Advertisement
Tata Project
-
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
ఎంఎంటీఎస్-2 కూత
టెండర్లు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థ 30 నెలల్లో రూ.389 కోట్లతో లైన్ల నిర్మాణం కొత్త ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు అందుబాటులోకి సాక్షి, సిటీబ్యూరో : ఎట్టకేలకు ఎంఎంటీఎస్ రెండోదశలో ప్రతిష్టంభన తొలగిపోయింది. దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సోమవారం జీఎమ్మార్ సంస్థకు అప్పగించింది. మొత్తం ఆరు మార్గాల్లో నిర్మించనున్న రెండోదశలో లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల కోసం రూ.389 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ఇందులో రూ.207 కోట్ల విలువైన పనులను జీఎమ్మార్ సంస్థ పూర్తి చేయనుంది. ఇందుకోసం 30 నెలల కాలపరిమితిని విధించారు. టాటా ప్రాజెక్ట్, కాళింది రైల్ నిర్మాణ్ సంస్థలతో కలిసి జీఎమ్మార్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. వచ్చేనెలలో పనులు ప్రారంభించే అవకాశ ం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రిటన్ సంస్థ బాల్ఫోర్బెట్టి ముందుకొచ్చినప్పటికీ గతేడాది సాంకేతిక కారణాల వల్ల విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ఆ సంస్థతో కలిసి పనిచేసేందుకు కాళింది సంస్థ కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. బాల్ఫోర్బెట్టి టెండర్లను కూడా దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో కొందరు రాజకీయ నేతలు కమిషన్లు అడిగినందుకే ఆ సంస్థ వెనకడుగు వేసినట్లు సమాచారం. దీంతో రెండోదశకు బ్రేకులు పడ్డాయి. తాజాగా జీఎమ్మార్ ఈ టెండర్లను దక్కించుకోవడంతో మళ్లీ కదలిక ప్రారంభమైంది. లైన్ల నిర్మాణ ం ఇలా... రెండోదశలో ఘట్కేసర్ నుంచి మౌలాలీ వరకు 14 కి.మీ. మేర కొత్త లైన్లు వేసి విద్యుదీకరిస్తారు. సనత్నగర్ నుంచి మౌలాలీ వరకు 23 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలి. ఫలక్నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 6 కి.మీ. మేర కొత్త లైన్లను నిర్మించాలి. బొల్లారం-మేడ్చల్మధ్య 14 కి.మీ. లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు 14 కి.మీ. విద్యుదీకరిస్తారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ. పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల ఫిరోజ్గూడ, సుచిత్ర జంక్షన్, బీహెచ్ఈఎల్, భూదేవినగర్, మౌలాలీ హౌసింగ్బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.