-
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
నెల రోజుల గరిష్టం
128 పాయింట్లు ప్లస్ 26,881కు చేరిన సెన్సెక్స్ మళ్లీ 8,000 దాటిన నిఫ్టీ చివర్లో పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 26,881 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 36 పాయింట్లు లాభపడి 8,028 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 8,000 మైలురాయికి ఎగువన ముగిసింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 5.6%కు చేరుతుందన్న ప్రపంచ బ్యాంకు అంచనాలు, ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు దేశీయంగా సెంటిమెంట్కు జోష్నిచ్చాయని విశ్లేషకులు తెలి పారు. ఇదికాకుండా అక్టోబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్ల ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. సన్ ఫార్మా జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా 4.3% పుంజుకోగా, సిప్లా, టాటా పవర్, ఎస్బీఐ, గెయిల్, ఐసీఐసీఐ 3-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, భారతీ, హెచ్యూఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, మారుతీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ 1.5-0.5% మధ్య నష్టపోయాయి. -
‘మహా’ రైళ్లకు గుజరాత్ విద్యుత్
సాక్షి, ముంబై: విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్న పశ్చిమ రైల్వే జోన్ అధికారులు ఆ సమస్యకు విరుగుడు కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సం బంధించి ఇప్పటికే అక్కడి అధికారులకు లేఖ రాయగా, వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. రైల్వేల నిర్వహణకు సంబంధిం చి ఆయా జోన్లకు కేంద్రం పూర్తి అధికారాలు దఖ లుపర్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరి ష్కరించేందుకు పక్కరాష్ట్రం నుంచి విద్యుత్ కొనాలని అధికారులు నిర్ణయించారు. ముంబై సబర్బన్లో రైళ్లను నడిపేందుకు చవక ధరలో విద్యుత్ కొనుగోలు చేయాలన్నది అధికారుల ప్రతిపాదన. ప్రస్తుతానికి వారు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెం దిన విద్యుత్ పంపిణీ సంస్థ , టాటా పవర్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల వ్యయం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఈ భారాన్ని అదు పు చేసేందుకు గుజరాత్ నుంచి కేవలం యూని ట్కు ఐదు రూపాయల చొప్పున కరెంటును కొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత 50 మెగావాట్లను గుజరాత్ నుంచి కొనుగోలు చేయాలని, ఆ తరువాత దీన్ని మరింత పెంచాల ని భావిస్తున్నారు. గుజరాత్లోని టిట్వాలా విద్యు త్ ప్రాజెక్టు త్వరలోనే వినియోగంలోకి రానున్నందున, అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును తాము కొనుగోలుచేస్తామని పశ్చిమ రైల్వే ప్రతి పాదించింది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. -
ఆదుకున్న ఐటీ
రోజంతా ఒడిదుడుకులు చివరికి స్వల్ప లాభాలు ఒక దశలో 25,711కు సెన్సెక్స్ 25,584 వద్ద ముగింపు తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది. ఎఫ్ఐఐల పెట్టుబడులు సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి. -
బెస్ట్కు ‘టాటా’..!
సాక్షి, ముంబై: నగరవాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(బెస్ట్)కు టాటా చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. కారణం సుప్రీంకోర్టు ఆదేశాలతో నగరవాసులకు త్వరలో ‘టాటా పవర్’ అందుబాటులోకి రానుంది. ప్రత్యేకించి దక్షిణ ముంబై వాసులకు ఈ టాటా పవర్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లుల విషయంలో బెస్ట్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. బెస్ట్ సంస్థ ఒక్కటే సరఫరా చేస్తుండడంతో చార్జీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. తమ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని కోరుతూ బెస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెస్ట్తోపాటు ఇక్కడ ఎవరైనా(టాటా) విద్యుత్ సరఫరా చేసుకోవచ్చని తీర్పునివ్వడంతో బెస్ట్కు చుక్కెదురైంది. సరఫరాదారుల మధ్య ఇకపై పోటీ పెరుగుతుందని, టాటా పవర్ తక్కువ ధరకే లభించనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులపై విద్యుత్ భారం కూడా కొంతమేర తగ్గడమేకాకుండా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. టాటావైపు మొగ్గు... ముంబైలో విద్యుత్ సరఫరా చేసే బెస్టుకు ప్రత్యామ్నాయంగా టాటా విద్యుత్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందరూ అటువైపే మొగ్గుచూపుతున్నారు. భారీ ఎత్తున విద్యుత్ను వినియోగించే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, హోటల్స్, కార్యాలయాలు కూడా టాటా విద్యుత్వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పరిశీలించినట్టయితే.. బెస్ట్ చార్జీలకంటే టాటా పవర్ కంపెనీ విద్యుత్ చార్జీలు యూనిట్కు సుమారు రూ. 1.25 నుంచి రూ. 3.00 వరకు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం గృహ వినియోగదారులకు బెస్ట్ మొదటి 100 యూనిట్ల వరకు రూ.3.20 చొప్పున ప్రతి యూనిట్కు వసూలు చేస్తుండగా టాటా పవర్ కంపెనీ మొదటి 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్కు కేవలం రూ.2.49 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక 100 నుంచి 300 యూనిట్ల వరకు బెస్ట్ ప్రతి యూనిట్కు రూ.6.38 వసూలు చేస్తుండగా టాటా కేవలం రూ.4.13 వసూలు చేస్తోంది. 500 యూనిట్లు ఆపై వినియోగదారుల నుంచి బెస్ట్ ప్రతి యూనిట్కు రూ.11.40 వసూలు చేస్తుండగా టాటా మాత్రం కేవలం రూ. 9.09 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో అటువైపే నగరవాసులు ఆకర్షితులు అయ్యే అవకాశముందని చెబుతున్నారు. బెస్ట్కు మరిన్ని ఇబ్బందులు..? సుప్రీం కోర్టు తీర్పుతో భవిష్యత్తులో బెస్ట్ సంస్థకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సంస్థ ఆర్థిక వ్యవస్థపై ఈ తీర్పు ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెస్ట్ను టాటా రాకతో అనేక మంది వినియోగదారులు వీడడం ఖాయంగా కన్పిస్తోంది. బస్సు సేవల్లో బెస్ట్కు ప్రతి సంవత్సరం సుమారు రూ.600 నుంచి రూ.700 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై ప్రతి యూనిట్పై రూ.0.55 నుంచి రూ. రూ.2.00 అదనపు భారాన్ని మోపుతోంది. దీంతో విద్యుత్ విభాగం పెద్ద ఎత్తున లాభాలబాటలో ఉంది. అయితే బెస్ట్ విధించే చార్జీలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చౌకగా అందుబాటులోకి రానున్న టాటా విద్యుత్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపినట్లయితే బెస్ట్ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని సంస్థలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచుతాం: బెస్ట్ బెస్ట్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఏ సంస్థకైనా విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే నగరవాసులు సంతోషాన్ని ఆవిరి చేస్తూ బెస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 300 లోపు యూనిట్ల వినియోగదారుల చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా పవర్ సరఫరా కావడానికి సమయం పడుతుందని చెప్పింది. -
కాగ్ మాట వినాల్సిందే!
