-
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్ కానేకాదు..
చూడటానికి ఇది సాదాసీదా సైకిల్లాగానే కనిపించినా, నిజానికిది ఫాస్ట్ ఫోల్డింగ్ ఈ–బైక్. ఇప్పటికే కొన్ని ఫోల్డింగ్ ఈ–బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మడతపెట్టడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది.బ్రిటిష్ కంపెనీ ‘డికాథ్లాన్’ తాజాగా మార్కెట్లోకి ‘బీటీవిన్ ఈ–ఫోల్డ్–900’ పేరుతో తీసుకు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్ను కేవలం ఒక సెకండులోనే మడతపెట్టి కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఇది 252 డబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేశాక 55 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది.బ్రష్లెస్ మోటారుతో తయారైన దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు. నగరాలు, పట్టణాల రహదారుల్లోనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో కూడా సునాయాసంగా ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం దీనిని యూరోప్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. దీని ధర 1499 పౌండ్లు (రూ.1.59 లక్షలు).ఇవి చదవండి: ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా! -
ఉద్యోగ ప్రకటన దుమారం.. టెక్ కంపెనీకి భారీ జరిమానా
అమెరికాలో ఓ ఉద్యోగ ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపింది. "శ్వేత జాతీయులు మాత్రమే" దరఖాస్తు చేయాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వర్జీనియాకు చెందిన ఒక టెక్ కంపెనీ వేలాది డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఆర్థర్ గ్రాండ్ టెక్నాలజీస్ అనే ఫెడరల్ కాంట్రాక్టర్ సంస్థకు అమెరికా న్యాయ, కార్మిక శాఖలు 7,500 డాలర్ల జరిమానా విధించాయి. దీంతోపాటు ప్రకటన గురించి ఫిర్యాదు చేసిన 31 మందికి 31,000 డాలర్లు చెల్లించాలని ఆయా డిపార్ట్మెంట్లు ఆదేశించాయి.21వ శతాబ్దంలో కూడా 'శ్వేతజాతీయులు మాత్రమే', 'అమెరికాలో జన్మించిన వారు మాత్రమే' అంటూ ఉద్యోగ నియామకాలను ప్రకటించడం సిగ్గుచేటని న్యాయ శాఖ పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డల్లాస్, టెక్సాస్ కేంద్రంగా సేల్ఫోర్స్ బిజినెస్ అనలిస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్థానం కోసం కంపెనీ 2023 మార్చిలో ప్రకటనలు ఇచ్చింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. అవేంటంటే డల్లాస్కు 60 మైళ్ల లోపు దూరంలో స్థానికంగా ఉన్న యూఎస్ బోర్న్ సిటిజన్స్ [శ్వేత జాతీయులు] మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించింది.ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో న్యాయశాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ జాబ్ పోస్టింగ్ను కంపెనీ ఖండించింది. ఇది భారతదేశంలోని తమ అనుబంధ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ లిస్టింగ్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘించిందని, జాతి, జాతీయ మూలం, ఇతర రక్షిత లక్షణాల ఆధారంగా ఫెడరల్ కాంట్రాక్టర్లు వివక్ష చూపరాదనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను కంపెనీ ఉల్లంఘించిందని కార్మిక శాఖ తెలిపింది. -
కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్! ఎలా అంటే?
