాలతో ‘ఈనాడు’లో నింపి పారేస్తున్నారు. ఇందులో భా గమే శుక్రవారం ‘పర్యాటకం.. పక్కా నాటకం’ అంటూ ఈనాడు వండిన ఓ ఫక్తు నాటకీయ కథనం. అప్పట్లో బీచ్లలో అశ్లీలత ప్రోత్సాహానికి కుట్ర ఇక అప్పట్లో పర్యాటకం ముసుగులో చంద్రబాబు సంప్రదాయలకు పాతరేశారు. విశాఖ బీచ్లో లవ్ ఫెస్టివల్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే కుట్రకు తెరతీశారు. దీనిపై ప్రజలు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే రామోజీకి పర్యాటకాభివృద్ధిగా కనిపిస్తుందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. చంద్రబాబు బీచ్లను బహిరంగ అశ్లీలతకు వాడుకోవాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 288 బీచ్లను గుర్తించి అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి కోస్టల్ జోన్ టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. కానీ, చంద్రబాబు ప్రచార పిచి్చతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేయడాన్ని రామోజీ ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. రికార్డు స్థాయిలో ఏపీటీడీసీ ఆదాయం.. ప్రపంచ పర్యాటకం మొత్తం కరోనాతో కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. ఏపీటీడీసీ ఆదాయాన్ని టీడీపీ ఐదేళ్ల పాలనతో పోలిస్తే రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2022–23లో ఏకంగా రూ.162.25 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22తో పోలిస్తే 10.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం గమనార్హం. మరి రామోజీ చెబుతున్న పర్యాటకం కుంటుపడితే ఒక్క హరిత హోటళ్లు, బోటింగ్ ద్వారా ఇంత వృద్ధి ఎలా సాధ్యపడుతుందో రామోజీనే చెప్పాలి. మరోవైపు.. నాస్తికత్వపు వాసనలు పోని రామోజీ టీటీడీ టూర్ ప్యాకేజీలపైనా విషం చిమ్మారు. సెంట్రలైజ్డ్గా అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తమ రవాణా మార్గాల్లో సేవలందిస్తుంటే.. పర్యాటక సంస్థ ఆదాయానికి గండి కొట్టేస్తున్నట్లు ఆయన గుండెలు బాదుకున్నారు. కేంద్రం మెచ్చిన ఏపీ.. ఇక రూ.200 కోట్లతో అరకు, గండికోట అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గండికోట ప్రాంతంలో 4,336 ఎకరాల్లో పర్యాటక సిటీని అభివృద్ధి చేయనున్నారు. అరకు లోయలోనూ సుందర హోటళ్లు, అడ్వెంచర్, ఎకో పర్యాటకానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, విజయవాడ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అహోబిళం, నాగార్జునసాగర్ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రూ.3వేల కోట్ల పనులకు శ్రీకారం.. జీఐఎస్లో చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు రూ.3,049.90 కోట్ల విలువైన సివిల్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి రెడీగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కల్పించేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓ అండ్ ఎం) 87 ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. అప్పట్లో అద్దె సూట్లు తొడిగేసి.. వాస్తవానికి.. చంద్రబాబు హయాంలో ప్రచార పిచ్చి పీక్స్లో ఉండేది. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు సదస్సులతో ప్రజలను నిరంతరం మభ్యపెడుతూనే ఉండేవారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో రోడ్ల పక్కన కనిపించిన ప్రతిఒక్కరికీ అద్దె సూట్లు తొడిగేసి మరీ వారికి పెట్టుబడిదారుల కలరింగ్ ఇచ్చేశారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు వారితో దొంగ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా జగమెరిగిన సత్యం. అప్పట్లో పర్యాటక రంగంలో తన అనుయాయులకు తప్ప మిగిలిన ఎవరికీ ఒక్క కాంట్రాక్టు, లేదా ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటే చంద్రబాబు పాలనంతా పైన పటారం లోన లొటారం అనే స్పష్టమైంది. ఇక వీటినే రామోజీరావు గొప్పగా కీర్తిస్తూ పతాక శీర్షకల్లో బాబుకు నిర్లజ్జగా భజన చేసి ప్రజలను దగా చేశారు. కానీ, సీఎం జగన్ దార్శనిక పిలుపుతో గతేడాది విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (జీఐఎస్)లో మొత్తం రూ.13.11 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఒక్క పర్యాటక రంగంలోనే 117 ఒప్పందాల ద్వారా రూ.17,127 పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 39,170 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రణాళిక రచించారు. కానీ, చంద్రబాబు దొంగ ఒప్పందాలను అడ్డగోలుగా కీర్తించిన అదే రామోజీరావు.. సీఎం జగన్ పాలనలో వాస్తవాలకు పాతరేస్తూ దు్రష్పచారానికి తెగబడడం సిగ్గుచేటు. ఆతిథ్య ఆంధ్ర.. మరోవైపు.. సీఎం జగన్ సారథ్యంలో ఆతిథ్య రంగం అభివృద్ధి బాట పడుతోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్ రంగ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్తో పాటు దేశీయ సంస్థలైన గార్రిసన్ కన్స్ట్రక్షన్, మేఫెయిర్ హోటళ్లు వచ్చాయి. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో ఈ రంగంలో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్పటికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యా యి. ఇక్కడ శంకుస్థాపనలు జరగ్గా త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 11వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతిలో నోవోటెల్ సంస్థ రూ.125 కోట్లతో మూడువేల మందికి ఉపాధి, విశాఖపట్నలో మేఫెయిర్ సంస్థ రూ.525 కోట్లతో, మరో రూ.404 కోట్లతో హయత్ రీజెన్సీ ఫైవ్స్టార్ హోటళ్లు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే విజయవాడలో సుమారు రూ.100 కోట్లతో హయత్ న్యూ లగ్జరీ స్టార్ హోటల్, గుంటూరులో ఐటీసీ హోటళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. చంద్రబాబు హ యాంలో ఇలాంటి అభివృద్ధి లేకపోగా విదేశీ యులను తీసుకొచ్చి పర్యాటకంలో విపరీతమై న దుబారా ఖర్చులు చేశారు. బహుశా రామోజీకి రూపాయి రాక కంటే.. రూపాయి ఖర్చుచేయడమే అభివృద్ధిగా కనిపించినట్లుంది. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్వేస్కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్లుక్ను ప్రకటించింది. -
మారిషస్ను మాల్దీవుల అనుకున్న నెటిజన్లు.. ‘ఎక్స్’ పోస్టులు వైరల్
భారత్-మాల్లీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్యదీప్ను పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి అందాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. మాల్దీవుల మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు భారత దేశంలోని ప్రముఖులంతా మాల్దీవుల కంటే.. స్వదేశానికి చెందిన లక్ష్యదీప్, అండమాన్ ద్వీపాలకు పర్యటనకు వెళ్లాలని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి విదితమే. భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో మారిషస్ ద్వీప దేశం భారతీయ పర్యటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘మరిషస్ టూరిజం(ఇండియా)’ ‘ఎక్స్’ (ట్విటర్)లో భారతీయ పర్యటకులు తమ దేశంలోకి రావాల్సిందిగా స్వాగంతం పలికింది. ‘మారిషస్లోని అందాలను అన్వేషించటం కోసం భారతీయులకు స్వాగతం. 2024 ఏడాదిలో మారిషస్ ద్వీపాన్ని సందర్శించండి. అక్కడి అందాలను చూసి కొత్త శక్తి, అనుభూతిని ఆస్వాధించండి. టన్నుల కొద్ది సాహసాలు, అనుభవాలు మీ కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ రోజు మీ హాలీ ట్రిప్ను ప్లాన్ చేసుకోండి!’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానీ, భారతీయ నెటజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. మారిషస్ ద్వీపాన్ని పలువురు భారతీయ నేటిజన్లు మాల్దీవులగా పొరపాటు పడ్డారు. ‘మాల్దీవులపై మాకు ఆసక్తి లేదు. మాకు లక్ష్యదీప్ ఉంది’, ‘ మీరు మా ప్రధానమంత్రిని అవమానించారు. అందుకే మేము మీ దేశాన్ని పర్యటించము’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన మారిషస్ టూరిజం.. ‘హాయ్, ఇది మారిషస్ దేశం. మాల్దీవుల ద్వీపం కాదు. రెండు వేర్వేరు ద్వీపాలు’ అని స్పష్టత ఇచ్చింది. వెంటనే నెటిజన్లలో నవ్వులు పూచాయి. మరికొంత మంది నెటిజన్ల స్పందిస్తూ.. మాల్దీవుల కంటే మారిషస్ పర్యటన బాగుటుందని కామెంట్లు చేశారు. ‘ మాల్దీవుల కంటే స్నేపూర్వకంగా ఉండే మారిషస్ పర్యటనకు వెళ్లటం ఉత్తమం’, మాల్దీవుల కంటే మారిషస్ చాలా చాలా మంచి పర్యటక ప్రాంతం’ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు ‘ఎక్స్’ వైరల్ అవుతున్నాయి. -
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
Interim Budget 2024: లక్షద్వీప్కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్లను టూరిస్ట్ హబ్గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్ను కేటాయించారు. సహజమైన బీచ్లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
Maldives: తగ్గిన భారత్ టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా
మాలె: భారత్, మాల్దీవుల వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకంలో భారత్ వాటా తగ్గిపోయింది. గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మూడవ స్థానంలో ఉండే భారత్ వివాదం అనంతరం ఐదవ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల టూరిజంలో భారత దేశ వాటా 7.1 శాతంగా ఉండి 3వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో చైనా కనీసం మాల్దీవుల టూరిజంలో అధిక వాటా కలిగిన దేశాల జాబితాలో కనీసం టాప్ టెన్లో కూడా లేదు. అలాంటిది వివాదం తర్వాత మాల్దీవుల టూరిజంలో చైనా, బ్రిటన్ల వాటా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు చైనా మూడవ స్థానానికి, బ్రిటన్ అయిదవ స్థానానికి ఎగబాకాయి. జనవరి 2వ తేదీన ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. దీనిపై మాల్దీవుల మంత్రులు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో భారత పర్యాటకుల్లో చాలా మంది మాల్దీవుల టూర్లు రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు ట్రెండింగ్గా మారింది. ఇదీచదవండి.. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం -
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉద యం 8.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు విశాఖ జిల్లా భీమిలిలో పర్యటన సీఎం జగన్ శనివారం విశాఖ జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
టెంపుల్, ఎకో టూరిజాలతో సర్క్యూట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో ఎకో టూరిజాన్ని కలిపి టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరిగింది. గిరిజనుల లబ్ధికి ఔషధ మొక్కల తోటల పెంపకం చేపట్టండి.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్నో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థికపరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత ఔషధ మొక్కల తోటలను పెంచాలన్నారు. ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ ప్లాంటేషన్లకు సంబంధించి మార్కెటింగ్ను అనుసంధానించాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజానికి హైదరాబాద్వాసుల్లో ఆదరణ ఉందని, ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిత బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, దేవాదాయ కమిషనర్ అనీల్ కుమార్, పీసీసీఎఫ్ డోబ్రియల్ పాల్గొన్నారు. -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
అనంతగిరి అందాలకు కొత్త సొబగులు
వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు బిజీలైఫ్నుంచి ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్లేని ప్రదేశంలోకి వెళ్లిపోవాలని ఆరాట పడుతూ ఉంటారు. అటు అధ్యాత్మికం.. ఇటు ఆహ్లదకరమైన వాతావరణం కలగలిపిన పర్యాటక అందాలకు కేరాఫ్ అడ్రస్.హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లాలోని అనంతగిరి కొండలు ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగిన రోడ్లు, అలిసిన మనుసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచి పిక్నిక్ స్పాట్ అనంతగిరి కొండలు.. తాజాగా ఈ పర్యాటక అందాలకు మరిన్ని హంగులు అద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రాజెక్ట్ డీపీఆర్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఏకో టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా అటవీ సంపద దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధి చేస్తారు. చెట్లను నరకకుండా.. కొండలను తొలచకుండా ఏకో టూరిజం ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నారు. అడ్వంచరస్ టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్, రోప్ వే వంటివి ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి సేదతీరడానికి వస్తుంటారు. వీకెండ్ లో పర్యాటక అందాలను ఎంజాయ్ చేయడానికి బైక్ లపై రయ్... రయ్ మంటూ వచ్చేస్తుంటారు. అనంతగిరి కొండలకు అటు.. ఇటు రెండు సాగు ప్రాజెక్టులు ఉండటం పర్యాటక అభివృద్ధికి మరింత అనుకూలంగా మారింది. ఒక వైపు సర్పన్ పల్లి.. మరోవైపు కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్స్ లు, హోటల్స్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ప్రాజెక్ట్ ల్లో బోటింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అనంతగిరి అభివృద్ధి కోసం ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. పెద్దసంఖ్యలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా ఇక్కడ నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. జూ పార్క్ తరహాలో పక్షుల, జంతువుల కోసం 213 ఎకరాలను కేటాయించారు. త్వరలోనే పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది. అనంతగిరి కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికంగా ప్రశాంతతను పొందవచ్చు. 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నవాబ్ నిర్మించాడట ఈ ఆలయాన్ని. హైదరాబాద్ నవాబు కలలోకి అనంత పద్మనాభస్వామి వచ్చి టెంపుల్ కట్టమని ఆదేశించడంతో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టారనీ అందుకే ఈ ప్రదేశానికిఅనంతగిరి కొండలు అని పేరు వచ్చిందని ప్రతీతి. -
ఛలో లక్షద్వీప్.. మంచిది కాదు!
కవరత్తి: మాల్దీవులపై కోపంతో.. సొంత పర్యాటకాన్ని ప్రొత్సహించుకునే క్రమంలో సోషల్ మీడియాలో ఛలో లక్షద్వీప్ ట్రెండ్ తీసుకొచ్చారు కొందరు భారతీయులు. అయితే.. లక్షద్వీప్కు పర్యాటకులు పోటెత్తడం ఎంతమాత్రం మంచిది కాదని అంటున్నారు అక్కడి ఏకైక ఎంపీ. పగడాల నేల లక్షద్వీప్ చాలా సున్నితమైందని.. పైగా పర్యావరణపరంగా చాలా పెళుసుగా ఉండటంతో అతి పర్యాటకం దీవులకే ముప్పు తెస్తుందని చెబుతున్నారాయన. లక్షద్వీప్కు ఎన్నో పరిమితులున్నాయి. ఇక్కడికి నేరుగా విమాన సౌకర్యం లేదు. హోటల్ గదులు 150 వరకే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ద్వీపం పెళుసు జీవావరణ దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు పోటెత్తడాన్ని నియంత్రించాల్సి ఉంటుంది అని ఎంపీ మొహమ్మద్ ఫైజల్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ రవీంద్రన్ కమిటీ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆలోచనను ప్రతిపాదించింది. ఈ ప్లాన్.. ఇక్కడి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం రూపొందించబడిన గ్రంథం లాంటిది. దీవుల సామర్థ్యం ఆధారంగానే.. ఇక్కడ సౌకర్యాల ఏర్పాటు జరగాలని.. పర్యాటకుల్ని అనుమతించాలంటూ స్పష్టంగా సూచించింది ఈ కమిటీ. కాబట్టి.. ఈ దీవులకు నియంత్రణ పర్యాటకం(controlled tourism) సరైందని చెబుతున్నారాయన. లక్షద్వీప్లోని.. 36 దీవులకుగానూ 10 మాత్రమే జనావాసంగా ఉన్నాయి. ఇక్కడి జనాభాలో 8 నుంచి 10 శాతం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పైగా టూరిజం జాబితాలో చాలామందికి ఇది ఉండకపోవచ్చు. కేవలం మాల్దీవుల మీద కోపంతో.. చాలామంది లక్షదీవులకు వెళ్తామంటూ చాలామంది చెబుతున్నారు. ఇది కేవలం భావోద్వేగపూరితమైన చర్య మాత్రమే అని తెలిపారాయన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన.. ఆ సమయంలో దిగిన ఫొటో షూట్ తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్తో సంబంధాలు బెడిసి కొట్టడాన్ని ప్రధానాంశంగా లేవనెత్తుతూ అక్కడి ప్రతిపక్షాలు రచ్చే చేశాయి. దీంతో ముగ్గురు మంత్రుల్ని తొలగించాల్సి వచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే.. చైనాతో భేటీ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వరం మారింది. ఈ క్రమంలో.. తమది చిన్నదేశమే అయినా బెదిరింపుల్ని ఉపేక్షించబోమని, మార్చి 15వ తేదీలోపు అక్కడ మోహరించిన భారత సైన్య సిబ్బంది వెనుదిరగాలంటూ అల్టిమేటం ప్రకటించారాయన. -
భారీ పెట్టుబడులే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏఐపై శ్రీధర్బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు. ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్ తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు.