Tabs
-
పేద విద్యార్థులకు డిజిటల్ విద్య
-
న్యాణ్యమైన విద్య అందించేందుకే ట్యాబ్లు: మంత్రి బొత్స
-
విద్యార్థులకు ట్యాబ్ లు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
S7 FE , A7 Lite ట్యాబ్ ఫీచర్స్ లీక్, ధర ఎంతంటే
వెబ్డెస్క్:మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE ఫీచర్లు లీక్ అయ్యాయి. సౌత్ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ ట్యాబ్ S7 FE , A7 Lite ట్యాబ్లను విడుదల చేస్తున్నట్లు మే నెలలో ప్రకటించింది. ఈ ట్యాబ్స్ రేపు ఇండియాకు చేరుకోబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ట్యాబ్లకు సంబంధించిన ఫీచర్లు పబ్లిక్ డొమైన్ లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..గెలాక్సీ Tab S7 FE ,గెలాక్సీ Tab A7 Lite ఫీచర్లు ఇలా ఉన్నాయి. మిస్టిక్ స్పెషల్ మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్ మరియు మిస్టిక్ పింక్ కలర్స్ విడుదల కానున్న గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ఎఫ్ఇ 12.4-అంగుళాల టీఎఫ్టీ (Thin Film Transistor) డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్, 750 జి ప్రాసెసర్, టాబ్లెట్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.దీనిని పెన్ (Ultra S-Pen) ఆపరేట్ చేసుకోవచ్చు. గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ విషయానికొస్తే భారత్ లో ఈ ట్యాబ్ ఖరీదు రూ. 14,999 కే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్పెసిఫేకషన్ పరంగా చూస్తే గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ 15: 9 యాస్పెక్ట్ రేషియో, 8.7-అంగుళాల WXGA + డిస్ప్లే తో వస్తుంది. మీడియాటెక్ హెలియో పి 22 టి ప్రాసెసర్ తో నడుస్తుంది. 3 జీబీ+ 32 జీబీతో పాటు 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్లను కలిగి ఉంది. గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్లో 8 మెగాపిక్సెల్ తో విడుదల కానుండగా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టాబ్లెట్ 5W100mAh బ్యాటరీని, 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కాగా, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ గ్రే,సిల్వర్ కలర్ లో అందుబాటులోకి రానుంది. చదవండి : Samsung Galaxy M32: ధర రూ.20వేల లోపే, ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?! -
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త ట్యాబ్స్ ను లాంచ్ చేసింది. మెటల్ యూనీ-బాడీ డిజైన్తో ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్’ పేరుతో దీన్ని భారత్లో సోమవారం ప్రవేశపెట్టింది. గత ఏప్రిల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ను విడుదల చేసిన వీటి ప్రారంభ ధర రూ. 27,999 గా ఉంచింది. శాంసంగ్.కామ్, అమెజాన్ ద్వారా ఈ రోజు (జూన్ 8) నుంచి 16వరకు ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచింది. జూన్ 17వ తేదీనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ మూడు రంగులలో లభ్యం. ఇ-లెర్నింగ్, వర్క్ ఫ్రం హోం సాధారణమైన ప్రస్తుత సందర్భంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ తీసుకొచ్చినట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ అన్నారు. ఎస్ 6 లైట్ లో జోడించిన ఎస్ పెన్తో విద్యార్థులు, మల్టీ టాస్కింగ్ వినియోగదారులకు ఉపయోగపడుతుందన్నారు. ఆఫర్లు ప్రీ-బుక్ చేసే కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ + రూ .2999 కే కొనుగోలు చేయవచ్చు. లేదా రూ. 4,999 విలువ చేసే గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ బుక్ కవర్ ను .2,500 కు కొనుగోలు చేయడానికి అర్హులు. గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ ఫీచర్లు టాబ్ ఎస్ 6 లైట్ ఎస్ పెన్ సపోర్ట్, 10.4 అంగుళాల 2000x1200 ఎల్సిడి టచ్స్క్రీన్, ఎక్సినోస్ 9611 సాక్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,7040 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా జోడించింది. ధరలు గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ రూ .31,999 వై-ఫై వెర్షన్ ధర రూ .27,999 -
అమెజాన్కు షాక్: నెట్ఫ్లిక్స్ కొత్త ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకు అత్యంత చవక ధరకే నెలవారీ ప్లాన్ను లాంచ్ చేసింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు షాకిచ్చేలా రూ.199లకే నెలవారీప్లాన్ను బుధవారం ప్రకటించింది.మొబైల్, లేదా ట్యాబ్ సేవలకు మాత్రమే ఈ ప్లాన్ పరిమితం. నెలకు రూ. 500 బేసిక్ ప్లాన్తో వినియోగదారులకు ఆకట్టుకోలేకపోతున్ననెటిఫిక్ల్స్ ప్రధాన ప్రత్యర్థులు అమెజాన్, హాట్స్టార్ అందిస్తున్న ప్లాన్లకు ధీటుగా అత్యంత తక్కువ ధరకే తాజా ప్లాన్ను ప్రకటించడం విశేషం. తాజా ప్లాన్లో ఒకేసారి ఒక స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో ఎస్డి కంటెంట్ను వీక్షిచేందుకు ఈ ప్లాన్ వినియోగదారులను అనుమతిస్తుంది. 499, 649 , 799 రూపాయల మధ్య ఉన్న ప్రస్తుత, బేసిక్, ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చిన నాల్గవ ప్లాన్ ఇది. ఫిక్కి నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు ప్రయాణంలోనే చూస్తున్నారనీ, 30 శాతం ఫోన్ సమయంలో 70శాతం మొబైల్ డేటాను ఎంటర్టైన్మెంట్లో గడుపుతున్నారనీ, దీంతో సాధ్యమైనంత ఎక్కువ డివైస్లకు చేరుకోవడమేతమ లక్ష్యమని నెట్ఫ్లిక్స్ పార్టనర్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ నిగెల్ బాప్టిస్ట్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. అలాగే కొన్ని దేశాలలో మొబైల్ ఓన్లీ ప్లాన్ను మార్చి మాసంనుంచి పరీక్షించనుంది. ప్రస్తుతం అమెజాన్, హాట్స్టార్ తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్లలో చాలా తక్కువ ధరకే నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
బడులు.. హైటెక్లోకి అడుగులు!
కృష్ణాజిల్లా, మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల పరీక్షలు ట్యాబ్ల ద్వారానే నిర్వహించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. భవిష్యత్లో పేపరు, పెన్ను అనేది ఉపయోగించకుండా, పరీక్షల కోసమని ట్యాబ్లనే ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రామీణ విద్య బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నప్పటకీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదనే జాతీయస్థాయి విద్యారంగ నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్లో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానం ద్వారానే విద్యా బోధన సాగాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇందుకనుగుణంగా మార్పులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే డిజిటల్, వర్చువల్ తరగతుల బోధన సాగుతుండగా, తాజాగా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ట్యాబ్ల ద్వారానే పరీక్షలు.. భవిష్యత్తులో విద్యార్థులు అన్ని రకాల పరీక్షలను ట్యాబ్ల ద్వారానే పూర్తి చేసేలా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని రకాల పోటీ పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సత్తా ఉన్నప్పటికీ వీటిని ఎదుర్కోలేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే వీటిపై అవగాహన ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీంతో సర్కారు బడుల్లో ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే ట్యాబ్ల వినియోగంపై విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నారు. 3, 4 తరగతుల విద్యార్థులపై ప్రయోగం ప్రాథమిక పాఠశాలల్లోని 4, 5 తరగతుల విద్యార్థులు ట్యాబ్ల ద్వారా పరీక్షలు రాసేందుకు తొలిప్రయోగం చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను ప్రస్తుతం ట్యాబ్ల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా తరగతుల పాఠ్యాంశాల్లోని అంశాలతో తయారు చేసిన ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్లో సిద్ధం చేశారు. విద్యార్థికి ఒక ట్యాబ్ ఇచ్చి, ట్యాబ్ ద్వారానే పరీక్షను ఎదుర్కోవాలని సూచిస్తారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ట్యాబ్ ద్వారా పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కో పేపరులో 40 ప్రశ్నలు ఉంటాయి. రెండు సబ్జెక్టులను 1.20 గంటల్లో పూర్తి చేయాలి. సమయం దాటితే ప్రశ్నాపత్రం స్క్రీన్పై కనిపించదు. ఎంత సమయం ఉందనేది విద్యార్థి తెలుసుకునేలా ట్యాబ్లో పొందుపరిచారు. జిల్లాలో 23 పాఠశాలలు ఎంపిక ట్యాబ్ల ద్వారా పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సన్నద్ధం చేసే క్రమంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలనేది తెలుసుకునేందుకు జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ మండలాల్లోని 21 పాఠశాలలను ఎంపిక చేశారు. మచిలీపట్నం మండలంలో 9, గుడివాడలో 7, నూజివీడు మండలంలో 7 పాఠశాలల్లో ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. వీటి విజయంతానికి గాను 16 మంది సీఆర్పీలను ఎంపిక చేసి, వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రయోగానికి ప్రత్యేక యాప్ ట్యాబ్లపై పరీక్షల నిర్వహణకు విద్యార్థులకు అవగాహన కల్పించి, దీని అమల్లో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ స్థాయిలో గల ఓ ఏజెన్సీకి అప్పగించారు. సెంటర్ ఫర్ స్వే్కర్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) పేరుతో సదరు సంస్థ ప్రత్యేక యాప్ను రూపొందించారు. ప్రశ్నావళి నిక్షిప్తమై ఉన్న యాప్ను ట్యాబ్ల్లో సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు సలోమీ గుప్తా, దేవికా కపాడియా, నీల్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఇందుకు సంబం«ధించిన పనులు టెక్నీషియన్లు చేస్తున్నారు. ఈ వారంలోనే పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ట్యాబ్లపై ప్రయోగ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పేపర్ లెస్ విధానానికి అలవాటుపడాలి
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్స్టేషన్లో ఇక నుంచి పేపర్ లెస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలీస్స్టేషన్లో సిబ్బంది పేపర్ లెస్ విధానాన్ని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అందుకోసం సంబంధిత అధికారులు పోలీస్స్టేషన్లో కేసుల అన్ని వివరాలు ట్యాబ్స్ లేదా, ప్యాడ్లను ఉపయోగించాలన్నారు. ఇందులో పోలీస్స్టేషన్లో కేసుల వివరాలు, కోర్టు పనులలో అన్ని విషయాలను పొందుపర్చాలన్నారు. దీంతోపాటు క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టంలో పోలీస్స్టేషన్లోని ఎఫ్ఐఆర్, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేసి దోషులను అరెస్టు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూఎస్లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్లు ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి లాడ్జీల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నేరాలు అరికట్టేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను పక్కగా నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అదే పనిగా నేరాలకు అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీలు శ్రీధర్రెడ్డి, ఆకుల రాంరెడ్డి, ఆర్మూర్, బోధన్, ఏఆర్ ఏసీపీలు శివకుమార్, రఘు, సీహెచ్ మహేశ్వర్, అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సీసీఆర్బీ ఎస్ఐ రాజేశ్వర్గౌడ్, ఆర్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ట్యాబ్స్ మార్కెట్.. లెనొవొ టాప్..
బెంగళూరు: ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ ఇండియా’ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం. లెనొవొ ఇండియా.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా నివేదికను ఉటంకిస్తూ.. 2017–18 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలోనూ శాంసంగ్, ఐబాల్ కంపెనీలను వెనక్కు నెట్టామని ప్రకటించింది. ఇక లెనొవొ ఇండియా ప్రధాన ప్రత్యర్థులైనా శాంసంగ్, ఐబాల్ మార్కెట్ వాటా వరుసగా 19.9 శాతంగా, 17.7 శాతంగా ఉంది. -
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త ‘కాన్వాస్ ట్యాబ్’
ధర రూ.7,499 న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా ‘కాన్వాస్ ట్యాబ్ పీ681’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,499గా ఉంది. ఇందులో డీటీఎస్ డ్యూయెల్ ఆడియో స్పీకర్స్, 8 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లేబ్యాక్ రెజల్యూషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ట్యాబ్స్ వినియోగదారులకు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. -
అందని పల్స్
ప్రజాసాధికార సర్వేకు తప్పని ఇక్కట్లు సాఫ్ట్వేర్ మార్చినా పనిచేయని సర్వర్ ఎన్యూమరేటర్లకు పూర్తిగా అందని ట్యాబ్లు వ్యక్తిగత వివరాలు అడగడంపై ప్రజల్లోనూ ఆందోళన జిల్లాలో ప్రజాసాధికార (పల్స్) సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వర్ మొరాయించడం.. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలు అప్లోడ్ కాకపోవడంతో ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన సర్వే నత్తలా సాగుతోంది. కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లకు ట్యాబ్లు, ఐరిస్ తీసే పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే గందరగోళంగా తయారైంది. ఇంకొన్ని చోట్ల ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. వెరసి పల్స్ సరిగా అందడం లేదు. మచిలీపట్నం/విజయవాడ సెంట్రల్ : పల్స్ సర్వేతో సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సర్వే బృందాలు ప్రజల నుంచి వివరాలను కూపీ లాగుతున్నాయి. ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు, ఆస్తిపన్ను, ఐడీ, కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఎల్పీజీ గ్యాస్ బుక్, బ్యాంక్ పాస్బుక్, వాటర్ బిల్లు, క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లు, కిసాన్కార్డు, పెన్షన్ సర్టిఫికెట్, డ్వాక్రా కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ (5 సంవత్సరాలలోపు) పోస్ట్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కార్డులు వివరాలను సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. మొత్తం 75 అంశాలకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేయని వర్షన్లు స్మార్ట్ పల్స్ సర్వే చేసే నిమిత్తం ఎన్యూమరేటర్లకు ఇచ్చిన ట్యాబ్లలో తొలుత 2.0 వర్షన్ను ఆప్లోడ్ చేశారు. ట్యాబ్లో ఉన్న సిమ్కు 2జీ సేవలను అందుబాటులో ఉంచారు. 2.0 వర్షన్ పనిచేయకపోవటంతో 2.1 వర్షన్, అదికూడా పని చేయకపోవటంతో 2.2, తిరిగి 2.1, 2.3 వర్షన్లను ఆప్లోడ్ చేశారు. వీటిలో ఏదీ పని చేయలేదు. దీంతో కొద్ది పాటి మార్పులు చేసి మంగళవారం 2.3.1 వర్షన్ను ఆప్లోడ్ చేశారు. ఇదీ పని చేయకపోవడంతో బుధవారం 2.4 వర్షన్ను ఆప్లోడ్ చేశారు. ప్రస్తుతం 3జీ, 4జీ సేవలు అందుబాటులో ఉన్నా ఎన్యూమరేటర్లకు 2జీ సేవలు అందించే సిమ్లను ఇవ్వడంతో సర్వర్ సిగ్నల్స్ సక్రమంగా అందక ట్యాబ్లో నింపిన వివరాలు ఆప్లోడ్ కావటం లేదు. కొన్ని ట్యాబ్లలో బ్యాటరీలు సక్రమంగా పని చేయకపోవటం మరో సమస్యగా మారింది. మరి కొన్ని ట్యాబ్ల్లో కుటుంబ సభ్యుల వేలిముద్రలను సక్రమంగా స్వీకరించని పరిస్థితి ఉంది. ఏ పని చేయాలి ? పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వేలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పాల్గొనాలనే నిబంధన విధించారు. ఓ వైపు పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి పనులు చేయాలో.. పల్స్ సర్వేలో పాల్గొనాలో అర్ధంకాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఈ నెల 15వ తేదీ నుంచి పంచాయతీ కార్యదర్శులు పుష్కర విధుల్లో తప్పనిసరిగా ఉండాలని షరతులు పెట్టారు. ఒక మండలం నుంచి వేరే మండలానికి కొంత మందిని నియమించారు. ఒక ఉద్యోగి రెండు చోట్ల ఎలా పని చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, వీఆర్వో, వీఆర్ఏలను స్మార్ట్ పల్స్ సర్వేలో ఎన్యూమరేటర్లుగా నియమించినా ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు. కోతల కోసమే గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు సామాజిక పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000, 1,500కు పెంచుతానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలను కేటాయిస్తామన్నారు. పేద,మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే ఇలాంటి హామీలు ఎన్నో. తెల్లరేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొనే వీలుంటుందనేది బహిరంగ రహస్యం. కుటుంబ ఖర్చుల్ని లెక్కగట్టి ఆదాయంగా చూపినట్లైతే ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుల్లో 60 శాతం మేర తొలగించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కుటుంబ, వ్యక్తిగత సమాచారాన్ని సర్వే ముసుగులో రాబడుతున్నారు. పల్స్ సర్వే బృందాలు వస్తున్నాయంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. అధికారపార్టీ నేతలు మాత్రం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే సర్వే నిర్వహిస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అన్నింటికీ ‘ఆధార్’ ఉండగా పల్స్సర్వే దేనికన్నది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
మళ్లీ నోకియా మొబైల్స్ వస్తున్నాయ్!
మైక్రోసాఫ్ట్ నుంచి హెచ్ఎండీ గ్లోబల్కు బ్రాండ్ హెల్సింకి/న్యూఢిల్లీ: మళ్లీ నోకియా బ్రాండ్లు ఫోన్లు, ట్యాబ్లు మార్కెట్లోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా బ్రాండ్ హక్కులను హెచ్ఎండీ గ్లోబల్కు ఫాక్స్కాన్ కంపెనీలకు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్ఎండీ గ్లోబల్ లిమిటెడ్కు నోకియా బ్రాండ్ ఎక్స్క్లూజివ్ గ్లోబల్ లెసైన్స్ను పదేళ్లపాటు ఇచ్చామని నోకియా పేర్కొంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్, ఈ సంస్థ తైవాన్ భాగస్వామి ఎఫ్ఐహెచ్ మొబైల్ ఆఫ్ ఫాక్స్కాన్ టెక్నాలజీలు ఇక నోకియా బ్రాండ్ మొబైళ్లను విక్రయిస్తాయి. 1998-2011 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత శామ్సంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. 2014లో తన హ్యాండ్సెట్ వ్యాపారాన్ని నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫీచర్ ఫోన్లకు మాత్రం నోకియా బ్రాండ్ను వాడి లూమియా బ్రాండ్ కింద స్మార్ట్ఫోన్లను విక్రయించింది. మైక్రోసాఫ్ట్తో కుదుర్చుకున్న బ్రాండ్ లెసైన్సింగ్ ఒప్పందం ఈ ఏడాది మధ్యకల్లా ముగియనున్నదని అంచనా. -
అక్రమాలకు చెక్ పెట్టేందుకే!
► త్వరలో పాఠశాలల హెచ్ఎం, సీఆర్పీలకు ట్యాబ్లు ► అన్ని స్కూళ్లలో అమలుకు ► విద్యాశాఖ కసరత్తు చిత్తూరు(గిరింపేట): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల హాజరు, తనిఖీల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించా రు. ఇటీవల డీఈవో, పీవో, డీవైఈవో, ఎంఈవోలకు ట్యాబులను సరఫరా చేశారు. వీటిని వారందరూ వినియోగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాలకు సమాధానాలను ఆ ట్యాబ్ల ద్వారా పంపుతున్నారు. ఇది విజయవంతం కావడంతో త్వరలో జిల్లాలోని హైస్కూల్ పాఠశాలల హెచ్ఎంలకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ట్యాబ్లను జీపీఎస్తో అనుసంధానం చేయడ ం ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం అందడంతో పాటు, అకడమిక్ పర్యవేక్షణ సులభతరమవుతుందని భావిస్తున్నారు. విద్యార్థుల బోగస్ హాజరుకు చెక్పెట్టడంతో పాటు, విధులకు డుమ్మా కొట్టే టీచర్లను గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన విధానానికి, ఈ పర్యవేక్షణకు సమగ్ర నిర్వహణ సమాచార పద్ధతి(మానిటరింగ్ అండ్ ఇన్ఫరేషన్ సిస్టమ్) గా పేరపెట్టారు. జీపీఎస్తో అనుసంధానం ఉన్నతపాఠశాలల హెచ్ఎంలకు త్వరలో ఇవ్వనున్న ట్యాబ్లకు ప్రభుత్వం జీపీఎస్ విధానానికి అనుసంధానం చెయ్యనుంది. ఆర్జేడీ, డీఈవోల నుంచి మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ హెచ్ఎంలు , క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల వరకు తామునిర్వర్తించే పనులను ఎప్పటికప్పుడు రాష్ట్ర విద్యాశాఖకు ఆ ట్యాబ్ల ద్వారా అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖాధికారులు ప్రతి వారం స్కూళ్లను పర్యవేక్షించాల్సిన బాధ్యతను అప్పగించారు. వారు ఆ పాఠశాలకు వెళ్లి అక్కడ ఉన్న సదుపాయాలను ఫొటో లు తీసి పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులకు ట్యాబ్లను జీపీఎస్తో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల నిజంగా అక్కడికి వెళ్లి ఫొటోలు తీశారా? లేదా? ఏ రోజు తీశారు? ఏ సమయంలో తీశారన్న విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఈ కొత్త విధానం వల్ల ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పనిచేయాల్సిందే. అయితే తాము కాకుండా వెరొకరిని పంపించడం వంటి అంశాలకు వీలు లేకుం డా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. పాఠశాల సమాచా ర నివేదికల రూపొందించడానికి విద్యాశాఖ పోర్టల్, డాప్బోర్డు అప్లోడ్ అయ్యేలా, ట్యాబ్లలో నిక్షిప్తం చేసేలా అప్లికేషన్ను రూపొందించారు. ఇంటర్నెట్ సౌకర్యం గల సిమ్కార్డులను కూడా అందజేస్తారు. లక్షాలివే.. ►మానిటరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) కింద పాఠశాల పనితీరు, విద్యావిషయా లు, విద్యార్థులు, టీచర్ల హాజరు, ఇతర అంశాలపై ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. ► కీలక విభాగాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖకు అప్లోడ్ చేయడం. ► క్షేత్రస్థాయి విద్యావిధానాన్ని నిరంతరం పర్యవేక్షించడం ►మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించడం ►పాఠశాలల్లో ఆధునిక సదుపాయాల కల్పన, వాటి పర్యవేక్షణను గమనించడం ► వివిధ అవసరాలకు బడ్జెట్లో, వాటికి సంబంధించిన అకౌంటింగ్, ఎలక్ట్రానిక్ నిర్వహణ -
సంక్షేమ అధికారులకు ట్యాబ్లు
జవాబుదారీతనం, కచ్చితమైన పర్యవేక్షణ కోసం ఎస్టీ శాఖ చర్యలు సాక్షి, హైదరాబాద్: సంక్షేమరంగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎక్కడైనా స్తబ్దత ఏర్పడినా లేదా పనుల్లో వేగం మందగించినా, సరైన పర్యవేక్షణ లేకపోయినా అటువంటి వాటిని గుర్తించే ప్రక్రియను చేపడుతున్నారు. కిందిస్థాయి వరకు అధికారుల విధుల నిర్వహణలో కచ్చితత్వం, జవాబుదారీతనం, నిబద్ధతలను సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయా ఉపకరణాలు, పరికరాల (గాడ్జెట్స్)ను ఉపయోగించుకోవడం ద్వారా అధికారుల నుంచి మంచి ఫలితాలను సాధించేందుకు సంక్షేమ శాఖలు నడుం బిగించాయి. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఆయా చర్యలను చేపట్టినా తాజాగా షెడ్యూల్డ్ తెగల సంక్షేమశాఖ పరిధిలోని అధికారులందరికీ త్వరలోనే ట్యాబ్లు (ట్యాబ్లెట్లు) అందజేయనున్నారు. ఎస్టీ శాఖ పరిధిలోని అధికారులందరికీ మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ట్యాబ్స్ను, ఆయా పనుల పర్యవేక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. తమకు అవసరమైన అన్ని సాంకేతిక అంశాలున్న మంచి ట్యాబ్లను సూచించాల్సిందిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు కూడా ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు శాఖాపరంగా చేపడుతున్న పనులు, కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ ప్రాతిపదికన చేపడుతున్న పనులు, విద్యాసంస్థల పనితీరు, పథకాల తీరుతెన్నులను ట్యాబ్ల ద్వారా పరిశీలించాలని నిర్ణయించారు. తనిఖీలు, పర్యవేక్షణలను గురించి పై అధికారులకు నివేదికలను అందించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. విద్యార్థులు, టీచర్లు, వార్డెన్లు, ఇతరుల అటెండెన్స్ను బయోమెట్రిక్ పద్ధతిలో పర్యవేక్షించేందుకు, ఎస్టీ హాస్టళ్ల పోర్టల్లో అవసరమైన మార్పులు చేసేందుకు, టీడబ్ల్యూఎస్ఐఎస్ విధానంలో మార్పులు తీసుకురావాల్సిందిగా సీజీజీకి సవివర ంగా లే ఖ రాశారు. స్టడీసర్కిళ్ల విద్యార్థులకూ ట్యాబ్లు ఎస్టీ, బీసీ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కూడా ట్యాబ్లను సరఫరా చేయాలనే ఆలోచనతో అధికారులున్నారు. ఎస్టీ, బీసీ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిన పక్షంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచే ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లలో చేరేవారికి ట్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. -
‘రెవెన్యూ’కు ట్యాబ్స్
♦ వీఆర్ఓల నుంచి తహసీల్దార్ల వరకు పంపిణీ ♦ సమాచారం పంపాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు ♦ ‘వెబ్ల్యాండ్’ నిర్వహణ సులభతరం సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ శాఖను సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్న ఈ శాఖను సుపరిపాలన దిశగా నడిపించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. రెవెన్యూ రికార్డులను చిటికెలోనే తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ ఉద్యోగులకు కూడా టాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి సర్వే నంబర్ పుట్టు పూర్వోత్తరాలు, క్షేత్రస్థాయిలో స్థితిగతులతో కూడిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ‘వెబ్ల్యాండ్’ పేర కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. తాజాగా క్రోడీకరించిన ఈ సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునేలా గ్రామ రెవెన్యూ అధికారి మొదలు మండల తహసీల్దార్ వరకు టాబ్లెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పంపాలని రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమాండ్పీటర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారి, పోస్టింగ్, ఖాళీలను తెలిపేలా రూపొందించిన ఫార్మెట్కు అనుగుణంగా సమాచారాన్ని నివేదించమని సూచించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో పనిచేస్తున్న 434 మంది వీఆర్ఓలు, 65 మంది ఆర్ఐలు, 59 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 37 మంది తహసీల్దార్లకు టాబ్లెట్లు రానున్నాయి. -
లక్షకు పైగా ట్యాబ్ల కొనుగోలు
* ఇ గవర్నెన్స్, పేపర్లెస్ పాలన అంటున్న ప్రభుత్వం * రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్ధం సాక్షి, హైదరాబాద్: రెండువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయాన్ని వెచ్చిస్తూ ఏకంగా లక్ష కు పైగా ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒకవైపు లోటు బడ్జెట్, నిధుల లేమి అని ముఖ్యమంత్రి తరచూ బీద అరుపులు అరుస్తుంటారు. అయితే పాలనపరమైన సౌకర్యం కోసం అంటూ ఇప్పుడు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధం అవుతుండటమే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కీలక ఉద్యోగులందరికీ ఈ ట్యాబ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి గ్రామ, మండల స్థాయి నుంచి ఏ అధికారి అయినా స్మార్ట్ ఫోన్ల ద్వారా టెలిగ్రామ్, వాట్స్యాప్ సౌకర్యాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే రాష్ట్రస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు ఏ సమాచారం పంపాలన్నా మెయిల్ ద్వారానే పంపించనున్నారు. ఇ-గవర్నెన్స్లో భాగంగా ట్యాబ్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఒక్కో ట్యాబ్కు పది వేల రూపాయల వ్యయం, ఒక్కో స్మార్ట్ ఫోనుకు పది వేల రూపాయల వ్యయం అవుతుందని ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా రెండువందల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. స్కూళ్లకు 62 వేల ట్యాబ్లు దశల వారీగా రాష్ట్రంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్కు కూడా ట్యాబ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కూల్స్ అన్నీ కలసి 62 వేలకు పైగా ఉన్నాయి. అంటే మరో 62 వేల ట్యాబ్లను కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నారు. -
విద్యార్థినులకు ట్యాబ్స్
రాంచీ: విద్యార్థినులకు టాబ్లెట్ కంపూటర్లను పంపిణీ చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 9 నుంచి ఇంటర్ మధ్య జరిగే విద్యార్థునులకు అందజేయనున్నట్టు చెప్పారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రఘువర్ దాస్ చెప్పారు. ఉపాధ్యాయుల భర్తీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సదుపాయం తదితర అవసరాలను తీరుస్తామని తెలిపారు.