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ సహకరించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు డిస్కమ్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), రిలయన్స్ అడాగ్కు చెందిన బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి ఎస్ మృదుల్తో కూడిన బెంచ్ ఆదేశించింది. కాగ్ ఆడిటింగ్ నిలిపివేతపై స్టే మంజూరు చేయాలన్న మూడు డిస్కమ్ల విజ్ఞప్తి తోసిపుచ్చింది. ఈ కంపెనీల అభ్యర్థనలు, వీటికి కాగ్ ఆడిటింగ్ కోరుతూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిటిషన్లంటిపై మే ఒకటిన విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, వాదనలను అప్పటి వరకు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగ్ ఆడిటింగ్ను నిలిపివేయడానికి తిరస్కరిస్తూ జనవరి 24న ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ మూడు డిస్కమ్లు పిటిషన్ దాఖలు చేశాయి. కాగ్ అడిగిన పత్రాలన్నింటినీ తప్పకుండా అందజేయాలని కూడా దిగువకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా నివేదికను విడుదల చేయవద్దని న్యాయమూర్తి కాగ్ను ఆదేశించారు. తమ ఖాతాలకు కాగ్ అడిటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి స్వచ్ఛంద సంస్థ, నివాసుల సంక్షేమ సంఘా సంయుక్త కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని డిస్కమ్లు కోరాయి. దీనికి కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ డిస్కమ్లు ఆడిటింగ్ రద్దు కోరుతున్నాయని కాబట్టి తమ పిటిషన్ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) స్వయంగా ప్రకటించిందని, బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కాగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆడిటింగ్ ప్రక్రియకు డిస్కమ్లు సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వాదనతో విభేదించిన డిస్కమ్లు, తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టీకరించాయి. ఆడిటింగ్ కోసం కాగ్కు ఇప్పటికే 10 వేల పత్రాలు సమర్పించామని తెలిపాయి. వీటి ఖాతాల్లో పలు అవకతవకలు ఉన్నందున సీబీఐ దర్యాప్తు లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి విన్నవించారు. నష్టాలు వచ్చాయంటూ డిస్కమ్లు చూపించిన కాకిలెక్కలను నమ్మిన షీలా దీక్షిత్ ప్రభుత్వం, కరెంటు టారిఫ్ పెంపునకు అనుమతించిందని నివాసుల సంక్షేమ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆరోపించింది. రాజధానిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం నిర్ణయించడంతో 2002 నుంచి ఈ మూడు డిస్కమ్లు కరెంటు పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ఇవి ఖాతాలను తారుమారు చేసి దొంగ లెక్కలు చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. డీఈఆర్సీ సైతం ఈ వాదనను సమర్థిస్తూ టారిఫ్ తగ్గించవచ్చని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్ల ఖాతాలకు ఆడిటింగ్ జరిపిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం డిస్కమ్ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్కు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యుత్ బిల్లులపై 50 శాతం ప్రకటించింది. ఇదిలా ఉంటే..డిస్కమ్లు ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా భారీగా పెంచడంతో నగరవాసిపై భారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాము ఆడిటింగ్కు సహకరించడంతో లేదంటూ కాగ్ మరోసారి సోమవారం హైకోర్టుకు ఫిర్యాదు చేయడంపై బీఎస్ఈఎస్ రాజధాని విస్మయం వ్యక్తం చేసింది. కాగ్ ఆడిటర్లకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. -
టాటా పవర్
ఎందుకంటే: ప్రైవేట్ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ షేర్ రూ.142 స్థాయిల నుంచి రూ.80కు పడిపోయింది. పలు అనుకూలమైన అంశాలు సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ షేర్ పెరుగుదలకు దోహద పడనున్నాయి. ఇండోనేసియా బొగ్గు గనుల్లో 30% వాటా విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించడం దీంట్లో మొదటిది. ఈ వాటా విక్రయం కారణంగా కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో కంపెనీ రుణ భారం గణనీయంగా తగ్గనున్నది. ఏడాదికి వడ్డీ భారం రూ.300 కోట్లు తగ్గుతాయి. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని గత వారంలో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇది రెండోది. ఈ నిధుల కారణంగా కూడా రుణ భారం తగ్గనున్నది. ముంద్రా ప్రాజెక్ట్ విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సెర్క్) ఇచ్చిన ఉత్తర్వులు ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించడం మూడవది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలి తాలు అంచనాలను మించనున్నాయి. ప్రస్తుతం 9,000 మెగావాట్లుగా ఉన్న కంపెనీ కెపాసిటీ ఐదేళ్లలో 25 వేల మెగావాట్లకు పెరగనున్నది. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఈ షేర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. -
ఫార్మా షేర్ల కి డిమాండ్
దేశీ స్టాక్స్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. ఎన్టీపీసీ డౌన్, టాటా పవర్ అప్ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ బీఎస్ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్లో ఉత్పత్తయ్యే విద్యుత్పై నష్టపరిహారంకింద యూనిట్కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్చేసి రూ. 83 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల దూకుడు న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్అండ్పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది. -
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. -
2013 ముగింపు సానుకూలం
పాజిటివ్ ముగింపుతో 2013 సంవత్సరానికి స్టాక్ మార్కెట్ వీడ్కోలు పలికింది. మంగళవారం మందకొడిగా జరిగిన ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్పలాభంతో 21,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 6,304 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్ల మద్దతుతో ఈ ఏడాదిలో సెన్సెక్స్ 9 శాతం ర్యాలీ జరపగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.5 శాతం ఎగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడంతో తాజా ట్రేడింగ్ సెషన్లో హెవీవెయిట్ షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. టాటా పవర్, ఐడీఎఫ్సీ, జేపీ అసోసియేట్స్ షేర్లు 3-4 శాతం మధ్య పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, విప్రోలు 1-2 శాతం మధ్య ఎగిసాయి. అయితే మిడ్క్యాప్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అమెరికా టైర్ల కంపెనీ కూపర్ డీల్ నుంచి వైదొలిగిన ఫలితంగా అపోలో టైర్స్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 6 శాతం ర్యాలీ జరిపింది. నగదు విభాగంలో ట్రేడయ్యే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో యూబీ హోల్డింగ్స్, టీసీఐ, మీర్జా ఇంటర్నేషనల్, తాజ్ జీవీకే, డెన్ నెట్వర్క్స్, రిలాక్సో ఫుట్వేర్ షేర్లు 10-20 శాతం మధ్య పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 309 కోట్ల నికరపెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. ఐటీ ఇండెక్స్ టాప్ : 2013లో ప్రధాన సూచీలను అధిగమించి బీఎస్ఈ ఐటీ సూచి భారీగా 59 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 22 శాతం పెరుగుదలతో ద్వితీయస్థానాన్ని ఆక్రమించగా, ఆటో, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు 7-11 శాతం మేర పెరిగాయి. బీఎస్ఈ రియల్టీ సూచీ 32 శాతం పతనమయ్యింది. బ్యాంకింగ్, మెటల్ ఇండెక్స్లు 9 శాతం చొప్పున క్షీణించాయి. బ్లూచిప్ షేర్లతో కూడిన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగినా, మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఈ ఏడాది విలవిలలాడాయి. జపాన్ నికాయ్ రికార్డు : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసిన భారీ నిధుల ఫలితాన్ని అన్ని దేశాల సూచీలు అందిపుచ్చుకున్నా, జపాన్ నికాయ్ ఇండెక్స్ అన్నింటికంటే ఎక్కువగా 57 శాతం ర్యాలీ జరిపింది. 2013లో అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ, నాస్డాక్లు మూడూ 25 శాతంపైగా పెరిగాయి. 1996వ సంవత్సరం తర్వాత డో, ఎస్ అండ్ పీలు ఒకే ఏడాది ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. ప్రధాన యూరప్ దేశాల ఇండెక్స్లు 12-35 శాతం మధ్య పెరిగాయి. వర్థమాన దేశాల సూచీల్లో అత్యధికంగా అర్జింటీనా సూచీ 89 శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ : కొద్ది రోజుల నుంచి చిన్న శ్రేణికి పరిమితమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త సంవత్సరం తొలిరోజుల్లో ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో మంగళవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే 7 పాయింట్లు పెరగడం, 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడం వంటివి లాంగ్ బిల్డప్ను సూచిస్తున్నాయి. నిఫ్టీ 6,304 వద్ద ముగియగా, ఫ్యూచర్ 51 పాయింట్ల ప్రీమియంతో 6,355 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున ఈ ప్రీమియం 44 పాయింట్లే. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 4.94 లక్షల షేర్లు యాడ్కావడంతో మొత్తం ఓఐ 1.97 కోట్ల షేర్లకు పెరిగింది. 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్ ఓఐలో 3.59 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 19 వేల షేర్లు కట్ అయ్యాయి. 6,300 స్థాయిపైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ ర్యాలీ జరపవచ్చని, ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
పునరుత్పాదక విద్యుత్కు చేయూతనివ్వాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూ టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా.. చౌక టెక్నాలజీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం... ఈ వ్యవస్థ పటిష్టం కావడం ఆర్థిక వృద్ధికి కీలకం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 2020 నాటికి 26వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రైవేట్ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ నిర్దేశించుకుంది. ఇందులో నాలుగోవంతు వాటా పునరుత్పాదక విద్యుత్ది ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయేతర విద్యుదుత్పత్తి విభాగం పనితీరు, ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి విషయాల గురించి టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... జోరుగా స్థల సమీకరణ టాటా పవర్లో భాగమైన సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక విభాగం సామర్థ్యం ప్రస్తుతం 1,106 మెగావాట్లుగా ఉంది. 2020 నాటికల్లా టాటా పవర్ 26,000 మె.వా. విద్యుదుత్పాదన సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో సుమారు 20-25 శాతం కాలుష్యరహితమైన సంప్రదాయేతర వనరుల ద్వారా ఉండాలని నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం పవన విద్యుత్కి సంబంధించి 398 మె.వా. సామర్థ్యం ఉంది. మరో 160 మె.వా. ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇక సౌర విద్యుత్కి సంబంధించి 28 మె.వా. పైగా సామర్థ్యం ఉంది. మరిన్ని ప్రాజెక్టులను చేపట్టే దిశగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల సమీకరణ ప్రక్రియ జరుగుతోంది. విద్యుదుత్పత్తి విధానాన్ని బట్టి భౌగోళికంగా పరిస్థితులు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నాం. రెండింటికీ ప్రాధాన్యం.. సౌర, పవన విద్యుత్.. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే, దేశీయంగా పవన విద్యుత్ రంగ విధానాలు గడిచిన ఇరవై ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. కానీ, సౌర విద్యుత్ రంగం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రూపొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం మీద ఏటా 150-200 మె.వా. మేర పవన విద్యుత్, 30-50 మె.వా. మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నాం. ఇతర దేశాల్లో విస్తరణ.. అంతర్జాతీయంగా నాలుగు కీలక ప్రాంతాలను ఎంచుకున్నాం. ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, సార్క్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో మార్కెట్ పరిస్థితులను, అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం. దక్షిణాఫ్రికా, ఇండొనేషియా వంటి దేశాల్లో ఇతర కంపెనీలతో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టాం. అవకాశాలు, రిస్కులు, రివార్డులు మొదలైన అంశాల ప్రాతిపదిక గా ఆయా దేశాలను ఎంచుకుంటున్నాం. సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి సవాళ్లు.. ఈ రంగం ప్రధానంగా కొనుగోలుదారులపరమైన సమస్య ఎదుర్కొంటోంది. చాలా మటుకు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. దీంతో అవి కొనుక్కునే విద్యుత్ చెల్లింపుల్లో జాప్యాలు జరుగుతున్నాయి. మరోవైపు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాల విధానాలు పాటిస్తుండటం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్థల సమీకరణలో జాప్యం, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం, పునరావాస కల్పన లాంటివి వీటికి తోడవుతున్నాయి. ఇక పవన విద్యుత్కి అనువైన పరిస్థితులు ఉన్న కొన్ని రాష్ట్రాలు.. ఇప్పటికే తమకు సరిపడేంత విద్యుత్ ఉండటంతో కొత్తగా మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఇందుకు టారిఫ్లను తగ్గించేయడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం వంటి మార్గాలు ఎంచుకుంటున్నాయి. పంపిణీ సంస్థలు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలన్న నిబంధనను అమలు చేయకపోవడం వల్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వ సహకారం కావాలి.. ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగం ఎదగడానికి అడ్డుగా ఉంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. అలాగే ప్రభుత్వం విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారాల్లో డిజిన్వెస్ట్ చేసి, పెట్టుబడులు రావడానికి ఊతమివ్వాలి. ప్రైవేట్ సంస్థలు ప్రజల అవసరాలకు తగిన విధంగా స్పందించేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యుదుత్పత్తి పరిమాణంలోనే కాకుండా నాణ్యతలో కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే ఇది సాధ్యమే. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు(ఆర్పీవో) వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తే ఈ రంగానికి గట్టి ఊతం లభిస్తుంది. పునరుత్పాదక వనరులు దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో ఉండవు కనుక అవి పుష్కలంగా ఉన్న చోట్లలో భారీఎత్తున ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఆర్పీవోల వల్ల భరోసా కలుగుతుంది. ఇక, సౌర విద్యుదుత్పత్తికి ఉపయోగించే టెక్నాలజీపైనా (సీఎస్టీ లేదా పీవీ) ఆంక్షలు పెట్టకుండా దాన్ని డెవలపర్లకే విడిచిపెట్టాలి. విద్యుదుత్పత్తి వ్యయాలను తగ్గించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహమివ్వాలి. -
ఆర్బీఐ ఎఫెక్ట్.. 248 పాయింట్ల ర్యాలీ
మార్కెట్ ను ఆశ్యర్యపరుస్తూ రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా వుంచడంతో బుధవారం స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. వరుసగా ఆరు రోజుల పతనానికి బ్రేక్వేస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 20,917 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ సాగించింది. చివరకు క్రితం ముగింపుకంటే 248 పాయింట్ల పెరుగుదలతో 20,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 6,217 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ దఫా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అంచనాలతో మార్కెట్ వరుస క్షీణతను నమోదుచేస్తున్నది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 714 పాయింట్లు పతనమయ్యింది. తాజా ర్యాలీలో రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు జోరుగా పెరిగాయి. డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్, టాటా పవర్లు 4-6 శాతం మధ్య పెరిగాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్బీఐలు 2-3% మధ్య పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో లార్జ్క్యాప్స్కంటే మిడ్సైజ్ పీఎస్యూ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. రంగాలవారీగా అన్నింటికంటే ఎక్కువగా రియల్టీ ఇండెక్స్ 3.5% ర్యాలీచేయగా, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.4% పెరిగింది. ఎఫ్ఐఐలు రూ. 1,196 కోట్ల నిధుల్ని కుమ్మరించగా, డీఐఐలు రూ. 413 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. టెస్కో వాటా కొనుగోలుచేయడంతో ట్రెంట్ 10% ఎగిసింది. ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు... ఇన్వెస్టర్ల అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెంపునకు బ్రేక్వేసినప్పటికీ, ఆర్బీఐ చర్యకు మార్కెట్ తగినంతగా పెరగలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రేట్ల పెంపు అంచనాలతో గతవారం రోజుల్లో 3 శాతంపైగా క్షీణించిన సూచీలు, ఆర్బీఐ నిర్ణయం తర్వాత 1.2 శాతమే పెరిగాయి. రానున్న ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడమే చిన్నర్యాలీకి కారణమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించనున్నట్లు ఫెడ్ ప్రకటిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు హఠాత్తుగా పెరిగే అవకాశం వుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, టాపరింగ్ వాయిదాపడితే గురువారం సూచీలు మరికొంత పెరిగే ఛాన్స్ వుందని ఆ వర్గాలు వివరించాయి. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మ్యాజిక్ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. డిసెంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపునకు మరో ఐదురోజులే గడువు ఉన్నా, తాజాగా నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.76 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.20 కోట్లకు చేరింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 32 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,117 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 6,249 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు ఈ ప్రీమి యం 21 పాయింట్లే. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడుతున్నా, ఇలా ప్రీమియం పెరిగిపోవడం భారీ షార్ట్ కవరింగ్ను, లాంగ్ బిల్డప్ను సూచిస్తుంది. అలాగే ఫెడ్ నుంచి ప్రతికూల నిర్ణయం ఏదైనా వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200 దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో ఈ స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 6,200 పుట్ ఆప్షన్ ఓఐలో 16.18 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే సమయంలో 6,300 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 80 వేల షేర్లు యాడ్ అయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో 51 లక్షల షేర్ల పుట్ బిల్డప్ కలిగిన 6,200 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 71.50 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వున్న 6,300 స్థాయి నిఫ్టీ పెరుగుదలను నిరోధించవచ్చని ఆప్షన్ రైటింగ్ విశ్లేషిస్తున్నది. -
వొకేషనల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వొకేషనల్ సెంటర్ను రోహిణి సెక్టార్-3లోని జేజే కాలనీలో ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి చౌహాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ టీడీడీపీఎల్ పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏడో తరగతి వరకు ఎలక్ట్రీషియన్ కోర్సులతోపాటు ట్యూ షన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రీషియన్లో రెండు నెలల షార్ట్టర్మ్ కోర్సుతోపాటు ఆరునెలల లాంగ్టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిలో ఏడాదికి 220 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏఎన్కే అనే స్వచ్ఛందసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగోల్పురిలో ఐటీఐ భవన నిర్మాణం కొనసాగుతున్నట్టు చౌహాన్ పేర్కొన్నారు. నూతన భవన ప్రారంభంతో స్థానికులతోపాటు, పిరాడిగఢి, ఉద్యోగ్నగర్, రాణిభాగ్, రోహిణి, బుద్ధవిహార్, సుల్తాన్పురి, మదీనాపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యుత్ టారిఫ్ల్లో 73 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో టీడీడీపీఎల్ కార్యనిర్వాహణ అధికారి పర్వీర్ సిన్హా, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చివర్లో రివ్వున పైకి
తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యలో కొంతమేర వెనక్కు తగ్గినప్పటికీ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ చివరి అర్థగంటలో పెరిగిన కొనుగోళ్లతో 200 పాయింట్లు ఎగసి గరిష్టంగా 20,013ను తాకింది. ఆపై స్వల్పంగా వెనక్కుతగ్గి 158 పాయింట్ల లాభంతో 19,962 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 5,900ను అధిగమించింది. చివరికి 49 పాయింట్లు జమ చేసుకుని 5,899 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 2-1.3% మధ్య బలపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు ట్రేడింగ్ పట్ల పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో మార్కెట్లు అక్కడక్కడే సంచరిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే యూరప్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ట్రేడవుతుండటంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని తెలిపారు. 24 షేర్లు లాభాల్లోనే : సెన్సెక్స్-30లో 24 షేర్లు లాభాలతోనే ముగియగా, ఎన్టీపీసీ, టాటా పవర్ 3%పైగా పురోగమించాయి. మిగిలిన దిగ్గజాలలో ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, ఎల్అండ్టీ, మారుతీ, ఆర్ఐఎల్, ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.4-1.2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు భెల్ దాదాపు 5% పతనంకాగా, హీరోమోటో 2.8%, సెసా గోవా 1.6% చొప్పున క్షీణించాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,221 లాభపడ్డాయి. 1,112 నష్టపోయాయి.