-
ముంబైపై ఢిల్లీ పైచేయి
-
మంచి మనసు చాటుకున్న తిలక్ వర్మ.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ మంచి మనసు చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతుగా వచ్చిన చిన్నారులకు ఊహించని బహుమతి ఇచ్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్పై విజయంలో తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ లెఫ్టాండర్.. సూర్యకుమార్ యాదవ్(78)తో కలిసి ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. The 𝕊𝕦𝕡𝕝𝕒 shot we've been waiting for 🤌#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/XyiGgWs0fN — JioCinema (@JioCinema) April 18, 2024 మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 34 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు తిలక్ వర్మ. అంతేకాదు.. ముంబై విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రమాదకరంగా మారిన పంజాబ్ కింగ్స్ సంచలనం శశాంక్ సింగ్(25 బంతుల్లో 41) వికెట్ పడగొట్టడంలో భాగస్వామ్యమయ్యాడు కూడా! పంజాబ్ ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపాడు. మిడ్ వికెట్ ఫీల్డ్ పొజిషన్లో ఉన్న తిలక్ వర్మ ఏమాత్రం పొరపాటు చేయకుండా వేగంగా కదిలి క్యాచ్ అందుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన ముంబై ఎట్టకేలకు తొమ్మిది పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఫలితంగా సొంతమైదానం ముల్లన్పూర్లో పంజాబ్ గెలుపొందితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో విజయానంతరం డ్రెస్సింగ్రూంకు వెళ్తున్న తరుణంలో తిలక్ వర్మ.. టెస్టు జెర్సీలు వేసుకున్న ముగ్గురు అమ్మాయిలు ఇంకా స్టేడియంలో ఉండటాన్ని గమనించి.. తన బ్యాటింగ్ గ్లోవ్స్ను వారి వైపునకు విసిరాడు. ఆ ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు గ్లోవ్స్ను క్యాచ్ పట్టి థాంక్యూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పాటు.. ఓ కీలక క్యాచ్ అందుకున్నాడు. అలాగే ఇద్దరు వర్ధమాన క్రికెటర్లు తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ కారణాన్ని కూడా చూపించాడు. తిలక్ వర్మ హ్యాట్సాఫ్’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది టీమిండియాలోనూ అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికీ ముంబై ఫ్రాంఛైజీతో కొనసాగుతున్న ఈ తెలుగు తేజం తిలక్.. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి 208 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ముంబై ఈ ఎడిషన్లో ఏడింట మూడు విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో Scored 34* (18), took an important catch and this… Gave two budding cricketers a reason to believe in their dreams. Tilak Varma, 🙏👍🥹#MumbaiMeriJaan #MumbaiIndians #PBKSvMI | @TilakV9 pic.twitter.com/nZIifQAcZh — Mumbai Indians (@mipaltan) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్కతా నైట్రైడర్స్కు.. హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్కు.. హైదరాబాద్కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
ఐపీఎల్కు ముందు సిక్సర్ల వర్షం కురిపించిన తిలక్ వర్మ..
ఐపీఎల్-2024 సీజన్కు మరో రెండు రోజుల్లో తెరలేవనుది. మార్చి 22న చెపాక్ వేదికగా తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ క్యాష్రిచ్ లీగ్ కోసం ఇప్పటికే మొత్తం అన్ని జట్లు తమ అస్త్ర, శాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు తిలక్ వర్మ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2022 సీజన్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఈ యువ సంచలనం.. 740 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలోనూ వర్మ సత్తాచాటాడు. ఏకంగా మూడు సెంచరీలను తిలక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే దూకుడును ఐపీఎల్లోనూ కొనసాగించాలని ఈ హైదరాబాదీ ఊవ్విళ్లరుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 24 అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. చదవండి: Hardik Pandya: అప్పటికే ఫిట్గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే! Tilak’s bat striking the 𝐩𝐞𝐫𝐟𝐞𝐜𝐭 chord in the nets 🎶🤌#OneFamily #MumbaiIndians #NetSetGo @TilakV9 pic.twitter.com/jcsT3NfYBX — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల వయసులో వీళ్లకు ఛాన్స్! రూ. కోటి..
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్ల(2023-24)లో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?! రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్లు, 31 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్ రింకూ సింగ్ రెండు మ్యాచ్లలో కలిపి 55 పరుగులు సాధించాడు. నంబూరి తిలక్ వర్మ హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అండర్19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ గోల్డ్ మెడల్ అందించాడు. శివం దూబే సీఎస్కే స్టార్ క్రికెటర్, ముంబై పేస్ ఆల్రౌండర్ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు. రవి బిష్ణోయి రాజస్తాన్కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్. ముకేశ్ కుమార్ బెంగాల్ పేసర్, 30 ఏళ్ల ముకేశ్ కుమార్ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్ బౌలర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ప్రసిద్ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ మధ్యప్రదేశ్కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్. 27 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు. రజత్ పాటిదార్ లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్. 1993లో ఇండోర్లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు. జితేశ్ శర్మ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్హ్యాండర్ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు -
రెచ్చిపోయిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!
నవీ ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20లో టోర్నీలో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ఆడుతున్న తిలక్.. సెంట్రల్ రైల్వే టీమ్తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 43 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్.. సహచరుడు శివాలిక్తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్కు రిలయన్స్ 1 స్టార్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇదే టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ రెండో మ్యాచ్లోనే జట్టులో కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ మళ్లీ గాయం బారిన పడ్డాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. హార్దిక్, తిలక్ ఇద్దరు ముంబై ఇండియన్స్కు ఆడనున్న విషయం తెలిసిందే. చదవండి: హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. తొలి మ్యాచ్లోనే..! -
IPL 2024: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ
టీమిండియా యువ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తిలక్ వర్మ గురువారం షేర్ చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ చాంపియన్గా హైదరాబాద్ అవతరించిన విషయం తెలిసిందే. తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ ఫైనల్లో మేఘాలయను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అదే విధంగా వచ్చే ఏడాది ఎలైట్ గ్రూపులో తలపడే అవకాశం దక్కించుకుంది. తిలక్ వర్మ కెప్టెన్గా, బ్యాటర్గా రాణించి జట్టుకు ఈ మేరకు విజయాలు అందించాడు. ఇక తదుపరి అతడు ఐపీఎల్-2024తో బిజీ కానున్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ త్వరలోనే జట్టు శిక్షణా శిబిరంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటిన తిలక్ వర్మను ఐపీఎల్-2022కు ముందు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత రెండు సీజన్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. వరుసగా 397, 343 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ వెస్టిండీస్తో 2023 టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు, 4 వన్డేలు ఆడి .. ఆయా ఫార్మాట్లలో 336, 68 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్లో లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్లలో తొలి మ్యాచ్ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
దుమ్ములేపిన తిలక్ సేన.. చాంపియన్గా హైదరాబాద్
రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. మేఘాలయ టీమ్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్- మేఘాలయ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 17న మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బ్యాటింగ్ చేసింది. 83 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో చెలరేగగా.. రోహిత్ రాయుడు మూడు, రిషభ్ బస్లాస్, కెప్టెన్ తిలక్ వర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది. కె.నితేశ్రెడ్డి సెంచరీ(122)తో ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ ప్రజ్ఞయ్రెడ్డి అజేయ శతకం(141 బంతుల్లో 102 పరుగులు) సాధించాడు. మరోవైపు.. కెప్టెన్ తిలక్ వర్మ 44 పరుగులతో రాణించాడు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మేఘాలయను లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ మరోసారి దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 5 వికెట్లు తీసి మేఘాలయ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో 243 పరుగులకే మేఘాలయ కథ ముగిసింది. ఈ క్రమంలో 198 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(62), కెప్టెన్ తిలక్ వర్మ(64) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. తాజా సీజన్లో ప్లేట్ గ్రూప్లో ఉన్న హైదరాబాద్, మేఘాలయ ఇప్పటికే ఎలైట్ డివిజన్కు అర్హత సాధించాయి. వచ్చే ఎడిషన్లో ఎలైట్ గ్రూపులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, మంగళవారం ముగిసిన ఫైనల్లో మేఘాలయపై పైచేయి సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది హైదరాబాద్. తద్వారా ప్లేట్ గ్రూపు చాంపియన్గా అవతరించింది. -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్తో మ్యాచ్లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
తిలక్ వర్మ మెరుపు సెంచరీ.. హైదరాబాద్ ఘన విజయం
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ప్లేట్ గ్రూప్లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ మెరుపు సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న వర్మ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సెంచరీలతో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సిక్కిం.. హైదరాబాద్ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్లో కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో త్యాగరాజన్ 6 వికెట్లతో సిక్కి పతనాన్ని శాసించగా.. మిలాంద్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ను 463/4 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తిలక్తో పాటు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137; 125 బంతుల్లో) కూడా సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం 384 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన సిక్కిం 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఈ ఏడాది రంజీ సీజన్లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఆ రెండూ క్లిష్టమైనవే! -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
తొలిరోజే దంచికొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు.. 302 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Sikkim Day 1 - Hyderabad lead by 302 runs: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ రంజీల్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆరంభమైన తర్వాత దేశవాళీ జట్టుకు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా అఫ్గన్తో జరిగిన తొలి టీ20లో వన్డౌన్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20తో విరాట్ కోహ్లి పునరాగమనం చేసిన నేపథ్యంలో తిలక్పై వేటు పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు ఈ హైదరాబాద్ బ్యాటర్. ఈ క్రమంలో శుక్రవారం నాటి హైదరాబాద్- సిక్కిం మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. 79 పరుగులకే సిక్కిం ఆలౌట్ ఈ మ్యాచ్లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హైదరాబాద్ బౌలర్లు టి.త్యాగరాజన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సీవీ మిలింద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు సిక్కిం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(137), గహ్లోత్ రాహుల్ సింగ్(83) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. వరుసగా రెండు విజయాలు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ తిలక్ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న చందన్ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. రంజీ తాజా సీజన్లో ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది. తిలక్(అజేయ సెంచరీ) సారథ్యంలో నాగాలాండ్పై, గహ్లోత్ రాహుల్ సింగ్ కెప్టెన్సీలో మేఘాలయపై గెలుపొందింది. తాజాగా మళ్లీ తిలక్ నేతృత్వంలో ఆడుతున్న హైదరాబాద్ ఈసారి సిక్కింను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక రంజీ సీజన్-2024లో హైదరాబాద్కు ఇది మూడో మ్యాచ్! చదవండి: Ranji Trophy 2024: బ్యాట్తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
రోహిత్, పంత్లను అధిగమించిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ విషయంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్లను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20 అనంతరం యశస్వి సాధించిన ఈ ఘనతకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి. టీ20ల్లో 23 ఏళ్లు దాటక ముందే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు రిషబ్ పంత్, అప్ కమింగ్ ప్లేయర్ తిలక్ వర్మల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్, పంత్, తిలక్ ముగ్గురూ 23 ఏళ్లు దాటకముందు రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. యశస్వి ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. 22 ఏళ్ల యశస్వి 16 టీ20ల్లోనే 163.83 స్ట్రయిక్రేట్తో 498 పరుగులు చేశాడు. Young and unstoppable! Yashasvi Jaiswal notches up five fifties in T20Is before turning 23, setting a new record for the most by an Indian player. pic.twitter.com/IFNTeB35iW— CricTracker (@Cricketracker) January 16, 2024 కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసిన యశస్వి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వితో పాటు శివమ్ దూబే (63 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ (57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అర్ష్దీప్ 3, అక్షర్, భిష్ణోయ్ తలో 2 వికెట్లు, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో దూబే, జైస్వాల్ భారత్ ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది. -
Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్
India vs Afghanistan, 2nd T20I- Virat Kohli Re-Entry: అఫ్గనిస్తాన్తో సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పునరాగమనం చేయనున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి మ్యాచ్కు దూరమైన ఈ రన్మెషీన్.. ఇండోర్లో రెండో టీ20కి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ప్రకటించాడు. కోహ్లి రాక.. వేటు ఎవరిపై? మరి.. సీనియర్ ప్లేయర్, స్టార్ బ్యాటర్ కోహ్లి తిరిగి టీ20 జట్టుతో చేరితే ఎవరిపై వేటు పడనుంది?! మొహాలీ వేదికగా అఫ్గన్తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. లెఫ్టాండర్ యశస్వి తిరిగి వస్తే లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం రోహిత్కు జోడీగా యశస్వి జైస్వాల్ను ఆడిస్తామని ద్రవిడ్ ముందే చెప్పినప్పటికీ.. గజ్జల్లో గాయం కారణంగా జైస్వాల్ సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో గిల్ను అదృష్టం వరించింది. మరోవైపు.. కోహ్లి గైర్హాజరీలో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మకు వన్డౌన్లో ఆడే అవకాశం దక్కింది. సాధారణంగా తిలక్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో వస్తాడు. అయితే, తొలి టీ20లో మాత్రం అతడు టాపార్డర్కు ప్రమోట్ అయ్యాడు. తిలక్ వర్మ సైతం.. ఇక ఈ మ్యాచ్లో గిల్తో సమన్వయలోపంతో రోహిత్ శర్మ రనౌట్(డక్) కాగా.. గిల్ 12 బంతుల్లోనే 23 పరుగులతో రాణించాడు. తిలక్ వర్మ సైతం 22 బంతుల్లో 26 రన్స్ సాధించాడు. ఇలా వీరిద్దరు తమ వంతు బాధ్యతను చక్కగానే పూర్తి చేశారు. అయితే.. అఫ్గనిస్తాన్తో రెండో టీ20కి కోహ్లితో పాటు.. ఒకవేళ యశస్వి జైస్వాల్ కూడా అందుబాటులోకి వస్తే వీళ్లిద్దరిలో ఒకరిపై వేటు పడటం ఖాయం. ముఖ్యంగా వీరిద్దరి రాకతో గిల్కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే.. ఓపెనర్గా యశస్వి, వన్డౌన్లో కోహ్లి ఆడితే.. బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఏ స్థానంలో గిల్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. యశస్వి రాకుంటే అలా కాకుండా.. గిల్ అదృష్టం బాగుండి యశస్వికి విశ్రాంతిని పొడిగిస్తే మాత్రం అతడికి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు తిలక్ వర్మ ప్లేస్ గల్లంతవుతుంది. కోహ్లి కోసం తిలక్ తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా అఫ్గనిస్తాన్తో తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వాషీని వద్దనుకుంటే.. అప్పుడు సేఫ్ ఒకవేళ.. షార్ట్ బౌండరీలకు ప్రసిద్ధి పొందిన ఇండోర్ పిచ్పై బ్యాటింగ్ డెప్త్ కోసం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాలనుకుంటే అప్పుడు వాషింగ్టన్ సుందర్పై వేటు పడే అవకాశం ఉంటుంది. తొలి టీ20 హీరో శివం దూబే(పేస్ ఆల్రౌండర్), అక్షర్ పటేల్(స్పిన్ ఆల్రౌండర్), రవి బిష్ణోయి(స్పిన్నర్), పేసర్లు అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్లను ఆడించి .. వాషీని పక్కనపెడితే అప్పుడు తిలక్ కూడా సేఫ్గానే ఉంటాడు. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతడు 20 బంతుల్లోనే 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్ను కాదని సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి రెండో టీ20లో సంజూకు మరోసారి మొండిచేయే ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అఫ్గనిస్తాన్తో రెండో టీ20(జనవరి 14)కి భారత జట్టు(అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు -
రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ!
Someone like Rinku Singh will miss out: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20 పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాల రాకతో భారత జట్టు మరింత పరిపుష్టమైందని.. మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ వీరిద్దరిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించారు. అప్పుడే గత చేదు అనుభవాలను మరపిస్తూ ఈసారి టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎందుకు తిరిగి రప్పించారు? అయితే, ఒకప్పటి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దీప్దాస్ గుప్తా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను తిరిగి రప్పించడం వెనుక సెలక్టర్ల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. గత వరల్డ్కప్ టోర్నీలో వైఫల్యం తర్వాత దాదాపు 14 నెలలుగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్లను మళ్లీ ఇప్పుడు ఆడిస్తే ఫలితం ఏముంటుందని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు ఎలా? ‘విరాహిత్’ ద్వయం రీఎంట్రీ కారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని దీప్దాస్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వస్తే రింకూతో పాటు తిలక్ వర్మ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో కచ్చితంగా గందరగోళం నెలకొంటుందని స్టార్ స్పోర్ట్స్ షోలో దీప్దాస్ గుప్తా వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ అవసరమా? ‘‘టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పక్కనపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోందని అనుకున్నాను. కానీ సెలక్టర్ల నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. టీ20 వరల్డ్కప్-2022లో సీనియర్ ప్లేయర్లు ఉన్నా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయాం కదా! కానీ మళ్లీ మరోసారి అదే పునరావృతం చేస్తున్నారు. వెస్టిండీస్ పిచ్ల మీద 160, 180, 200 పరుగుల స్కోరు ఆశిస్తున్నారా? గతేడాదితో పోలిస్తే ఇప్పటి జట్టును చూస్తుంటే టీమిండియా మళ్లీ తిరోగమిస్తోందనిపిస్తోంది. రోహిత్, కోహ్లిలను మళ్లీ తీసుకురావడంలో ఇంతకంటే గొప్ప అర్థమేముంది? రింకూలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి నిర్ణయాల వల్ల రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు జట్టులో చోటే కష్టమవుతుంది. కేవలం అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ గురించి కాకుండా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని సమాలోచనలు చేయాలి. ప్రస్తుతం రింకూ, యశస్వి తమను తాము నిరూపించుకుని పెద్ద మ్యాచ్లలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం రోహిత్, కోహ్లి, పాండ్యా, సూర్యలతో నిండిపోతే రింకూ, తిలక్ వర్మ లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి?’’ అని దీప్దాస్ గుప్తా ఈ సందర్భంగా ప్రశ్నలు లేవనెత్తాడు. కాగా బెంగాల్కు చెందిన దీప్దాస్ టీమిండియా తరఫున 8 టెస్టుల్లో 344, 5 వన్డేల్లో 51 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లి- రోహిత్ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్తో మ్యాచ్లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా
రంజీ ట్రోఫీ-2024 సీజన్లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ సింగ్ గహ్లోత్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్ 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా 157 బంతులు ఎదుర్కొన్న రాహుల్ సింగ్.. 23 ఫోర్లు, 9 సిక్స్లతో 214 పరుగులు చేశాడు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్ సింగ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాహుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో వాంఖడేలో బరోడాతో జరిగిన మ్యాచ్లో బాంబే (ప్రస్తుతం ముంబై) తరఫున 123 బంతుల్లో శాస్త్రి తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 76.4 ఓవర్లలో 5 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో రాహుల్తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) నమోదు చేశాడు. చదవండి: #David Warner: ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ? -
సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. ధనాధన్ ఇన్నింగ్స్
Ranji Trophy 2023-24 Hyd Vs NGL: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్ములేపాడు. నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా దేశవాళీ టెస్టు ఫార్మాట్ టోర్నీ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా తొలి వికెట్గా వెనుదిరిగాడు. అయితే, అతడి స్థానంలో వన్డౌన్లో దిగిన గహ్లోత్ రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్లో ఏకంగా 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ.. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి హైదరాబాద్ 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు. -
Tilak Varma: క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే: అక్షర్ పటేల్
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో చెమటోడుస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే మరో టీమిండియా స్టార్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లోనూ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ గా తిలక్ వర్మ
దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్ల్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత జట్టు సభ్యుడు ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రాహుల్ సింగ్ గహ్లోత్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో పోటీపడ్డ హైదరాబాద్ తమ గ్రూప్లో చివరిస్థానంలో నిలవడంతో ఈసారి ‘ప్లేట్’ డివిజన్లో పోటీ పడనుంది. ‘ప్లేట్’ డివిజన్లో హైదరాబాద్తోపాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ప్రదేశ్ జట్లున్నాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను జనవరి 5 నుంచి నాగాలాండ్తో, రెండో మ్యాచ్ను జనవరి 12 నుంచి మేఘాలయతో ఆడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్ ), రాహుల్ సింగ్ గహ్లోత్ (వైస్ కెప్టెన్ ), తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, టి.రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహని, కార్తికేయ కక్, నితేశ్ కన్నల, సాయిప్రజ్ఞయ్ రెడ్డి, సాకేత్ సాయిరామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా, ఇ.సంకేత్. స్టాండ్బైస్: రాహుల్ బుద్ధి, జావీద్ అలీ, యశ్ గుప్తా, రిషబ్ బస్లాస్, టీపీ అనిరుధ్, గణేశ్. డీబీ రవితేజ (హెడ్ కోచ్), పవన్ కుమార్ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రియాజ్ ఖురేషి (టీమ్ మేనేజర్), సుభాశ్ పాత్రో (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), సంతోష్ (ఫిజియో), కృష్ణా రెడ్డి (వీడియో ఎనలిస్ట్), సాజిద్ హుస్సేన్ (మసాజర్). -
ఆవేశ్ ఖాన్కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టాపార్డర్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్డౌన్లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ..
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగనుంది. తిలక్ వర్మకు డిప్యూటీగా రాహుల్ సింగ్ గహ్లౌట్ ఎంపికయ్యాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో జనవరి 5న నాగాలాండ్తో తలపడనుంది. కాగా తిలక్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వైట్బాల్ సిరీస్లలో భాగమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ గహ్లౌత్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, సివి మిలింద్, రోహిత్ రాయుడు, రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహాని, కార్తికేయ కాక్, నితేష్ కన్నాల, సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), సాకేత్ సాయి రామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా (వికెట్ కీపర్),సంకేత్