-
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్'లో గెలిచిన విద్యార్థి డెవలపర్లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్లో భాగంగా మైండ్బడ్ అనే యాప్ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్ను రూపొందించినట్లు సమాచారం. మైండ్బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్బడ్ని సృష్టించడానికి స్విఫ్ట్యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్కిట్, ఫైల్మేనేజర్లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్బుక్లోని సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024 -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్లైన్తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది!
యాపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనం చూసేద్దాం. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం. ఇదీ చదవండి: అదే నిజమైతే బిలియనీర్కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే? టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు. -
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్లందరూ తమ వార్షిక బోనస్ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు హాజరైనట్టు ఇన్స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్గా మారాయి. (గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ఈ పోస్ట్లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు
Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి. 2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్లను కోల్పోయిట్టు అంచనా. హువావే జోరు అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్తో Mate 60 స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్ను ప్రారంభించింది. అటు ఐఫోన్ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. -
టిమ్ కుక్కి చేదు అనుభవం - క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే..
ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్మన్ సాచ్స్తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం. -
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్గా యాపిల్ సాకేత్ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
DC Vs KKR: ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్లో సందడి చేసిన యాపిల్ సీఈవో.. ఫోటోలు వైరల్
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 57 పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 127 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో జాసన్ రాయ్(43), రస్సెల్(38) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నోర్జే తలా రెండు వికెట్లు సాధించారు. మ్యాచ్ను వీక్షించిన యాపిల్ సీఈవో ఇక యాపిల్ రిటైల్ స్టోర్ల ప్రారంభోత్సవం కోసం ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టిమ్ కుక్ తమ రిటైల్ స్టోర్ను దేశ రాజధాని ఢిల్లీలో గురువారం(ఏప్రిల్ 20)న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో టిమ్ కుక్ సందడి చేశారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి ఆయన మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2023: సన్రైజర్స్తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. In 2016, the CEO of Apple - Mr. Tim Cook was in Kanpur to witness an IPL contest in presence of Mr. Rajeev Shukla, vice-president of the BCCI. Fast Forward to 2023, he makes his visit to yet another IPL game by attending the #DCvKKR game in Delhi 👏🏻👏🏻@ShuklaRajiv | @tim_cook pic.twitter.com/2j1UovSmPd — IndianPremierLeague (@IPL) April 20, 2023 -
ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ
ఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలో గురువారం ఉదయం యాపిల్ రెండో స్టోర్ లాంఛ్ నేపథ్యంలో.. ఈ సాయంత్రం వీళ్ల భేటీ జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. దానికి టిమ్ కుక్ బదులు కూడా ఇచ్చారు. టిమ్ కుక్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం. భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను హైలైట్ చేయడం ఆనందంగా ఉంది అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దానికి టిమ్ కుక్ స్పందిస్తూ.. తనకు దక్కిన స్వాగతంపై ప్రధాని మోదీకి థ్యాంక్స్ తెలియజేశారు. భారత దేశ వృద్ధికి, పెట్టుబడులకు మేం పెట్టడానికి కట్టుబడి ఉన్నాము అంటూ ట్వీట్ చేశారు. An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU — Narendra Modi (@narendramodi) April 19, 2023 ప్రధాని మోదీని కలవడానికి ముందు యాపిల్ సీఈవో కుక్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీ సాకేత్లో రేపు(ఏప్రిల్ 20వ తేదీన) రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించనున్నారు. ముంబై తొలి షోరూం ఓపెనింగ్ తరహాలోనే.. ప్రారంభం సందర్భంగా కస్టమర్లను స్వయంగా టిమ్ కుక్ ఆహ్వానించనున్నారు. అయితే ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ డ్రైవ్లోని తొలి యాపిల్ షోరూంతో పోలిస్తే.. సాకేత్ షోరూం చిన్నదిగా తెలుస్తోంది. అయినప్పటికీ.. ముంబై తరహా లాంగ్ క్యూ అనుభవం ఇక్కడా ఎదురు కావొచ్చని యాపిల్ భావిస్తోంది. రేపటి షోరూం లాంఛ్ కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు టిమ్ కుక్. తొలుత లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ కు చేరుకున్నారాయన. అంతేకాదు దీనికి కారణమైన ఎస్టీఫ్లస్ ఆర్ట్ ఫౌండేషన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఆ పర్యటన ఫొటోలను షేర్ చేసుకున్నారు. గోవాకు చెందిన కళాకారుడు దత్తారాజ్ నాయక్ను ఈ సందర్భంగా టిమ్ కుక్ కలిశాడు. పబ్లిక్ ప్లేస్లో తమ కళను ప్రదర్శించేందుకు వీధి కళాకారులకు దక్కిన వేదికే ఈ లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్. దేశ్యవాప్తంగానే కాకుండా.. విదేశాలకు చెందిన 50 మంది కళాకారుల ఆర్ట్ వర్క్ ఇక్కడ కొలువు దీరింది. అటుపై నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం-హస్తకళా అకాడమీని సందర్శించారాయన. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 I could've spent the whole day at the National Crafts Museum & Hastkala Academy. From ancient and vibrant textiles to impossibly intricate wood carvings, it displayed India’s deep—and deeply beautiful— culture of craft. Thanks Sarah Sham and Ruchika Sachdeva for showing me… pic.twitter.com/CzQy0dOi8y — Tim Cook (@tim_cook) April 19, 2023 -
Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్
న్యూఢిల్లీ: దేశంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాపిల్ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్ స్టోర్ ప్రారంబించిన అనంతరం కుక్ దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్ను కుక్ ప్రారంభించనున్నారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్లోని మంత్రముగ్ధుల్ని చేసే కళాత్మక చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్ ఆర్టిస్ట్ ఫౌండేషన్ ఆర్టిస్టులను అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, తదితర సెలబ్రిటీలు కుక్ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్తో ఒకయాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. -
భారత్లో ‘యాపిల్’ స్టోర్ ప్రారంభం.. (ఫొటోలు)
-
ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్కుక్...
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్బుక్ప్రో అనే యూట్యూబర్ అన్బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది. పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. (ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!) -
భారత్లో భారీ పెట్టుబడులు ఇందుకే: సీక్రెట్ రివీల్ చేసిన యాపిల్ సీఈఓ
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్పై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. భారత్ మార్కెట్ తమకు అత్యంత కీలకమని, అందుకే ఇక్కడ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. యాపిల్ సంస్థ తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించింది. మొత్తం 117.2 బిలియన్ డాలర్లు (రూ.9,61,775 కోట్లు) రెవెన్యూ ఆర్జించినట్లు తెలిపింది. మార్కెట్ల సంఖ్య పరంగా ఇది ఆల్టైమ్ రికార్డ్. కెనడా, ఇండోనేషియా, మెక్సికో, స్పెయిన్, టర్కీ, వియత్నాం, బ్రెజిల్, భారత్ మార్కెట్ల నుంచి ఈ రెవెన్యూ వచ్చింది. భారత్లో యాపిల్ డబుల్ గ్రోత్ భారత్లో యాపిల్ సంస్థ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తోందని, దీనిపై చాలా సంతృప్తికంగా ఉన్నట్లు టిమ్కుక్ పేర్కొన్నారు. భారత్లో కంపెనీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగా 2020లో ఇక్కడ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో యాపిల్ రిటైల్ స్టోర్ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. కోవిడ్ సంక్షోభం తర్వాత భారత్లో తమకు బాగా కలిసివచ్చిందన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2022లో భారత్లో రూ.30వేలుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో యాపిల్ వాటా 11 శాతం. ఇది మార్కెట్ రెవెన్యూలో 35 శాతం. భారత్లో గతేడాది ప్రీమియం స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో యాపిల్దే అగ్రస్థానం. ఇందులో ఐఫోన్13 అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రీమియం స్మార్ట్ఫోన్గా నిలిచింది. భారత్లో ఓవరాల్ స్మార్ట్ఫోన్ రెవెన్యూ షేర్లో 2021లో నాలుగో స్థానంలో ఉన్న యాపిల్.. 2022లో రెండో స్థానానికి ఎగబాకింది. -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్తో పాటు ఫేమ్ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్లలో ఉపయోగించే హార్డ్వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
అంతా తూచ్! యాపిల్ ఆఫీస్ భలే ఉంది: మస్క్ యూటర్న్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్తో యుద్ధానికి సై అంటే సై అన్న బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ముఖ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్తో భేటీ తర్వాత మస్క్ మాట మార్చడం హాట్టాపిక్గా నిలిచింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పలు ఆరోపణలు చేశారు. తన ట్విటర్ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే.. తాను కూడా ప్రత్యామ్నాయంగా స్మార్ట్ఫోన్ల తయారీలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా తాను అపార్థం చేసున్నామనీ, ట్విటర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్నునిలదీసిన మస్క్ తాజాగా తామిద్దరి మధ్యా మంచి చర్చ జరిగిందనీ, ఇతర విషయాలతోపాటు, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విటర్ను తొలగించాలని తామెపుడూ భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారంటూ పేర్కొన్నారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో "యాపిల్ అందమైన హెచ్క్యూ" వీడియో క్లిప్ను కూడా షేర్ చేయడం విశేషం. Thanks @tim_cook for taking me around Apple’s beautiful HQ pic.twitter.com/xjo4g306gR — Elon Musk (@elonmusk) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆపిల్ ఈవెంట్ : ఐఫోన్ 14 సిరీస్, కొత్త వాచ్, ఇయర్పాడ్స్ వచ్చేశాయ్ ఫోటోలు చూడండి
-
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్నెస్తో 2778×1244 రిజల్యూషన్తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్నెస్తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారనేది హాట్ టాపిక్గా మారింది. ఆపిల్ ఐఫోన్ 14: కోవిడ్ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ కావడంతో మరింత జోష్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్ల ప్రకారం భారీ అప్డేట్స్ తో ఐఫోన్ -14 సిరీస్ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 48ఎంపీ బిగ్ కెమెరా, ఆన్లోనే ఉండే డిస్ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. ఆపిల్ స్మార్ట్వాచ్ 8: ఆపిల్ 7 వాచ్ డిజైన్కు దగ్గరానేఈ కొత్త సిరీస్ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్ సీరిస్ను తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్వాచ్ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్ప్లే, టైటానియం సూపర్ డిజైన్, అదనపు బటన్తో ఈ స్మార్ట్వాచ్ను తీసుకు రానుందని సమాచారం. ఎయిర్పాడ్స్ ప్రో 2: తదుపరి జనరేషన్గా వస్తున్న వీటిల్లో ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్తో లాంచ్ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్ మెగా ఈవెంట్ ఆపిల్ డాట్కామ్,యూ ట్యూబ్లో లైవ్ ఉంటుంది. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
వర్క్ఫ్రం హోంపై యాపిల్ సీఈవో టిమ్కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా కొత్త వేరియంట్లు భయపెడుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు ఇక వర్క్ఫ్రం హోం చాలు ఆఫీసులకు రండి అంటూ తాకీదులు పంపుతున్నాయి. ఈ తరుణంలో ప్రపచంలోనే అతి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ సీఈవో టిమ్కుక్ ఈ అంశంపై స్పందించారు. ప్రయోగాలు చేస్తున్నాం టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ సదస్సులో టిమ్ కుక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. వర్క్ ఫ్రం హోం, ఆఫీసు నుంచి పని ఈ రెండు విధానాల విషయంలో యాపిల్ అనేక ప్రయోగాలు చేస్తోందని వివరించారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొలేదు. కాబట్టి ఉద్యోగులు, సంస్థలకు మేలు చేసే విధానం ఏంటనేది తెలుసుకోవాలంటూ రకరకాల ప్రయోగాలు చేయకతప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం యాపిల్లో వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రం హోంకి అవకాశం కల్పిస్తున్నట్టు టిమ్కుక్ తెలిపారు. మెంటల్ హెల్త్ కరోనా సంక్షోభం రావడానికి ముందు అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. కానీ కరోనా అది మోసుకొచ్చిన అనేక సమస్యలు మెంటర్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపించాయి. ఫిజికల్గా ఫిట్గా ఉంటే సరిపోదు మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే అనే భావన కలిగించాయి. కాబట్టి మెంటల్ హెల్త్కి ఏ పద్దతి మంచిదనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని కుక్ అన్నారు. ఆఫీస్ వర్క్.. కానీ వ్యక్తిగతంగా తనకు పర్సనల్ రిలేషన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమంటూ ఆఫీసుకు వర్క్కే ఆయన మొగ్గు చూపారు. అయితే వర్చువల్ వర్క్ అనేది ఆఫీస్ వర్క్ కంటే తక్కువ స్థాయిది ఏమీ కాదని, అదొక భిన్నమైన పని విధానమంటూ చెప్పుకొచ్చారు టిమ్కుక్. మొత్తంగా ఆఫీస్ వర్క్ పని విధానమే మేలైనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా దాన్ని బలవంతంగా అమలు చేయడం సరికాదన్నట్టుగా టిమ్కుక్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
పవర్ఫుల్ ఎం2 చిప్తో సరికొత్త రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ లాంచ్ (ఫోటోలు)
-
నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా నిలిచారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్లింక్ సంస్థల వ్యవస్థాపకుడు 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్-500 టాప్-10 సీఈవోల తాజా జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2021లో ఫార్చ్యూన్ 500 టాప్ సీఈవోల యాపిల్ సీఈవో టిమ్ కుక్, నెటిఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సహా ఇతర టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారున్నారు. 2021లో ఎలాన్మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయంపెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53. 8 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ మాత్రం టాప్ ర్యాంకులోనే కొనసాగుతోంది. ఇంకా న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5 చీఫ్ ఎగ్జిక్యూటివ్లు టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ 2021లో వేతనం పరంగా ఈలాన్ మస్క్ టాప్-1 ప్లేస్లో ఉన్నారు. టెస్లా కంపెనీ సాధించిన ఘనమైన ఆదాయాల నేపథ్యంలో 53.8 బిలియన్ల డాలర్ల మొత్తం రాబడి 2020 నుండి 71శాతం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల కంపెనీ 2021లో కీలకమైన యూరోపియన్ ,చైనీస్ మార్కెట్లలో 936,000 వాహనాలను డెలివరీ చేసింది. ఇది 87 శాతం జంప్. యాపిల్ సీఈవో టిమ్ కుక్: 2011 నుండి కుక్ ఆపిల్ సీఈవోగా ఉన్న కుక్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 2021లో ఆయన వేతనం 770.5 మిలియన్ డాలర్లు. ఈ 10 సంవత్సరాల్లో 1.7 బిలియన్ల షేర్లను ఆయనకు దక్కాయి. అలాగే కుక్ హయాంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఆపిల్ 2వ స్థానంలో నిలిచింది. 95 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. న్విదియా, జెన్సన్ హువాంగ్ షీల్డ్ గేమింగ్ కన్సోల్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కి ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీ న్విదియా సహ వ్యవస్థాపకుడు హువాంగ్ వేతనం 561 మిలియన్ డాలర్లు స్వీకరించాడు. సుమారుగా 60 రెట్లు పెరిగింది. నెట్ఫ్లిక్స్, రీడ్ హేస్టింగ్స్ :2021లో నెట్ఫ్లిక్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈవో రీడ్ హేస్టింగ్స్ వతేనం 453.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్, లియోనార్డ్ ష్లీఫెర్ ఆస్తమా, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేసే వివిధ రకాల ఔషధాలను తయారు చేసే బయోటెక్ సంస్థ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఐదవ అత్యంత వేతనం పొందిన స సీఈవోగా అయిదో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్కు చెందిన సత్య నాదెళ్ల 309.4 మిలియన డాలర్లతో ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. -
'జాక్ పాట్' అంటే ఇదేనేమో! యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శాలరీ ఎంతంటే!
ప్రముఖ టెక్ కంపెనీల్లో పనిచేసే సీఈఓల శాలరీ ఎంతుంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొన్ని కంపెనీలు సీఈఓల జీతభత్యాల గురించి బహిరంగంగా చర్చించవు.అందుకు కారణాలు వేరే ఉన్నాయి..ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 'జీరో శాలరీ'తో షేర్ల ద్వారా తన బిలియన్ డాలర్ల దాహం తీర్చుకుంటున్నారు. లిథియమ్ మెటల్ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే అమెరికన్ స్టార్టప్ 'క్వాంటమ్స్కేప్ కార్పొరేషన్' సీఈఓగా భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్ కు కంపెనీ శాలరీ రూపంలో కాకుండా వాటాల రూపంలో షేర్లను కట్టబెట్టినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. వాటి విలువ అక్షరాల మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. మరి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? ►యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏడాదికి రూ.733 కోట్లు తీసుకుంటున్నారని సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. అదనంగా సెక్యూరిటీ, ప్రైవేట్ జెట్ వంటి సౌకర్యాల్ని యాపిల్ కల్పిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ►సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ప్రకారం.. కుక్ బేసిక్ శాలరీ సంవత్సరానికి రూ.89.20 కోట్లు ఉండగా.. ఎన్నిరాన్ మెంటల్ సస్టైనబులిటీ గోల్స్ (ఆఫీస్, ఉద్యోగుల కోసం) కింద రూ.10.33 కోట్లు ►ప్రైవేట్ జెట్ కోసం రూ. 5,29,66,072.92 కోట్లు ►సెక్యూరిటీ కోసం రూ.4,68,80,781.95 కోట్లు ►విహార యాత్రల కోసం రూ.17,15,534.95 కోట్లు ►ఎంప్లాయి రిటైర్మెంట్ ప్లాన్ కింద (401(k) plan) రూ.12,93,509.04 కోట్లు ►స్టాక్స్ అవార్డ్ కింద రూ.6,133.02కోట్లు 2021లో యాపిల్ భారీ లాభాల్ని గడించినట్లు ఎస్ఈసీ తెలిపింది. వరల్డ్ వైడ్గా లాక్డౌన్, కోవిడ్ విజృంభించినా యాపిల్ అమ్మకాలు వృద్దుతంగా జరిగినట్లు ఎస్ఈసీ తన నివేదికలో పేర్కొంది. ఆపిల్ సుమారు 33 శాతం ఆదాయ వృద్ధితో పాటు అమ్మకాలలో రూ.27,130.47 కోట్లని నివేదించింది. చదవండి: జాక్పాట్ కొట్టాడు! ఏకంగా 15వేల కోట్ల రూపాయల ప్యాకేజీ