Thaman
-
శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్.. అంత పని చేశాడేంటి?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రవితేజతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శ్రీలీలను అప్యాయంగా పలకరించారు. సరదాగా ఆమె బుగ్గలు గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతమందించారు.திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..! #thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8— Thanthi TV (@ThanthiTV) June 25, 2024 -
డల్లాస్లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పలు పాన్ ఇండియన్ సినిమాలతో ఇతడు బిజీగా ఉన్నాడు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతిచోట తమన్ పాటలు అదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే ఇతడితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.(ఇదీ చదవండి: పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!)అమెరికాలోని డల్లాస్లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు. స్పైస్ టూర్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాని చూపించారు. ఇప్పటివరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్) -
'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'గుంటూరు కారం' నుంచి తాజాగా ఓ మాస్ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. అభిమానులకు సాంగ్ నచ్చడం సంగతి పక్కనబెడితే ఊహించని విధంగా ఈ గీతం.. కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. అసలు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్ బాబు.. ఇలాంటి పాటని ఎలా అంగీకరించాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. మహేశ్ బాబు కొత్త సినిమా 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో 'దమ్ మసాలా' శ్రోతల్ని ఆకట్టుకోగా.. 'ఓ మై బేబీ' పాటపై ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. తాజాగా మాస్ గీతం అని చెప్పి 'కుర్చీ మడతపెట్టి' అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్-శ్రీలీల స్టెప్పులు బాగానే వేసినప్పటికీ లిరిక్స్పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) హైదరాబాద్లోని కాలా పాషా అనే ఓ తాత.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ 'కుర్చీ మడతపెట్టి..' అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఇతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు. అయితే ఇందుకోసం కుర్చీతాతకు దాదాపు రూ.5 వేల ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రోమోకే ఈ రేంజు ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న 'గుంటూరు కారం' టీమ్.. జనవరి 12న సినిమా రిలీజయ్యేలోపే ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో? మహేశ్-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి-కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రీసెంట్గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
గుంటూరు కారం తమన్ సాంగ్స్ పై మహేష్ బాబు సీరియస్!
-
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
Happy Birthday S Thaman: హ్యాపీ బర్త్డే సంగీత దర్శకుడు ఎస్ తమన్ (ఫోటోలు)
-
'శపథం' పూర్తి చేసిన స్టార్ హీరో
రంగస్థలం, నిన్నుకోరి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆది పినిశెట్టి. ఇతడు హీరోగా నటించిన కొత్త మూవీ శపథం. అరివళగన్ దర్శకుడు. ఇంతకుముందు వీళ్ల కాంబోలో 'ఈరం' చిత్రాన్ని తీశారు. అది హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'శబ్దం' పేరుతో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) హరర్, థ్రిల్లర్ సినిమాలతో తీయడంలో ఎక్స్పర్ట్ అయిన అరివళగన్.. అదే తరహా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. కాగా శపథం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు ప్రకటించాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలో ఫస్ట్లుక్, ట్రైలర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?) -
మొదటిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పిన తమన్
-
కొన్ని కారణాల వల్ల యాక్టర్ అవ్వలేకపోయాను లేదంటే..!
-
#RC15 లో నా మ్యూజికన్ను ఎవరూ అంచనావేయలేరు..!
-
మహేష్ త్రివిక్రమ్ సినిమా కు బ్రేక్?
-
తమన్ ట్యూన్స్ ప్రిన్స్ కు నచ్చడం లేదా?
-
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్తో ఆడేసుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ఫాదర్. నిన్న(సోమవారం)చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మ్యూజిక్పై ట్రోలింగ్ నడుస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్పై మండిపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ తమన్ తీరును ఎండగడుతున్నారు. కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం విశేషం. Super @MusicThaman 👏 pic.twitter.com/AJeoHAyGDl — ʌınɐʎ (@CooIestVinaay) August 21, 2022 #GodFatherTeaser lone dorikipoyav ga ra #Thaman 🙄 pic.twitter.com/ND61touLV5 — ❄sesh💥 (@syam__SVS) August 21, 2022 -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
Mahesh Babu: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి
‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వ హించిన ప్రీ రిలీజ్ వేడు కలో మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్ ట్రాక్ ఒకటి. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్ని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్ మదిగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్బ్లస్టర్స్ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్.. మన కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్ ఫీల్ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. రిలీజ్కి ముందే బాక్సాఫీస్ హిట్ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్లో మహేశ్గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్బస్టర్ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది’’ అన్నారు. మనం సూపర్స్టార్ని (మహేశ్బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్ చేశారు. మే 12న మాకు డబుల్ బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘నాకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నారు మహేశ్గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న బెస్ట్ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్గా చెప్పే ఆర్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెట్లో కింగ్లా ఉంటాడు. డైరెక్టర్స్కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మహేశ్గారికి బెస్ట్ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్ టైమ్ క్లాసికల్గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు. మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే. – మహేశ్బాబు -
తమన్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఏ స్టార్ హీరో సినిమా అయిన దానికి సంగీత దర్శకుడు ఎవరు అంటూ తమన్ పేరే వినిపిస్తోంది. అంతేకాదు హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్తోనే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ మ్యూజిక్ సన్సెషన్ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్ మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సుకుమార్పై నెటిజన్లు ఫైర్, ఆ వెబ్ సిరీస్ను కాపీ కొట్టాడా? ఈ క్రమంలో తన తొలి సంపాదన 30 రూపాయలని చెప్పాడు. ఈ మేరకు తమన్.. ‘మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవారు.. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్గా ముందుకు వెళ్లాను. చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఈ క్రమంలో నేను డ్రమ్మర్గా పనిచేసిన తొలి చిత్రం ‘భైరవద్వీపం’. ఆ సినిమాకి పని చేసినందుకు నాకు 30 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అలా డ్రమ్మర్గా నా తొలి సంపాదనగా 30 రూపాయలు సంపాదించాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఎంత సన్సెషన్ అయ్యిందో తెలిసిందే. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాస్ బీజీయంకు ఆమెరిక బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది. కాగా ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్ ‘గని’, అఖిల్ ‘ఏజెంట్’తో పాటు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు. -
భీమ్లా నాయక్: కొత్త స్టిల్ అదిరిందిగా!
సాక్షి, హైదరాబాద్: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి ఒక ఫోటో వైరలవుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ తరువాత పవన్, రానా ఫోటోను ‘అన్వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ అంటూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం విడుదల చేసింది. ఛాతీ మీద గాయంతో నులకమంచం మీద పవన్ పడుకుని ఉంటే.. రఫ్ లుక్లో రానా ఎడ్లబండి మీద వయ్యారంగా పడుకున్న స్టిల్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. పవర్ వెర్సెస్ బీస్ట్ అని కమెంట్ చేస్తున్నారు. అలసిపోయి, షూటింగ్ దుస్తుల్లోనే అలా సేద తీరుతున్న దృశ్యాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపుదిద్దు కుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్కు తెగ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai — Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021 -
లేట్గా లేటెస్ట్గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు సామజవరగమన, రాములో రాములా సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేయగా.. సినిమా విడుదలయ్యాక బుట్టబొమ్మ వీడియో సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇటీవల ఈ సాంగ్కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చిందులేశాడంటే ఈ సాంగ్కు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విటర్లో వెల్లడించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను.. అర్మాన్ మాలిక్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం సూపర్ హిట్గా నిలవడంలో అందులోని పాటలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. #200millionforbuttabomma #ButtaBomma #Unstoppableavpl #AlaVaikunthapurramuloo album ♥️🎬🎛 My love @alluarjun gaaru my respect to #trivikram gaaru ♥️ It’s the love & trust of them @ramjowrites @haarikahassine @vamsi84 @GeethaArts 🎧✊⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/kAPxY6SgOc — thaman S (@MusicThaman) May 31, 2020 -
150 మిలియన్ మార్క్ దాటిన ‘బుట్టబొమ్మ’
‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ పాట విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్స్ క్రియోట్ చేస్తూ కొత్త రికార్డులను బద్దలు కొడుతుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్లో 150 మిలియన్ వ్యూస్ మార్క్ని దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సంపాదించిన మొదటి సౌత్ ఇండియన్ సాంగ్గా అరుదైన ఘనతను నమోదుచేసింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో అలవోకగా నానుతూ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది ఈ పాట. (ఈ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు! ) రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. అల్లు అర్జున్ , పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులు ఎంతో ఆకట్టుకున్నాయి. బుట్టబొమ్మ పాట క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మొన్న బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ పాటకు చిందులేయగా, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి సాంగ్కు స్టెప్పులేసి బుట్టబుమ్మ పాట సరిహద్దులు దాటేసింది అని నిరూపించారు. బుట్టబొమ్మ పాట ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. (వార్నర్కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్) -
సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా
సామజవరగమన.. ఈ పాట కొన్ని కోట్ల మందిని ఆగం చేసింది. రింగ్ టోన్, కాలర్ ట్యూన్ ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్లో చేరిపోయింది. థమన్.. ఈ సాంగ్తో మిమ్మల్ని మీరే మించిపోయారు’ అని పేర్కొన్నారు. దీనికి సంగీత దర్శకుడు ఎస్.థమన్ స్పందిస్తూ మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందంటూ కేటీఆర్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్ అవుతుందని ట్వీట్ చేశాడు. కాగా అల వైకుంఠపురం సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఇక జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. Sirrrrrrrr coming this from the man I look upto ♥️ @KTRTRS u have made our song more sensational ✊More power & more love to U sir ✨Happy to knw tat our #sensationalsamajavaragamana is making ur day 🥁🥁🥁We have got the best now 💿💿💿💿#godbless https://t.co/MUtOtGVKP4— thaman S (@MusicThaman) January 21, 2020 చదవండి: సైరా రికార్డును తుడిచేసిన అల వైజాగ్లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి కష్టాన్నంతా మరచిపోయాం – తమన్ -
‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో..’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఎంతటి హిట్ టాక్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్, బన్నీ డైలగ్, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాట టీజర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. పూర్తి సాంగ్ను దీపావళి కానుకగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాట కూడా అభిమానులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’అని సాగే సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్లు సాధించిన తొలి తెలుగు పాటగా ‘సామజవరగమన’చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా విడుదల చేసిన పాట ఇదే ఊపులో భారీ హిట్ సాధించే అవకాశం ఉంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమా ఫలితం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరామ్, సుశాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
రేపే ‘సామజవరగమన’
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలు రాగా.. మరోసారి ప్రేక్షకులకు ఆ మ్యాజిక్ చూపించేందుకు సిద్దమయ్యారు. అల వైకుంఠపురంలో అంటూ విడుదలైన చేసిన టీజర్, టైటిల్, అల్లు అర్జున్ లుక్ ఇలా అన్నింటిపైనా.. పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక తాజాగా ఈ మూవీలోని పాటలు రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా.. సామజవరగమన అనే పాటను రేపు (సెప్టెంబర్ 28) ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమోకు విపరీతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు. The most awaited first single & an enchanting melody from our album, #AlaVaikunthapurramuloo, #Samajavaragamana will be out tomorrow at 10:00am! Lyrics: Seetharama Sastry garu Singer: @sidsriram A @musicthaman Musical!@alluarjun #Trivikram @hegdepooja pic.twitter.com/xIbjn967n2 — Geetha Arts (@GeethaArts) September 27, 2019 -
బన్నీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో అంటూ రిలీజ్ చేసిన పోస్టర్, అల్లు అర్జున్ డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ.. తనపై వచ్చే ప్రశ్నలన్నీంటికి ఒక్క డైలాగ్తో పంచ్ వేసినట్టు ఫుల్ ఫేమస్ అయింది. ఫుల్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సాంగ్స్ను విడుదల చేసేందకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే వీరి కాంబినేషన్లో సినిమా అంటే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తాడని అందరూ అనుకుంటారు. కానీ, ఈ చిత్రానికి థమన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ మూవీలోని పాటలు విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీగా ఉందని తెలుస్తోంది. పూజా హెగ్డే, టబు, నవదీప్, సుశాంత్, సునీల్ లాంటి తారాగణం నటిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. A hush hush surprise for all the Stylish Star @alluarjun fans from #AlaVaikunthapurramuloo! A @musicthaman Musical! Coming Soon... 🎶🎹 pic.twitter.com/K9zMrgJVjj — Geetha Arts (@GeethaArts) September 23, 2019 -
సరిగమల సమావేశం
అనుకున్న సమయానికి చిత్రీకరణను పూర్తి చేయాలని అల్లుఅర్జున్ అండ్ టీమ్ నాన్స్టాప్గా వర్క్ చేస్తున్నట్లున్నారు. అటు సన్నివేశం.. ఇటు పాటలను ఒకేసారి కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, నివేతాపేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. టబు, సుశాంత్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నట్లు తెలిసింది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు అల్లుఅర్జున్, త్రివిక్రమ్లతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేశారు తమన్. అక్కడి ఫొటోను షేర్ చేస్తూ– ‘‘మా సినిమా మ్యూజిక్ మంచి ప్రాసెస్లో, స్పీడ్ ప్రోగ్రెస్లో ఉంది’’ అని తమన్ పేర్కొన్నారు. మరి... వీరి సరిగమల సమావేశం శ్రోతలను ఎంతలా ఆకట్టుకుంటాయో చూడాలంటే కాస్త ఓపికపట్టాల్సిందే. -
మ్యూజిక్ సిట్టింగ్లో బిజీగా తమన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాగానే శృతి కుదిరినట్టు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత భారీ హిట్ను సాధించడమే కాకుండా మ్యూజికల్గానూ వర్కౌట్ అయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్కు కూడా తమన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అందులో సంగీత దర్శకుడు కచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ అనే అనుకుంటారు అభిమానులు. అయితే ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ.. ప్రస్తుతం బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అల్లుఅర్జున్-త్రివిక్రమ్-తమన్ మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే మ్యూజిక్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమన్ ట్విటర్ ద్వారా తెలిపాడు. మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నాయని అదే ప్రాసెస్లో ఉన్నామని ట్వీట్ చేశాడు. #AA19 And we r on process with our music 🎶 The master of writing ✍️ #trivikram sir & our #stylishstar @alluarjun ♥️#AATT 🎵 pic.twitter.com/KB4MXtnqV4 — thaman S (@MusicThaman) June 23, 2019