TANA
-
విశ్వ సుందరిగా బెజవాడ యువతి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడకు చెందిన బి. నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలో భాగంగా మిస్ తెలుగు యూనివర్సల్ పోటీల్లో కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. -
తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం
వాషింగ్టన్ : ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి తానా అధ్యక్షులు జయ తాళ్ళూరి అధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహొత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తముగా 100కి పైగా తెలుగు సంఘాలు భాగస్వాంతో వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తన్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే 12000 మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకొని పోటీలకు సిద్దమవుతున్నారు. 3 సంవత్సరాల నుండి 60కిపైగా వయసున్న వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. మహోత్సవాన్ని 8 భాగాలలో 33 విభాగాలలో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తూనుగుంట్ల శిరీష చెప్పారు. 500 మందికి పైగా నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పాల్గొంటున్న ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గోనున్నారు. పోటీలు జరిగే విభాగాలు: 1.సౌందర్యలహరి ఫ్యాషన్ షో - లిటిల్ ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ - 3 నుండి12 సంవత్సరాల వయస్సు వారికి బ్యూటీ పేజెంట్ – టీన్ – 13 నుండి19 సంవత్సరాల వయస్సు వారికి బ్యూటీ పేజెంట్ – మిస్ – 20 నుండి 28 సంవత్సరాల వయస్సు వారికి బ్యూటీ పేజెంట్ – మిస్సర్స్ – 29 నుండి వయస్సు వారికి 2. తెలుగు వెలుగు తెలుగు పద్యాలు సామెతలు వివరణ పరభాష లేకుండా పలుకు చందమామ కధలు 3. రాగమంజరి జానపద సంగీతం శాస్త్రీయ సంగీతం లలిత గీతాలు / సినీ గీతాలు 4. నాదామృతం వీణ, వయొలిన్, మృదంగం, ఫ్లూట్, తబలా, కీబోర్డు, గిటార్ 5. అందెల రవళి జానపద నృత్యం శాస్త్రీయ నృత్యం పాశ్చాత్య నృత్యం 6. కళాకృతి రంగవల్లి చిత్రలేఖనం అల్లికలు వ్యంగ చిత్రలేఖనం బంకమట్టి అచ్చులు, సైకత శిల్పాలు 7. రంగస్థలం మూఖాభినయం ఏకపాత్రాభినయం ఇద్దరు లేక ముగ్గురితో సన్నివేశ నటన 8. భువన విజయం తెలుగు ఐఖ్యరాజ్య సమితి ఈ పోటీలు 24,25, 26 తేదీల్లో జరగనున్నాయి -
డల్లాస్లో ఘనంగా ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్లో ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు నిర్వహించింది. జెన్స్టార్ మాంటెస్టరీ అకాడమీలో సభ్యుల ఆరోగ్య అవగాహన కోసం డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుత టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కళ్యాణి తాడిమేటి (సుఖీభవ కమిటీ సమన్వయ కర్త), సాంబ దొడ్డ(తానా SW region RVP) అందరికి స్వాగతం పలికారు. టాంటెక్స్, తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పారు. తదుపరి దత్త యోగా క్రియ టీచర్స్ ప్రశాంత దుల్లూర్, శివరాజు జయన్నలను సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న ముందుగా టాంటెక్స్, తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నాడి సుద్ధి వ్యాయమాన్ని అందరికీ ఎలా చేయాలో చూయించి అందరూ ఆ వ్యాయామాన్ని ఎవరికి వారు చేయగలిగేలా నేర్పించారు. అలాగే ఆసనాలు, సూర్య నమస్కారాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సూర్యనమస్కారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో నాడులన్నీ చక్కగా పనిచేస్తాయని మలబద్ధకం లాంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. యోగా మనకి పూర్వీకులు అందించిన మంచి ప్రక్రియ అని దాన్ని మనం సక్రమంగా వాడుకోగలిగితే మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చివరిగా ప్రాణాయమ ప్రక్రియను నేర్పి మన శరీరంలో ప్రతి అవయవం మన శ్వాసతో కలిసి పనిచేస్తుందని సరైన శ్వాసతో నాడులు పనితీరును యోగా ప్రక్రియ ద్వారా మెరుగుపర్చుకోవచ్చని తెలియజేశారు. అక్కడకు వచ్చిన సభ్యులు అందరూ ఎంతో ఓపికగా యోగాలో మెళకువలను నేర్పిన యోగా టీచర్స్కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్నలను టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, సాంబ దొడ్డ (తానా sw region rvp), శ్రీకాంత్ పోలవరపు(తానా ఫౌండేషన్ డైరెక్టర్), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్వయకర్త) శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న సేవలను కొనియాడారు. టాంటెక్స్, తానా తరపున యోగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్య్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబ దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, కళ్యాణం తాడవిమేటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులకు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
వికలాంగుల కష్టాలు తీర్చే వైకుంఠం ‘విర్డ్’ ఆసుపత్రి
డాలస్: ఒక లక్షా 20వేలకు పైగా అంగవికలురకు విజయవంతంగా ఎముకల శస్త్రచికిత్సలు నిర్వహించిన ప్రముఖ వైద్యుడు డా.గుడారు జగదీష్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర అంగవైకల్య శస్త్రచికిత్స పరిశోధనా పునరావాస ఆసుపత్రికి(Venkateswara Institute For Rehabilitation & Research of the Disabled-VIRRD) డాలస్లో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు రూ.60లక్షలను విరాళంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ప్రతినిధి దొడ్డా సాంబ ప్రారంభించారు. తానా డైరక్టర్ల బోర్డు కార్యదర్శి వెన్నం మురళీ మాట్లాడుతూ నిస్వార్థంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డా.గుడారు జగదీష్ వంటి వారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఆసుపత్రికి డాలస్ ప్రవాసులు తోడ్పడం ఆనందంగా ఉందన్నారు. తానా మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 2013లో డాలస్లో జరిగిన తానా సభల్లో డా.గుడారుకి పురస్కారాన్ని అందించి గౌరవించుకున్నామని, 2017లో ఏలూరులో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరో పురస్కారంతో ఆయన్ను రెండుసార్లు గౌరవించుకునే అవకాశం దక్కిందని అన్నారు. అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణ, సాంత్వన కలిగిన మాటతీరుతో అంగవైకల్యం బాధపడే లక్షల మంది జీవితాల్లో ఆనందాన్ని నింపి వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా చేసిన దేవుడు డా.గుడారు అని ఆయన కొనియాడారు. అనంతరం డా.జగదీష్ను తోటకూర సభకు పరిచయం చేశారు. డా.గుడారు జగదీష్ తన ప్రసంగాన్ని ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 1987లో ఎన్టీఆర్ తిరుపతిలో స్థాపించిన విర్డ్(BIRRD) ఆసుపత్రిలో నేను 1996 నుండి 1,20,000 మంది అంగవికలాంగులకు 95శాతం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాను. 2008లో వేగేశ్న ఫౌండేషన్, ద్వారకా తిరుమల ఆలయం సహకారంతో విర్డ్ను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎంతోమందికి ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో 23వేల మంది అంగవికలాంగులకు శస్త్రచికిత్సలు, కృత్రిమ అవయవాల అవసరం ఉంది. దీనితో పాటు విర్డ్ ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స గది, రోగులకు మంచాలు, గ్రంథాలయం, ఫిజియోథెరపీ ఉపకరణాలు వంటి వాటిని ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉంది. జనవరి నుండి తొలివిడతలో ఏపీలో, తదనంతరం తెలంగాణా రాష్ట్రాల్లో వీఐఆర్ఆర్డీ ఉచిత నిర్ధారణ శిబిరాలను నిర్వహించి అర్హులైన వారికి స్థానిక వైద్యుల సహకారంతో స్థానికంగానే చికిత్స చేస్తాం లేదా విర్డ్కు తరలించి అక్కడే అవసరమైన మేర చికిత్స చేస్తాం. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తమ ప్రాంతంలో ఈ శిబిరాలను నిర్వహించాలంటే విర్డ్ను సంప్రదించండి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పూర్తి ఉచితంగా ఎలాంటి శస్త్రచికిత్సను అయినా విర్డ్లో అందిస్తున్నాం. రోగి విర్డ్లోనే రెండు నుండి ఆరు వారాల పాటు ఉచితంగా భోజన సదుపాయంతో కూడిన నివాసంలో ఉండవచ్చు. తోడుగా ఒక కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల రోగులు సైతం మా విర్డ్కు వస్తున్నారు. ఏడాదికి 50వేల మంది రోగులకు మేము వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇంతమంది రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న విర్డ్ను మరింత మెరుగుపరిచేందుకు నిధులను సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాసులు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని డా.జగదీష్ పేర్కొన్నారు. తానా మాజీ అధ్యక్షుడ్ కోమటి జయరాం రూ.35లక్షలు, మురళీ వెన్నం సమన్వయంలో డాలస్ మిత్రులు రూ.15లక్షలు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ రూ.10లక్షలు విర్డ్కు అందించేందుకు హామీ ఇచ్చారు. వీరందరికీ డా.గుడారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సుబ్బరాయ చౌదరి, చిత్తూరు ప్రవాసుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో తానా క్రీడా విభాగ సమన్వయకర్త లోకేష్ నాయుడు, పోలవరపు శ్రీకాంత్, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, మల్లవరపు అనంత్, డా.పుదూర్ జగదీశ్వరన్, యు.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్లో ఘనంగా అష్టావధాన కార్యక్రమం
