tenth class Exams
-
పది పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. (‘కేసీఆర్ భాష సరిగా లేదు’) జూన్ 3న కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఇక జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : సీబీఎస్ఈ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పెండింగ్లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. చదవండి : సీబీఎస్ఈ సిలబస్ హేతుబద్ధీకరణ -
పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న కరోనావైరస్ అన్ని వ్యవస్థల్నీ చిన్నాభిన్నం చేసేస్తోంది. ఆర్థిక, సామాజిక పరంగా ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు.. కోలుకోనంతగా దెబ్బతిన్నాయి. అదే కోవలో విద్యా వ్యవస్థ కూడా కరోనా దెబ్బకు కునారిల్లుతోంది. సెట్స్ వాయిదా పడ్డాయి. పరీక్షలు రద్దయ్యాయి. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు కూడా మరోసారి వాయిదా వేశారు. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రభుత్వం వద్దన్నా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యడం గమనార్హం. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేవి. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలు, అకాడమీలు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తరగతులు కూడా ప్రారంభించారు. పదోతరగతి పరీక్షలకు కూడా అంతా సిద్ధమవుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన ఒకట్రెండు రోజులకే కోవిడ్–19 దేశంలో విశ్వరూపం చూపించడం మొదలు పెట్టింది. దీంతో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహించే వీలు లేకపోవడంతో ఆ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల్ని పై క్లాసులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మార్చి 22 నుంచి ఎవ్వరికీ ఒక్క క్లాసు కూడా జరగకపోవడంతో అంతా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఏప్రిల్ 14 వరకూ లాక్డౌన్ నిర్వహించడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలూ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో ఆన్లైన్లో పాఠాలు, హోంవర్క్లు పంపిస్తున్నారు వివిధ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు. కోచింగ్ సెంటర్లూ ఖాళీ అయిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే అన్ని పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా ఆన్లైన్ చదువులపైనే దృష్టిసారించారు. విద్యార్థులు నష్టపోకుండా... ఈ విద్యా సంవత్సరంలో జ్ఞాన సముపార్జన అవకాశాన్ని నష్టపోకుండా ఇంటర్నెట్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు 10వ తరగతి వరకూ పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారించారు. ఇవి కాకుండా దీక్షా యాప్ ద్వారా మొబైల్ ఫోన్లో పాఠాలు వినే వెసులుబాటు ఉంది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ ప రీక్షలకు శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకున్న వారికి ఆన్లైన్లో సందేహాల్ని నివృత్తి చేస్తున్నారు. పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి పరీక్షలు రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నాయి. తమ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు యాజమాన్యం ఫోన్ చేసి.. ఫైనల్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి చదువుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిందని చెబుతుంటే.. దాంతో తమకు సంబంధంలేదనీ.. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాలని తెగేసి చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితీ.. కరోనా వైరస్ కారణంగా పరీక్షలు, వాటి ఫలితాలు వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాసి.. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకూ ఇంటర్ స్పాట్ వాల్యూషన్ కూడా మొదలు కాలేదు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతా యన్నది కూడా ఇంకా స్పష్టత లేకపోవడంతో వారు మరో రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక నీట్ జేఈఈ అడ్వాన్స్, ఎంసెట్, పీజీ, ఇంజినీరింగ్... ఇలా అన్ని రకాల విద్యల్ని అభ్యసిస్తున్న వారి పరిస్థితి ఒక్కో రకంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందో ళన విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్నీ వెంటాడుతోంది. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు కోవిడ్–19 ప్రభావంతో 9వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలూ అనుసరించాల్సిందే. ఏ ప్రైవేట్ పాఠశాలైనా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి. -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 2,530 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. జలుబు, దగ్గుతో వచ్చే విద్యార్థులకు ప్రత్యేక రూములు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ఇద్దరు వైద్యులు,శానిటైజర్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
శరవేగంగా ‘పది’కి ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ప్రభుత్వం 31వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న మార్పులపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించిన విద్యాశాఖ అధికారులు పరీక్షల విధి నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలపై జిల్లాలోని ఐదు విద్యాశాఖ డివిజన్ల వారీగా చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు ఐదు డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలను సైతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని 1,041 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరు కానున్న 60,042 మంది విద్యార్థులకు 269 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే నియమించేందుకు చర్యలు చేపట్టారు.సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని చీఫ్ సూపరింటెండెంట్గా నియమించడంతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున పర్యవేక్షణకునియమిస్తున్నారు. 3,000 మంది ఇన్విజిలేటర్లు పదో తరగతి పరీక్షల విధులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లుగా నియమించే క్రమంలో సీనియారిటీతో పాటు గతంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించాలని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్ల మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకుని, అవసరమైతేనే పక్క మండలాల్లోని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది మండల పరిధిలోని ఇన్విజిలేటర్ల సంఖ్యలో ఐదు శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసుతో పాటు అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ఇన్విజిలేటర్లను ప్రతి మూడురోజులకోసారి జంబ్లింగ్ విధానంలో ఇతర పరీక్షా కేంద్రాలకు పంపనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ జిల్లాకు చేరవేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరీక్షలకు వారం రోజుల ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
వేర్వేరుగా పరీక్ష రాయనున్న కవలలు వీణావాణి
