-
అసంతృప్తి జ్వాలలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
-
ఆందోళనలతో ‘కూటమి’ కుతకుత
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్/డోన్/కాళ్ల/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/వెంకటగిరి రూరల్ (తిరుపతి జిల్లా)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా)/దేవరపల్లి: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబును ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి విలేకరుల సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నరసరావుపేట మండలం పాలపాడులోని తన స్వగ్రహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరవిందబాబుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇంకా పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తి, మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇప్పించేందుకు ఆయన పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ద్రోహి శ్రీకృష్ణదేవరాయలు అని మండిపడ్డారు. అనంతరం పక్కనే ఉన్న పురుగుమందు డబ్బాను అందుకుని తాగారు. కార్యకర్తలు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇదంతా చదలవాడ ఆడిస్తున్న డ్రామా అని ప్రత్యర్థివర్గాలు ఆరోపిస్తున్నాయి. కేఈ, కోట్లది చీకటి ఒప్పందం కేఈ, కోట్ల కుటుంబాలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని తాము మాత్రమే డోన్ రాజకీయాలను శాసించాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే తాను పార్టీని బతికించానని, రెండున్నరేళ్ల క్రితమే తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మోసం చేసింది : శివరామరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో బుధవారం జైన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తే తనను అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు. కష్టపడిన వారికి గుర్తింపు లేదు టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగర్ల మస్తాన్యాదవ్ విమర్శించారు. తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలోని తనచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోసం సేవ చేస్తే చివరకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మస్తాన్ యాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్దిపాటిని మార్చకుంటే బరిలోకి రెబల్ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజును మార్చకుంటే పార్టీలో తిరుగుబాటు తప్పదని కార్యకర్తలు హెచ్చరించారు. బుధవారం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్ హాల్లో మద్దిపాటి వ్యతిరేకవర్గం సమావేశమైంది. మద్దిపాటిని మార్చకుంటే రెబల్ అభ్యర్థిని బరిలో దింపుతామని అలి్టమేటం జారీ చేశారు. బొజ్జలకు మద్దతు లేదు బొజ్జల సుదీర్రెడ్డికి తాము మద్దతివ్వలేదని మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య స్పష్టం చేశారు. ఎస్సీవీ నాయుడు స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సు«దీర్రెడ్డి తమను కలిశారని, అయితే మద్దతిస్తున్నట్టు ఆయనకు తాము చెప్పలేదని పేర్కొన్నారు. తానూ చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే టికెట్ కోరతానని స్పష్టం చేశారు. బలిచ్చే మేకపోతు మాకొద్దు విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్కు ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో సాధిక్ కార్యాలయం వద్ద వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్ వర్గీయులు బుధవారం బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. దీంతో సాధిక్, వీరమహిళలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ‘‘బలిచ్చే మేకపోతు మాకొద్దు’’ అంటూ ఓ మేకను తీసుకొచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. -
లాలూతో పప్పు యాదవ్ భేటీ.. మాధేపురా సీటుకు వినతి!
బీహార్కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. -
వరుణ్కు టిక్కెట్ ప్లాన్ చేసిన అఖిలేష్?
లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూపీలోని పిలిభిత్ స్థానానికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్వాదీ పార్టీ వరుణ్గాంధీని బరిలోకి దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడి టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ మార్చి 28. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఏప్రిల్ 30. ఎన్నికల తేదీ ఏప్రిల్ 19. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
AP,TG: చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్భాషాకి టికెట్ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్బాబుకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్కుమార్రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
దర్శి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
దర్శి: టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గోరంట్ల రవికుమార్కు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, వివిధ హోదాల్లోని నాయకులతో ఆ పార్టీ కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దర్శి మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, ముండ్లమూరు మాజీ ఎంపీపీ వెంకట్రావు, కురిచేడు మండల మాజీ అధ్యక్షుడు నాగరాజు, దొనకొండ మండల అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఎవరినడిగి రవికుమార్ను ఇన్చార్జిగా రవికుమార్కు ఇచ్చారంటూ అధిష్టానంపై మండిపడ్డారు. అధిష్టానానికి అనుకూలంగా ఉండే రియల్టర్లు, డబ్బున్న వాళ్లను తెచ్చుకుంటున్నారని, వాళ్లు ఇక్కడ ఓడిపోగానే వెళ్లిపోతున్నారని, దీంతో ఇక్కడ పార్టీకి దిక్కు లేకుండాపోతోందన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లందరికీ దర్శి కనబడుతుందని, బయట నుంచి వచ్ఛిన మన్నెం వెంకటరమణ, కదిరి బాబూరావు, శిద్ధా రాఘవరావు, పమిడి రమేష్, వేమా సుబ్బారావు వంటివారు ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయారని, అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వవద్దని కోరారు. స్థానికులు కాకపోవడం వల్ల ఓడిన వెంటనే వెళ్లిపోయి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక రాజీనామాలకు సిద్ధం దర్శి సీటును జనసేనకు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదని.. ఇక్కడ నివాసం ఉండే వారికే టికెట్ వ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని సర్పంచ్లు, మండల టీడీపీ అధ్యక్షులు, అన్ని హోదాల్లో ఉన్న నాయకులు రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ లేకపోయినా పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం బాధాకరమన్నారు. మూడేళ్లుగా టీడీపీకి నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం, స్థానిక నాయకులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. దీంతో సమావేశం ఆద్యంతం రసాభాసగా మారింది. గతంలో ఇన్చార్జిలను ప్రకటించినప్పుడు ఏం చేశారని రవికుమార్కు మద్దతుగా కొందరు మాట్లాడారు. దీంతో పారీ్టలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. -
టీడీపీలో ఎగసిన ఆగ్రహ జ్వాలలు
పొత్తుల వ్యవహారం పలు జిల్లాల్లో చిచ్చురేపింది. ఇప్పటికే జనసేన పొత్తు ఖరారు కాగా.. తాజాగా బీజేపీ కూడా చేతులు కలపడం.. సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల శనివారం తమ అనుచరులతో నిరసన గళాలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతుంటే తమ ఆశలను నట్టేటా ముంచారని అధినేతపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పలు చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. యలమంచిలి రూరల్/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, పుట్టపర్తి/పాడేరు: పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జనసేనకు టికెట్ కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు తీవ్ర అన్యాయం చేశారని పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రగడ నాగేశ్వర్రావుకు మొండిచెయ్యి చూí³స్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సీనియర్లతోపాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. పోలవరంలో పొత్తు రగడ ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తు రగడ తారస్థాయికి చేరింది. టికెట్ జనసేనకు కేటాయించామని టీడీపీ నేతలకు పార్టీ స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం తెలుగుదేశం పార్టీలో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఏళ్ల తరబడి నుంచి టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించవద్దంటూ జిల్లా అధ్యక్షుడు మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ విన్నవించారు. కట్ చేస్తే.. ఈ సీటు జనసేనకు కేటాయించి.. పొత్తు ధర్మం పాటించండి అంటూ చంద్రబాబునాయుడు నుంచి ఫోన్ రావడంపై బొరగం శ్రీనివాస్ వర్గం మండిపడుతోంది. శనివారం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ నేతృత్వంలో బుట్టాయగూడెంలో ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సీటు ఇవ్వకపోతే సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయోమయంలో టీడీపీ శ్రేణులు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని సీటు వరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సారీ జనసేనకో, బీజేపీకో కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ‘శంఖారావం’ను పట్టించుకోని నేతలు నారా లోకేశ్ చేపట్టిన శంఖారావ సభలు ‘శంకా’రావాలుగా మారిపోతున్నాయి. పుట్టపర్తి జిల్లాలో శంఖారావ సభలకు శుక్రవారం వచ్చిన లోకేశ్ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తారని స్థానిక టీడీపీ నేతలు భావించారు. కానీ ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఫలితంగా ధర్మవరం టికెట్ ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్, కదిరిపై ఆశలు పెట్టుకున్న వెంకటప్రసాద్, పుట్టపర్తి టికెట్ కోరుతున్న పల్లె రఘునాథరెడ్డి అలకబూనారని తెలిసింది. బీజేపీతో పొత్తులో భాగంగా హిందూపురం పార్లమెంటులో ఏ సీటు ఇస్తారనే దానిపై టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. లోకేశ్ శంఖారావం సభలను కీలక నేతలు పట్టించుకోలేదు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, పెనుకొండలో బీకే పార్థసారథి వర్గాలు లోకేశ్ సభలకు గైర్హాజరయ్యాయి. నాయకులు పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి లేకుండా ఫ్లెక్సీలు, పేపరు ప్రకటనలు రావడం గమనార్హం. పల్లెకు టికెట్ వద్దని కొందరు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది. -
బండారు కథ కంచికి!
పెందుర్తి (విశాఖ జిల్లా): బండారు సత్య నారాయణమూర్తి... 40 ఏళ్ల రాజకీయానుభవం. ఐదుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి.. కానీ ఏం లాభం. చంద్రబాబు ఛీ పొమ్మన్నారు. టికెట్ లేదనేశారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్లకు టికెట్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో బండారు భవిష్యత్తు డోలాయమానంలో పడింది. బీసీలపై చంద్రబాబు చూపించే కపట ప్రేమకు బండారు ఉదంతమే తాజా ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మెప్పు కోసం అధికార పక్షంపై, మహిళా మంత్రి రోజాపై బండారు నోరు పారేసుకుని అభాసుపాలయ్యారు. పార్టీ కోసం చేతి చమురు వదిలించుకున్నారు. అయినా వాడుకుని వదిలేసే చంద్రబాబు చివరకు అదే చేశారు. తన అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, వియ్యంకుడైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుల సిఫార్సులు కూడా బండారును గట్టెక్కించలేక పోయాయి. దీంతో టికెట్ రేసు నుంచి తప్పుకుని పత్తాలేకుండా పోయారు. రెండు వారాలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు. ముఖ్యమైన ఏ సమావేశంలోనూ కనిపించడం లేదు. ఇటీవల టీడీపీ–జనసేన ఉమ్మడిగా నిర్వహించిన జెండా, జయహో బీసీ సభలకు కూడా దూరంగా ఉండడంతో కేడర్కు ఏమీ పాలుపోవడంలేదు. ఒక్కసారిగా సీన్ రివర్స్ పెందుర్తి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోనేందుకు ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ–జనసేన పొత్తు పెట్టుకోవడంతో గత కొన్నాళ్లుగా ‘టికెట్ మాదంటే మాది’ అంటూ జనసేన, టీడీపీలు ప్రచారం చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ చరమాంకంలో ఉన్న టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గంపెడాసలు పెట్టుకున్నారు. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో టికెట్ రేసులో పోటీ పడ్డారు. ‘తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే ఆఖరి కదా.. చంద్రబాబు కూడా అవకాశం ఇస్తారు’ అన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేడర్తో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ వేదికలపై అధికార పక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు. మంత్రి రోజాను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో టికెట్ బండారుదేనని టీడీపీ కేడర్ కూడా ధీమాగా ఉంది. అయితే పెందుర్తి టికెట్ కోసం పంచకర్ల రమేష్బాబు పట్టుపట్టడం, సీట్ల పంపకాల్లో కచ్చితంగా పెందుర్తిని జనసేనకే కేటాయిస్తారని బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పంచకర్ల కూడా నియోజకవర్గంలో జోరు పెంచడంతో అవమానభారంతో కేడర్కు బండారు మొహం చూపించట్లేదు. వరుస ఓటములతో అవమానం ఒకప్పుడు రాజకీయంగా వైభవం చూసిన బండారులో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత మరింత జోష్ కనిపించింది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో లెక్కలేని అవినీతి.. కొడుకు అప్పలనాయుడు వ్యవహారశైలి కారణంగా సత్యనారాయణమూర్తి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామం వెన్నెలపాలెంలో సర్పంచ్గా పోటీ చేసిన ఆయన భార్య మాధవీలత సహా పంచాయతీలో పది వార్డుల్లోనూ బండారు అనుచరులు చిత్తుగా ఓడిపోయారు. దెబ్బ మీద దెబ్బ.. చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెన్నెలపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ప్రజాతీర్పును గౌరవించని బండారు ఆ తరువాత పూర్తిగా అదుపు తప్పారు. వరుస ఓటముల అవమానభారంతో అధికార పార్టీపై నోరు పారేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా అని బయటకు ప్రచారం చేసుకుంటున్నా.. జనంలో పూర్తిగా గుర్తింపు కోల్పోయారన్న కారణంతోనే బండారును చంద్రబాబు పక్కన పెట్టారని టీడీపీ నాయకులే అంటున్నారు. -
నమ్మించి ముంచేశారు
సాక్షి, గుత్తి/పెద్దతిప్పసముద్రం/నిడదవోలు/పిఠాపురం/నెల్లూరు: నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్న చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇంతవరకు పార్టీని అంటిపెట్టుకున్న తాము అంటరానివారైపోయామని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నేతల అనుచరవర్గాలు దీన్ని జీర్ణించుకోలేక రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గుమ్మనూరుకు సీటిస్తే ఓడిస్తాం మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టీడీపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు గుత్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా నుంచి గాందీ, రాయల్, ఎన్టీఆర్ సర్కిళ్ల వరకు ర్యాలీ చేశారు. ‘గుమ్మనూరు వద్దు, జితేందర్ గౌడ్ ముద్దు’, ‘ఆలూరులో పనికి రాని చెత్త గుంతకల్లులో పనికి వస్తుందా’, ‘పేకాట, మద్యం గుమ్మనూరు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ... గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే సీటు ఇస్తే డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడిస్తామన్నారు. రౌడీ భావజాలమున్న గుమ్మనూరుకు సీటు ఇస్తే ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 35 సంవత్సరాల పాటు జితేందర్ గౌడ్ కుటుంబం టీడీపీకి సేవలు చేసిందని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి పేకాట నిర్వాహకుడు గుమ్మనూరుకు ఎలా సీటు కేటాయిస్తారని ప్ర శ్నించారు. టి.సదుంలో ఉద్రిక్తత అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో విభేధాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్కే అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైందని అనుకుంటున్న సమయంలో రాజకీయ అరంగేట్రానికి తెర లేపిన జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై పునరాలోచించి ప్రజాదరణ ఉన్న శంకర్కు టికెట్ కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఇటీవల రోడ్లెక్కి నిరసనలకు దిగారు. తాజాగా గురువారం టి.సదుంలో జయచంద్రారెడ్డి ఇంటింటా ప్రచారానికి రావడంతో ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి జయచంద్రారెడ్డి కారు అద్దాలను పగులగొట్టాడు. దీంతో కొంతసేపు గ్రామంలో ఘర్షణ నెలకొంది. ఎస్ఐ రవీంద్రబాబు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జయచంద్రారెడ్డి నిరాకరించారు. ఆయన వెంట ప్రచారం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆలయంలో పూజలు నిర్వహించి వెనుదిరిగారు. నిడదవోలులో ఆందోళన పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు నిడదవోలు టికెట్ కేటాయిస్తున్నారనే ప్రచారంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిడదవోలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిడదవోలు పట్టణం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా ప్లకార్డులతో పాదయాత్ర చేపట్టారు. గణేష్ చౌక్ సెంటర్, గణపతి సెంటర్ మీదుగా యర్నగూడెం రోడ్డులోని టీడీపీ పట్టణ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్థిల్లాలి, శేషారావు జిందాబాద్, నిడదవోలు గడ్డ – శేషారావు అడ్డా అంటూ నినదించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, నిడదవోలు టికెట్ శేషారావుకు కాకుండా బయటి వ్యక్తులకు ఎవరికిచ్చినా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కారింకి సాయిబాబు, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల టీడీపీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అతికాల శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. పిఠాపురంలో అసమ్మతి సమావేశం చంద్రబాబుకే క్లారిటీ లేదు.. ఇంక మా భవిష్యత్తుకేం గ్యారెంటీ ఇస్తాడు’ అంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ లేఖలను తగులబెట్టారు. తనకు టికెట్ నిరాకరించి, జనసేనకు కేటాయిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మకు సమాచారం అందడంతో.. టీడీపీ వర్గాలు గురువారం పిఠాపురంలో ఆందోళనకు దిగాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో వర్మకు టికెట్ నిరాకరించడంతో టీడీపీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలను సైతం పట్టుకునేది లేదని చెప్పారు. రాజీనామాలకు సంతకాలు సేకరించారు. వర్మ మాట్లాడుతూ ‘నేనేమన్నా నేరం చేశానా? నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేసిన సేవను గుర్తించి చంద్రబాబు తనకే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, పిఠాపురం వర్మ అడ్డా అని, దానిని వేరేవారికి కేటాయించడానికి ఎవరికీ హక్కు లేదని వ్యాఖ్యానించారు. కోవూరులో పోలంరెడ్డి కుటుంబం కుతకుత కోవూరు టికెట్ విషయంలో రెండు దశాబ్దాల కాలంగా టీడీపీని నమ్ముకున్న పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యండిచ్చారు. ఇటీవలే పార్టీ ఫిరాయించిన వేమిరెడ్డి కుటుంబానికి కోవూరు సీటు ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పోలంరెడ్డి వర్గం మండిపడుతోంది. నిన్నటి వరకు సీటు తనదేనంటూ పోలంరెడ్డి దినేష్రెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలారు. ఇటీవల పార్టీ అధినేత పర్యటనల సమయంలో చేతిచమురు కూడా వదిలించుకుంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కోవూరు సీటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖరారు చేస్తున్నట్లు లీకులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. మూడు సార్లు టీడీపీ తరుపున పోటీచేసి రెండుసార్లు విజయం సాధించారు. పోలంరెడ్డికి అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం తన రాజకీయ వారసుడిగా తనయుడు దినేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధిష్టానం కూడా దినేష్ రెడ్డిని ప్రోత్సహించింది. ఈ క్రమంలో సీటు విషయంలో చంద్రబాబు పేచీ పెట్టడంతో దినేష్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్థంలో పడింది. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంటూ పార్టీ ఫిరాయించిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కోవూరు సీటు ఖరారు చేస్తుండడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అందలం ఎక్కించడం వెనుక కేవలం డబ్బుమూటలే పనిచేస్తున్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. -
సీనియర్లు.. ఎదురు‘తన్నులు’
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు పక్కనపెడుతున్నారు. తొలి జాబితాలో చాలామందికి సీటు నిరాకరించగా వారికి దాదాపు అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సీటు నిరాకరించిన చంద్రబాబు ఆయన కుటుంబంలో ఒకరికి సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో చింతమనేనిని పక్కనపెట్టారు. చంద్రబాబుకు గట్టి మద్ధతుదారుగా ఉన్న తనకు తగిన గుణపాఠం చెప్పారని ఆయన రగిలిపోతున్నారు. చింతమనేని స్థానంలో ఆయన కుమార్తెకి సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో తనను అవమానిస్తున్నారని, పార్టీ కోసం ఇన్నాళ్లూ పని చేయించుకుని ఇప్పుడు పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావుకు సీటు ఖరారు చేయని చంద్రబాబు ఆయన మద్ధతుదారులను సైతం పక్కనపెట్టారు. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటి వారికి సీటిచ్చి తనను కాదనడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కళాకు సర్దిచెబుతున్నా ఆయన మాత్రం ఒప్పుకోకుండా తన సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. లాబీయింగ్ వదలని గంటా.. చంద్రబాబు ససేమిరా ! మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి మరీ ఇరకాటంగా మారింది. ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ధన బలం, తన సామాజికవర్గ బలాన్ని చూపిస్తూ అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం పంపించడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా మాత్రం భీమిలి స్థానం కోసం అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. జనసేన పొత్తులో విశాఖ జిల్లా పెందుర్తిలో తన సీటు ఎగిరిపోతుండడంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే తన తడాఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో వలస నేత వసంత కృష్ణప్రసాద్కు మైలవరంలో అవకాశం ఇస్తుండడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. తనకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని కృష్ణప్రసాద్ అందరికీ చెబుతూ మద్ధతు కోరుతున్నారు. దేవినేని ఉమా మాత్రం చివరి నిమిషంలో అయినా తనకే సీటు ఖరారు చేస్తారనే ఆశతో తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. యరపతినేనికి ఎసరే! ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును గురజాల నుంచి తప్పించాలనే నిర్ణయంతో పల్నాడు ప్రాంత టీడీపీలో అయోమయం నెలకొంది. యరపతినేని స్థానంలో వలస నేత జంగా కృష్ణమూర్తిని పోటీకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు మింగుడుపడడంలేదు. ఆయన్ను నర్సరావుపేట ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నా దానిపైనా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం యరపతినేని గాల్లో ఉన్నారు. మరోవైపు పొత్తులో తెనాలి సీటు జనసేకు పోవడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా తన పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తున్నా ఆయన్ను పట్టించుకున్న వారే లేరు. -
బాబు లీల.. కేడర్ గోల
సాక్షి, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేస్తున్న హడావుడితో తెలుగుదేశం పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. తమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రోజుకో నేత పేరు.. అదీ సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారి పేర్లు వస్తుండటంతో కేడర్ నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కసరత్తు కేడర్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారో, ఎందుకు అలా చేస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఐవీఆర్ఎస్ సర్వే అంటూ కేడర్కు వారి నియోజకవర్గానికి సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు చెప్పి వారు ఆ స్థానంలో పోటీ చేస్తే గెలుసారో లేదో చెప్పండని నిలదీస్తుండటంతో ఏమి చేయాలో కార్యకర్తలకు పాలుపోవడం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటును వసంత కృష్ణప్రసాద్కి ఖరారు చేయడంతో ఉమా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరుకు సిద్ధంగా ఉండాలని ఉమాకు చంద్రబాబు సూచించారు.పెనమలూరులో అభ్యర్థి ఉమా అయితే సమ్మతమేనా అని ఫోన్లు వస్తుండడంతో కేడర్ తెల్లబోతోంది. ఉన్నట్టుండి ఉమాను ఇక్కడకు దిగుమతి చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ఇన్ఛార్జి బోడె ప్రసాద్ తనకు కాకుండా మరొకరికి సీటు ఇస్తే తాను చేతగానివాడిలా చూస్తూ ఊరుకోనంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దేవినేని ఉమా కూడా పెనమలూరులో కొందరు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆరా తీస్తుండటంతో ఇదేమి పరిస్థితంటూ స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావును నిన్నటి వరకు చంద్రబాబు గాల్లో పెట్టారు. మొదటి జాబితాలో ఆయన పేరు గల్లంతైంది. ఇప్పడు ఆయన్ని గురజాల నుంచి నర్సరావుపేటకు మార్చాలనే ఆలోచన చేస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా యరపతినేని అయితే ఎలా ఉంటుందోనని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దీంతో అక్కడి ఇన్ఛార్జి చదలవాడ అరవింద్బాబు వర్గం లబోదిబోమంటోంది. మరోవైపు గురజాలలో వలస వచ్చిన నేత జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వంపై సర్వే చేస్తున్నారు. గురజాలలో తనను కాదని ఉన్నట్టుండి జంగాను తేవడంతో యరపతినేని కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అయితే ఏకంగా జిల్లా దాటించే ప్రయత్నం చేస్తుండడంతో ఉత్తరాంధ్ర టీడీపీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తేవడం, ఆయన నిరాకరిస్తుండటం గందరగోళానికి దారితీసింది. విజయవాడ పశ్చిమ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. మరోవైపు ఆ సీటు తమదేనని జనసేన హడావుడి చేస్తోంది. ఈ మూడు శిబిరాలు నివ్వెరపోయేలా కొత్తగా ఎంకే బేగ్ను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఆయన అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుండటంతో స్థానిక నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
సీటివ్వకపోతే చచ్చిపోతా..!
తాడేపల్లిగూడెం/తణుకు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఏలూరు(టూటౌన్)/గోకవరం: పదేళ్లపాటు టికెట్ ఇస్తానని నమ్మబలికి ఇప్పుడు తణుకు టికెట్ను పొత్తులో టీడీపీకి కేటాయించడం న్యాయం కాదని, తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు హెచ్చరించారు. టికెట్ కేటాయింపుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో ఆయన సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్తోపాటు ఇతర నాయకులు చేపట్టిన బుజ్జగింపులు ఫలించలేదు. తనకు సీటు కేటాయించకపోవడంపై సోమవారం రాత్రి మనోహర్ను ప్రశ్నించేందుకు ఆయన బస చేసిన గెస్ట్హౌస్కు నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన విడివాడను మనోహర్ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విడివాడ తణుకు వెళ్లిపోయారు. తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్కు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. తణుకు టికెట్ను పవన్ గతంలో హామీ ఇచ్చిన విధంగా విడివాడ రామచంద్రరావుకు కాకుండా టీడీపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో రగిలిపోతున్న జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్లో ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన జనసేన, టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ క్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కన్వినర్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన బస చేసిన గెస్ట్హౌస్ని ముట్టడించారు. మనోహర్ బయటికి రావాలని, విడివాడకు న్యాయం చేయాలంటూ నినాదాలిచ్చారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోపల ఉన్న మనోహర్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రగిలిపోయిన శ్రేణులు తోపులాటకు దిగాయి. ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు. ఈ క్రమంలో సహనం నశించిన కార్యకర్తలు గెస్ట్హౌస్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడానికి యత్నించారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీను, కొటికలపూడి గోవిందరావు తదితరులు ప్రయత్నించినా ఎవ్వరూ లెక్కచేయలేదు. ఈ సందర్భంగా విడివాడ మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ పంచాయితీని తణుకులోనే తేల్చుకుంటామని తన అనుచరులతో కలసి వెనుదిరిగారు. అనంతరం మనోహర్ సూచనలతో జిల్లా నాయకులు తణుకు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడివాడ గెస్ట్ హౌస్కు తీసుకొచ్చారు. పదేళ్లపాటు జనసేన టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి టికెట్ల పంపకాల్లో మొండిచేయి చూపడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ప్లెక్సీలను చించేస్తూ జనసేన అధినేత పవన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు నన్ను కాదని మరో వ్యక్తికి తణుకు టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన విడివాడ మండపాక గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన నాయకుడిని పక్కన పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తే సహకరిస్తామని, అంతే తప్ప తెలుగుదేశం జెండా మోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేన పార్టీకి సంబంధం లేని వారిని టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తనతో పాటు తిప్పుకోవడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. మరోవైపు నెల్లూరులో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్ సీటు ఇస్తారని ఆశ పెట్టుకున్న మనుక్రాంత్రెడ్డికి పవన్ కళ్యాణ్ పెద్ద షాకిచ్చారు. పవన్కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని టికెట్ వస్తుందని ఆశిస్తే అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సోమవారం నెల్లూరులోని మినీబైపాస్లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు మాయలోపడి పవన్ మోసపోయాడని వారు మండిపడ్డారు. టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నిరసన సమయంలో మనుక్రాంత్రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. రెడ్డి అప్పలనాయుడు కన్నీటిపర్యంతం పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీనిపై జనసేన, టీడీపీ నేతలు వపన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటును జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మాకు న్యాయం చేయాలి’, ‘రెడ్డి అప్పలనాయుడుకు సీటు ఇవ్వాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవసరమైతే జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు రెబల్గా పోటీలో నిలవాలంటూ నినదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ను టీడీపీకి కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి లోనయ్యారన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి అత్యధికంగా బలం ఉన్న నియోజకవర్గం ఏలూరు అని సర్వేలో మొదటి స్థానం వచ్చిన ఏలూరు సీటుపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందించని పక్షంలో ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. గత ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమించిన రెడ్డి అప్పలనాయుడుకు పొత్తుల పేరుతో మొండిచేయి చూపడాన్ని పార్టీ కార్యకర్తలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల సమావేశం నుంచి లోపలికి వెళుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని చూసిన జనసైనికులు పెద్దగా నినాదాలు చేశారు. కార్యాలయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఫ్లెక్సీల్లోని చంద్రబాబు ఫొటోలను చించేశారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించి, తనకు అన్యాయం చేయడంపై జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరం మండలంలోని అచ్యుతాపురం కనకదుర్గమ్మ ఆలయం వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షా శిబిరాన్ని సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులను పరామర్శించారు. -
సమన్వయం లేనిచోటే సమన్వయ సభ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. ఏ పనైనా కలిసికట్టుగా చేయాలన్న ఓ కట్టుబాటు ఉంటుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనల మధ్య ఇదే కొరవడింది. సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాట్లు దీనికో తాజా ఉదాహరణ. ఈ నెల 28న టీడీపీ, జనసేన సంయుక్తంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా ఏర్పాట్ల పరిశీలనకు రెండు పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని ప్రకటించారు. కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నేతలు 100 మందితో సభ జరిగే ప్రత్తిపాడు ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించి వెళ్లిపోయారు. అంతకు ముందు గురువారం సాయంత్రమే టీడీపీ నాయకులు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పరిశీలన సమయంలో వీరు వారిని, వారు వీరిని పిలవలేదు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం పరిశీలించారని తెలియగానే ఆ సాయంత్రమే టీడీపీ జోన్–2 కోఆర్డినేటర్ నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో హడావుడిగా సమావేశం పెట్టారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు హడావుడిగా ఏర్పాట్లు పరిశీలించి అంతా టీడీపీయే చేస్తోందని, జనసేనది ఏమీ లేదన్నట్టు వ్యవహరించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని తానే మాట్లాడి సెట్ చేశానని, అంతా తామే చేస్తున్నామని జనసేన ఇన్చార్జి మౌత్ పబ్లిసిటీ ప్రారంభించారు. ఇలా ఎవరికి వారుగా పనిచేస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న మాటల యుద్ధం తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వలవల బాబ్జి, జనసేన ఇన్చార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరూ టికెట్ మాదంటే మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెమేనని బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తరువాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడేమని వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రామ్లు నిర్వహించే స్థాయికి ఇది చేరింది. పార్టీలు రెండు దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించనుండటంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావుడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ, బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్ను పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది. -
గ్రూపులతో గుంజాటన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే. విజయనగరంలో మూడు ముక్కలాట... విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు. బేబినాయనకు కేడర్ సమస్య బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్కృష్ణ రంగారావు సీన్లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది. కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు. కోళ్లకు కృష్ణ సెగ శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో అంతా అయోమయం నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు. నిమ్మకకు పెరిగిన అసమ్మతి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’ గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. గంటా పేరుతో గందరగోళం చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు. కురుపాంలో కుమ్ములాట... కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్కుమార్ దేవ్ తనయుడు వీరేశ్దేవ్ కూడా టికెట్కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సాలూరులో ఆగని వర్గపోరు... సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
హే..‘కృష్ణా’ .. ఇదేమి తంటా ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా హఠాత్తుగా దిగిపడుతున్న పారాచూట్ నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తుండటం టీడీపీలో తమ్ముళ్లను కకావికలం చేస్తోంది. జనసేన పొత్తుతోపాటు, బీజేపీతో కూడా ఖాయం అనుకుంటున్న పొత్తు టీడీపీ నేతల టికెట్ అవకాశాలను దెబ్బతీస్తోంది. దీంతో సీనియర్ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొండి చెయ్యి మిగలనుందని స్పష్టం అవుతోంది. దీంతో అసలు పార్టీలో ఏమి జరుగుతోందో అన్న స్పష్టత లేక టీడీపీ తమ్ముళ్లు మరింత గందరగోళానికి గురవుతున్నారు. బొండా ఉమాకు సీటు గండం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేదని భావిస్తున్న బొండా ఉమాకు గడ్డుకాలం మొదలైంది. బీజేపీ పొత్తు రూపంలో ఆయనకు గండం పొంచి ఉంది. దీనికితోడు వంగవీటి రాధా సైతం తనకే సీటు కావాలని పట్టు పడుతుండటంతో విజయవాడ సెంట్రల్ అభ్యర్థి ఎవరన్నది తేలక నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయిస్తే బొండా టికెట్ గల్లంతు కావడం ఖాయం. తిరువూరు తెరపైకి రోజుకో అభ్యర్థి... తిరువూరు నియోజకవర్గంలో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్చార్జిగా శావల దేవదత్తు ఉన్నారు. ఆయనను కాదని కొలికిపూడి శ్రీనివాస్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ మరికొందరు నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తమదే టికెట్ అని చేసుకొంటున్న ప్రచారం అక్కడ తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి కూడా టీడీపీ తరఫున టికెట్ రేసులోకి వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి ఇక్కడికి పారాచూట్ నేతలను తీసుకొస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం నెలకొంది. జగ్గయ్యపేట అభ్యర్థి నేనే‘నయా’ ఇప్పటికే చంద్రబాబు జగ్గయ్యపేట నియోజకవర్గం పర్యటనలో పార్టీ అభ్యర్థిగా శ్రీరాం తాతయ్యను ప్రకటించారు. కానీ అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో టీడీపీ నాయకుడు బొల్లా రామకృష్ణ పేరుతో ‘గెలిస్తే న్యాయం చేస్తా, ఓడినా సాయం చేస్తా, మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా’ అంటూ జగ్గయ్యపేటలో వెలిసిన ఫ్లెక్సీలు అక్కడ టికెట్పై కొత్త చర్చకు దారితీసేలా చేశాయి. చంద్రబాబు ఇప్పటికే ఇన్చార్జిలుగా ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం తమకు బీ ఫాం ఇచ్చే వరకు టికెట్ అనుమానమే అన్న భావనను పలువురు వ్యక్తంచేస్తున్నారు. ఇది క్యాడర్లో తీవ్ర గందరగోళం రేపుతోంది. సీట్లు తన్నుకు పోతున్న పారాచూట్లు... ఇప్పటికే నూజివీడులో కొలుసు పార్థసారథి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పారాచూట్లుగా వచ్చి టికెట్లు తన్నుకుపోయారు. మరోవైపు ఇతర నియోజకవర్గాల్లో కూడా పారాచూట్లకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో పారీ్టకోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మైలవరంలో తెరపైకి కేశినేని చిన్ని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేద్దామనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతో పొత్తు ఆయన సీటుకు ఎసరు పెట్టనుంది. ఎంపీ సీటుపై బీజేపీ కర్చిప్ వేసింది. ఈ నేపథ్యంలో చిన్నికి ఎక్కడైనా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన్ను మైలవరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. అదే జరిగితే మైలవరంపై ఆశలు పెట్టుకున్న వసంతకు ఆశాభంగమే. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పెనమలూరు టికెట్ ఇస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ బోడే ప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. మరోవైపు దేవినేని ఉమా పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. ఇప్పటికే మైలవరంలో టికెట్ ఆయనకు లేదని తేలిపోవడంతో పెనమలూరుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ బోడే వర్గంతోపాటు, వసంత పోటీకి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన కన్ను పెనమలూరుపై పడిందని సమాచారం. అదే జరిగితే బోడే ప్రసాద్, వసంత, దేవినేని ఉమా ముగ్గురి సీట్లు గల్లంతయినట్టే. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
‘పొత్తు’లాటతో అంతర్యుద్ధం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోంది. ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై అందరిలోనూ సందేహం వ్యక్తమవుతోంది. పొత్తులపైనా నిర్దిష్ట నిర్ణయం జరగక దిగువ స్థాయి కేడర్ సతమతమవుతోంది. టికెట్పై స్పష్టత కొరవడడంతో సీనియర్లలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థులెవరన్నది తేలకపోవడంతో ఎక్కడా ఆ హడావుడి మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంటే తమ పార్టీ అధినేత మీనమేషాలు లెక్కించడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. మరోవైపు ప్రతి చోటా పొత్తు ధర్మం పేరుతో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థుల హడావుడి వారిని తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటికే జనంలోకి వైఎస్సార్సీపీ దూసుకుపోతూ... ప్రజల్లో విశ్వాసం కూడగడుతుంటే తాము మాత్రం ఏం చేశామో... భవిష్యత్తులో ఏం చేస్తామో... చెప్పుకోలేక... డీలాపడిపోతోంది. దీనికి తోడు అప్పుడప్పుడు పెదబాబు... ఇటీవల చినబాబు చేసిన పర్యటనలకు ఖర్చులు పెట్టలేక టికెట్లు ఆశిస్తున్న నాయకులు చేతులెత్తేస్తున్నారు. తీరా ఏర్పాటుచేసిన సభల్లో వారి ప్రసంగాలు ఆకట్టుకోలేకపోవడం... సభలు వెలవెలబోవడంతో ఎక్కువమంది పార్టీ వీడే యోచనలో ఉన్నారు. – సాక్షి నెట్వర్క్ బత్తులకు ఉత్తచెయ్యేనా... తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అభ్యర్థిత్వాల వ్యవహారం రోజుకోమలుపు తిరుగుతోంది. ఈ స్థానంలో తమ పార్టీ పోటీచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇప్పటివరకూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణకు తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రూపంలో షాక్ తగిలేలా ఉంది. ఆయనకు కాకుండా జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభేదాలు బట్టబయలు శ్రీసత్యసాయి జిల్లాలో ఏ నియోజకవర్గం పరిశీలించినా.. వేరు కుంపట్లు కనిపిస్తున్నాయి. దీనిపై విసిగెత్తిపోతున్న కేడర్ టీడీపీకి టాటా చెబుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో టీడీపీ ఖాళీ అయ్యింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆ జిల్లాలో జరిపిన పర్యటనల్లో పార్టీ నాయకుల మధ్య గొడవలు వెలుగు చూడటం గమనార్హం. పెనుకొండలో నియోజకవర్గ ఇన్చార్జ్ బి.కె.పార్థసారథి కంటే సవితమ్మ ఎక్కువ హడావుడి చేశారు. మడకశిరలో దళితులను వెనక్కి నెట్టి.. గుండుమల తిప్పేస్వామి అన్నీ తానై వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత హడావుడి చూసి శ్రీరామ్ ధర్మవరం వైపు ఎందుకొస్తున్నారంటూ చాలా మంది టీడీపీ వీడుతున్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం ఏకంగా ఎన్నికల ప్రచారమే చేస్తోంది. వియ్యంకుల్లో ఒకరికేనట! పల్నాడు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు జి.వి.ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ల టికెట్ల కేటాయింపునకు బంధుత్వం అడ్డుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వియ్యంకులైన ఈ ఇద్దరిలో జీవీ వినుకొండ, కొమ్మాలపాటి పెదకూరపాడు టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే కోరికతో వారు చంద్రబాబును ఇటీవల కలిశారట. అప్పుడు ఆయన ఒక్కరికే సీటు ఇవ్వగలనని, ఆ ఒక్కరూ ఎవరో మీరే తేల్చుకోండని వారిపైనే ఆ భారం నెట్టేసి చేతులు దులుపుకున్నారట. పరోక్షంగా పెదకూరపాడులో డబ్బు దండిగా పెట్టగల భాష్యం ప్రవీణ్కు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పడంతో శ్రీధర్ తన వర్గీయులతో శుక్రవారం గుంటూరు నగరంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి తనకు అండగా నిలవాలని కోరారు. మిత్రత్వంలో శతృత్వం ఏలూరులో టీడీపీ, జనసేన మధ్య టిక్కెట్ ఫైట్ తీవ్రంగా ఉంది. జనసేనకు టిక్కెట్ ఇస్తే కాపుకాసేది లేదని టీడీపీ నేతలు చెబుతుంటే... టీడీపీ అభ్యర్థి టిక్కెట్ దక్కించుకుంటే తాము సహకరించబోమని, పోటీలో కచ్చితంగా ఉంటామని జనసేన నేతలు బహిరంగంగా చెబుతున్నారు. పొత్తుల్లో ఈ స్థానం టీడీపీకి ఖరారైందని ఆ పార్టీ ఇన్చార్జి బడేటి చంటి ప్రచారం చేసుకుని ఏకంగా హోర్డింగులతో హడావుడి చేశారు. దీనికి కౌంటర్గా జనసేన నాయకులు ‘మేము రెడీ.. టిక్కెట్ మాదే..’ అంటూ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. అంతేనా... ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడే అంటూ అతను నిర్వహించిన ఆతీ్మయ సమావేశంలో జిల్లా జనసేన నేతలే ప్రకటించారు. ఇదిలా కొనసాగుతుండగా జనసేనలో అకస్మాత్తుగా తెరపైకి మరో కొత్త నేత వచ్చి తనకే టికెట్ అంటూ నగరమంతా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరో గందరగోళానికి దారితీశారు. అనంతపురంలో అంతర్గత పోరు అనంతపురం అర్బన్లో ప్రభాకర్ చౌదరికి అసమ్మతి బెడద ఎక్కువైంది. ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ పవన్కల్యాణ్ పోటీచేస్తే తాను తప్పుకుని ఆయన గెలుపునకు పాటుపడతానని ప్రభాకర్ చెబుతుండగా ‘త్యాగం చెయ్యడానికి, గెలిపించడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ తాత, తండ్రుల సొత్తు కాదు కదా!’ అని తెలుగుదేశం పార్టీలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మునిరత్నం మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ‘తమ్ముళ్ల’ హడావుడితో జనసైనికుల ఆగ్రహం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీట్ల పంపకం తేలకున్నా... మిత్రపక్షాన్ని సంప్రదించకుండా టీడీపీ ఇన్చార్జులు, పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారం ప్రారంభించడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి తమకు అధిక సీట్లు కావాలని జనసేన కేడర్ పట్టుబడుతోంది. కానీ దానిని పట్టించుకోకుండా అమలాపురం టీడీపీ ఇన్చార్జి ఆనందరావు ఏకంగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు మండపేట సభలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజోలు నుంచి తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మిగిలిన ఐదు స్థానాల పరిస్థితి తేలాల్సి ఉంది. కొత్తపేట, ముమ్మిడివరంలో టీడీపీ ఇన్చార్జిలు బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తామే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. యర్రగొండపాలెంలో డిష్యుం..డిష్యుం యర్రగొండపాలెంలో టీడీపీపై అసమ్మతి బుసలు కొడుతోంది. డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగు దేశం పార్టీ గెలవడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వర్గం చెబుతుండగా ఆయన గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయనకు టికెట్ఇస్తే సహకరించేది లేదని, అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోమని డాక్టర్ రవీంద్ర వర్గం కరాఖండీగా చెబుతోంది. -
అందరి గురి మల్కాజిగిరి!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు పదును పెట్టింది. పార్టీ ముఖ్యులతో ముమ్మర చర్చలు జరుపుతోంది. శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీ నివాసంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కె.లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. తనకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని మల్కాజిగిరి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సీటును ఆశిస్తున్న మురళీధర్రావు.. దశాబ్దాలుగా తనకున్న జాతీయ స్థాయి అనుభవం, పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పరిగణనలోకి తీసుకుని పోటీకి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి కూడా ఈ సీటును కోరుతున్నారు. ఈ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. మరోవైపు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని జైపాల్రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, మురళీగౌడ్ భావిస్తుండగా, మహబూబ్నగర్ నుంచి పోటీకి డీకే అరుణ, జితేందర్రెడ్డి, శాంతకుమార్ బరిలో ఉన్నారు. త్వరలో అభ్యర్థుల ప్రకటన: కిషన్రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత త్వరలోనే ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని సమావేశానంతరం కిషన్రెడ్డి మీడియాకు చెప్పారు. తొలి జాబితాలోనే వీలైనన్ని ఎక్కువ పేర్లు ప్రకటిస్తామన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉందని, గ్రామ స్థాయిలో పార్టీలో చేరికల కోసం 25 మంది యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు వేస్తామన్నారు. దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోని ఆఫీస్కు తాళం వేశారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని విమర్శించారు. -
ధర్మపురి అరవింద్కు షాక్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వద్దని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి అరవింద్కు టికెట్ ఇవ్వద్దని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ‘వి వాంట్ జస్టిస్, అహంకార అరవింద్ మాకొద్దు.. అరవింద్ డౌన్ డౌన్ , అరవింద్ కీ హటావో బీజేపీ బచావో’ అంటూ మెడలో దండలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన చేశారు. ‘ఎంపీగా గెలిచిన అరవింద్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడు. గత 30 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదు. ఈసారి అరవింద్కు టికెట్ ఇస్తే ఒడిస్తాం’ అని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు -
ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్గేమ్ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్వర్క్ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. వరదపై మల్లెల మండిపాటు ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు. సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం. ప్రవీణ్కు వాసు వత్తాసు పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్కుమార్రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్, ప్రవీణ్ నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్చార్జి ప్రవీణ్ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘డోన్’టాక్..!
సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ను కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీన్ ! ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్లతో హల్చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం. వాడీవేడిగా విమర్శలు ! మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. -
17 సీట్లు.. 306 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్లో లోక్సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు రోజుల్లో 41 దరఖాస్తులు రాగా శుక్రవారం 100 దరఖాస్తులు, శనివారం ఏకంగా 165 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నల్లగొండ స్థానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. శనివారం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ (ఖమ్మం), చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, రేవంత్రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్రెడ్డి (నల్లగొండ), టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ (భువనగిరి), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుడు పిడమర్తి రవి (వరంగల్), టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు (మెదక్), సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం (కరీంనగర్) తదితరులున్నారు. బరిలోకి బంధుగణం.. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న లోక్సభ స్థానాలకు పార్టీలోని ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఇతర ముఖ్య నేతల బంధువులు, వారి సన్నిహితులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్లో గడ్డం వంశీ, ఊట్ల వరప్రసాద్, గోమాస శ్రీనివాస్, పెరిక శ్యామ్ (పెద్దపల్లి), సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్ (వరంగల్), మల్లు రవి, ఎస్. సంపత్కుమార్ (నాగర్కర్నూల్), కుందూరు రఘువీర్, పటేల్ రమేశ్రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్, కుంభం కీర్తిరెడ్డి, చనగాని దయాకర్, పున్నా కైలాశ్నేత (భువనగిరి), జగ్గారెడ్డి, సోమేశ్వరరెడ్డి (మెదక్), బండ్ల గణేశ్, దిలీప్ కుమార్, హరివర్ధన్రెడ్డి, సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ (మహబూబాబాద్), వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్రెడ్డి, వి.వి. రాజేంద్రప్రసాద్ (ఖమ్మం) ఉన్నారు. దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 6లోగా టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై వాటిని షార్ట్లిస్టు చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.