డల్లాస్(టెక్సస్) : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) , ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆద్వర్యంలో ఆగస్టు18 న డల్లాస్లోని ఫ్రిస్కో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అష్టావధానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మందికి పైగా సాహితి ప్రియులు హాజరై సభను జయప్రదం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి అష్టావదానం నిర్వహించడానికి వచ్చిన డా. మేడసాని మోహన్గారికి సాదర స్వాగతం పలికారు. ఈ అష్టావదానం కార్యక్రమం తానా, టాంటెక్స్లు కలిసి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముందుగా తాన్వి పొప్పూరి ఆలపిచిన అన్నమయ్య కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిగవంతాలకు వ్యాపించేలా తెలుగు భాషలలో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియను డాక్టర్ మేడపాని మోహన్ తనదైన శైలిలో రక్తి కట్టించి అమెరికా నలుమూలల నుంచి విచ్చేసిన అవధాన ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం అంటే అవధులు లేని ఆనందం అనిపించేంతగా కార్యక్రమం సాగింది. ఈ అవధాన ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద అవధాని గారిని పరీక్షించారు. మేడసాని మోహన్ ఎక్కడా కాగితం, కలం వాడకుండా వారు అడిగిన చందస్సులను చమత్కారంగా, ఛలోక్తులతో కూడిన సమాధానాలు ఇవ్వడం ద్వారా కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులను ఆనందింపజేశారు. అవధాన అంశాలలో శ్రీ ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, శ్రీ తోటకూర ప్రసాద్ న్యస్తాక్షరి, శ్రీ ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, శ్రీ వేముల లెనిన్ వర్ణన, శ్రీమతి కలవగుంట సుధ, ఆశువు, శ్రీ కాజ సురేష్ నిషిద్దాక్షరి అంశాలతో, శ్రీ మాడ దయాకర్ తన అప్రస్తుత ప్రసంగం, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అవధానం నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, సాంబ దొడ్డ బృందం డా. మేడసాని మోహన్ గారిరీ శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుస్తమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బారావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి.చేకూరి , ప్రకాశ్రావు వెలగపూడి, ,ఎం.వి.యల్. ప్రసాద్, టాంటెక్స్ ఉపాధ్యాక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యాక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, శరత్ ఎర్రం సహా మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రాణం నిలబెట్టేందుకు 'రన్ ఫర్ రామ్'
ఫిలడెల్ఫియా : ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడంలో నాట్స్ ఎప్పుడూ ముందుంటుందనేది మరోసారి రుజువైంది. అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామ్మూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు నాట్స్ తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రామ్మూర్తి వైద్య ఖర్చులను భరించేందుకు అతని కుటుంబసభ్యులకు నాట్స్ హెల్ప్లైన్ ద్వారా విరాళాల సేకరణ చేయాలని నిశ్చయించింది. ఇందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానిక తెలుగు సంఘం టీఏజీడీవీతో కలిసి నాట్స్ 'రన్ ఫర్ రామ్' పేరుతో 5కె రన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తాన్ని రామ్మూర్తి కుటుంబానికి నాట్స్ విరాళంగా అందించనుంది. 5కె రన్లో భాగంగా స్థానికంగా ఉన్న 120 మందికి పైగా తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా, పలు సేవా సంస్థ ల ప్రతినిధులు మద్దతు తెలిపారు. నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, టీఏజీడీవీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మన బోయిన, వేణు సంఘాని తదితరులు హాజరై తమ వంతు సంఘీభావాన్ని ప్రకటించారు. -
డల్లాస్లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!
డల్లాస్ (టెక్సస్) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'ఆహా! ఈహీ! ఒహో!' అనే తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని జూలై 21న డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సాహితీ ప్రియులు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సభను ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి తానాబోర్డు కార్యదర్శి మురళి వెన్నం సాదర స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేస్తూ, భావసారుప్యం ఉన్నజాతీయ, స్థానిక సంస్థలతో కలసి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగాటాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగాఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. 'సాహితీ వేముల', 'సింధూర వేములలు','మా తెలుగు తల్లికి మల్లె పూదండ', 'ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట' అనే గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారినిసభకు పరిచేయం చేస్తూ.. శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి లబ్ధ ప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగిన శ్రీ జొన్నవిత్తులగారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తానాకార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతో వేదికపైకి ఆహ్వానం పలికినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. నాలుగు భాగాలుగా చతుర్ముక పారాయణం మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నంగా మొదటిసారి చమత్కార చతుర్ముఖ పారాయణం అనేనాలుగు ప్రక్రియలున్న సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చతుర్ముఖ పారాయణంలో సినీ సాహిత్యం, తెలుగు భాషా వైభవం,పురాణాల ప్రాశస్త్యం, పేరడీ పాటలు అనే నాలుగు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలుగు భాషా ప్రియత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రసాద్గారి ప్రేమను కొనియాగారు. ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టాంటెక్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జొన్నవిత్తుల గారితో ప్రసాద్ తోటకూర ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవి జొన్నవిత్తుల తాను రాసిన పాటలు అనేక సినిమాలలో వినూత్న ప్రయోగాలుగా ఉండి అత్యంత ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం 'సరిగమపదని' అనే సప్త అక్షరాలతో పాట రాయడం, 'చినుకు చినుకు అందెలతో', 'జగదానంద కారకా', 'ఓ వాలు జడా, పూలజడా' వంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు, అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని తెలిపారు. తర్వాత కనక దుర్గమ్మవారి రూపంలోని అక్షరమాలను, అక్షరమాలలో ఉన్న సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకాల్లో నుoచి ఎన్నో పద్యాలను పాడి సభికులను ఆనందపరవశంలో ముంచెత్తారు. అదే విధంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములు లాంటి అంశాలను కథా వస్తువుల ఆధారంగా శ్రీ జొన్నవిత్తుల పేరడీలు సృష్టించడంతో సభలో మొత్తం కేరింతలు, ఈలలతో నిండిపోయింది. ఈ సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని సభ నిర్వాహకులు గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.కార్యక్రమం చివర్లో తానా పూర్వాధ్యక్షులైన డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి ఇక ముందు కూడా కలిసి పని చేస్తూ, పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. గాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించిన జొన్నవిత్తుల ఈ సాహితీ సమావేశం తర్వాత డా. ప్రసాద్ తోటకూరతో కలసి జొన్నవిత్తుల అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి అని, ఈ స్మారక నిర్మాణం వెనుక డా. తోటకూర ప్రసాద్ గారి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షను కొనియాడదగినదని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇక ‘తానా’ తందానేనా?
ద్వాపరయుగం చివరి రోజులు... ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది. కురుక్షేత్ర యుద్ధానంతరం కౌరవమాత గాంధారి తీవ్రంగా రోదించింది. నూరుగురు కొడుకులను కోల్పోయిన పుత్ర శోకంతో ఆమె రుద్రమూర్తిలా మారిపోయింది. ఇందుకు కారకుడవు నువ్వేనంటూ శ్రీకృష్ణుడిని నిందించింది. నా కడుపు కోతకు కారణమైన నీ వంశం సర్వనాశనమైపోతుందని శపించింది. అప్పటికి ముప్ఫయ్యారేళ్లయింది కురుక్షేత్ర యుద్ధం – ధర్మరాజు పట్టాభిషేకం జరిగి. ఆమె శాపం ఇప్పుడు ప్రభావం చూపడం మొదలైందని కృష్ణుడికి అర్థమైంది. దానికితోడు మునుల శాపం ఒకటుంది. యాదవ వంశంలో ఒకరోజు ముసలం (రోకలి) పుట్టి, ఆ వెంటనే పరస్పర హననంతో అందరూ అంతరిస్తారని వారు శపించారు. అదీ పని చేయడం మొదలైంది. చేయగలిగిందేమీ లేదు. కృష్ణుడు కళ్లు మూసుకున్నాడు. యాదవ వంశ వినాశనం జరిగిపోయింది. ఇది మహాభారతంలోని పదహారవ పర్వమైన మౌసల పర్వం కథా సంగ్రహం. రాజకీయాల్లో ఎన్నడూ కననీ, విననీ విడ్డూరాలూ, చోద్యాలు తెలుగుదేశం పార్టీలో జరిగిపోతున్నాయి. ఎన్నికలకు ముందే ఈ పరిణామం మొదలైంది. ఇప్పుడు పీక్స్కు చేరుతోంది. లేకపోతే, ఒక పార్టీ అధ్యక్షుడై వుండి, తనకు నమ్మిన బంట్ల వంటి నాయకులను స్వయంగా బొట్టుపెట్టి మరీ బీజేపీలోకి చేర్చడమేమిటి? మరో రెండు మూడు బ్యాచ్లకు కూడా బొట్టుపెట్టడానికి ఏర్పాట్లు చేయడమేమిటి? అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు కూడా వింత గొలుపుతోంది. అక్రమ నిర్మాణంలో నివాసముంటున్నారని అధికారపక్షం గౌరవ ప్రతిపక్ష నేతను అధిక్షేపించింది. అందుకాయన ‘లేదు, లేదు, కృష్ణానదే నా ఇంటిని దురాక్రమణ చేసింద’ని ఎదురుదాడికి దిగారు. అక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టడం వలన ప్రవాహం ఆగిపోయి తన ఇంటి మీదకు వరదొచ్చిందనేది ఆయన కవి హృదయ సారాంశం. కానీ, చంద్రబాబు గారికి నాలుగేళ్ల వయసున్నప్పుడు (1954) బ్యారేజీ శంకుస్థాపన జరిగింది. ఏడేళ్ల ప్రాయంలో (1957) ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటికే అక్కడ ఇప్పుడున్న ప్యాలెస్ వుండి వుంటే, కృష్ణానది దొంగతనంగా వారి పెరట్లోకి ప్రవేశించిందన్న అభియోగాన్ని తర్కం కోసమైనా పరిశీలించవచ్చు. పిచ్చి ముదిరిందీ అంటే రోకలి తలకు చుట్టమనే ఈ వైఖరితో తెలుగుదేశం నేతలూ, ఎమ్మెల్యేలూ లబలబలాడిపోతున్నారని సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్లో భారీ స్కామే దాగుందని అధికారపక్షం చేసిన ఆరోపణపై చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తల్లడిల్లిపోతున్నారు. అధికారపక్షాన్ని అనవసరంగా రెచ్చగొట్టి మరీ దెబ్బలు తింటున్నాడు మా నాయకుడని వారు ప్రైవేటు శోకాలు పెడుతున్నారు. తప్పు చేసినప్పుడు తేలు కుట్టినవాడిలాగా కూర్చుంటే సరిపోయేది. తగుదునమ్మా అని అసెంబ్లీ అయిన తర్వాత ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. దాని ఫలితంగా మరుసటిరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చి గణాంకాలతో సహా స్కామ్ను నిరూపించిన తీరు సామాన్య జనంలోకి కూడా సూటిగా వెళ్లిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ గణాంకాలు హల్చల్ చేస్తున్నాయి. ‘‘మిగులు విద్యుత్ ఉన్నా కూడా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనివల్ల ఏటా 2,766 కోట్ల భారం పడుతుంది. ఈ ఒప్పందాల గడువు 25 సంవత్సరాలు. అంటే 2,766 x 25 = 69,150 కోట్లు. రానురాను విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చంద్ర బాబు స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్ర ఖజానాకు మరింత భారం. మొత్తంగా 70 వేల కోట్లను దాటిన భారీ కుంభకోణం ఇది’’ – ఏదో ఒక గ్రూప్ ద్వారా ఈ వివరాలు అందని స్మార్ట్ఫోన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ అసలు విషయం చెప్పకుండా సెల్ఫోన్ ఛార్జీలు తగ్గించింది తానేననీ, విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టిందీ తానేనని అందుకోవడంతో టీవీల్లో అసెంబ్లీ చూస్తున్న చాలా మంది జడుసుకున్నారట. ఇక చార్మినార్ కట్టింది కూడా తానేననీ, గోల్కొండ కోట తనదేనని అంటారని ఊహించారు. లక్కీగా అక్కడిదాకా పోలేదు. విత్తనాలు, పోలవరం, కాపుల సమస్యలలోనూ అసెంబ్లీలో ఎదురుదెబ్బలే. తనువంతా గాయాలే. ఎందుకిలా జరుగుతున్నది. ఎన్టీఆర్ శాపం ఇప్పుడు ప్రభావం చూపెడుతున్నదా? ఏమో... తెలుగుదేశం నేతల కైతే కారణాలు అంతుబట్టడం లేదు. అంతుచిక్కించుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరు. ఐదేళ్ల కాలంలో తాము చేసిన అవినీతి నభూతో నభవిష్యతి అని తన అంతరాత్మే చెబుతోంది. వీటిమీద విచారణలు జరిగితే తన పరిస్థితి ఏమిటి? బయటపడే మార్గం ఎలా? బీజేపీతో సయోధ్యకు మళ్లీ దారి దొరుకుతుందా... ఇవే ఆలోచనలు. పూర్వం చక్రవర్తుల కటాక్ష వీక్షణాలకోసం సామంతులూ దండనాయకులూ యధాశక్తి కానుకలు పంపించేవారు. ఆ తరువాత అసలు కథ నడిపేవారు. ఈ కానుకలలో రాజ్యభాగాలు, రమణులు, గుర్రాలు, ఏనుగులు, గోవులు, బ్రాహ్మణులు, ధనకనకవస్తు వాహనాదులుండేవి. కాలక్రమంలో కానుకల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు కూడా మోదీ కొలువుకు ముందుగా కొన్ని ‘గుర్రాలను’ పంపించారు. వాటితోపాటు ఒక తెల్లజెండాను కూడా పంపించారు. ఢిల్లీ పెద్దల స్పందనకోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ పెద్దలకు తెలుగుదేశం కథ అర్థమైంది. ఆ పార్టీకి ఎక్స్పైరీ డేట్ దగ్గరపడిందన్న నిర్ధారణకు వచ్చేశారు. అందుకు సహేతుకమైన కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న కోట కింద భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్ల అమరికల్లో జరుగుతున్న మార్పులు నాగపూర్ ఆరెస్సెస్ కేంద్రంలోని రెక్టర్ స్కేల్పై నమోదవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాభై శాతం ఓట్ షేర్తో రికార్డు సృష్టించింది. ఇంతకాలం టీడీపీకి ప్రధాన వోటు బ్యాంక్గా వున్న బీసీ వర్గాల్లో నిట్టనిలువునా చీలిక వచ్చి మొగ్గు వైసీపీవైపు తూగింది. వై.ఎస్. జగన్కు వున్న వ్యక్తిగత విశ్వసనీయత కారణంగా ఆయన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను బీసీ విద్యాధికులు సంపూర్ణంగా నమ్మారు. ఫలితంగా వైసీపీకే ఈసారి కొంత ఆధిక్యత లభించింది. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వంటి వర్గాల్లోనూ గతంతో పోలిస్తే కొంత మెరుగైన స్థాయిలో ఆ పార్టీ మద్దతు రాబట్టగలిగింది. సంప్రదాయ ఓటు బ్యాంకును చెక్కుచెదరకుండా నిలబెట్టుకోవడం వలన ఈ కొద్దిపాటి అదనపు మద్దతుతోనే వైసీపీ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేయగలిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్. జగన్ చూపుతున్న రాజకీయ పరిణతి, ఇచ్చిన హామీలను శర వేగంగా అమలుచేయడం కోసం తొలి సమావేశాల్లోనే వాటికి చట్టబద్ధత కల్పించడం, ఏ స్థాయిలో అవినీతి జరిగినా సహించబోమని దృఢంగా పంపించిన సంకేతాలు, విచ్చలవిడి మద్యపానంపై మోపిన ఉక్కుపాదం, ప్రజాధనం పైసా కూడా వృథా కాకూడదని పడుతున్న తపన– అందుకోసం అవినీతి ప్రాజెక్టులను సమీక్షించి రివర్స్ టెండరింగ్కు సిద్ధపడడం వంటి చర్యల ఫలితంగా కుల, మత, వర్గాలకతీతంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజల్లో మద్దతు పెరిగింది. నవరత్న పథకాలు పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత ఆయన బలం మరింత పెరుగుతుందన్న అంచనాల్లో బీజేపీ వర్గాలున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకూ, స్త్రీలకూ 50 శాతం వాటా కేటాయించడం కూడా తీవ్రంగా ప్రభావం చూపే అంశమేననీ, ఈ పరిణామం తర్వాత బీసీ వర్గాల్లో తెలుగు దేశం మద్దతు నామమాత్రం కానున్నదని కాషాయం పెద్దల అంచనా. ఇప్పటివరకూ బీసీలతోపాటు పట్టణ ఉన్నత మధ్యతరగతి వర్గాల్లో టీడీపీకి ఆదరణ వుంది. మీడియా ప్రచారం కారణంగా, సెల్ఫోన్ను కనిపెట్టడం, హైటెక్ సిటీని నిర్మించడం వంటి గోబెల్స్ ప్రచారాల కారణంగా ఈ సెక్షన్లో టీడీపీ పాగా వేయగలిగింది. పబ్లిసిటీ స్టంట్లో చంద్రబాబుకు బీజేపీ ఏమాత్రం తీసిపోదు. టన్నులకొద్దీ దేశభక్తిని సోషల్ మీడి యాలో డంప్ చేయగల శక్తి బీజేపీకి వుంది. ఈ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ పట్టణ మధ్యతరగతిని టీడీపీ నుంచి తమ వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని బీజేపీ భావిస్తున్నది. బీసీ ఓట్లను వైసీపీ తీసుకుని, పట్టణ మధ్య తరగతిని తాము లాగేసుకుంటే ఇక తెలుగుదేశం పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలాంటి దేని కాషాయ శిబిరం భావిస్తున్నట్టుంది. ఈ కోణం నుంచే ఆలోచించి తెలుగుదేశంతో ఎటువంటి సంబంధాలను నెలకొల్పుకోవాలన్నది బీజేపీ నిర్ణయించుకుంటుంది. తెలుగుదేశం పార్టీని నిశ్శేషం చేసి, ఆ స్థానంలో ప్రవేశించడమా? లేక అవశేషమాత్రంగా మిగిల్చి జూనియర్ పార్ట్నర్గా చేసుకోవడమా? అనేది బీజేపీ చాయిస్గానే వుంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఆకాంక్షల మేరకు ఉండకపోవచ్చు. తమపై ఎటువంటి కేసులూ రాకుండా కాపాడి ఎన్డీఏలో చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ లాబీయింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ అగ్రనాయకుడు రామ్మాధవ్ చేసిన ఒక వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హమైనది. ఇక మీదట తెలుగుదేశం పార్టీ ‘తానా’ సభల్లో మాత్రమే మిగులుతుందని ఆయన కామెంట్ చేశారు. దానర్థం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కోల్పోబోతోందనే. అమెరికా, కెనడాల్లో స్థిరపడ్డ తెలుగు వారి కోసం ఏర్పడిన సాంస్కృతిక సంస్థ ‘తానా’. అది రానురాను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులతో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీతో ఏర్పరచుకున్న ‘గాఢ’మైన అనురక్తితో ‘తానా’లో ఒక కెమిస్ట్రీ ఏర్పడింది. ఆ ‘కెమిస్ట్రీ’ ల్యాబ్లోని హైడ్రోజన్ సల్ఫైడ్ వెలువరించే కుళ్లిన కోడిగుడ్ల వాసనకు తానా సభలకు వెళ్లిన రామ్మాధవ్కు తల తిరిగినంతపనైంది. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఫారిన్ టూర్పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
ఆర్ఆర్ఆర్ షూటింగ్లో ఉన్న దర్శకుడు రాజమౌళి వాషింగ్టన్కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ తానా సభలు జరుగుతుండటంతో రాజమౌళి ఆ సభలలో పాల్గొనేందుకు వాషింగ్టన్ వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో రాజమౌళి తన టూర్పై క్లారిటీ ఇచ్చారు. ‘నేను కేవలం వ్యక్తిగత పనుల మీద మాత్రమే వాషింగ్టన్ వచ్చాను. తానా సభల కోసం కాదు. పెద్దన్న (సంగీత దర్శకుడు కీరవాణి) మ్యూజికల్ షోలో కూడా నేను పాల్గొనటం లేదు. అభిమానులు నేను వేడుకలకు హాజరవుతానని ఆశించి నిరాశచెందవద్దు. అందుకే ఈ క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి తరువాత రామ్చరణ్, ఎన్టీఆర్లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020లో రిలీజ్ కానుంది. ఇద్దరు హీరోలు గాయపడటంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన రాజమౌళి, ఇటీవలే తిరిగి షూటింగ్ను ప్రారంభించారు. Friends, I have come to Washington on a personal work. Not for TANA convention. I might not even attend peddanna's musical show. I do not want people to expect me at the convention and get disappointed. Hence the clarificarion. — rajamouli ss (@ssrajamouli) 4 July 2019 -
సాహితీ కృషీవలుడు సన్నపురెడ్డి
సాక్షి, కడప : జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘కొండపొలం’ నవలకు తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అవార్డు ప్రకటించింది. 2019 సంవత్సరానికిగాను ప్రకటించిన నవలల పోటీలో ఆయన నవలను ప్రత్యేక న్యాయ నిర్ణేతల కమిటీ బహుమతికి ఎంపిక చేశారు. బహుమతిగా రూ. 2 లక్షల మొత్తాన్ని ప్రకటించారు. ఇంతవరకు పోటీలు నిర్వహించిన ఏ సంస్థ తెలుగు నవలకు ఇంత పెద్ద మొత్తాన్ని బహుమతిగా ఇవ్వలేదు. త్వరలో ఆయనకు ఈ బహుమతి అందజేయడడంతోపాటు బహుమతి పొందిన నవలను కూడా ప్రచురించనున్నారు. కథా సాహితీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచేగాకఅమెరికా నుంచి 58 నవలలు అందాయి. న్యాయ నిర్ణేతలు పలుమార్లు నవలలను వడపోసి బహుమతికి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నవల కొండపొలంను ఎంపిక చేశారు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి జిల్లాలోని బాలరాజుపల్లెలో 1963 ఫిబ్రవరి 16న జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకు పాఠాలు బోధించడంతోపాటు స్వగ్రామం నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎనిమిది నవలలు, మూడు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి రాశారు. 2017లో తానా నవలల పోటీలో ఈయన రచించిన ‘ఒంటరి’కి బహుమతి లభిం చింది. మొదటి నవల ‘కాడి’కి, ‘తోలుబొమ్మలాట’లకు ఆటా పురస్కారాలు లభించాయి. ఆయన రచించిన మరికొన్ని నవలలు, ఇతర రచనలు, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సన్నపురెడ్డి రచించిన 75కు పైగా కథలు, వివిధ సంకలనాల్లో చోటుచేసుకోవడమే కాకుండా ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనకు ఈ బహుమతి లభించడం పట్ల జిల్లా సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండూరు పిచ్చమ్మ వెంకట్రాజు స్మారక ట్రస్టు, లలిత కళా నికేతన్, భూతపురి సుబ్రమణ్యం స్మారక ట్రస్టు, జానమద్ది సాహితీపీఠం, నారు నాగనార్య సాహితీపీఠం, పోతన సాహితీపీఠం, రాయలసీమ టూరిజం కల్చరల్ సొసైటీ ప్రతినిధులు సన్నపురెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
కేటీఆర్కు తానా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీశ్ వేమన, ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్చందర్రావు తానా సభల ఆహ్వాన పత్రికను వారికి అందించారు. జూలై 4 నుంచి జూలై 6 వరకు వాషింగ్టన్లో తానా సభలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. -
షికాగో సెక్స్ రాకెట్ కేసుతో తానాలో కలకలం
-
షికాగో సెక్స్రాకెట్ .. ఎవరీ ABCDE?
చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సెక్స్ రాకెట్ డైరీలో ఏపీ మంత్రి ? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ వేమన సతీష్ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసోసియేషన్ల పేరుతో వీసాలు.. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది. విచారణ జరిగిందిలా.. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. విచారణకు సహకరిస్తాం : సతీష్ వేమన సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు. -
వాషింగ్టన్లో తానా మహాసభలు
వాషింగ్టన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ ద్వైవార్షిక మహాసభలకు 2019 జూలై 4,5,6 తేదీలలో వాషింగ్టన్ డీసీ లోని వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. ప్రవాస తెలుగు సంఘం తానా అంగరంగ వైభవంగా ప్రతి రెండేళ్లకొకసారి జరుపుకునే మహాసభలకు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ వాషింగ్టన్ డీసీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈమేరకు జూన్ 15వ తేదీన తానా అధ్యక్షులు సతీష్ వేమన, కార్యవర్గబృందం వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ అధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ గడచిన కొద్ది నెలలుగా వాషింగ్టన్ డీసీలో మళ్లీ తానా మహాసభలను ఏర్పాటు చెయ్యాలని తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ మహాసభల నిర్వహణలో పాలుపంచుకోవటానికి వాషింగ్టన్ డీసీ తెలుగు కమ్యూనిటీ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తోందని అందరి సహకారంతో తానా ప్రతిష్ఠ మరింత పెంచేలా తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నభూతో నభవిష్యత్ అనే విధంగా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, తానా బోర్డు చైర్మన్ చలపతి కొండ్రకుంట, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, మాజీ బోర్డు చైర్మన్ డా. నరేన్ కొడాలి, 2007 తానా మహాసభల కన్వీనర్ డా. హేమప్రసాద్ యడ్ల, తానా కోశాధికారి రవి పొట్లూరి, డా. వెంకట్రావు మూల్పూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి రమాకాంత్ కోయ, ట్రస్టీ రవి మందలపు క్యాపిటల్ రీజియన్ ప్రాంతీయ కోఆర్డినేటర్ రఘు మేకా, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు. -
కప్పట్రాళ్ల అభివృద్ధికి మరింత కృషి
- ఎస్పీ ఆకె రవికృష్ణ - గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ దేవనకొండ : గ్రామస్తులు సహకరిస్తే కప్పట్రాళ్లను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. తాను దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ఎస్పీ ప్రారంభించారు. ముందుగా తానా(తెలుగు రాష్ట్రాల సంయుక్త సంఘం) వారి సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించనున్న స్త్రీశక్తి భవనానికి భూమి పూజ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోరమాండల్, సత్యసాయిట్రస్టు దాతల సహకారంతో రూ.6 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. 15 మంది రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ మంజూరు చేసిన ఎద్దులబండ్లు, 18 మందికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ ఉరవకొండ మండల పొదుపు ఐక్యసంఘం, గ్రామజ్యోతి ప్రాజెక్టు వారు కప్పట్రాళ్ల పొదుపు మహిళలను రిసోర్స్పర్సన్గా గుర్తించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుపై వివరించేందుకు ఇక్కడి వారిని తీసుకెళ్తారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి స్త్రీశక్తిభవనంలో ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 63 పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. పంట రుణాలు పొందిన రైతులు వాటిని సక్రమంగా చెల్లించి మరింత ఎక్కువగా రుణం పొందాలన్నారు. త్వరలో గ్రామంలో మిర్చిప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో ఎస్పీ కాసేపు మాట్లాడి వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో తానా ప్రోగ్రాం కన్వీనర్ ముప్పా రాజశేఖర్, కోరమాండల్ ఫర్టిలైజర్ మేనేజర్ చక్రవర్తి, డీఎస్పీలు రమణమూర్తి, బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్సింహా, నాగరాజుయాదవ్, డేగుల ప్రభాకర్, శ్రీనివాసులు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, కంబగిరి రాముడు, ఎస్ఐ గంగయ్యయాదవ్, ఏఓలు అక్బర్బాషా, అల్తాఫ్ఆలీఖాన్, పత్తికొండ ఏడీఏ నారాయణనాయక్ పాల్గొన్నారు. -
ఎన్నారై విద్యార్థులకు తానా సంగీతం కోర్సులు
డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనుసంధానంతో సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ప్రారంభించింది. తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి ఆ వివరాలను ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేందుకు తానా తీసుకున్న మరో మెట్టు ఇది. ఎంతో శ్రమించి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధికారులతో చర్చలు జరిపి ఈ కార్యక్రమం రూపుదాల్చడంలో కృషిచేసిన తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, విశ్వవిద్యాలయ అధికారులకు జంపాల చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో తానా సంగీత కోర్సులు ప్రారంభించడం తానా చరిత్ర లో ఒక మైలు రాయి. ఈ వర్సిటీ రూపొందించిన సంగీత పాఠ్య ప్రణాళికను విద్యార్థులు పాటిస్తే, ఇక్కడే పరీక్షలు రాసి, అన్ని స్థాయిలు పూర్తి చేసిన తరువాత వర్సిటీ డిప్లొమా సర్టిఫికెట్స్ పొందవచ్చు. అమెరికా సంగీత ప్రియులు తమ ప్రతిభా పాఠవాలను పరీక్షించుకోవాలనే దీర్ఘకాలిక కలను సాకారం చేసినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.దుర్గాభవానీ, డీన్ ప్రొఫెసర్ డి.శారద, వర్సిటీ సిబ్బంది నా ప్రత్యేక ధన్యవాదాలు. మీనాక్షి అనిపిండి.. పద్మావతి వర్సీటీ నుంచి సంగీతంలో బంగారు పతకంతో పట్టభద్రులయ్యారని, అమెరికాలో ఉన్న గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరని కొనియాడారు. ఎన్నారై విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంగీతం కోర్సుల్లో వెంటనే నమోదు కావల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నానని” చెప్పారు. తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ “ సంగీత కోర్సుల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నారై స్టూడెంట్స్ భారత్కు వెళ్లకుండానే ఇక్కడే పరీక్షలు వ్రాసి, డిప్లొమా సర్టిఫికెట్స్ పొందడానికి గొప్ప అవకాశం. లెవెల్ 1, లెవెల్ 2 కోర్సులకు వెంటనే అప్లై చేసుకోవాలనిని సంగీత విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఉత్తర అమెరికాలోని తల్లిదండ్రులను, సంగీత ఉపాధ్యాయులను అభ్యర్ధిస్తున్నాను. తానా సంస్థతోను, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూరతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందదాయకమని” చెప్పారు. డల్లాస్ లో తానా నిర్వహించిన “సంగీత కోర్సుల” నమోదు కార్యక్రమంలో వందకు పైగా విద్యార్థులు పాల్గొని, ఎంతో ఉత్సాహభరితంగా లెవెల్ 1 మరియు లెవెల్ 2 లో నమోదయ్యారు. ఉత్తర అమెరికా లో నివసిస్తున్న ఆసక్తి గల విద్యార్థులెవరైనా మార్చి 20, 2017 లోగా ఈ కోర్సుల్లో నమోదు కావచ్చు. ప్రసాద్ తోటకూర, మీనాక్షి అనిపిండి ఓ ప్రకటనలో ఈ క్రింది వివరాలు వెల్లడించారు. అకాడమిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్: Level 1 – Diploma in Introductory Music Level 2 – Diploma in Music Level 3 – Diploma in Music Level 4 – Advanced Diploma in Music ప్రస్తుతం, విద్యార్థులు లెవెల్ 1 మరియు లెవెల్ 2 సంగీతం కోర్సుల్లో నమోదు కావచ్చు. ఒక్కో లెవెల్ కు 12 క్రెడిట్స్ ఇస్తుంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు అందుకున్న డిప్లొమాలు ఎన్నారై విద్యార్థులకు అదనపు విద్యా కార్యక్రమంగా భావిస్తారు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ క్రెడిట్స్ ను గుర్తించవచ్చు. మేము వారు దరఖాస్తు చేసినప్పుడు వారి సంబంధిత అధికారులతో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము. విద్యార్థులు ఉత్తర అమెరికాలో ఎక్కడనుంచి అయినా ఏ సంగీత ఉపాధ్యాయుల నుంచి అయినా సంగీతం నేర్చుకోవచ్చు. ఈ సంగీత కోర్సుల్లో నమోదుకు కనీస వయసు 10 సంవత్సరాలు కాగా, విద్యార్థినులు మాత్రమే నమోదు కాగలరు. పరీక్షా ఫీజుతో కలిపి ఒక్కో లెవెల్ కు ఫీజు 300 డాలర్లు మాత్రమే. లెవెల్ 1, 2, 3 చివర్లో విద్యార్థుల నైపుణ్యతను తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్, వారి బృందం కలిసి నిర్ణయిస్తారు. లెవెల్ 4కు విశ్వవిద్యాలయ అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించి థియరీ అండ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు డిప్లొమాలను అమెరికాలో ఒక అధికారిక స్నాతకోత్సవంలో బహుకరిస్తారు. ప్రతి లెవెల్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి కనీసం 45% మార్కులు సాధించాలి. 70 శాతం సాధిస్తే "డిస్టింక్షన్" గా పరిగణిస్తారు. దయచేసి నమోదు ఫారం కోసం www.tana.org ను సందర్శించి పేర్కొన్న విధంగా ప్రక్రియను పూర్తి చేయాలి. మరిన్ని వివరాలకు: www.tana.org ను సందర్శించండి లేదా: మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ tanamusiccoordinator@gmail.com, డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఛైర్మన్- తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్ 817-300-4747, లేదా tanaieachair@gmail.com, డాక్టర్ జంపాల చౌదరి, తానా అధ్యక్షులు- 937-475-7809 లేదా president@tana.org ఫోన్ నెంబర్లలో గానీ, మెయిల్స్ లోగానీ సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో నమోదయిన విద్యార్థులకు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి, టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా వారికి తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
రాయల వైభవాన్ని తలపించిన నాటిక పోటీలు
– డిప్యుటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి కర్నూలు(కల్చరల్): తానా అసోసియేషన్ నాటిక పోటీలు అలనాటి రాయల వైభవాన్ని తలపించాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తానా సంస్థ అమెరికాలో తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షిస్తూనే ఆంధ్ర దేశంలోని పలు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కర్నూలు జిల్లాలోనూ తానా పలు చోట్ల పేదల కాలనీలు నిర్మించేందుకు సహకరించిందన్నారు. రాయలసీమలో తొలిసారిగా నాటక పోటీలను నిర్వహించి తానా సంస్థ స్థానిక కళాకారులకు చక్కని ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. కళాకారుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మూడు రోజులుగా సాగిన తానా నాటిక పోటీల్లో విజేతలైన కళాకారులకు తానా అధ్యక్షులు జంపాల చౌదరి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, తానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం, నియమిత అధ్యక్షులు సతీష్ వేమన, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.జి.భరత్, తానా సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, ప్రోగ్రామ్ కన్వీనర్ ముప్పా రాజశేఖర్, న్యాయ నిర్ణేతలు గురుస్వామి, వన్నెం బలరామ్, సుభాన్ సింగ్, లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియ, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ నాటకంగా 'అనగనగా'.. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా సాగిన నాటక పోటీలలో యంగ్ ఆర్ట్ థియేటర్స్ విజయవాడ వారు ప్రదర్శించిన అనగనగా.. నాటిక ఉత్తమ నాటికగా ఎంపికయ్యింది. ద్వితీయ ఉత్తమ నాటికగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన రెండు నిశ్శబ్దాల మధ్య, ఉత్తమ తృతీయ నాటికగా సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు ఎంపికయ్యాయి. -
పల్లె ప్రగతికి పాటుపడతాం
- తానా బృంద సభ్యుల ప్రకటన - కప్పట్రాళ్లలో రైతు కోసం - తానా కార్యక్రమం - పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం - జిల్లా ఎస్పీ, తానా బృందాన్ని సత్కరించిన కప్పట్రాళ్ల వాసులు కప్పట్రాళ్ల(దేవనకొండ) : తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తానా (ఉత్తర అమెరికా తెలుగుసంఘం) అధ్యక్షులు జంపాల చౌదరి, జాయింట్ సెక్రటరీ పొట్లూరి రవి, బృంద సభ్యులు ప్రకటించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో శనివారం ముప్ఫా ఫౌండేషన్ ప్రోగ్రాం కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో రైతుకోసం-తానా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన తానా బృందం సభ్యులు, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను గ్రామస్తులు తెలుగు సంప్రదాయం ప్రకారం ఎద్దులబండిపై ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జంపాల చౌదరి, పొట్లూరి రవి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో ఏదైనా సాధించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ 40 సంవత్సరాల నుంచి గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.300 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో డిజిటల్ క్లాసులు, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తానా ఆధ్వర్యంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు, శ్మశానవాటిక ప్రహరీల ఏర్పాటును కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా మందులను పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. అనంతరం రైతులకు రక్షణ కిట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ కన్నతల్లిని, పుట్టిన ఊరుని ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తానా సంస్థ వారు అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామంలో పొదుపు మహిళల కోసం స్త్రీశక్తిభవాన్ని నిర్మించాలని కోరగా అందుకు అంగీకరించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తానా సంఘంసభ్యులు ఉపాధ్యక్షులు సతీష్, వేమన, ఏపీ అధికార ప్రతినిధి కోమాటి జయరాం, గోగినేని శ్రీనివాసులు, అంజయ్యచౌదరి, గరికపాటి ప్రసాద్, జానయ్య, లోకేష్నాయుడు, గోవర్దన్రెడ్డి, డీఈఓ రవీంద్రారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీలు బాబాఫకృద్దీన్, సీఐలు విక్రమ్సింహ, డేగల ప్రభాకర్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, రిటైర్డ్ హెచ్ఎం రామరాజు, ఏఓ అక్బర్బాషా, గ్రామజ్యోతి కో-ఆర్డినేటర్ నారాయణ, దేవనకొండ ఎస్ఐ గంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు
‘తానా’ అధ్యక్షుడు సతీష్ వేమన రాజమహేంద్రవరం సిటీ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నదని ఈ సంఘం అధ్యక్షుడు (2017) సతీష్ వేమన పేర్కోన్నారు. బుధవారం చైతన్యస్రవంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ తానా 2017 మే 28తో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఏటా జూలైలో నిర్వహించే ఉత్సవాలను ఈసారి మే 28నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాలలో తానా కార్యాక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. గన్ని సతీష్కు మొక్కను అందజేశారు. ఆయన వెంట సినీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఉన్నారు, -
కర్నూలులో తొలిసారిగా 'తానా'
– నేటి నుంచి ప్రారంభం కానున్న తానా జాతీయ స్థాయి నాటిక పోటీలు – ప్రతి రోజు మూడు నాటికలు – 24న బహుమతి ప్రదానం – ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం కర్నూలు(కల్చరల్): కళల కాణాచియైన కర్నూలు జిల్లా తొలిసారిగా 'తానా' జాతీయ స్థాయి నాటిక పోటీలకు వేదికగా మారింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంస్థ ప్రతి రెండేళ్లకొకసారి ఆంధ్రప్రదేశ్లోని విశిష్టాత్మకమైన నగరాల్లో కళా ప్రదర్శనలు చేపడుతోంది. తొలిసారిగా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలునగరంలోని స్థానిక సీ.క్యాంపు సెంటర్లో ఉన న టీజీవీ కళాక్షేత్రంలో ఇవి జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నాటక సమాజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది నాటక సంస్థలు ఈ పోటీలలో పాల్గొననున్నాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు తానా నాటిక పోటీలు ప్రారంభోత్సవం జరగనున్నది. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎస్పీ ఆకె రవికృష్ణ, తానా అధ్యక్షుడు డా.జంపాల చౌదరి, తానా నియమిత అధ్యక్షుడు సతీష్ వేమన, సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, చైర్మన్ టీజీ భరత్, కన్వీనర్ ముప్పా రాజశేఖర్, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన లలిత కళా సమితి: గత నాలుగు దశాబ్దాలుగా కర్నూలులో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, జానపద, శాస్త్రీయ నృత్య కళారూపాలను ప్రదర్శిస్తూ లలిత కళాసమితి రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళా సంస్థగా గుర్తింపు పొందింది. ప్రముఖ రంగస్థల నటుడు సయ్యద్ అహ్మద్, స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నంది నాటకోత్సవాల్లో స్వర్ణ నందిని, రజతనంది, తామ్రనందిని కైవసం చేసుకుంది. పులిస్వారీ అనే ఒక సాంఘిక నాటకాన్ని నూట ఇరవై సార్లు ప్రదర్శించి అరుదైన రికార్డులను దక్కించుకుంది. ప్రతియేటా మే నెలలో రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహిస్తూ రంగస్థల నటలను ప్రోత్సహిస్తోంది. ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం : గురువారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న తానా నాటిక పోటీలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రకటనలో తెలిపారు. సురభవారి ఆధ్వర్యంలో వేదికను ప్రత్యేక కర్టన్లతో ముస్తాబు చేశామన్నారు. కుటుంబ సమేతంగా ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రేక్షకులు నాటికలను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రోజు మూడు నాటికలను ప్రదర్శిస్తారని, ఇద్దరు ప్రముఖ రంగస్థల నటులను సన్మానిస్తారని ఆయన తెలిపారు. 22, 23న సాయంత్రం, 24న ఉదయం 10 గంటల నుంచి ప్రదర్శనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 24న సాయంత్రం నాటిక పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేస్తామన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు రంగయాత్ర సంస్థ కళాకారులు 'అనంతం' నాటికను 7.30 గంటలకు చైతన్య భారతి, కరీంనగర్ కళాకారులు 'దొంగలు' నాటికను 8.30 గంటలకు గణేష్ ఆర్ట్స్ గుంటూరు కళాకారులు 'అంతాబ్రాంతియే' నాటికను ప్రదర్శిస్తారన్నారు. కళాభిమానులు వీటిని తిలకించి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞాప్తి చేశారు. -
22 నుంచి జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీలు
కర్నూలు(టౌన్): తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24 వరకు స్థానిక సి.క్యాంపులోని టి.జి.వి. కళాక్షేత్రంలో జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం చైర్మన్ టి.జి. భరత్ వెల్లడించారు. సోమవారం స్థానిక మౌర్య ఇన్లోని పరిణయ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 7 గంటలకు సభా కార్యక్రమం ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, రాయలసీమ ఐజీ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శివకోటిబాబురావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్తోపాటు తాను కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో 9 టీమ్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజు మూడు టీమ్లు మూడు రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారన్నారు. 24న ముగింపు రోజు ఉత్తమ నాటిక ప్రదర్శన, బహుమతి ప్రదానం, హైదరాబాదు వారిచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సిని నటుడు, యువ హీరో నిఖిల్, మిమిక్రీ కళాకారుడు రమేష్, అమెరికా నుంచి తానా అధ్యక్షులు చౌదరి జంపాల, సతీష్ వేమన, సంయుక్త కార్యదర్శి రవి పోట్లూరి, గోగినేని శ్రీనివాసు హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కో-ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘తానా’ చెస్ టోర్నీలు
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో రాష్ట్ర స్థాయి స్కాలర్ షిప్ చెస్ టోర్నీలు నిర్వహించనున్నట్లు ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని తెలిపారు. గురువారం సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఈ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జిల్లా పరిషత్ (జెడ్పీ) ఉన్నత పాఠశాల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంట్రీ ఉచితమన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులతో పాటు, ఉచితంగానే వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న విశ్లేషణ సామర్థ్యం వెలితీయటం, వ్యూహాత్మకంగా సమస్యలను అధిగమించే శక్తి, పోటీ తత్త్వం మెరుగుపరచడం, చదువుకు గాను స్కాలర్షిప్లు సాధించుకొనే శక్తి కల్గించాలనే సదుద్దేశంతో, సదాశయంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ముందుగా జరిగే ఈ టోర్నీలో ప్రతి జిల్లా నుంచి 8, 9, 10వ తరగతి విభాగాల నుంచి ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను పోటీల ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 18, 19వ తేదీల్లో విజయవాడలో... 26, 27వ తేదీల్లో హైదరాబాద్లో జరుగుతాయని చెప్పారు. ప్రథమ విజేతకు రూ. 50 వేలు, ద్వితీయ విజేతకు రూ.30 వేలు ఉపకార వేతనాలు ఉంటాయన్నారు. ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర టోర్నీలో జిల్లా స్థాయిలోని బాలబాలికల విభాగం విజేతలకు రూ. 10 వేలు ఉపకార వేతనం అందజేస్తామన్నారు. డిసెంబర్ రెండో వారంలో అన్ని జిల్లాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అక్కడ గెలుపొందిన ఐదుగురు బాలికలు, బాలుర విజేతలకు రాష్ట్రస్థారుు పోటీలకు ఎంపిక, జిల్లా చెస్ సంఘాల ద్వారా జరుగుతుందన్నారు. వివరాలకు 9490000252 నెంబర్లో సంప్రదించాలి. మీడియా సమావేశంలో తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు, అసోసియేట్ మెంబర్ చిత్రకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి తానా నాటక పోటీలు
కర్నూలు (కల్చరల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తానా నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నాటక పోటీల కమిటీ చైర్మెన్ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కన్వీనర్ ముప్పా రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో భాగంగా 22న సాయంత్రం 6 గంటలకు గుంటూరు నాటక సమాజం వారు అనంతం నాటికను, కరీంనగర్ చైతన్య కళాభారతి వారు దొంగలు నాటికను ప్రదర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు గణేష్ ఆర్ట్ థియేటర్ వారు అంతా భ్రాంతియే అనే నాటికను ప్రదర్శిస్తారన్నారు. 23న సాయంత్రం 6 గంటలకు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు రెండునిశ్శబ్దాల మధ్య అనే నాటికను, యంగ్ థియేటర్స్ అసోసియేషన్ విజయవాడ వారు అనగణగా అనే నాటికను రాత్రి 8.30 గంటలకు, సిరిమువ్వా కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు మాతృక నాటికను ప్రదర్శిస్తారన్నారు. 24న శనివారం ఉదయం 10.30 గంటలకు నంద్యాల కళారాధన వారు సైకథ శిల్పం నాటికను, 11.30 గంటలకు కొలకలూరు సాయిఆర్ట్స్ క్రియేషన్ వారు ఒక్క మాట చాలు అనే నాటికను, 12.30 గంటలకు నిజామాబాద్ మురళీకృష్ణ కళానిలయం వారు పొద్దు పొడిచింది అనే నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. 24న సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ సినీ నటులు బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొంటారన్నారు. కళాభిమానులు ఈ నాటకాలను తిలకించి జయప్రదం చేయాలని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య కోరారు. -
కప్పట్రాళ్ల అభివృద్ధిలో 'తానా'
– చైతన్య స్రవంతి పేరుతో డిసెంబరు 23, 24న అభివృద్ధి కార్యక్రమాలు కర్నూలు: కప్పట్రాళ్ల గ్రామాభివృద్ధికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ముందుకు వచ్చిందని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. చైతన్య స్రవంతి పేరుతో గ్రామంలో డిసెంబరు 23, 24 తేదీల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు తానా సభ్యులు కార్యచరణను రూపొందించారని వివరించారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరి సొంత నిధులతో కప్పట్రాళ్ల గ్రామంలో డిసెంబరు 23న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తారన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, అలాగే గ్రామంలోని ప్రతి విద్యార్థికి హైపటైటిస్–బి వ్యాక్సిన్ను వేస్తారన్నారు. డిసెంబరు 24న కప్పట్రాళ్ల జడ్పీ హైస్కూలులో బ్రీడ్స్ సొసైటీ లైబ్రరీని ప్రారంబిస్తామన్నారు. అలాగే జెడ్పీ హైస్కూలులో డిజిటల్ క్లాస్రూములను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పురుగు మందుల పిచికారీ సమయంలో అవసరమైన ప్రొటెక్షన్ కిట్స్ను రైతులకు పంపిణీ చేయన్నుట్లు చెప్పారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరితో పాటు తానా అధ్యక్షులు జంపాల చౌదరి, తానా కార్యక్రమాల సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ (కర్నూలు), వేమన సతీష్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి (అమెరికాలో) కోమటి జయరామ్, తానా ఫౌండేషన్ చైర్మెన్ గోగినేని శ్రీనివాస్, ఫౌండేషన్ ట్రస్టీ తాళ్లూరి జయశేఖర్ తదితరులు చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
’తానా’ 40వ వార్షికోత్సవం రోజే మహాసభలు
తెనాలి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆవిర్భవించి 40 ఏళ్లవుతున్న సందర్భంగా 2017లో జరగాల్సిన 21వ తానా మహాసభలను అదేరోజు నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఏటా జులైలో నిర్వహించే ఈ సభలను వార్షికోత్సవం సందర్భంగా 2017 మే 26, 28 తేదీల్లో జరిపేందుకు నిర్ణరుుంచినట్టు ’తానా’ అధ్యక్షుడు చౌదరి జంపాల పంపిన ఈ-మెరుుల్ సందేశంలో పేర్కొన్నారు. మహాసభల థీమ్గా ‘ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు’ అని నిర్ణరుుంచారు. తానా కన్వీనర్ డాక్టర్ కూర్మనాధరావు చదలవాడ ఆధ్వర్యంలో మహాసభల బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.