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19 నుంచి జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు గ్రేటర్ పరిధిలో 1.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనిపిల్లలకు మానసికంగా ధైర్యం చెప్పి అండగా ఉండాలని సూచిస్తున్నారు. కోరితేవీణావాణీలకు స్క్రైబ్స్ పుట్టుకతోనే రెండు తలలు అతుక్కునిజన్మించిన వీణావాణీలు 2016 వరకు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకోవడం తెలిసిందే. 2017 జనవరిలో వారిని స్టేట్హోంకు తరలించగా.. మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు 2018 విద్యా సంవత్సరంలో వీరికి వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు (5618, 5619) ఇచ్చారు. ఇటీవల వీరు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ కలిపి ఒకే హాల్టికెట్ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది. ఈసారైనా గట్టెక్కేనా? హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 82 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47155 వేల మంది విద్యార్థులు ఉండగా, 17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 43139 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేకపోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తల్లిదండ్రులూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో ఇప్పటికే అభ్యాస పరీక్షలు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్ర పుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్ఫోన్ వంటివాటికి దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. – బి.వెంకటనర్సమ్మ, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ఈనెల 15నుంచి ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలిపి ఒకే మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హయత్నగర్ మండలంలోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో జవాబు పత్రాలను దిద్దేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 3న పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఇతర జిల్లాలకు పంపించారు. ఇతర జిల్లాలవి మన దగ్గరకు చేరవేశారు. అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు ఆరు లక్షల జవాబు పత్రాలు వచ్చినట్లు సమాచారం. వీటిని మూల్యాంకనం చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. జవాబు పత్రాలు దిద్దే బాధ్యతలను సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల్ల(ఎస్ఏ)కు అప్పగించారు. వీరికి సహాయకులుగా సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు విధులు కేటాయించారు. ఇలా మొత్తం మూడు వేల మంది టీచర్లు మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంది. మూల్యాంకనం.. విధుల్లో భాగమే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మూల్యాంకనం చేపడుతున్నారు. ఈ మూల్యాంకనం విధులకు హాజరయ్యేందుకు చాలా మంది ఉపాధ్యాయులు వెనకాడుతున్నారు. మూడు జిల్లాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉండగా కొందరు డుమ్మా కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు టీచర్లు ప్రజాప్రతినిధులతో సిఫారసు కూడా చేయించుకుంటున్నారని వినికిడి. దూరభారం కారణంగా తాము రాలేమని టీచర్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మూడు సంవత్సరాల కిందట ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు లేవనెత్తారు. ఇందుకు అంగీకరించని ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతంలో ఉన్న మూల్యాంకన కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మూల్యాంకనానికి విముఖత చూపిస్తుండగా.. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. సబ్జెక్టుల వారీగా నియమించిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకపోతే.. మిగిలిన వారిపై భారం పడుతుంది. పైగా 11 రోజుల్లోనే అన్ని పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. సరిపడు ఉపాధ్యాయులు హాజరుకాకపోతే మూల్యాంకన ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారం ఉంది. గతేడాది వివిధ జిల్లాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కొందరు రాకపోవడంతో మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇది ఈ ఏడాది పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల ప్రకటనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. కచ్చితంగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరుకావాల్సిందేనని, ఉదయం 9 గంటల వరకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
ఆరిలోవ(విశాఖతూర్పు): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. గత నెల 18న ప్రారంభమైన పరీక్షలు 17రోజుల పాటు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ రెండో తేదీకే ముగియాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ను బుధవారం నిర్వహించడంతో మూడో తేదీతో ముగి శాయి. జిల్లావ్యాప్తంగా 242 పరీక్ష కేంద్రాల్లో 56,683 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో బాలురు 28,953 మంది కాగా 27,730 మంది బాలికలున్నారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పరీ క్షలు ప్రశాంతంగా ముగిశాయి. 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 242మంది చీఫ్ ఎగ్జామినర్లు, 242మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. అన్నీ ప్రభుత్వ కేంద్రాలే.. ఈ సారి పదో తరగతి పరీక్షలను నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన కొయ్యూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, క్రిస్టియన్ అరకు ఆదర్శ పాఠశాల, అనంతగిరి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, పాడేరులోని ఏపీ గిరిజన విద్యార్థుల సంక్షేమ పాఠశాల, చింతపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెదబయలులోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలపై ప్రత్యేక నిఘాపెట్టారు. 144 సెక్షన్ అమలు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు సహకారం?: టెన్త్ పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల పెత్త నం సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈవో కార్యాలయంలో కొందరు అధికారులు ప్రైవేట్ యాజ మాన్యాలకు సహకరించారనే విమర్శలున్నాయి. వారి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇన్విజిలేటర్ల ద్వారా బిట్, చిన్న ప్రశ్నలకు జవాబులు అందించడంలో సహకారం అందించినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
‘పది’ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ
ముషీరాబాద్: అతనో చిరు వ్యాపారి.. అయితేనేం సేవలో పెద్ద మనసున్న వ్యక్తి. ముషీరాబాద్ ఏక్మినార్లోని మసీదు ఎదుట ఓ చిన్న కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహించే షాహెద్ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తూ గొప్పగా జీవిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. సాయంత్రం 7గంటల వరకు విద్యార్థులు స్కూళ్లోనే ఉండాల్సి రావడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్.. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్లుగా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు (దాదాపు 100 మంది) ప్రతిరోజు స్నాక్స్ అందజేస్తున్నాడు. అరటిపండ్లు , మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం అందిస్తున్నాడు. ప్రతిరోజు రూ.2,500 చొప్పున 40 రోజులకు రూ.లక్ష సేవకు వెచ్చిస్తున్నాడు. ‘నాంది’ ఫౌండేషన్కు ముందే షాహెద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. తన షాప్లో షాహెద్ సేవానందం... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా సహాయం కోరితే నాకు తోచిన సహాయం చేయడం బాధ్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నాను. సేవలోనే నాకు ఆనందం ఉంది. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు.. నాకున్న దాంట్లో నేనెంత సహాయం చేస్తున్నాననేదే ముఖ్యం. – షాహెద్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే.. ‘పది’ పరీక్షా కేంద్రాలు!
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించేలా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నుంచి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. గతేడాది వరకూ ఈ పరీక్షలను ప్రైవేటు స్కూల్స్లోనూ నిర్వహించేవారు. దీంతో ఇందుకు సాధ్యాసాధ్యాలను జిల్లా విద్యాశాఖ పరిశీలిస్తోంది. గతేడాది పరిస్థితి ఇదీ.. గతేడాది జిల్లాలోని 301 పరీక్షా కేంద్రాల్లో 65,768 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో 57 కేంద్రాలను ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తారన్న విషయం ఖరారైన తరువాత పరీక్షా కేంద్రాల జాబితాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రైవేటు కేంద్రాల కుదింపునకు చర్యలు జిల్లాలో ఉన్న 57 ప్రైవేటు పాఠశాలల్లో కేంద్రాల విషయంలో జిల్లా విద్యా శాఖకు కొంత ఇబ్బంది ఏర్పడుతున్నట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది లేకున్నా, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రైవేటు పరీక్షా కేంద్రాలకు బదులు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయడం కత్తి మీద సాము చందంగా ఉంటుందని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన కేంద్రాలు 80 శాతం పట్టణాల్లోనే ఉన్నాయి. అందుతోన్న సమాచారం మేరకు 30 ప్రైవేటు కేంద్రాలు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు కేంద్రాల రద్దు ఎందుకంటే.. సర్కారు బడుల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన మౌలిక వసతులు లేవని ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కేంద్రాలున్న చోట ప్రైవేటు పాఠశాలల వర్గాలు పెత్తనం చెలాయిస్తున్నాయని, కొన్నిచోట్ల ప్రశ్నా పత్రాలను ముందుగానే తెరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాస్ కాపీయింగ్కు ఆస్కారం ఏర్పడుతుందని విద్యా శాఖ అనుమానం. ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీస్టేషన్కు 4 కిలోమీటర్ల పరిధిలో.. గతేడాది వరకు పోలీస్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసేవారు. దీని వల్ల ఎక్కువగా ప్రైవేటు పాఠశాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఈ ఏడాది పోలీస్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాల పరిధి 4 కిలోమీటర్లకు పెంచారు. కళాశాలలూ పరిశీలించే అవకాశం దీంతో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో టెన్త్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ను అనుసరించి దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కసరత్తు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే విషయంపై కసరత్తు చేస్తున్నాం. డివిజన్ కేంద్రాల నుంచి సమాచారం రప్పిస్తున్నాం. నెలాఖరు నాటికి స్పష్టత వసుతంది. – జి.నాగేశ్వరరావు, ఏడీ, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ కట్టుదిట్టంగా నిర్వహించేందుకే.. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏటా విద్యా శాఖ కొత్త విధానాలను అవలంబిస్తోంది. టెన్త్ పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ -
అబ్బాయి ఫెయిల్.. కుటుంబం పండుగ..!!
భోపాల్, మధ్యప్రదేశ్ : పదో తరగతిలో ఫెయిల్ అబ్బాయినో లేక అమ్మాయినో ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా చేస్తున్నారని స్థానికులు అడిగిన ప్రశ్నకు పరీక్షల్లో తప్పినందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఇది ఒక్కటే చివరి పరీక్ష కాదని చెప్పడానికే ఇలా చేస్తున్నామని బాలుడి కుటుంబ సభ్యులు వివరించారు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని చెప్పిన కొడుకు అన్షును తండ్రి సురేంద్ర గట్టిగా కౌగిలించుకున్నారని, అనంతరం స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి రప్పించారని పేర్కొన్నారు. ఈ ఘటనతో అన్షు ఆశ్చర్యపోయాడని వివరించారు. దీంతో బాలుడి తండ్రి పాజిటివ్ థింకింగ్కు ఫిదా అయిన స్థానికులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం మాట్లాడిన బాలుడు తనకు చదువుకోవాలని లేదని, తండ్రి ట్రాన్స్పోర్టు బిజినెస్ను కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. సోమవారం మధ్యప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వెలువడిన గంటల్లోనే దాదాపు 11 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఆర్థిక స్వార్థం వల్లే టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆర్థిక స్వార్థం వల్లే పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో చాలాచోట్ల కాపీలు జరిగాయంటే డబ్బులే ప్రధాన కారణంగా భావిస్తున్నానని, డబ్బులు తీసుకుని కాపీలను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఒక విద్యార్థి విషయంలో డీఈఓ మళ్లీ పరీక్ష రాయించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ఏ అధికారంతో ఒక విద్యార్థితో తిరిగి జవాబులు రాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ విధానం ద్వారా అవినీతికి అడ్డుకట్ట జిల్లాలో హాస్టళ్లలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తీరు, స్కాలర్షిప్ల జారీ వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో 8 వేలమంది విద్యార్థులను చేర్చుకోగా అందులో 6,700 మంది హాజరవుతున్నట్టు ఇన్నాళ్లూ అధికారులు లెక్కలు చూపించారని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయడంతో హాస్టళ్లలో ఉండేవారి సంఖ్య కేవలం 4,800 మందికి మించలేదన్నారు. డీఈఓ సీవీ రేణుక, అదనపు జేసీ షరీఫ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రంగలక్ష్మీ దేవి, బీసీ సంక్షేమశాఖాధికారి జి.లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలే తప్ప మరణాల సంఖ్యను తగ్గిస్తామంటూ నివేదికలు సమర్పించడం ఏమిటని కలెక్టర్ భాస్కర్ రవాణా శాఖాధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశానికి కలెక్టర్ భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 9 నుంచి సమ్మెటివ్ పరీక్షలు ఏలూరు(ఆర్ఆర్పేట) : ఏప్రిల్ 9వ తేదీ నుంచి సమ్మెటివ్(ఎస్ఏ –2) పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ(ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రామకృష్ణారెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 1 నుంచి 9వ తరగతి వరకూ ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీటిలో భాగంగా 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. మార్పులకు అనుగుణంగా జివి మాల్ ఏలూరు (మెట్రో): రిటైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్స్టైల్స్ రంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు జివి మాల్ను ఏర్పాటు చేస్తున్నట్లు మాల్ ఎమ్డి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆకర్‡్షప్రైడ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని దుకాణాల కంటే భిన్నంగా 365 రోజులు ఒకే ధరను తమ మాల్లో వస్త్రాలపై నిర్ణయించామని చెప్పారు. లక్కీషాపింగ్మాల్ అధినేత రత్తయ్య, ఏలూరు జివి మాల్ అధినేత కె.రామకృష్ణ పాల్గొన్నారు. -