మారుతున్న టెక్నాలజీ పరంగా.. మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి. అందులో ఎన్నోరకాల పరికరాలను చూసుంటాం. మోకాళ్ల నొప్పులను, వినికడి లోపాలను సరిచేసేటువంటి వీటిని మీరెప్పుడైనా వాడటంగానీ, చూడటంగానీ చేశారా..! అవేంటో మరి చూద్దామా..మోకాలి నొప్పులకు చెక్!ఆటలాడేటప్పుడు గాయాలు కావడం వల్ల కొందరు మోకాలి నొప్పుల బారినపడుతుంటారు. ఇంకొందరు కీళ్ల అరుగుదల వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. నొప్పులు తగ్గడానికి రకరకాల మందులు వాడుతుంటారు. కాపడాలు పెట్టించుకుంటుంటారు. వీటి వల్ల వచ్చే ఉపశమనం అంతంత మాత్రమే! మోకాలి నొప్పుల నుంచి సత్వర ఉపశమనం కలిగించేందుకు అమెరికన్ కంపెనీ ‘నీ ఫ్లో’ హెల్మెట్ ఆకారంలో ఉన్న ఈ మసాజర్ను రూపొందించింది.ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. మోకాలికి దీనిని బిగించి కట్టుకుని, దీనికి ఉన్న స్విచ్ను ఆన్ చేసుకుంటే చాలు– దీని లోపలి వైపు నుంచి కాంతి, వేడి వెలువడటమే కాకుండా, లయబద్ధంగా వెలువడే ప్రకంపనలు మోకాలి కీళ్లకు కండరాలకు మర్దన చేస్తాయి. దీని వల్ల వాపు, నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే కీళ్ల కదలికలు త్వరగా చురుకుదనాన్ని పుంజుకుంటాయి. ‘నీ ఫ్లో’ మసాజర్ మోకాలి ఉపరితలానికి మాత్రమే కాకుండా, లోపలి భాగాలకు కూడా ఫిజియో థెరపీ అందిస్తుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,775) మాత్రమే!కళ్లకు జోడు.. చెవులకు తోడు..ఇది కళ్లజోడులా కనిపిస్తుంది. అలాగని కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వినికిడి సమస్యలు ఉన్నవారి చెవులకు తోడు కూడా. అంటే, ఇది స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ అన్నమాట! జర్మన్ కంపెనీ ‘ఆడియా అకాస్టిక్’ ఈ స్పెక్టకిల్ కమ్ హియరింగ్ ఎయిడ్ను ‘బ్రకాఫ్’ బ్రాండ్ పేరుతో ‘స్పెక్టకిల్ ఎయిడ్’గా రూపొందించింది.దృష్టి లోపాలు, వినికిడి సమస్యలు రెండూ ఉన్నవారికి ఇదొక వరమనే చెప్పాలి. ఇందులోని కళ్లద్దాలు దృష్టిని స్పష్టం చేస్తాయి. కళ్లజోడు చెవులకు పెట్టుకునే భాగంలో చివరివైపు ఉన్న హియరింగ్ ఎయిడ్ శబ్దాలను స్పష్టంగా వినేందుకు దోహదపడుతుంది. మిగిలిన హియరింగ్ ఎయిడ్ పరికరాల మాదిరిగా దీనిని చెవి లోపల పెట్టుకోనవసరం లేదు. మామూలు కళ్లజోడు తొడుక్కున్నట్లే పెట్టుకుంటే సరిపోతుంది.దృష్టి లోపాలు లేకుండా వినికిడి సమస్యలు మాత్రమే ఉన్నవారు జీరో పవర్ గ్లాసెస్తో తీసుకుని, దీనిని తొడుక్కుంటే చాలు. కోరుకున్నంత ధ్వనిలో శబ్దాన్ని వినేందుకు వీలుగా ఇందులో అడ్జస్ట్మెంట్స్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ధర 495 పౌండ్ల (రూ. 51,593) నుంచి ప్రారంభం. ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ మోడల్స్ బట్టి కొంత ఎక్కువ కూడా ఉంటుంది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్తో పరుగులు తీసే కారు.. జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
టెక్ టాక్: ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్ఫామ్లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్చాట్లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
మళ్లీ టెక్ ‘లేఆఫ్’.. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్ : టెక్ ‘లేఆఫ్స్’మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరి తొలి రెండువారాల్లోనే 58 టెక్ కంపెనీలు 7,785 మంది ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్–ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజాగా స్పష్టం చేసింది. టెక్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఈ లేఆఫ్స్ ట్రెండ్ను పరిశీలిస్తే..రాబోయే రోజులు కూడా భారత ఐటీ వృత్తినిపుణులు, టెకీలకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడి ఇంకా మూడు వారాలు కూడా దాటకుండానే వేలాది మంది టెక్ స్టార్టప్ ఉద్యోగులు లేఆఫ్స్కు గురికాగా, రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయపడుతున్నారు. ‘జెనరేటివ్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్షంగా కారణమని వారంటున్నారు. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా.... ► గూగుల్... డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్లలో వందలాదిమంది ► అమెజాన్ సంస్థలోని అమెజాన్ ఆడిబుల్ తమ వర్క్ఫోర్స్లో ఐదు శాతం ► అమెజాన్ ప్రైమ్ వీడియోలో వందలాదిమంది ఉద్యోగులు ► అమెజాన్ ట్విచ్ తన వర్క్ఫోర్స్లో 35 శాతం అంటే 500 మంది ► సోషల్ చాట్, మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ 17 శాతం ఉద్యోగులను అంటే 170 మంది ► వీడియోగేమ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్వేర్ తన ఉద్యోగుల్లో 25 శాతం అంటే 1,800 మంది ► ఐటీ కంపెనీ జిరాక్స్ తన వర్క్ఫోర్స్ను 15 శాతం అంటే 3000మంది ► యూఎస్కు చెందిన ప్రాప్టెక్ కంపెనీ ఫ్రంట్డెస్క్ గూగుల్ మీట్లో రెండు నిమిషాల్లోనే తన 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదంతా ఇదే పరిస్థితి ఉండొచ్చు భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం/వాయిదా పడడంతో ఆ ప్రభావం ఇక్కడి ఐటీ పరిశ్రమపై పడింది. యూఎస్ వడ్డీరేట్ల పెరుగుదల, పరిశ్రమపై చాట్ జీపీటీ వంటి కృత్రిమమేథ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయిల్ వ్యవహారం, ఎర్రసముద్రంలో హైతీ తీవ్రవాదుల దాడులు వంటివి కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికా డాలర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు రావాల్సిన నూతన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరోనా కాలంలో భారీగా ప్రాజెక్టులు వస్తాయని కంపెనీలు ఊహించి పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేశాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరిట పెద్దసంఖ్యలో లేఆఫ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 2020–21 నుంచే యూఎస్ ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఈ విధంగా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చునని భావించింది. అయితే మూడేళ్లుగా ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా ఇలాంటి చర్యలే కొనసాగాయి. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా కూడా ప్రస్తుత పరిస్థితులే కొనసాగే అవకాశాలున్నాయి. – ఎన్.లావణ్యకుమార్, స్మార్ట్స్టెప్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు లేఆఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్కు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈ ప్రకంపనలు భారత్ టెక్, ఐటీ ఇండస్ట్రీపై కూడా పడడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది..ఎలాంటి చిక్కులు, అడ్డంకులు సృష్టిస్తుందనేది చూడాలి. ఆర్థికంగా ఎదురయ్యే పరిస్థితులు, మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితరాలతో మనదేశంలోనూ పెద్ద కంపెనీ లేఆఫ్స్కు దిగడం మొదలుపెట్టాయి. గ్లోబల్ ఐటీ వర్క్ఫోర్స్కు భారత్ అందిస్తున్న భాగస్వామ్యం ముఖ్యమైనది కావడంతో లేఆఫ్స్తో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఐటీరంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ ప్రభావాలు, పరిణామాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ దిగ్గజాలు, వృత్తినిపుణులు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే లేఆఫ్స్ అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. – కార్తీక్ డాలే, డేటాస్కిల్స్ సంస్థ ఫౌండర్ -
స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్! ఆటకు సాంకేతికతను జోడించి..
ఆటలు, సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు విషయాలు కాదు. సాంకేతికత సహాయంతో ఆటల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు... అనే లక్ష్యంతో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా ‘స్తూప స్టోర్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది మేఘా గంభీర్. ఎలాంటి ప్లాన్ లేకుండానే పెద్ద కార్పొరేట్ కంపెనీలో తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్బై చెప్పింది మేఘా గంభీర్. అదే సమయంలో ఆమె భర్త, టేబుల్ టెన్నిస్ కోచ్ దీపక్ మాలిక్ ‘టెక్నాలజీ సహాయంతో ట్రైనీల పెర్ఫార్మెన్స్ను ఎలా మెరుగుపరచవచ్చు...’ అనే అంశంపై ఆలోచిస్తున్నాడు. మేఘకు వెంటనే స్టార్టప్ ఐడియా తట్టింది. డేటా, ఎనలటిక్స్ సహాయంతో ప్లేయర్స్ తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి రెండు సంవత్సరాల క్రితం ‘స్తూప స్పోర్ట్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్కు శ్రీకారం చుట్టింది. దీనికిముందు అమెరికన్ ఎక్స్ప్రెస్, పెప్సికో... మొదలైన కంపెనీలలో పదిహేను సంవత్సరాల పాటు టెక్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసింది. మేఘకు ఆటలు అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆటలలో నిపుణుౖలైన ఎంతోమందితో మాట్లాడిన తరువాత తన స్టార్టప్ ఐడియాను పట్టాలకెక్కించింది. డేటాను కాప్చర్ చేసే ఆటోమేటెడ్ ఇంజిన్ను తయారు చేయడానికి సంవత్సరానికి పైగా టైమ్ పట్టింది. ఆటలో ప్రతి కోణాన్ని విశ్లేషించుకునేలా కోర్టులో 8–10 కెమెరా సెటప్కు రూపకల్పన చేశారు. కంపెనీకి సంబంధించి ప్రత్యేక టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి పదిహేనుకు పైగా గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు. ‘టెక్నాలజీ వైపు నుంచి స్పోర్ట్స్ ఎనలటిక్స్ వైపు మేఘ రావడానికి కారణం ఏమిటి?’ జవాబు ఆమె మాటల్లోనే... ‘ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పటికీ నేను చేస్తున్న ఉద్యోగంతో సంతోషంతో లేను. ఉద్యోగం కాకుండా నెక్ట్స్ ఏమిటి... అని ఆలోచించడానికి గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నా భర్త వల్ల స్టార్టప్ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్లో నా కాన్సెప్ట్ను ప్రెజెంట్ చేస్తే మంచి స్పందన వచ్చింది. జూనియర్స్, యూత్, సీనియర్స్... ఇలా రకరకాల విభాగాలు ఆటలో ఉంటాయి. ప్రతి మ్యాచ్కు, ప్రతి ప్లేయర్కు సంబంధించిన సమాచారాన్ని కాప్చర్ చేయడం కోచ్లకు కష్టం అవుతుంది. ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించడానికి వారి దగ్గర తగిన సమాచారం ఉండాలి. ఒక ప్లేయర్ టోర్నమెంట్కు సంబంధించి అయిదు లేదా పది మ్యాచ్లు చూడాల్సి వస్తే డేటా రాయడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఎనలటిక్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్ను తీసుకువచ్చాం. దీనిద్వారా ప్లేయర్స్ తమ మ్యాచ్ వీడియోలను అప్లోడ్ చేసి విశ్లేషణ రిపోర్ట్ను తీసుకోవచ్చు. ఇదే సమయంలో కామెంటర్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్స్ రూపొందించాం. టేబుల్ టెన్నిస్తో మొదలుపెట్టాం. బ్యాడ్మింటన్లాంటి ఇతర ఆటల్లోకి కూడా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాం’ అంటుంది మేఘా గంభీర్. నాణ్యతతో కూడిన వర్చువల్ కోచింగ్, ప్లేయర్స్కు ఉపయోగపడే సెన్సర్–బేస్డ్ టెక్నాలజీపై ప్రత్యేక కృష్టి పెట్టింది కంపెనీ. యూరప్ మార్కెట్లో పట్టు సంపాదించిన ‘స్తూప’ ఆసియా, యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంది. ‘మహిళా స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్లు తక్కువగా కనిపిస్తారు. చాలామంది లైఫ్స్టైల్, ఫ్యాషన్, ఫుడ్లాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్గా నేను విజయం సాధించడానికి కారణం చక్కని సలహాలు ఇచ్చిన అనుభవజ్ఞులు, విషయ నిపుణులు, ప్లేయర్స్, కోచ్ల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్’ అంటుంది మేఘా గంభీర్. (చదవండి: ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! వెడ్డింగ్ విత్ టికెట్!) -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్లో భాగంగా తనే ఏజ్ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్లను ఒకే డ్యాష్బోర్డ్లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
ఆసక్తే అతడి శక్తి! అదే టాప్ డిజిటల్ స్టార్గా మార్చింది!
తెలుసుకోవాలనే ఆసక్తి ఆ తరువాత శక్తిగా మారుతుంది. శక్తిమంతులు ఊరకే ఉంటారా! కొత్త ద్వారాలు తెరుస్తారు. గర్వ పడేలా ఘన విజయాలు సాధిస్తారు. ఢిల్లీకి చెందిన జే కపూర్ టెక్నో యూనివర్శిటీలలో చదువుకోలేదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అంటూ గ్యాడ్జెట్ల పుట్టుపుర్వోత్తరాల గురించి ఆసక్తి చూపించేవాడు. ఆ ఆసక్తి అంతులేని శక్తిని ఇచ్చింది. ‘డిజిటల్ స్టార్’ హోదాలో హుందాగా కూర్చోబెట్టింది. తాజాగా... ఫోర్బ్స్ ఇండియా ‘టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు జే కపూర్... మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తితే జే కపూర్ను వెదుక్కుంటూ వచ్చే వాళ్లు ఫ్రెండ్స్. నిమిషాల వ్యవధిలోనే వాళ్లు పట్టుకొచ్చిన సమస్యకు పరిష్కారం చూపేవాడు కపూర్. కొంతకాలం తరువాత సుపరిచితులే కాదు అపరిచితులు కూడా కపూర్ను వెదుక్కుంటూ రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ‘తరచుగా ఎదురయ్యే కొన్ని సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు’ పేరుతో ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాడు. అలా డిజిటల్ ప్రపంచంలో తొలి అడుగు వేశాడు. 2011లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అయితే చాలామంది యూట్యూబర్లకు ఎదురైనట్లే ఖరీదైన కెమెరా ఎక్విప్మెంట్స్ కొనడానికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఎలాగో కష్టపడి తనకు కావాల్సిన సాంకేతిక పరికరాలు సమకూర్చుకున్నాడు. లేటెస్ట్ టిప్స్, ట్రిక్స్, ట్యుటోరియల్స్, ట్రెండింగ్ టాపిక్స్తో తన యూట్యూబ్ చానల్ దూసుకుపోయింది. సక్సెస్కు ‘ఐడియా అండ్ రిసెర్చ్’ ముఖ్యమైనవి అంటాడు కపూర్. ట్విట్టర్ నుంచి దినపత్రికలలో వచ్చే ఆర్టికల్స్ వరకు ఎక్కడో ఒక చోట తనకు ఐడియా దొరుకుతుంది. ఆ తరువాత అన్ని కోణాల్లో దాని మీద రీసెర్చి మొదలుపెడతాడు. ‘కొన్నిసార్లు మూడు గంటల్లో చేసిన వీడియోలకు లక్షలాది వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు రోజుల తరబడి చేసిన వీడియోలు ఫ్లాప్ అవుతుంటాయి’ నవ్వుతూ అంటాడు కపూర్. 19 సంవత్సరాల వయసులోనే మన దేశంలోని ‘టాప్ 6 టెక్ యూట్యూబర్స్’లో ఒకరిగా నిలిచిన జే కపూర్ ఆండ్రాయిడ్ డెవలపర్ కూడా. ‘ఫ్లాష్ సేల్ హెల్పర్’ అతడి తొలి యాప్. ఆ తరువాత స్మార్ట్ఫోన్ యూజర్లకు ఉపయోగపడే ‘వోల్ట్ చెకర్’ యాప్ క్రియేట్ చేశాడు. ‘విజయం సాధించాలనే దృష్టితో పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు అదేపనిగా చదవడం నుంచి కాన్ఫరెన్స్లకు హాజరు కావడం వరకు ఎన్నో చేస్తుంటాం. అయితే మన జయాపజయాలను నిర్ణయించేది మాత్రం మన కష్టమే’ అంటాడు జే కపూర్. టెక్ ఇన్ఫ్లూయెన్సర్గా సుపరిచితుడైన కపూర్ ‘మనీ మిసెక్ట్స్’ పేరుతో చేసే వీడియోలతో ఫైనాన్స్ ఇన్ఫ్లూయెన్సర్గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. కష్టం కనిపిస్తేనే విజయం కనిపిస్తుంది. స్ఫూర్తి అనేది ఎక్కడి నుంచి, ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు. స్ఫూర్తి తీసుకోవడానికి పెద్దగా కష్టం అక్కర్లేదు. అయితే ఆ స్ఫూర్తిని మన విజయంగా మలుచుకోవడానికి మాత్రం బాగా కష్టపడాలి. కష్టం కనబడని చోట విజయం కూడా కనిపించదు. – జే కపూర్ (చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!) -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ఇజ్రాయెల్ ‘స్టార్టప్ నేషన్’ ఎందుకయ్యింది? టెక్ దిగ్గజాల దృష్టిని ఎలా ఆకర్షించింది?
ఇజ్రాయెల్పై హమాస్ దాడి కొనసాగుతోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా వందలాది మంది పౌరులను కోల్పోయింది. ప్రపంచానికి సాంకేతికతతో సహా వివిధ ఉత్పత్తులను విక్రయించే ఇజ్రాయెల్ ఇప్పుడు కష్టాల కొలిమిలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా హమాస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దీన్ని స్టార్టప్ కంట్రీ అని కూడా అంటారు. ఇంతటి ఘనమైన పేరు ఇజ్రాయెల్కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను అమితంగా ప్రోత్సహించింది. స్టార్టప్లకు నిధులను సమకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలకు తగిన మద్దతును అందిస్తుంది. ఇటువంటి స్నేహ పూర్వక వాతావరణం కారణంగానే దేశంలో స్టార్టప్ల సంఖ్య వేగంగా పెరిగింది. 1990లలో ఇజ్రాయెల్.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో హైటెక్ విప్లవాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ స్టార్టప్లు టెల్ అవీవ్ సాంకేతిక కేంద్రం నుండి జెరూసలేం వరకు విస్తరించాయి. దక్షిణ ఎడారి నగరమైన బీర్-షేవాలో కూడా ఇజ్రాయెల్ స్టార్టప్లు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్టార్టప్ల భాగస్వామ్యం కారణంగా ఇజ్రాయెల్.. ‘స్టార్టప్ నేషన్’ హోదాను దక్కించుకుంది. స్టార్టప్ దేశంగా మారిన ఇజ్రాయెల్ ఆర్థికంగా మరింత బలోపేతంగా మారింది. ఇక్కడి స్టార్టప్లు దేశ ఆర్థిక వ్యవస్థలోకి $4.8 బిలియన్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇందులో 85 శాతం విదేశీ పెట్టుబడిదారులు ఉండటం విశేషం. ఇజ్రాయెల్ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.3 శాతం పరిశోధన, అభివృద్ధి రంగాలకు కేటాయిస్తోంది. గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల పరిశోధనా కేంద్రాలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్లోని పలు స్టార్టప్లు హెల్త్ టెక్, మొబైల్ యాప్లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్లను కలిగిన దేశంగా పేరుగాంచింది. ఈ దేశంలో ప్రతి 1,400 మందికి ఒక స్టార్టప్ ఉంది. అంటే దేశంలోని ప్రతి 1,400 మంది పౌరులలో కనీసం ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు లేదా సహ వ్యవస్థాపకుడు కనిపిస్తారు. ఇజ్రాయిలీలు పరిశోధన ఆవిష్కరణలకు పెట్టిందిపేరుగా నిలిచారు. ఈ దేశంలో 3,000కు మించిన హై-టెక్ స్టార్టప్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్మికులు సగటును అత్యధిక వేతనం పొందుతున్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? -
అగ్రి - టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్ఎస్జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఎస్జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్కు డిఫైనింగ్ మార్క్ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్గ్రౌండ్లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్బాట్ను గూగుల్కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్ఫాం చాట్జీపీటీకి పోటీగా బార్డ్ను గూగుల్ రూపొందించింది. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
ఒక టెకీ హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కొత్త ఒరవడి సృష్టించింది!
సౌమ్యంగా సాధించింది సౌమ్య ఈ తరం టెకీ. సాంకేతికతను ఆరోగ్యానికి అద్దింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో వైద్యరంగంలో కొత్త ఒరవడి తెచ్చింది. వైద్యరంగం, ఔషధాల తయారీ రంగాలు సాంకేతికతను అందుకోవాల్సినంత వేగంగా అందుకోవడం లేదనుకుంది సౌమ్య. ‘మల్టిప్లైయర్ ఏఐ’ పేరుతో హెల్త్కేర్ రంగంలో ప్రవేశించింది. ఇంత సునిశితమైన, సంక్లిష్టమైన పరిశ్రమను నిర్వహించడం మగవాళ్లకే సాధ్యం అనే అభిప్రాయాన్ని చెరిపేసిందామె. ‘మగవాళ్ల ప్రపంచం అనే భావన మహిళలు ప్రవేశించేటంత వరకే. ఒకసారి మహిళలు ప్రవేశిస్తే ఇక అది అపోహ మాత్రమేనని నిర్ధారణకు వచ్చేస్తాం. మా టీమ్ లో సగానికి పైగా మహిళలే. సేల్స్ విభాగంలో కూడా మహిళలు సమర్థంగా పని చేస్తున్నార’ని చెప్పింది. ఒక టెకీ హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి దారితీసిన పరిస్థితులను, హైదరాబాద్లో సంస్థ స్థాపించి సక్సెస్ అందుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు సౌమ్య. భారీ మూల్యం చెల్లించాం ‘‘నన్ను హెల్త్కేర్ ఇండస్ట్రీలోకి రప్పించిన కారణాలు అత్యంత బాధాకరమైనవి. మాది ఉత్తరప్రదేశ్, ప్రయాగరాజ్ (అలహాబాద్). నాన్న రవిప్రకాశ్ శ్రీవాస్తవ ఐఏఎస్ ఆఫీసర్. నాన్న డయాబెటిస్తో బాధపడుతుండేవారు. రొటీన్ టెస్ట్లు, మెడికేషన్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. మా జీవితాలు భారీ మూల్యం చెల్లించుకున్న పొరపాటు అది. వైద్యుల నిర్లక్ష్యం, రాంగ్ మెడికేషన్ కారణంగా ఆయన హటాత్తుగా ప్రాణాలు వదిలారు. నేనప్పుడు బీటెక్ సెకండియర్లో ఉన్నాను. ఆ తర్వాత కొద్దిసంవత్సరాల్లోనే అమ్మకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. మేము తెలుసుకునేటప్పటికే వ్యాధి మూడవ దశకు చేరింది. చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆరు నెలలకే అమ్మను కూడా కోల్పోయాను. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనే బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశాను. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ వైద్యరంగం ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబడుతోంది. ఆ వెనుకబాటు తెచ్చిన నష్టంలో మా అమ్మానాన్నల మరణాలు కూడా భాగమేననిపించింది. ఈ రెండు రంగాల మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయాలనే సంకల్పం కలిగింది, చేయగలననే నమ్మకం కూడా. సమాచారలోపం తలెత్తని విధంగా మెడికల్ డాటాను పరిరక్షించగలిగే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాను. మల్టిప్లైయర్ ఏఐ స్థాపించి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా డాటా అనలైజేషన్, డాటా మెయింటెయిన్ చేస్తున్నాం. మా సంస్థకు ‘ఐఎస్ఓ 27001’ సర్టిఫికేట్ వచ్చింది. మా సర్వీస్ను దేశవిదేశాల్లో పెద్ద ఆరోగ్య సంస్థలు తీసుకుంటున్నాయి. పేషెంట్ కేర్లో మొదటిది పేషెంట్ ఆరోగ్య చరిత్ర, క్రమం తప్పని పరీక్షల ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, పరీక్షల నివేదికల నిర్వహణ ప్రధానమైనవి. ఇక్కడ పొరపాటు జరిగితే ప్రాణాలు దక్కవని చెప్పడానికి మా పేరెంట్సే ఉదాహరణ. ఫాలో అప్ సర్వీస్ వ్యాధి నిర్ధారణ ఆధారంగా వైద్యం అందించిన తర్వాత తదనంతర పరీక్షలను, వైద్యాన్ని అందించాల్సిన సమయానికి ఫాలో అప్ చేయడం కూడా మా సర్వీస్లో భాగంగా ఉంది. అలాగే భవిష్యత్తులో టెలిమెడిసిన్ విస్తరించాల్సిన అవసరం ఉంది. వైద్యచికిత్సను కుగ్రామాలకు చేరడానికి చక్కటి మాధ్యమం ఇది. పేషెంట్ను ఉన్న చోటనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని మానిటర్ చేయడం సాధ్యమవుతుంది. నేను చదివిన టెక్, బయోటెక్ పరిజ్ఞానం ఇందుకు దోహదం చేసింది. నాకు సవాళ్లు ఎదురయ్యాయా అంటే సవాళ్లు లేని ప్రొఫెషన్ అంటూ ఏదైనా ఉంటుందా? డిజిటల్ బ్రాండింగ్, మార్కెటింగ్లో అవరోధాలు వచ్చాయి. మా క్లయింట్ల సందేహాలను తీరుస్తూ, వాళ్లు సమాధానపడే వరకు సహనంగా వివరించాం. సవాళ్లకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు పోవడమే సక్సెస్కు దారి తీస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మా నాన్నను కోల్పోవడమే నన్ను ఈ రంగం వైపు నడిపించింది. ప్రతి విజయంలో మా అమ్మానాన్న కనిపిస్తున్నారు’’ అని వివరించారు సౌమ్య. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఉపయోగపడనుంది. -
China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!
ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన లేజర్లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. హై గ్రేడ్ లేజర్ సిస్టమ్లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్లు సూపర్ సోనిక్ మిసైల్లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది. ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం, చెంచుపల్లి గ్రామానికి చెందిన మేకల లిఖిత్ నవనీత్ (24) పోచారం ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ స్నేహితుడు మచ్చ నవీన్తో కలిసి దిల్శుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం వారిరువురు బైక్పై హాస్టల్ నుంచి పోచారానికి వెళుతుండగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడ్డారు. బస్సు వెనక చక్రాలు లిఖిత్ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లిఖిత్ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్ చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరు మేకల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!) -
‘వైజాగ్ టెక్ సమ్మిట్ 2023’: భారీ పెట్టుబడులే లక్ష్యం
విశాఖపట్నం మరో ప్రపంచస్థాయి సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసంధానంతో పల్సస్ గ్రూపు సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 నిర్వహణకి సన్నాహాలు మొదలయ్యాయి. ``వైజాగ్ టెక్ సమ్మిట్ 2023``పేరుతో ఫిబ్రవరి 16, 17తేదీలలో నిర్వహించనున్న సమ్మిట్ కి గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు, మేధావులు హాజరు కానున్నారు. పల్సస్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ఇప్పటివరకూ 3,000లకు పైగా అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో వైజాగ్ టెక్ సమ్మిట్ బాధ్యతలు స్వీకరించారు. డిజిటల్, మెడికల్, టెక్ ఈవెంట్లను దిగ్విజయంగా నిర్వహించిన పల్సస్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో పల్సస్ గ్రూపు గ్లోబల్ నెట్వర్క్ ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చిన సంస్థలు-మేధావులు జ్ఞానాన్ని పంచుకోవడానికి, తాజా అంశాలను చర్చించడానికి, ఫ్యూచర్ టెక్నాలజీని ప్రదర్శించడానికి వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 వేదిక కానుంది. వర్చువల్, ఫిజికల్ ఈవెంట్ వేదికల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. ఫిబ్రవరి 16, 17తేదీలలో రెండు రోజులపాటు 3 సెషన్లలో 25 మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ప్రసంగిస్తారు. మనదేశంతోపాటు వివిధ దేశాల నుంచి ఇప్పటికే కంపెనీలు స్థాపించి విజయవంతంగా నడుపుతున్న ప్రతినిధులు వెయ్యి మందికి పైగా హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ టెక్ కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మార్గాన్ని చూపేందుకు సమర్థవంతమైన వేదిక కానుంది. వైజాగ్ టెక్ సమ్మిట్ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీకి అనుసంధానం అయ్యే అవకాశం దక్కనుంది. పరిశ్రమ ప్రముఖులు, తయారీదారులు, కీలక నిర్ణయాధికారులతో ఫేస్ టైమ్ పొందవచ్చు. వినూత్నమైన సాంకేతికతలను పరిచయం సంస్థల దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడొచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రపంచస్థాయి సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలోనే మొట్టమొదటిది కానుంది. సమ్మిట్ నిర్వహణకి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఈవెంట్లు జరుగుతాయి. నవంబర్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇన్వెస్టర్ల రోడ్ షో, స్టార్టప్ మీట్-అప్లు, CEO కాన్క్లేవ్లతో ప్రారంభం కానుంది. 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో మెగా ఈవెంట్ నిర్వహణతో టెక్ సమ్మిట్ ముగియనుంది. పోస్టర్ ఆవిష్కరణ వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 ఈవెంట్ పోస్టర్ను గురువారం ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జొనాథన్ హీమర్, మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ, న్యూ ఢిల్లీ, యుఎస్ కాన్సులేట్ ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ ఆండ్రూ ఎడ్లెఫ్సెన్ హైదరాబాద్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం కిరణ్ కుమార్ రెడ్డి సలికిరెడ్డి, గ్రూప్ సీఈఓ, APEITA, జనరల్ మేనేజర్ APEITA, సాయి అరవింద్, డాక్టర్ శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్ గ్రూప్, వైస్ చైర్మన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ EOUs, SEZs, (govt of india) శ్రీకాంత్ బాడిగ, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సి నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ; CH. రాజగోపాల్ చౌదరి, ఛైర్మన్, దేవి ఫిషరీస్ లిమిటెడ్; సౌరభ్ జైన్, హెడ్ ఏరోస్పేస్, ఎయిర్పోర్ట్ సిటీ బిజినెస్, GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్; M. మురళీధర్, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్; K. గణేష్ సుబుధి, CFO, K Rraheja IT పార్క్స్; ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఎస్, అనంత్ ఇన్ఫో పార్క్, హైటెక్ సిటీ సీఎండీ సుబ్బారావు పావులూరి పాల్గొన్నారు. ప్రపంచ ఇన్వెస్టర్ రోడ్ షోలు, 'సీఈవో సమావేశాల షెడ్యూల్ ♦ 29 నవంబర్ 2022, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్ ♦ 01 డిసెంబర్ 2022, హోటల్ స్వాస్తి ప్రీమియం, భువనేశ్వర్ ♦ 11 డిసెంబర్ 2022, విశాఖపట్నం, ఈవెంట్ ప్రెస్ మీట్ ♦ 17 డిసెంబర్-ITC మౌర్య- ఢిల్లీ ♦ 21 డిసెంబర్ - ఐటీసీ గ్రేడేనియా- బెంగళూరు ♦ 28 డిసెంబర్ - ఐటీసీ కోహినూర్- హైదరాబాద్ ♦ 07 జనవరి 2023- ITC మరాఠా- ముంబై ♦ 11 జనవరి 2023- ITC చోళ- చెన్నై ♦ 28 జనవరి 2023 - రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్-లండన్ ♦ 31 జనవరి 2023- WTO టవర్- దుబాయ్ ♦ 02, 04, 06, ఫిబ్రవరి 2023 ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలు