-
హైదరాబాద్ జోన్: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వర్గాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో రెండు నెలల కాలంలోనే ఏసీబీ దాడుల్లో పదుల సంఖ్యలో ఏసీబీ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జోన్ పరిధిలో ఏసీబీ దాడుల్లో పోలీసులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్, ఫైనాన్స్ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఓ అధికారి అరెస్ట్ అయ్యాడు. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ చిక్కారు. సీసీఎస్ సుధాకర్ గౌడ్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.ఇక, కుషాయిగూడలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్లు పట్టుబడ్డారు.తాజాగా సూరారం ఎస్ఐ ఆకుల వెంకటేశం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరు చర్చనీయాంశంగా మారింది. -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్లు హ్యాకింగ్కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్కు చెందిన హాక్ ఐ యాప్తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్కాప్ యాప్ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్శాఖకు సంబంధించిన కీలక యాప్ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్కాప్ యాప్లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్ల నెట్వర్క్ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్వేర్ను రూపొందించిన కంపెనీ.. యాప్లో పాస్వర్డ్లను ప్లెయిన్ టెక్ట్స్గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్కాప్ యాప్లు హ్యాకింగ్కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్లు, సీపీ ఆఫీస్లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్లు, స్పెషల్ యూనిట్లు, టాస్్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్వెబ్లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్కాప్ యాప్కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
HYD: గన్తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్తో కాల్పుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్ నాగర్ కర్నూల్కు చెందిన వ్యక్తి అని తెలిసింది. వివరాల ప్రకారం.. అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆదివారం ఉదయం తన సర్వీర్ రివాల్వర్తో తనను తానే కాల్చుకుని బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. బాలేశ్వర్ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు. -
రాడిసన్ డ్రగ్స్ కేసు: వీఐపీలకు షాక్.. పోలీసుల సరికొత్త ప్రయోగం!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్లో పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా క్రోమోటోగ్రఫీ పరీక్ష చేసేందుకు రెడీ అయ్యారు పోలీసులు. వివరాల ప్రకారం.. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్రోమోటగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం పోలీసులు కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే, కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతిస్తే ఆరోజు రాడిసన్కు వెళ్లిన వారిలో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక, ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి మొత్తం 14 మంది హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి డ్రగ్స్ టెస్టులు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్గా తేలింది. అయితే, వీరిలో సెలబెట్రీలు పార్టీ జరిగిన రోజు నుంచి ఎక్కువ సమయం తీసుకుని డ్రగ్స్ టెస్టు కోసం విచారణకు హాజరయ్యారు. దీంతో, వారి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనపించలేదు. ఈ నేపథ్యంలోనే రాడిసన్కి వచ్చిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి శరీరాల్లో డ్రగ్స్ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ నిర్వహించాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇక, క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదైంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు. -
జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్.. 21 మంది అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్ వైడ్నింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. -
15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. గ్రూప్–1లో 60 కొత్త ఖాళీల భర్తీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో.. 441 మంది సింగరేణి కార్మీకుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సింగరేణి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మీకుల పాత్రను ఎవరూ తగ్గించలేరని, పారీ్టలు విఫలమైన సమయంలోనూ కార్మీకులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సింగరేణి అండగా నిలిచింది రాష్ట్రంలోని గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్రం కూడా సింగరేణికి అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందన్నారు. సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవ లక్షి్మ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
మహిళా పోలీసుల ప్రవర్తన సరికాదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు సంబంధించిన ఇటీవలి సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినినిపై పోలీసుల దాడి అమానుషమని మండిపడ్డారు. ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న నిరసన చేస్తున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్య ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police. This… pic.twitter.com/p3DH812ZBS — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024 ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రవర్తన ఒక కట్టుబాటు కాదు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కవిత పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ -
TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు!
హైదరాబాద్, సాక్షి: పతంగి దారాలు పండుగ పూట ఉత్త పుణ్యానికి మనుషుల కుత్తుకలు కోస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడగా.. తాజాగా సోమవారం మరో ప్రాణం పోయింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. నిషేధిత చైనా మాంజా దారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి వేళ గాలి పటం సరదా ప్రాణాలు తీస్తోంది. బిల్డింగ్పై నుంచి పడి ఇద్దరు, విద్యుత్ షాక్తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మాంజా దారం తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన సంగతీ తెలిసిందే. అలా గడిచిన రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మరో మరణం సంభవించింది. విద్యుత్ తీగలకు తగిలిన పతంగి తీసే క్రమంలో 22 ఏళ్ల యువకుడికి షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. ఝరాసంగం మండలం పొట్పల్లిలో ఇది జరిగింది. వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు గాలి పటం ఎగరేసేలా చూడాలని కోరుతున్నారు. బిల్డింగ్లపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగరేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మాంజాదారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి దుకాణాల్ని సీజ్ చేస్తున్నాయి. సరదా పేరిట పతంగులు ఎగరేస్తూ పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడ్డా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటినుంచే రాయితీ
వరంగల్ క్రైం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాల చెల్లింపు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించిన విషయం తెలిసిందే. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరి ట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. అందరూ చెల్లిస్తే రూ.80కోట్లు వసూలయ్యే అవకాశం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. 2018 జనవరి ఒకటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకింద 47,31,823 చల్లాన్లు ఉండగా, జరిమానా రూ.140,91,52,550 విధించారు. గత మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన సమయంలో, పోలీస్ అధికారులు వాహనాల తనిఖీల సందర్భంగా 20,17,109 చల్లానకుగాను రూ.62,72,66,426 వసూలయ్యాయి. మిగిలిన చలాన్లు 27,14,714 ఉండగా, జరిమానా రూ.80,18,86,124 పెండింగ్లో ఉంది. కాగా, ఈ ఏడాది జనవరినుంచి ఈ నెల 25వ తేదీ వరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 5,73,436, ఆటోలపై 20,700, కార్లపై 1,15,421, లారీలపై 938, భారీ వాహనాలపై 2081, మొత్తం 7,14,720 చలాన్లు విధించారు. వాహనాలపై రాయితీ ఇలా.... బైక్లు, ఆటోలపై 80శాతం, కార్లు, ట్రక్కులు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. చలాన్లు ఉన్న వాహనదారులు తప్పకుండా వినియోగించుకోవాలి. వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించొద్దు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. – సీపీ అంబర్ కిషోర్ ఝా ఇష్టారాజ్యంగా చలాన్ల విధింపు.. కమిషనరేట్ పరిధిలో వాహనదారులపై పోలీస్ అధికారులు విధించిన చలాన్లపై సర్వతా విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయం సమయంలో వాకింగ్వెళ్లొచ్చే వాహనదారులపైనా విత్అవుట్ హెల్మెట్కింద జరిమానాలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగరంలో ప్రత్యేకంగా ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు లేవు. కానీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపితే నో పార్కింగ్ పేరిట జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసే సైన్ బోర్డులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ జరిమానాలు మాత్రం అంతటా వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్లో పనిచేసే కొంతమంది రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు పంపించే పనికి మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిబ్బంది చాలామంది జరిమానాల విధింపుపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. -
TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్?
హైదరాబాద్, సాక్షి: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. అయితే ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు ఛలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా కూడా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది. నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. ఇదీ చదవండి: వైన్ షాపులు.. కావవి బార్లు! -
‘రాజకీయ బదిలీ’లపై కొత్త పోలీసు కమిషనర్ల దృష్టి
హైదరాబాద్: పోలీసు విభాగంలో మరోసారి బదిలీల సీజన్ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో ట్రాన్స్ఫర్లు జరిగాయి. ప్రభుత్వం మారడంతో ‘పాత వారి’ జాబితాలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో ఇన్స్పెక్టర్, ఎస్సై స్థాయిలో భారీ బదిలీలు చోటుచేసుకోనున్నాయి. మరోపక్క ఏసీపీల వ్యవహారాన్ని డీజీపీ కార్యాలయం ఆరా తీస్తోంది. ఈ పోస్టులతో పాటు అదనపు డీసీపీ స్థాయి అధికారులకూ స్థానచలనం తప్పదని తెలుస్తోంది. కమిషనర్ల పోస్టింగులతో సందేశం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు రోజుల్లోనే ముగ్గురు పోలీసు కమిషనర్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ స్థాయి అధికారులకు బదిలీపై పోలింగ్ ముగిసిన నాటి నుంచి చర్చ జరుగుతోంది. పలువురి పేర్లు వినిపించినా.. సర్కారు మాత్రం ఎవరి ఊహకు అందని రీతిలో పోస్టింగ్స్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన వివిధ స్థాయిలకు చెందిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లోనే ఇదే సీన్. వీటి ద్వారా పోలీసింగ్లో రాజకీయ జోక్యం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పోలీసు కమిషనర్లు తమ పరిధిలోని ఠాణాలకు సంస్కరించే పనిలో పడ్డారు. ప్రతిభ, అనుభవాలను పక్కన పెట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ), కీలక విభాగాల్లో పోస్టింగ్స్ పొందిన వారి వివరాలను సేకరించారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటూ.. గడచిన కొన్నేళ్లలో రాజధాని వ్యాప్తంగా ఉన్న పోలీసుల బదిలీల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. కేవలం ఎస్హెచ్ఓలుగా ఉండే ఇన్స్పెక్టర్ స్థాయితో పాటు ఇతర విభాగాలు, ఎస్సై పోస్టుల్లోనే ఇదే పరిస్థితి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ లేదా మినిస్టర్ నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పోస్టింగ్స్ దక్కేవి. కొందరు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని నేరుగా ఆయా అధికారులకు చెప్పేవాళ్లు. తమ అనుమతి లేకుండా పోస్టింగ్ పొందిన అధికారులు చేరకుండా నేతలు అడ్డుపడిన సందర్భాలూ అనేకం. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత కమిషనర్లు భారీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. పరిధి, ప్రాధాన్యం, నేరాల నమోదు ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఠాణాల్లోని పరిస్థితులు అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా అనువైన అధికారులను నియమించాలని నిర్ణయించారు. మూస ధోరణితో వెళ్లకుండా.. ప్రభుత్వం మారిన ప్రతిసారీ పోలీసు బదిలీలు తప్పనిసరి. ప్రతి సందర్భంలోనూ దాదాపు 90 శాతం అధికారులు మారిపోతుంటారు. ఫోకల్లో ఉన్న వాళ్ళు నాన్–ఫోకల్కు, అక్కడి వారు బయటకు వస్తుంటారు. ఠాణాల్లో పని చేస్తున్న ప్రతి అధికారీ పాత నేతలకో, అధికారులతో తొత్తులు కాదు. బదిలీల నేపథ్యంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సిఫారస్లకు చెక్ చెబుతూ పనితీరు, అనుభవనం, నిజాయతీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా స్థాయిలకు చెందిన అధికారుల జాబితా సిద్ధం చేసిన పోలీసు కమిషనర్లు నిఘా విభాగాల ద్వారా వారికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేవలం సర్వీసు రికార్డుల ఆధారంగా కాకుండా కొందరికి సంబంధించి బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను ఆరా తీయిస్తున్నారు. ఏసీపీ స్థాయిలో ‘ప్రయత్నాలు’.. రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్లలో డీఎస్పీ స్థాయి అధికారులు ఏసీపీలుగా, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డీసీపీగా పని చేస్తుంటారు. ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో అనేక చోట్ల ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి, ఆ నేతల సిఫార్సులతోనే పోస్టింగ్ వచ్చింది. ప్రస్తుతం ఈ అధికారులు తమ ‘జెండా’ మార్చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. తమను తామున్న స్థానాల్లోనే కొనసాగించాలని, గతానికి భిన్నంగా తాము మీ మాట వింటామని, ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వస్తే వాళ్లు మీకు అనుకూలంగా ఉండరంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం ఆ స్థాయిల్లోనూ ప్రక్షాళనకు సిద్ధమవుతోంది. -
డిసెంబర్ 31 సెలబ్రేషన్స్.. హద్దు మీరొద్దు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. త్రీస్టార్, అంతకు మించి స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లు, బార్లు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహణకు ముందస్తు పోలీసు అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే కార్యక్రమాలు నిర్వహించాలని, సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలివీ.. ►ప్రతి ఈవెంట్ నిర్వహణ, భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. వేదిక ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్లేస్ వద్ద సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్లో అశ్లీల నృత్యాలు, సంజ్ఙలు ఇ తరత్రా చర్యలకు పాల్పడకూడదు. 45 డెసిబుల్స్కు మించి శబ్దాలు చేయకూడదు. ఈవెంట్లోకి ఎలాంటి తుపాకులు, ఆయుధాలను అనుమతించకూడదు. టపాసులు పేల్చకూడదు. సామర్థ్యానికి మించి పాస్లు, టికెట్లు, కూపన్లు జారీ చేయకూడదు. ►జంటల కోసం నిర్వహించే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదు. ఈవెంట్లలో ఎలాంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగించకూడదు. నియంత్రించడంలో విఫలమైన యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయి. ఎక్సైజ్ విభాగం అనుమతించని సమయానికి మించి మద్యాన్ని విక్రయించకూడదు. మద్యం మత్తులో ఉన్న కస్టమర్లు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈవెంట్ నిర్వాహకులు డ్రైవర్లు, క్యాబ్లను ఏర్పాటు చేయాలి. డ్రంకన్ డ్రైవ్లో దొరికిన వాహనదారుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది. -
HYD: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. ఇది తెలుసుకోండి..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఒంటి గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఇక, తాజాగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల మందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలి. ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. ఈవెంట్స్లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. అలాగే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం ఉండకూడదు. ఈవెంట్స్లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదు. పార్కింగ్కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి లేదు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయి. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయవద్దు. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు. రేపట్నుంచి శ్వేతపత్రాలు కాంగ్రెస్ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. లోక్సభ టార్గెట్ 15 వచ్చే ఏప్రిల్లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి లోపే పదవులు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఇన్చార్జులు ఖరారు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్ నేతలు జీవన్రెడ్డి, సుదర్శన్రెడ్డిలకు కూడా ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి. ఇన్చార్జులు వీరే: చేవెళ్ల, మహబూబ్నగర్ – రేవంత్రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క మెదక్ – దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ – సీతక్క నల్లగొండ – ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వరంగల్ – కొండా సురేఖ ఖమ్మం, మహబూబాబాద్ – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పెద్దపల్లి – శ్రీధర్బాబు కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ – టి.జీవన్రెడ్డి జహీరాబాద్ – పి.సుదర్శన్రెడ్డి మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు నాగర్కర్నూల్ – జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గాం«దీభవన్లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు. 28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పీఎస్లో కేసు నమోదైంది. ఏ1గా ఏపీ పోలీస్ ఫోర్స్ను పేర్కొంటూ కేసు నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. ప్రధాన డ్యామ్లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడి కాల్వ 5వ గేటు నుంచి ఏపీకి వదిలారని ఫిర్యాదులో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ పేర్కొంది. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: సాగర్పై ఏపీ చర్యలు న్యాయమైనవే: మంత్రి అంబటి -
ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యం
-
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాగార్జునసాగర్ డ్యామ్పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్ డ్యామ్పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. సాగర్ డ్యామ్పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు?: కోమటిరెడ్డి సాగర్ డ్యామ్పై పోలీసుల హడావుడి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందిస్తూ.. సాగర్ డ్యామ్పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనేనన్నారు. ఓడిపోతున్నారని కేసీఆర్కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు లేని హడావుడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ -
అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ ఐటీ దాడులు, పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి దాడులు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక, తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధు యాష్కీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హయత్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు. కాగా, పోలీసుల సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆయన ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో, ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం -
పోలీస్ సెల్యూట్ నో..
పెగడపల్లి: నిత్యం పోలీసుల భద్రత, సె ల్యూట్లు, అధికారుల ప్రొటోకాల్ మధ్య ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలకు అవి దూరమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చినపప్పటి నుంచే ప్రొటోకాల్ నిబంధనలు వర్తించకుండాపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మంత్రులతోపాటు పది మంది ఎమ్మెల్యేలున్నారు. వారు పర్యటనకు వచ్చినప్పుడు గౌరవ వందనం, సె ల్యూట్, ప్రొటోకాల్స్ తప్పనిసరి. ఎన్ని కల కోడ్ అమల్లోకి రావడంతో అవి నిలిచిపోయాయి. పైలెటింగ్ సేవలు కూడా ఉండవు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత భధ్రతా సిబ్బంది మాత్రం కొనసాగుతారు. ఎన్నికలు పూ ర్తయి ఎమ్మెల్యేలుగా గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ అధికారులు, పోలీసుల నుంచి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక మర్యాదలుండవు. -
టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత మాగంటి బాబుకు మరోసారి షాక్ తగిలింది. పోలీసులపై దాడి కేసులో మాగంటి బాబుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, సెప్టెంబర్ 16వ తేదీన తన అనుచరులతో కలిసి మాగంటి బాబు హైదరాబాద్లోని ఓఆర్ఆర్పై హంగామా చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి అంతుచూస్తానంటూ బహిరంగంగానే రెచ్చిపోయారు. దీంతో, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా నార్సింగి పోలీసులు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఘర్షణ జరిగిన రోజునే పోలీసులు.. మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇది కూడా చదవండి: అధికారంలో బీఆర్ఎస్ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్ -
చోరీలకు చెక్.. మొబైల్ రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ల దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు టాప్ ప్లేస్ నిలిచి రికార్డు క్రియేట్ చేశారు. 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. వివరాల ప్రకారం.. పోగొట్టుకున్న ఫోన్లలో 39 శాతం రికవరీతో దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ సీఐడీ పోలీసులు టాప్ ప్లేస్లో నిలిచారు. టెలికాం డిపార్ట్ మెంట్ సీఈఐఆర్ అప్లికేషన్ను ఉపయోగించి 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్స్ రికవరీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. దీంతో, హిస్టరీ క్రియేట్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే, చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్ఫోన్స్ ఆధారంగా.. -
పోలీసులకు హ్యాకర్ వార్నింగ్.. పర్సనల్ డేటా బయటపెడతామంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు. అతికష్టమ్మీద సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేసి సమాచారం. ఫోన్లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య