హడావుడి.. గందరగోళం!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఎక్కడా ఆరోపణలకు తావివ్వం. కాపీయింగ్ జరగకుండా అరికడతాం. పరీక్షల పారదర్శకత కోసమే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో నియమిస్తున్నాం. ఎక్కడైనా కాపీయింగ్కు పాల్పడితే యాక్టు 25ను అమలు చేస్తామని విద్యాశాఖాధికారుల డీంబకాలు తప్ప ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. పరీక్షల్లో అంతా హడావుడి ఆర్భాటం చేశారే తప్ప కొత్తగా సాధించిందేమీ లేదు. అటు పిల్లలను, ఇటు ఇన్విజిలేటర్లను భయాందోళనకు గురి చేసి బయటనుంచి కాపీలను రాకుండా కొంతమేర అరికట్టారేమోకానీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాత్రం మాస్కాపీయింగ్, చూచిరాతలు జోరుగా సాగాయి. దీంతోపాటు చాలా చోట్ల కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజామాన్యం డబ్బులను ఎరవేసి తమకు అనుకూలమైన చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లను నియమించుకుని తమ పనిని చక్కబెట్టుకున్నారని జోరుగా ఆరోపణలు వచ్చాయి. ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈఓ ఇటీవలే కొత్తగా బాధ్యతలను తీసుకోవడం.. ఆ డివిజన్పై సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ప్రొద్దుటూరులో కూడా జోరుగా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇ రాయచోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ చాలామంది చీఫ్, డిపార్టుమెంట్ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి లోలోపల జోరుగా కాపీయింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఈ ఏడాది అర్హత లేని వారిని కూడా స్క్వాడ్ వి«ధుల్లో నియమించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. పులివెందుల,వీఎన్పల్లి, ఎర్రగుంట్ల, ఖాజీపేట, మఠం, రాజంపేటలో కూడా కాపీయింగ్ ఆరోపణలున్నాయి. పకడ్బందీగా నిర్వహించాం:పది పరీక్షలను ఈ ఏడాది చాలా పకడ్బందీగా నిర్వహించాం. ఆరోపణలు వచ్చిన ప్రతిచోట గట్టి నిఘాను ఉంచి పరీక్షలను ప్రశాంతంగా నడిపించాం. కాపీయింగ్ను అరికట్టాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని పరీక్ష విధుల నుంచి కూడా తొలగించాం. పరీక్షలు ప్రశాతంగా ముగిశాయి. – పొన్నతోట శైలజ, డీఈఓ -
ముగిసిన 10 పరీక్షలు
ఆరిలోవ(విశాఖతూర్పు) :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. సాంఘిక శాస్త్రం–2 పరీక్ష ముగియగానే పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కరచాలనం చేసుకొని సరదాగా గడిపారు. ఎలా రాశావని ఒకర్నొకరు అడుగుతూ సందడిగా గడిపారు. పదికి పది గ్యారంటీ అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షలు ముగియడంతో సాయంత్రం విద్యార్థులంతా బీచ్లో వాలిపోయారు. ఇదిలావుండగా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారికి ఈ నెల 29 వరకూ పరీక్షలు జరగనున్నాయి. 99 శాతానికి పైగా హాజరు.. విద్యాశాఖ అధికారులు జిల్లాలో 55,493 మంది విద్యార్థులకు పరీక్ష హాల్ టిక్కెట్లు పంపించారు. వారిలో 99 శాతం పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 597 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. ప్రతి పరీక్షకు 100కు పైగా గైర్హాజరయ్యారు. గణితం పరీక్షకు (1,2 పేపర్లు) అన్నింటికంటే ఎక్కువగా 142 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు లేవు జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి మాల్ప్రాక్టీస్కు పాల్పడే అవకాశం కలగలేదన్నారు. దీంతో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. జిల్లాలో 240 పరీక్ష కేంద్రాలను 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు సందర్శించి విధులు సక్రమంగా నిర్వహించామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశామన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన పోలీసులు, వైద్య సిబ్బంది, 13 స్క్వాడ్ బృందాలు, రాష్ట్ర పరిశీలకులు, ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురిపై వేటు.. పరీక్షలు మొదలయినప్పటి నుంచి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఐదుగురిపై డీఈవో బి.లింగేశ్వరరెడ్డి వేటు వేశారు. వారిలో నలుగురు అధికారులను విధుల నుంచి బహిష్కరించగా, ఒక ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేయడం విశేషం. ఈనెల 21న జిల్లాలో పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటిండెంట్ కృష్ణమూర్తి, డిపార్టుమెంట్ ఆఫీసరు ఎన్ఎస్ఎస్ పడాల్ పరీక్షల ప్రారంభమయినప్పటి నుంచి సరిగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరిపై ఆ పరీక్ష కేంద్రం అబ్జర్వేటర్ ఇచ్చిన నివేదిక మేరకు డీఈవో విధుల నుంచి తప్పించారు. ఈనెల 23న అరుకు వేలీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం విధులు సరిగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ రామారావు, నక్కపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం విధుల సక్రమంగా నిర్వహించని చీఫ్ సూపరింటిండెంట్ పద్మావతిని విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా వీరితో పాటు నక్కపల్లి హైస్కూల్ కేంద్రంలో ఇన్విజిలేటరుగా విధులు నిర్వహిస్తూ పరీక్ష హాల్లోనే సెల్ఫోన్లో మాట్లాడుతూ డీఈవో కంటపడిన (జానకయ్యపేట హైస్కూల్ భౌతిక శాస్త్రం) ఉపాధ్యాయుడు ఎం.రమణబాబును సస్పెండ్ చేశారు. -
‘తల్లి’డిల్లిన హృదయంతో..
పిఠాపురం : ప్రతిరోజూ ఎదురొచ్చి సాగనంపే తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయి శోకాన్ని మిగిల్చగా.. కనీసం తల్లి ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక గుండెల నిండా బరువును నింపుకొని పదో పరీక్షకు హాజరైంది ఆ విద్యార్థిని. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం శివారు ముమ్మిడివారిపోడుకు చెందిన బత్తినీడి అప్పారావు భవానీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అనంతలక్ష్మి ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు మూలపేట హైస్కూల్లో రాస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కుమార్తెను తయారు చేసి ఎదురు వచ్చి పరీక్షకు పంపించేది తల్లి భవానీ. అయితే శనివారం భవానీ తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుదామని లేచిన కుమార్తె అనంతలక్ష్మి తల్లిని లేపింది. ఆమె ఎంతకు లేవకపోవడంతో విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వారు వచ్చి చూడగా ఆమె మృతి చెంది ఉండడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో పరీక్షకు సమయం దగ్గర పడడంతో తల్లి ఆఖరి చూపును కూడా వదులుకుని అనంతలక్ష్మి పుట్టెడు దుఃఖంతో పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. ఇక్కడ పరీక్ష కేంద్రంలో కుమార్తె పరీక్ష రాస్తుంటే అదే సమయంలో అక్కడ మరుభూమిలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించడం స్థానికులను కలచివేసింది. అయితే ఆమె పరీక్ష రాసి ఇంటికి వెళ్లే సరికి తల్లి అంత్యక్రియలు పూర్తి కావడంతో తల్లి కోసం గుండెలవిసేలా రోదించిన ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. -
దుఃఖాన్ని దిగమింగుకుని..
కురవి/మరిపెడ: తండ్రి మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు మంచ్యా తండాలో చోటు చేసుకుంది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నేరడ శివారు మంచ్యా తండాకు చెందిన భూక్య రాజు(40) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు భూక్య కుమార్ మరిపెడలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నాడు. కుమార్ ప్రసుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తండ్రి రాజు మృతి చెందిన విషయం తెలిసి కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మనోధైర్యం ఇవ్వడంతో కన్నీళ్లను దిగమింగుకుంటూ మరిపెడలోని సీతారాంపురం జెడ్పీ హైస్కూల్లో కుమార్ సైన్స్ రెండో పేపర్ రాశాడు. పెద్దనాన్న అయిన మాధవపురం సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న పరీక్ష సమయం ముగియగానే కుమార్ను ద్విచక్రవాహనంపై తీసుకుని తండాకు చేరుకున్నాడు. తండాకు వచ్చిన కుమార్ తండ్రి శవంపై పడి నాన్న లే నాన్న అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. నన్ను ఒంటిరి చేసి వెళ్లావా? అంటూ రోదిస్తుంటే తండావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే తండావాసులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. దింపుడు కల్లం వద్ద తండ్రి ముఖం చూస్తూ బోరున విలపించాడు. చితికి నిప్పంటించాడు. అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్కు తోడుగా తల్లి శారద ఉంది. ఈ సంఘటనతో తండాలో విషాదం అలుముకుంది. రెండు రోజులు సెలవులు ఉండడంతో కుమార్ తండాలోనే ఉంటాడని బంధువులు తెలిపారు. -
అనుభవం.. నేర్పని పాఠం!
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగ్లు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఇందులో స్పెషల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లే కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్(ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. సుమారు 400 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లు అవసరం కాగా వీరిలో సగంమంది కూడా రావడం లేదు. ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్చుకోని పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 5.40 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. రెండు రోజులుగా జవాబుపత్రాలు వస్తున్నాయి. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తున్నారు. స్పెషల్ అసిస్టెంట్లు కీలకం ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగ్లు, మార్కుల టోటలింగ్ పరిశీలించాలి. ♦ ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు మండుతున్న వేసవితో ఉక్కపోత, సౌకర్యాల లేమితో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న తప్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. ♦ పొరపాటున ఏఈల చేతుల్లో టోటలింగ్లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం. చాలీచాలని రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకు రోజుకు సగటున రూ.550 దాకా వస్తుంది. చీఫ్ ఎగ్జామినర్లకు కూడా ఇదే స్థాయిలో వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ.137.50లతో సరిపెడుతున్నారు. దీనికి తోడు డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలామంది టీచర్లు స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. గుణపాఠం నేర్వని విద్యాశాఖ ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. వారికి ఇష్టమున్నా.. లేకున్నా అధికారులే బలవంతంగా విధుల్లోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పూరిస్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు వస్తారు. అయితే అధికారులు అలా చేయకపోవడం గమనార్హం. సమస్యను అధిగమిస్తాం ఏప్రిల్ 2 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. రెమ్యూనరేషన్ తక్కువ, డీఏ ఉండదనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వాస్తవమే. ఈసారి సమస్యను అధిగమిస్తాం. వీలైనంత ఎక్కువ మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందు నాయక్,డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ఉరుకులు.. పరుగులు
సాక్షి, నెట్వర్క్ : మరికల్లో జరిగిన ఎస్సెస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్గానే స్పందించారు. కలెక్టర్ రొనాల్డ్రోస్, ఎస్పీ అనురాధ, ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈఓ సోమిరెడ్డిలతోపాటు ఇతర అధికారులు బుధశారం ఉరుకులు, పరుగులు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని సైతం పరుగులు పెట్టించారు. స్వయంగా ఉన్నతాధికారులు సైతం సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరించారు. ఇప్పటికే 11 మందిపై వేటుపడింది. ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్కు గురయ్యారు. భూత్పూర్ ఓ విద్యార్థి డిబార్ మండల కేంద్రంలోని రెండు సెంటర్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను బుధవారం కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పంచవటి విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదుల వెనుక నుంచి వెళ్లి కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులు కిటికీల నుంచి చీటీలు పడేసినట్లు గమనించిన కలెక్టర్ కొన్ని చీటీలు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో ఉన్న అక్షరాలను గుర్తించి ఓ గదిలో విద్యార్థుల రాత ట్యాలీ చేసి పరిశీలించారు. మరో చీటీలో ఏకంగా విద్యార్ధి పేరు చీటీపై రాసినట్లు గుర్తించిన కలెక్టర్ ఆ విద్యార్థి గురించి ఆరా తీశారు. కాసేపటి తర్వాత మాస్ కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థిని గురించి డీబార్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్కు ఆదేశించి వెళ్లి పోయారు. ఇదిలాఉండగా కలెక్టర్ తనిఖీకి రావడంతో ఇన్విజిలేటర్లు ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారుల తనిఖీ నారాయణపేట రూరల్: మరికల్లో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అప్రమత్తమైన విద్యాశాఖా అధికారులు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరీక్ష కేంద్రాల తనిఖీ ముమ్మరం చేశారు. డీఈఓ సోమిరెడ్డి, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాధిత్యాతో పాటు మండలానికి ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన జిల్లా సివిల్ సప్లయీస్ డీఎం భిక్షపతి, ఏఎంఓ రవీందర్, ఎంపీడీఓ వెంకటయ్య పట్టణంలోని ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ గ్రౌండ్, బాలికల ఉన్నత పాఠశాల చుట్టు పోలీసు, రెవిన్యూ సిబ్బందితో బందోబస్తు పెంచారు. అలాగే మోడ్రన్ స్కూల్ కేంద్రంలో ఎస్ఐ ఎం.కృష్ణయ్య ఆధ్వర్యాన వీడియో చిత్రీకరణ చేపట్టారు. డీఈఓ హల్చల్ మరికల్: స్థానిక బాలుర, బాలికల ఉన్నత పాఠశాలోని పరీక్ష కేంద్రాలను బుధవారం డీఈఓ సొమిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి హల్చల్ చేశారు. గణితం పేపర్–1 పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్యాడ్లు, చూట్టు పక్కల ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. ఎవరైనా మాస్కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎఫ్ఓ పరిశీలన అడ్డాకుల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎఫ్ఓ గంగారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులన్నింటినీ ఎంపీడీఓ బి.నర్సింగ్రావుతో కలిసి పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లను, నిర్వాహకులను ఆదేశించారు. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ : ఎస్పీ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో కలకలం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీక్పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే మరికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్పై కేసు నమోదు చేయించిన ఎస్పీ అనురాధ స్వయంగా దృష్టిసారించారు. ఈ కేసులో పోలీసులు చేసిన విచారణలో లభించిన సాక్ష్యాధారాల మేరకు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఎస్పీ ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెన్షన్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ సున్నితమైన అంశాల పట్ల నిర్లక్ష్యం వహించడం, వ్యక్తిగత లాభాపేక్షతో వ్యవహరించడం ఏమాత్రం సహించరాదని స్పష్టం చేశారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. భూత్పూర్లోని ఓ పరీక్ష కేంద్రం వెనకాల -
సీఎస్ వర్సెస్ డీఓ
గణపురం(భూపాలపల్లి) : గణపురం మండలంలోని చెల్పూరు çపదో తరగతి పరీక్ష కేంద్రం నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్) ప్రభాకర్రెడ్డి, డిపార్టమెంటల్ అధికారి(డీఓ)నర్సింహచారి మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న గొడవలు వీధికెక్కాయి. పరీక్ష కేంద్రంలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడి చేసుకునేందుకు యత్నించడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 16న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా గణపురం మండల కేంద్రంలో రెండుసెంటర్లతోపాటు చెల్పూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో సీఎస్ ప్రభాకర్రెడ్డి మొదటి రోజు నుంచి సెంటర్లో మాస్ కాపీయింగ్ నడుస్తున్నా పట్టించుకోవడం లేదని డీఓ నర్సింహచారి ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నుట్ల సమాచారం. అందులో భాగంగా సోమవారం ఇంగ్లిష్ మొదటి పేపర్ పరీక్ష జరుగుతుండగా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ చేతిలో చిట్టీ ఉండడం గమనించిన డీఓ ఆమె చేతిని లాక్కొని సీఎస్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఈ పెనుగులాటలో ఆమె చేతులకు ఉన్న గాజులు పగిలిపోయి గాయాలయ్యాయి. విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద« డబ్బులు తీసుకుంటూ మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నారంటూ సీఎస్ ప్రభాకర్రెడ్డితో డీఓ నర్సింహచారి గొడవకు దిగారు. రెండు రోజులపాటు పరీక్ష కేంద్రంలో ఈ తంతు నడుస్తుండడంతో విషయం తెలుసుకున్న డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సంఘటనపై విచారణ జరపాలని గణపురం ఎంఈఓ చిలువేరు సురేందర్, వెంటాపురం ఎంఈఓ శాగర్ల అయిలయ్యను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా డీఓను తొలగిస్తున్నట్లు ఆదేశా>లు జారీచేశారు. ఆయన స్థానంలో కర్కపల్లి పాఠశాల ప్రధానోపాద్యాయుడు భద్రయ్యను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తానికి సీఎస్, డీఓల మధ్య జరిగిన గొడవతో చెల్పూరు పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి వారి సెల్ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసుకొని వెళ్తున్నారని, మాస్కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాస్కాపీయింగ్ చేస్తే డీబార్
వీరఘట్టం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడితే డీబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్కు ప్రోత్సహించే ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారి హెచ్చరించారు. వీరఘట్టంలో బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ ఇన్విజిలేషన్ నియామకాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చిలిచిలికి గాలివానలా మారడంతో గురువారం ఇన్విజిలేషన్ చేసిన ఉపాధ్యాయులను క్షణాల్లో రిలీవ్ చేసి వీరి స్థానంలో 22 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఎంఈఓ జి.సుబ్రహ్మణ్యం ఈ రెండు పాఠశాలలకు చెరో 11 మందిని కేటాయించారు. అనంతరం అరుణకుమారి బాలుర, బాలికోన్నత పాఠశాలల పరీక్షా కేంద్రాల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. మంచి వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఇద్దరు హెచ్ఎంలు డి.నాగమణి, ఎం.వి.నర్శంగరావును ప్రశ్నించారు. ఇక మీదట జరగబోయే పరీక్షలన్నింటినీ పక్కాగా నిర్వహించాలని స ూచించారు. విద్యార్థులు బెంగ పడవద్దు ఉపాధ్యాయుల మధ్య జరిగిన తగాదా చివరకు పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ముద్ర పడేలా చేసిందని అరుణకుమారి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుంటే ఎందుకు మాస్కాపీయింగ్ జరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి బెంగ పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అయితే శుక్రవారం పరీక్షలు ప్రారంభమయినప్పటి నుంచి ముగిసే వరకు వరుసగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు వచ్చి పరీక్షల తీరు పరిశీలించడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం టెన్త్ పరీక్షల సందర్భంగా వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన తగాదా నేపథ్యంలో రెండో రోజు ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం జరిగింది. బాలుర ఉన్నత పాఠశాలలో సింహాద్రినాయుడు, బాలికోన్నత పాఠశాలలో పి.రామచంద్రరావు సిట్టింగ్ వేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఇక ప్రతి రోజూ సిట్టింగ్ స్క్వాడ్లు వస్తుంటారని టెక్కలి ఉపవిద్యాశాఖాధికారి టి.జోగారావు తెలిపారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు రిలీవ్ చేశారు వీరఘట్టం బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో మొదటి రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రెండు హైస్కూల్ల్లో ఇన్విజిలేషన్ చేస్తున్న 22 మందిని శుక్రవారం విధుల నుంచి తప్పించడంపై పలువురు ఉపాధ్యాయులు మండిపడ్డారు. అకారణంగా మమ్మల్ని ఎందుకు తొలగించారంటూ రాష్ట్ర పరిశీలకులు ఎస్.అరుణకుమారిని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి ఇంత మందిని రిలీవ్ చేయడం సరైన విధానం కాదని పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, రిలీవ్ అయిన వారందరూ తప్పు చేసినట్టు కాదని, పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. -
తల్లి మరణించినా లక్ష్యం విడవకుండా..!
బల్లికురవ: తల్లి చినపోయినా ఆ బాధను మనసుసులోనే దిగమింగుకుని, మనోధైర్యంతో బల్లికురవ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షలకు హాజరవుతోంది. మండలంలోని చిన అంబడిపూడి గ్రామానికి చెందిన కోవూరి వెంకటశేషయ్య, కుమార్తె సరళను 18 సంవత్సరాల క్రితం మార్టూరు మండలం, చిమ్మరిబండకు చెందిన పల్లపు వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు, ఆరు సవత్సరాల క్రితం సరళ అనారోగ్యం బారిన పడటంతో, నీవు నాకు అక్కర్లేదని, వెంకటేశ్వర్లు చిత్రహింసలకు గురిచేయడంతో సరళ పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. కుమార్తె ప్రియాంక స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సరళ అనారోగ్యంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్న ఈ నెల 12న మరణించింది. ప్రియాంక తల్లి అంత్యక్రియలకు హాజరై తిరగి పాఠశాలకు వచ్చి, తాత, వెంకటశేషయ్య, విద్యాలయం ప్రత్యేకాధికారి సరళ కుమారి ఇచ్చిన ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తోంది. తన తల్లి చనిపోయింది. తండ్రి వెంకటేశ్వర్లు పట్టించుకోవడం లేదు. దాతలు సహకారం అందిస్తే తాను, తన సోదరుడు అనిల్ ఉన్నత చదువులు చదువుకోగలమని విద్యార్థిని చెప్పింది. -
హవ్వ.. నవ్విపోదురు గాక..
ఏలూరు (ఆర్ఆర్ పేట) : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టుంది అధికారుల తీరు.. చివరికి పదో తరగతి పరీక్షలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నట్టు ఉంది. జనరల్ విద్యార్థులకు సాధారణ తెలుపు రంగు ప్రశ్నాపత్రాలను ఇచ్చినప్పటికీ కాంపోజిట్ విద్యార్థులకు పసుపు రంగులో ఇచ్చారు. దీంతో పాటు ఈ పేపరులో గద్య ప్రశ్నల్లో 3వ ప్రశ్న ఫక్తు ముఖ్యమంత్రి ప్రచారానికి, స్వోత్కర్షకు వినియోగించుకున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రశ్న ఇస్తూ అందులో రాష్ట్ర రాజధాని అమరావతిని 35 సంవత్సరాల్లో దశలవారీగా నిర్మిస్తారని, ఆకాశ హారŠామ్యలు, ఉద్యాన వనాలు, సరస్సులు నిర్మించబడతాయని పేర్కొన్నారు. చివరగా అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమంటూ ముగింపుకొచ్చారు. వర్షం వస్తే కారిపోయే భవనాలు, పూర్తిస్థాయిలో అసెంబ్లీ హాలు, శాసనమండలి నిర్మితం కాకపోయినా శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటూ పదో తరగతి విద్యార్థులకు తప్పుడు సంకేతాలివ్వడం కోసమే ఇటువంటి ప్రశ్నలిచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. అమరావతిపై ప్రశ్న ఇవ్వడమే అతిగా ఉంటే అందులో ముఖ్యమంత్రి కృషి అని పేర్కొనడం రాజకీయ దివాళాకోరుతనమని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు అదనపు మార్కులివ్వాలి విద్యార్థులను పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నను తొలగించి విద్యార్థులందరికీ అదనపు మార్కులివ్వాలి. 35 వేల మంది రైతుల భూములు బలవంతంగా లాక్కొని, వారి పొట్ట కొట్టిన చంద్రబాబు ప్రైవేట్ వర్సిటీలకు తక్కువ ధరకే కట్టబెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోతాం. సొంత డబ్బాతో విద్యార్థుల ఆలోచనలను పక్కదారి పట్టించి తన గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. – కాకి నాని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు -
కఠిన పరీక్ష
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతోంది. పరీక్ష విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, కాపీయింగ్కు పాల్పడినా కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమవుతోంది. పర్యవేక్షకులుగా వేళ్లేవారు విధుల్లో అప్రమత్తంగా లేకుంటే మాత్రం చర్యలు తప్పవు. ఈనెల15 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అమలు చేయనున్న నిబంధనలు చూస్తే విద్యార్థులకు పరీక్ష అయినా సిబ్బందికి మాత్రం అగ్నిపరీక్షే అని పలువురు అంటున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే గతంలో పరీక్ష విధుల నుంచి తొలగించేవారు. కానీ ఇప్పుడు సంబంధిత నిబంధనలను కఠినతరంగా చేశారు. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే క్రిమినల్ కేసు నమోదుతోపాటు ఆరునెలల నుంచి 3 సంవత్సరాల వరకూ జైలు, రూ.5 వేలు నుంచి రూ.లక్ష దాకా జరిమానా విధించనున్నట్ల తెలిసింది. కాఫీలకు పాల్పడితే..: పరీక్ష కేంద్రంలోకి స్క్వాడ్ వచ్చినప్పుడు విద్యార్థులు చీటిలతో పట్టుబడినా పక్కవారి పేపర్లో చూచిరాస్తున్నా అందుకు సంబంధించిన ఇన్విజిలేటర్తోపాటు డిపార్టుమెంట్ ఆఫీసర్, చీఫ్ సూపరిండెంట్పైనా చర్యలు చేపట్టనున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు జిల్లాలోని 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో దువ్వూరు, చక్రాయపేట(గండి), కమలాపురం(బాయిస్), నందిమండలం, బి.మఠం, పెనగలూరు మండలం చక్రంపేట, కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు, వనిపెం ట జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. æవీటిలో విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆందోళనలో ఇన్విజిరేటర్లు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో ఉపాధ్యాయిని ఇన్విజిలేటర్గా ఉంటే బాలికలను తనిఖీ చేయడం వీలవుతుంది. పురుష ఉపాధ్యాయుడైతే బాలురను తనిఖీ చేయడం కుదురుతుంది. కానీ చాలా పరీక్ష గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండేచోట సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరు వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఇన్విజిలేటర్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు సంఘాలు అంటున్నాయి. ఈ ఏడాది 35,737 మంది ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరతగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరికోసం 164 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 164 పరీక్ష కేంద్రాలలో ఎవరు కూడా కింద కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కేంద్రాలలో విద్యార్థులకు తాగునీరు వంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షల విధుల పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని లేనిపక్షంలో చట్టం 25ను అమలుచేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్యక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పొన్నతోట శైలజ, డీఈఓ -
పదిలమైన ఫలితాల కోసం...
బాలికల్లో డ్రాపవుట్స్ను తగ్గించేందుకు ఆవిర్భవించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇప్పుడు ఆంగ్లమాధ్యమానికి అప్గ్రేడ్ అయ్యారు. ఐదేళ్లుగా ఎలాగోలా వంటబట్టించుకున్నా...పబ్లిక్ పరీక్షలు తొలిసారిగా రాస్తున్నారు. శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో రకరకాలుగా ప్రణాళికలు రూపొందించిన అధికారులు వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు. విజయనగరం అర్బన్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థినులు మెరుగైన వార్షిక ఫలితాలు సాధన కోసం సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఆంగ్లమాధ్యమం ప్రారంభించిన తరువాత ఈ ఏడాదే తొలిసారిగా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనివల్ల ఫలి తాల్లో ఏమాత్రం తేడా రాకుండా ఉండాలనే లక్ష్యంతో ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. జిల్లాలోని 33 కేజీబీవీల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ఇప్పటికే అంచనావేసి ప్రత్యేక తర్ఫీదులను ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో ఇంతవరకు జరిగిన వివిధ రకాల పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యాలకు అనుగుణంగా తరగతిలో విద్యార్థులను విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇటీవల సబ్జెక్ట్లోని రెండేసి చాప్టర్ల వారీగా టెస్ట్లు పెట్టారు. వీటి ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఒక్కో కేజీబీవీలలో 5 నుంచి 6 శాతం వంతున జిల్లా వ్యాప్తంగా 360 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరందరినీ పాస్ చేయించేం దుకు శ్రద్ధ చూపుతున్నారు. ఎస్ఎస్ఏ పీఓ నుంచి సెక్టోరియల్ అధికారి వరకు ఒక్కో అధికారి ఒక్కో కేజీబీవీని దత్తత తీసుకొని అక్కడి వెనుకబడిన విద్యార్థినుల ఉత్తర్ణత బాధ్యతను తీసుకున్నారు. రోజూ నిర్వహించే ఉద్యోగ విధులతోపాటు అదనంగా ఈ బాధ్యత నిర్వర్తించాలి. సబ్జెక్ట్ వారిగా మాదిరీ ప్రశ్నపత్రాలను తయారు చేసి వాటి ద్వారా వెనుకబడినవారికి తర్ఫీదు ఇస్తున్నారు. టాప్ ఫైవ్ విద్యార్థులను ఒక చోటకు చేర్చి 10/10 సాధన కోసం శిక్షణ ఇస్తున్నారు. పరీక్షకు హాజరుకానున్న 1,139 మంది విద్యార్థినులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు కేజీబీ వీల నుంచి 1,045 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. కేజీబీవీల పరిధిలోని ఉపాధ్యాయులు రూపొం దించిన ప్రత్యేక ప్రశ్నావళితో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. గతేడాది సాధించిన 92.3 శాతం ఉత్తీర్ణత కంటే మెరుగైన ఫలితాలకోసం ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. విద్యార్థినుల్లో పరీక్షపై భయం పోగొట్టే ప్రక్రియలో భాగంగా పాఠశాల స్థాయిలో మానసికోల్లా స కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘అమ్మ ఒడి’ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి వారిని గౌరవించే కార్యక్రమం విద్యాలయం స్థాయిలో చేపట్టారు. ఇలాంటి వాటి ద్వారా వారిలో పరీక్షలంటే భయం పోతుందని ఎస్ఎస్ఏ అధికారులు అంటున్నారు. ఉత్తీర్ణతా శాతంపెంపునకు ప్రణాళికలు కేజీబీవీల్లో పదో తరగతి ఉత్తీర్ణతా శాతాన్ని గతేడాది కంటే మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాం. గతేడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించాం, ఈ ఏడాది సీసీఈ విధానం అమలులో ఉండడంతో ఏమాత్రం తగ్గకుండా శతశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్, ఈ నెల 24 నుంచి జరిగే ప్రీ ఫైనల్ పరీక్షల తరువాత పాఠశాల స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యం తెలుస్తుంది. తద్వారా బోధనపై శ్రద్ధపెడతాం. ఇంగ్లిష్ మాధ్యమంపైభయాన్ని పోగొట్టాం నాలుగేళ్లక్రితం ఆరోతరగతిలో ఇంగ్లిష్ మాధ్యమం మొదలైంది. తొలి బ్యాచ్ పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది రాస్తున్నారు. వీరికి తొలి రోజుల్లో ఇంగ్లిష్ మాధ్యమమంటే భయం ఉం డేది. దీనిని పోగొట్టడానికి ఏడా ది బోధనలో అధిక ప్రాధాన్యమిచ్చాం. దీనివల్ల ఫలితా లను మెరుగవుతాయన్న నమ్మకం ఉంది. – బలగ జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, గంట్యాడ ఫలితాలకోసం ప్రత్యేక కార్యాచరణ కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతుండగా సాయంత్రం 5.30 గంటల వరకు చివరి తరగతిని నిర్వహిస్తారు. పదో తరగతి బోధించే ఉపాధ్యాయులకు వరుస సెలవులు మంజూరు చేయరు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో పాఠాల పునశ్చరణ చేస్తున్నారు. సిలబస్ పూర్తయిన చోట సబ్జెక్టుల వారీగా వినిధరూపాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని నిర్ణయించారు. ఏ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వాటిని ఎలా రాయాలి తెలుసుకోవాలనే దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు.