-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
బలమైన గాలులతో భారీ వర్షాలు..
-
మూడు రోజులు భారీ వర్షాలు
-
వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఏపీలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న ఐదు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించిందిగురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. -
ఏపీ, తెలంగాణాలో తెలుగులోనే నీట్ ఎగ్జామ్
-
తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకి కస్టమర్లు భారీగా పెరిగారు. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న కూరగాయల ధరలు
-
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
-
గొత్తికోయల ‘అరణ్య’ రోదన
వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు. దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్ఓఎఫ్ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు. అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు. బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు. హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది. గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
Modi 3.0: ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరుగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. కిషన్రెడ్డి, రామ్మోహన్నాయుడుకి కేబినెట్లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్కు సహాయ మంత్రులుగా బెర్త్లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్! -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్లాల్ ఖట్టర్లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
ముగియనున్న ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువుపై కొమ్మినేని విశ్లేషణ
-
అంచనాల కంటే ముందే.. రైతులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే.. ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షంఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. -
ఫ్యాషన్ హబ్గా మారబోతోన్న హైదరాబాద్
-
తెలుగు రాష్ట్రాలపై తుపాన్ ఎఫెక్ట్..
-
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
-
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు
హైదరాబాద్/గుంటూరు, సాక్షి: వేసవి తాపం నుంచి ఊరట ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఇరు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వానలు, అలాగే ఏపీలో నాలుగు రోజులపాటు వానలు కురవనున్నాయి.తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, నగర శివారుతో పాటు మెదక్, సిద్ధిపేటలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండలో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.SEVERE STORMS ALERT - MAY 7As marked in the map, East, Central TG to get massive storms, heavy winds, lightining next 24hrs. West TG to get scattered storms ⚠️Hyderabad already had some rains this morning, more scattered storms ahead today with nice respite from heat 😍 pic.twitter.com/fhzs79oYbN— Telangana Weatherman (@balaji25_t) May 7, 2024ఇక కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి వల్ల నేటి నుంచి మూడు రోజులు పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కురుస్తాయని తెలిపింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.మరోవైపు.. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది. ఈ ఉదయం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక శ్రీకాకుళంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. 6th May 5:25 pm : Heavy Thunderstorms forming in a line along YSR Kadapa, Annamayya, Anantapur and also along Palnadu districts close to Nallamala forest range. Next 2 hours, parts of these districts will see good spells of rain with Thunderstorms. Stay indoors !! pic.twitter.com/fChTo2MPSi— Andhra Pradesh Weatherman (@praneethweather) May 6, 2024 అయితే.. రాయలసీమ జిల్లాలలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాలులు కొనసాగినా.. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. బుధవారం నుంచి వాతావరణం చల్లబడొచ్చని చెబుతోంది. ఇంకోపక్క.. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీయొచ్చని వాతావరణశాఖ అంచనా. -
తెలంగాణలో భానుడి భగభగలు..!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్లో 47.6, అబ్దుల్లాపూర్మెట్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు. ఆల్కహాల్తోనూ డీ హైడ్రేషన్.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. వడదెబ్బ లక్షణాలివీ.. వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన..ఫోటోలు
-
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులు (ఫొటోలు)
-
Good Friday 2024 : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే (ఫొటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు