-
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్కు మందలింపు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్ను పగులగొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్కు చెందిన జానీ బెయిర్స్టో, న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్తో జరిగిన మూడో టెస్ట్తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్స్టో- 99 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్తో కలుపుకుని 123 మ్యాచ్ల్లో న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్స్టో- 97 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. -
సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రచిన్ రీఎంట్రీ..?
సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్తో టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. 2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్ -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్ను పెవిలియన్కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
Ban vs NZ: న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్లో కివీస్కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
న్యూజిలాండ్కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్కు గుడ్ న్యూస్!
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(ఆక్టోబర్22)న ధర్మశాల వేదికగా టీమిండియాతో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ భారత్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో సౌథీ చేతి వేలికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తమ జట్టుతో కలిసి భారత్కు వచ్చినప్పటికీ మొదటి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే సౌథీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టు సెలక్షన్కు అందుబాటోకి వచ్చాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ స్టాండింగ్ కెప్టెన్ టామ్ లాథమ్ ధృవీకరించాడు. "భారత్తో మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇది గొప్ప పోటీ. ప్రపంచవ్యాప్తంగా కివీస్ ఎక్కడ ఆడినా అభిమానుల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఈ భారత్లో కూడా బ్లాక్ క్యాప్స్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటివకు ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్బుత విజయాలు సాధించాం. రాబోయే మ్యాచ్ల్లో కూడా అదే రిథమ్ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఇక కేన్ విలియమ్సన్ జట్టుతో ఉన్నప్పటికీ బొటనవేలు గాయంతో బాధపడతున్నాడు. అతడు రోజు రోజుకు బాగా కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను. అయితే టిమ్ సౌథీ మాత్రం ఫిట్నెస్ సాధించాడు. అతడు భారత్తో మ్యాచ్కు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో టామ్ లాథమ్ పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్కు గుడ్న్యూస్.. కేన్ మామ వచ్చేసాడు!
వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్తో మ్యాచ్కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇప్పడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్కప్కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్గా ప్రమోషన్ -
న్యూజిలాండ్కు మరో బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్కు ముందు న్యూజిలాండ్కు మరో బిగ్షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఇంగ్లండ్తో మ్యాచ్కు దూరమయ్యాడు. ఇప్పుడు సౌథీ కూడా దూరం కావడం కివీస్ నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా సౌథీ బొటనవేలు గాయమైంది. వెంటనే సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే వరల్డ్కప్ జట్టు ప్రకటనకు ముందు సౌథీ ఫిట్గా ఉన్నాడని కివీస్ ప్రకటించింది. కానీ భారత్కు వచ్చిన సౌథీ ఇంకా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్తో జరిగిన వామాప్ మ్యాచ్లో కూడా సౌథీ బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో అతడి స్ధానంలో జామీసన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఆరంభ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్ -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి బౌలర్గా
న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కివీస్ వెటరన్ 8.13 ఏకనామీతో 141 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు. కాగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో ఇంగ్లండ్ పర్యటనలో కివీస్ జట్టును సౌథీ నడిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఊదిపడేసింది. గ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43 నాటౌట్) పరుగులతో మ్యాచ్ను మగించారు. చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండో టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(56), చాప్మన్(51) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. జహూర్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో ఆయాన్ ఖాన్(42) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో లిస్టర్ మూడు వికెట్లు, జామీసన్, శాంట్నర్, ఆశోక్ తలా వికెట్ సాధించారు. 56 పరుగులతో రాణించిన విల్యంగ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్లోనే: రింకూ -
న్యూజిలాండ్కు బిగ్షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం
న్యూజిలాండ్కు పసికూన యూఏఈ బిగ్షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు. వసీం కెప్టెన్ ఇన్నింగ్స్.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: సిరీస్పై భారత్ కన్ను The moment UAE became the first associate team to beat New Zealand...!! A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్క్యాప్స్ బ్యాటర్లలో సీఫెర్ట్(55),మెక్కన్చీ(31) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జహూర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో చెలరేగిన సౌథీ.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈను టిమ్ సౌథీ ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్చేసి కష్టాల్లో నెట్టాడు. ఈ మ్యాచ్లో సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. కివీస్ కెప్టెన్ సంచలన బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ(60) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్ వేదికగా శనివారం జరగనుంది. చదవండి: IND vs IRE: ఐర్లాండ్తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా -
కివీస్తో సిరీస్.. కొత్త కెప్టెన్గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023 -
అంతర్జాతీయ టీ20లలో మొనగాడు.. అత్యధిక వికెట్లు తీసి..
Bangladesh vs Ireland, 2nd T20I - Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీని వెనక్కినెట్టి ముందుకు దూసుకువచ్చాడు. స్వదేశంలో ఐర్లాండ్తో రెండో టీ20 సందర్భంగా ఐదు వికెట్లు కూల్చిన షకీబ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. టపాటపా.. ఐదు వికెట్లు చట్టోగ్రామ్లో జరిగిన మ్యాచ్లో ఐరిష్ ఓపెనర్ రాస్ అడేర్(6), వికెట్ కీపర్, వన్డౌన్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్(5), నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హ్యారీ టెక్టార్(22), ఐదో స్థానంలో దిగిన గరేత్ డెలనీ(6), ఆరో స్థానంలో వచ్చిన జార్జ్ డాక్రెల్(2) వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వీరందరినీ తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఐర్లాండ్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాట్(38 నాటౌట్)తోనూ ఇటు బంతితోనూ మ్యాజిక్ చేసి బంగ్లాదేశ్ను గెలిపించాడీ స్పిన్ ఆల్రౌండర్. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి.. బంగ్లాకు మరో సిరీస్ విజయం అందించాడు. ఇప్పటి దాకా అన్ని వరల్డ్కప్లలో కాగా అంతర్జాతీయ టీ20లలో వికెట్ల విషయంలో ఇప్పటివరకు టిమ్ సౌతీ ముందంజలో ఉండగా.. షకీబ్ అతడిని అధిగమించాడు. తద్వారా నంబర్1 గా అవతరించాడు. 2006లో జింబాబ్వేతో మ్యాచ్తో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టిన షకీబ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు అతడు బంగ్లా తరఫున 114 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే! 1. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 136 వికెట్లు 2. టిమ్ సౌతీ- న్యూజిలాండ్- 134 వికెట్లు 3. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 129 వికెట్లు 4. ఇష్ సోధి- న్యూజిలాండ్- 114 వికెట్లు 5. లసిత్ మలింగ- శ్రీలంక -107 వికెట్లు చదవండి: BAN Vs IRE: చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు David Warner: సన్రైజర్స్ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్ను వదులుకుని! ఈసారి.. -
పట్టు బిగించిన కివీస్.. ఫాలోఆన్ గండం తప్పేదెలా?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్వెల్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు -
కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు ఊరట
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జడ్సీ) తమ ప్రధాన క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేందుకు మార్గం సుగమం చేసింది. శ్రీలంకతో రెండో టెస్టు తదుపరి వన్డే సిరీస్ నుంచి లీగ్ కాంట్రాక్టు దక్కించుకున్న తమ కీలక ఆటగాళ్లను విడుదల చేయనుంది. కేన్ విలియమ్సన్ (గుజరాత్ టైటాన్స్), టిమ్ సౌతీ (కోల్కతా నైట్రైడర్స్), డెవాన్ కాన్వే, సాన్ట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్)లు ఆయా ఫ్రాంచైజీలతో జట్టు కట్టేందుకు రిలీజ్ చేయాలని ఎన్జడ్సీ నిర్ణయించింది. లంకతో ఆఖరి టెస్టు ఆడిన వెంటనే వీళ్లంతా భారత్కు బయల్దేరతారు. మరో ముగ్గురు క్రికెటర్లు ఫిన్ అలెన్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), ఫెర్గూసన్ (కోల్కతా), గ్లెన్ ఫిలిప్స్ (సన్రైజర్స్ హైదరాబాద్లు)లకు 25న ఆక్లాండ్లో జరిగే తొలి వన్డే అనంతరం లీగ్లో అడేందుకు అనుమతించింది. ఈ సీజన్ ఐపీఎల్ పోటీలు మార్చి 31 నుంచి జరుగనున్నాయి. ఈ లీగ్కు ముందు న్యూజిలాండ్–శ్రీలంక జట్ల మధ్య 17 నుంచి 21 వరకు చివరిదైన రెండో టెస్ట్ జరుగుతుంది. ఇది ముగియగానే ఈనెల 25, 28, 31 తేదీల్లో మూడు వన్డేల సిరీస్... ఏప్రిల్ 2, 5, 8 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరగనుంది. -
వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్ కెప్టెన్
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ సారధి టిమ్ సౌథీ ఓ రేర్ ఫీట్ను సాధించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2nd on the list! Tim Southee (362 wickets) becomes the second highest wicket-taker in Tests for New Zealand. Southee (706) now has the most international wickets for a New Zealander 🏏 #StatChat #NZvSL pic.twitter.com/2oXxxKw5ty — BLACKCAPS (@BLACKCAPS) March 9, 2023 93 టెస్ట్ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్ వెటోరీని (112 టెస్ట్ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్ల్లో 431 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్ (578), కెయిన్స్ (419), మిల్స్ (327), మోరిసన్ (286), చాట్ఫీల్డ్ (263), బాండ్ (259), వాగ్నర్ (258) టాప్-10లో ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
NZ Vs SL: లంకతో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
Sri Lanka Tour New Zealand, 2023: శ్రీలంకతో టెస్టు సిరీస్కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్వదేశంలో లంకతో తలపడనున్న జట్టులో 13 మంది సభ్యులకు చోటిచ్చింది. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన కివీస్.. రెండో మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. లంకకు ఆ అవకాశం ఈ క్రమంలో మార్చి 9 నుంచి లంకతో పోరుకు సిద్ధమవుతోంది టిమ్ సౌథీ బృందం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో భాగంగా కివీస్- లంక మధ్య రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. క్రైస్ట్చర్చ్, వెల్లింగ్టన్లలో జరుగనున్న ఈ సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. ఒకవేళ న్యూజిలాండ్ను గనుక లంక వైట్వాష్ చేయడం సహా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా- ఆస్ట్రేలియాను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు కరుణరత్నె బృందానికి అవకాశాలు ఉంటాయి. అయితే, సొంతగడ్డపై కివీస్ను ఓడించడం లంకకు తేలికేం కాదు. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే లంక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్-2023 మార్చి 9- మార్చి 21 వరకురెండు టెస్టులు వేదికలు: క్రైస్ట్చర్చ్, వెల్లింగ్టన్ లంకతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ఇదే టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్), మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, స్కాట్ కుగ్గెలీజన్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్. చదవండి: WTC NZ Vs SL: కివీస్తో సిరీస్కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే.. -
ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్బాల్' పనికిరాదు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను తొలిరోజునే డిక్లేర్ చేయడం చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండో రోజుకే మ్యాచ్ ఫలితం వచ్చేసింది. తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్కు బజ్బాల్ క్రికెట్(Bazball) బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఇదే బజ్బాల్ క్రికెట్ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్లను మట్టికరిపించింది. కానీ ప్రతీసారి అదే దూకుడు పనికి రాదని తర్వాతి టెస్టుతోనే అర్థమైంది. ఓటమి నేర్పిన పాఠంతో బజ్బాల్(Bazball) ఆటను పక్కనబెడితే మంచిదని కొంతమంది క్రీడానిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈసారి కూడా ఇంగ్లండ్ ఆటను వేగంగానే మొదలుపెట్టింది. రూట్, హ్యారీ బ్రూక్ శతకాలతో విరుచుకుపడడంతో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ను తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌట్ చేసి ఫాలోఆన్ కూడా ఆడించింది. ఇన్నింగ్ తేడాతో గెలవాలన్న ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. కేన్ విలియమ్సన్ శతకంతో మెరవగా.. టామ్ బ్లండెల్, టామ్ లాథమ్, డెవన్ కాన్వే, డారిల్ మిచెల్లు కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో కివీస్ 483 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 258 పరుగుల టార్గెట్ను ఉంచింది. బజ్బాల్ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లండ్ ఆటను చూస్తే టార్గెట్ అంత కష్టమేమి అనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే రూట్ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. కానీ ప్రతీసారి దూకుడు పనికిరాదన్న విషయం ఇంగ్లండ్కు అర్థమైంది. రూట్ మినహా మిగతావాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. అయితే కాస్త ఓపికగా ఆడి ఉంటే మాత్రం ఇంగ్లండ్.. మ్యాచ్తో పాటు సిరీస్ను క్లీన్స్వీప్ చేసేదే. కానీ సంప్రదాయ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. బజ్బాల్ అంటూ దూకుడు మంత్రం జపిస్తున్న ఇంగ్లండ్కు న్యూజిలాండ్ తమ ఆటతో బ్రేకులు వేసింది. దీంతో ఇంగ్లండ్ బజ్బాల్ క్రికెట్(Bazball Cricket)ను పక్కనబెట్టడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చదవండి: పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం WHAT A GAME OF CRICKET New Zealand have won it by the barest of margins... This is test cricket at its finest ❤️ #NZvENG pic.twitter.com/cFgtFBIkR4 — Cricket on BT Sport (@btsportcricket) February 28, 2023 -
పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టు ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టెస్టు మ్యాచ్.. అసలు మజా ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో టెస్టు క్రికెట్లో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకముందు 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్తో విజయం సాధించిన జాబితాలో విండీస్తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది కివీస్. ఇంతకముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాకిస్తాన్పై నాలుగు పరుగుల తేడాతో అతి తక్కువ మార్జిన్ తేడాతో విజయాలు అందుకుంది. ఇక టెస్టు క్రికెట్లో అతి తక్కువ మార్జిన్తో విజయాలు సాధించిన జట్ల జాబితా పరిశీలిస్తే... ► 1993లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ విక్టరీ ► 2023లో ఇంగ్లండ్పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ► 2005లో ఆస్ట్రేలియాపై రెండు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 1902లో ఇంగ్లండ్పై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం ► 1982లో ఆస్ట్రేలియాపై మూడు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం ► 2018లో పాకిస్తాన్పై నాలుగు పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం ► 1994లో ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం ► 1885లో ఇంగ్లండ్పై ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP — BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023 చదవండి: టెస్టు క్రికెట్లో సంచలనం.. పరుగు తేడాతో విజయం