-
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
టాప్ గేర్లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
టాప్ 30 హెడ్లైన్స్
-
టాప్ 30 ముఖ్యాంశాలు..!
-
టాప్ ఇండియన్ సెలబ్రిటీస్ ఏజ్డ్ ఇమేజెస్
-
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..
సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే 1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది. -
భారతదేశంలోని టాప్ 11 మిస్టీరియస్ టెంపుల్స్
-
రియల్టీ కింగ్.. డీఎల్ఎఫ్ సింగ్.. లిస్ట్లో తెలుగువారు!
న్యూఢిల్లీ: దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ. 59,030 కోట్ల సంపదతో మరోసారి నంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2023కి గాను దేశీ రియల్టీ కుబేరులతో కిచెన్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సంస్థ గ్రోహె, రీసెర్చ్ సంస్థ హురున్ ఇండియా సంయుక్తంగా ఈ లిస్టును రూపొందించింది. 16 నగరాలకు చెందిన 67 కంపెనీలకు సంబంధించి 100 మంది సంపన్నులకు ర్యాంకింగ్ ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది చోటు దక్కించుకున్నారు. జీఏఆర్ కార్పొరేషన్ వ్యవస్థాపక చైర్మన్ జీ అమరేందర్ రెడ్డి కుటుంబం (రూ. 15,000 కోట్లు) పదో స్థానంలో నిల్చింది. మంగళవారం విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం.. రూ. 42,270 కోట్ల సంపదతో మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్ – లోధా గ్రూప్) రెండో స్థానంలో, రూ. 37,000 కోట్ల సంపదతో ఆర్ఎంజెడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం మూడో స్థానంలో ఉన్నాయి. ఈసారి లిస్టులో 25 మందికి కొత్తగా చోటు దక్కగా, 36 మంది సంపద తగ్గింది. ఇతర వివరాలు.. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది రియల్టీ కుబేరులు ఉన్నారు. ఢిల్లీ (23), కర్ణాటక (18) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో 9 మంది, ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు ఉన్నారు. నగరాలవారీగా చూస్తే ముంబై (29 మంది), న్యూఢిల్లీ (23), బెంగళూరు (18) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద 2017లో రూ. 3,350 కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు ఎగిసింది. అలాగే టాప్ 50లో చోటు దక్కించుకునేందుకు కనీస సంపద రూ. 660 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు చేరింది. టాప్ 100 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 4% పెరిగి రూ. 4,72,330 కోట్లుగా (57 బిలియన్ డాలర్లు) ఉంది. ఇందులో టాప్ 10 కుబేరుల వాటా 60%గా ఉంది. డీఎల్ఎఫ్కు చెందిన పియా సింగ్, రేణుకా తల్వార్ అత్యంత సంపన్న మహిళలుగా ఉన్నారు. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన పక్షులు
-
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్లో...? -
కార్యాలయాలకు కేరాఫ్ హైదరాబాద్! ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్
పెద్ద కార్యాలయాలకు హైదరాబాద్ కేరాఫ్గా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ల లావాదేవీల జాబితాలో హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాలు టాప్లో ఉన్నాయి. ఇదీ చదవండి: కరూర్ వైశ్యా బ్యాంక్పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా.. మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 1 లక్ష చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో లావాదేవీలు హైదరాబాద్, పుణేలలో 53 శాతం జరిగాయి. బెంగళూరులో ఈ లావాదేవీలు 51 శాతంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇక 50వేల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ల లావాదేవీలు కోల్కతాలో 70 శాతం, చెన్నైలో 57 శాతం జరిగాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబైలలో 50వేల నుంచి 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలకు ఈ విభాగంలో 30 శాతానికి పైగా లావాదేవీలు జరిగాయి. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! 2022లో ఆఫీస్ లీజింగ్ పరిమాణం 51 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు 2023లో మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 1 లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్లకు సంబంధించి బెంగళూరులో 36 ఒప్పందాలు, హైదరాబాద్లో 15 డీల్స్, పుణెలో 13 ఒప్పందాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ఈ నగరాల్లోని ఐటీ, తయారీ కంపెనీలు పెద్ద పరిమాణ కార్యాలయాలకు డిమాండ్ను పెంచాయని వివరించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్ఝున్వాలా ఎంట్రీ!సూపర్!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుడు బిలియనీర్, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు. 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ లిస్ట్లోచేరింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్ టాప్లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ , క్రిసిల్ రేఖ టాప్ పిక్స్గా చెప్పుకోవచ్చు. ట్రెండ్లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్లు రేఖ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. రేఖ ఝున్ఝున్వాలా ఎవరు? బిగ్బుల్గా పాపులర్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖ. రాకేష్ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా. వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ లో రాకేష్ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు. కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు పద్మశ్రీ మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ కుటుంబం ఆయన తరపున అవార్డును స్వీకరించింది. -
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ కార్ ఏదో తెలుసా?
సాక్షి, ముంబై: మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో మోడల్స్ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్ అయ్యాయి. అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్లను వెనక్కి నెట్టేసింది బాలెనో. అప్డేటెడ్గా వచ్చిన బాలెనో మోడల్ రాక గేమ్ ఛేంజర్గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మారుతి సుజుకి బాలెనో ఇంజీన్ బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్ను అందిస్తుంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్స్పేస్ని కలిగిఉంది. 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్బ్యాగ్లు, రియర్ AC వెంట్స్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. -
టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు, కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి. కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి. ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే.. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే టాప్ స్కిల్ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్). ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! క్లైర్.. గూగుల్లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. -
తలసరి ‘విద్యుత్’లో తెలంగాణకు ఐదో స్థానం..
సాక్షి, హైదరాబాద్: వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్లతో పంజాబ్, 2,131 యూనిట్లతో హరియాణా, 2,048 యూనిట్లతో గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. 2019–20లో భారతదేశ తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుకాగా.. 2020–21లో 1,161 యూనిట్లకు తగ్గిపోయింది. 2020–21 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా విడుదల చేసిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. 10,478 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దాద్రానగర్ హవేలీ తొలిస్థానంలో, 5,473 యూనిట్లతో డామన్ డయ్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. కరెంటు మరణాలు ఎక్కువ విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నింటిలోనూ కలిపి విద్యుత్ ప్రమాదాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2020–21లో రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటుచేసుకోగా, కర్ణాటకలో 2,935, రాజస్థాన్లో 2,726 ప్రమాదాలు జరిగాయి. ఇక రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 1,241 మంది మృతిచెందగా.. 219 మంది క్షతగాత్రులయ్యారు. 1,062 మరణాలతో మధ్యప్రదేశ్, 1,038 మరణాలతో మహారాష్ట్ర రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. విద్యుత్ ప్రమాదాలతో దేశంలో మొత్తంగా 9,021 మంది ప్రాణాలు కోల్పోగా, 3,750 మంది క్షతగాత్రులయ్యారు. విద్యుత్ ప్రమాదాల్లో మృతిచెందిన పశువుల సంఖ్య తెలంగాణలో (2,876 పశువులు) ఎక్కువగా ఉంది. మొత్తం ప్రమాదాల సంఖ్యలో మనుషులు, పశువుల మరణాలు/గాయాలు పాలైన ఘటనలు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్లో టాప్ ► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ► గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా.. 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ► వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో.. 128.81 యూనిట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. ► హెచ్టీ కేటగిరీ కింద పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1,163.99 యూనిట్లతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా.. తెలంగాణ 299.19 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం -
‘జలజీవన్ మిషన్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘జలజీవన్ మిషన్’ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఈ పథకం అమలు జరుగుతుండగా.. రాష్ట్రాల వారీగా పథకం అమలు జరుగుతున్న తీరుపై కేంద్రం ప్రతినెలా పథకం అమలులో పురోగతిపై జిల్లాల వారీగా ర్యాంకుల్ని ప్రకటిస్తూ వస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ విభాగం ‘జలజీవన్ మిషన్ సర్వేక్షణ్ బులెటిన్’ పేరుతో విడుదల చేస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలు జరిగిన తీరుపై కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో మన రాష్ట్రంలోని విశాఖపట్నం దేశంలోనే రెండవ ర్యాంక్ కైవసం చేసుకోగా.. మరో రెండు జిల్లాలు టాప్–10 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఐదవ స్థానం దక్కగా, అనకాపల్లి జిల్లా దేశంలోనే టాప్–10 జిల్లాల జాబితాలో పదో స్థానాన్ని దక్కించుకుంది. మూడు అంశాల ఆధారంగా.. ప్రతినెలా జిల్లాల వారీగా ఆయా గ్రామాల్లో కొత్తగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం.. తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణ.. అందుకు గ్రామ స్థాయిలో కలి్పస్తున్న వసతులు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా కేంద్రం ప్రతినెలా దేశంలోని జిల్లాలకు ర్యాంకులు కేటాయిస్తోంది. డిసెంబర్ నెలలో తమిళనాడులోని సేలం జిల్లా 91.79 మార్కుతో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించగా.. మన రాష్ట్రంలోని విశాఖ జిల్లా 86.85 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా 81.83 మార్కులతో 5వ ర్యాంక్, అనకాపల్లి జిల్లా 72.55 మార్కులతో పదో ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా వివిధ అంశాలపై ప్రతినెలా జిల్లాల వారీగా పథకం పురోగతిపై మార్కులను కేటాయిస్తూ ర్యాంకులు ఇస్తోందని.. ప్రతినెలా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వివరించారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలోనే సేంద్రీయ సేద్యంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీకి 2020, 2021 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒక లక్ష హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. 2019–20 నుంచి ఇప్పటివరకు ఏపీలో 1,44,465 హెక్టార్లు సేంద్రీయ వ్యవసాయం కిందకు వచ్చినట్లు తెలిపారు. 2020–21లో భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద 8 రాష్ట్రాల్లో 4.09 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సేద్యానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇందులో అత్యధికంగా ఏపీలో లక్ష హెక్టార్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి కింద దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ 2019–20 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాల కింద సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు శిక్షణ, సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రైతుల క్లస్టర్ల ఏర్పాటు, సామర్ధ్యం పెంపునకు హెక్టార్కు రూ.12,200 సాయాన్ని అందించినట్లు చెప్పారు. హ్యాండ్ హోల్డింగ్, సర్టిఫికేషన్, అవశేషాల విశ్లేషణ్కు హెక్టారుకు మూడేళ్లలో రూ. 2 వేల ఆర్థిక సాయం అందించామన్నారు. సహజ సేద్య ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారం, విలువ జోడింపునకు రైతులకు హెక్టార్కు మూడేళ్లలో రూ.8,800 డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ వరకు, ధృవీకరణ, మార్కెటింగ్, పంటకోత తర్వాత నిర్వహణకు పూర్తి మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్లోని వెలెన్సియా టాప్లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్తో మోదీ టాప్
-
రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైం క్రాప్ మేనేజ్మెంట్ ద్వారా సర్వే నంబర్ల వారీగా సాగవుతున్న పంటల గుర్తింపులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఈ–క్రాప్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. చదవండి: అతి త్వరలో గడపగడపకు వైద్యం జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ–క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ–క్రాప్ అమలులో ఏపీని కూడా భాగస్వామిని చేయడం గర్వకారణమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా వంటి అన్ని పథకాలు ఈ–క్రాప్ ప్రామాణికంగానే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్ నమోదు చేసిన రైతులందరికీ ఈ–కేవైసీ (మీ పంట తెలుసుకోండి) నమోదు ప్రారంభించాలన్నారు. ‘వైఎస్సార్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు రైతు గ్రూపుల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు. -
పిల్లలను ఇలా పంపించగలమా?...ఏకంగా ఆటోపై కూర్చోబెట్టి..:వీడియో వైరల్
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందకు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న నిబంధనలను గాలికొదిలేసి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు చాలా మంది వాహనదారులు. కళ్లముందే ఘోరమైన రోడ్డుప్రమాదాలు జరుగుతున్న కనువిప్పు కలగకపోవడం దురదృష్టం. ఏయే వాహనాల్లో ఎంతమంది ప్రయాణించాలానే రూల్ కూడా ఉంది. ఐతే డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది వాహనదారులు పరిమితికి మించి జనాలను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడొక ఒక ఆటో డ్రైవర్ అలాంటి పనే చేశాడు. విచిత్రమేమిటంటే అతను పోలీస్ కార్యాలయం నుంచి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఒక ఆటో డ్రైవర్ చిన్నారులను ఏకంగా ఆటోపైన కూర్చోబెట్టి తీసుకువెళ్లాడు. సుమారు ముగ్గురు చిన్నారులను ఆటో పైన కూర్చొబెట్టాడు. ఆ ముగ్గురు చిన్నారులు సుమారు 11 నుంచి 13 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ చేస్తూ "ఎవరైనా తమ పిల్లలను ఇలా పాఠశాలకు పంపగలారా?" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. పైగా ఆ ఆటో సమీపలోని ఆర్టీవో ఆఫీస్, నకిటీయా పోలీస్ ఔట్పోస్ట్ నుంచి వెళ్లినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోకపోవడ విచిత్రం అని పేర్కొన్నాడు. బహుశా అందరూ నిద్రపోతున్నారంటూ... కామెంట్ చేశాడు. దీంతో బరేలీ పోలీసులు ఈ వైరల్ వీడియోను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ...పిల్లల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని, పైగా ఇలాంటి డ్రైవర్లను అనుమతించకుండా పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతామని చెప్పారు. How can someone send their children to school with such a careless auto driver. Visuals from UP's Bareilly. This auto crossed office of RTO, Nakatia police outpost on Friday but everyone seemed to be sleeping. No action taken with registration no. UP25ET8342 by@Uppolice pic.twitter.com/hcfidtIJFS — Raj Kumar Bhim Army (@Rajkuma79883678) August 28, 2022 (చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్) -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం