tablets
-
గుడ్న్యూస్: కోవిడ్ సోకితే ఇక ఇంట్లోనే మాత్రలు వేసుకుంటే చాలు!
లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్ఛేంజర్గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి. ‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
గౌతం గంభీర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంభీర్ తరపున న్యాయవాది డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్కు స్టే ఇవ్వాలని కోరగా, కోర్టు ఈ విధంగా తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఫాబీప్లూ మందులకు డిమాండ్ భారీగా ఉంది. ఆ పరిస్థితుల్లో గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ప్రజలకు పంచిన సంగతి తెలిసిందే. దీంతో ఫాబీఫ్లూ టాబ్లెట్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్పై ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశానుసారం డీజీసీఐ.. గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, పంపిణీ చేయడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణిస్తూ ఆ ఫౌండేషన్ను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గంభీర్ను దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు అధికారులకు ఆరు వారాల గడువు ఇచ్చింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి గంభీర్ తరపు న్యాయవాది స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వలేమని, ఢిల్లీ హైకోర్టు ముందే మీ వాదనలు వినిపించాలంటూ తేల్చి చేప్పింది. -
నోరు తిరగని పేర్లు ఎలా పెట్టారో? :మంత్రి కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ‘పొసొకోనజోల్, క్రెసంబా, టొలిసిజిమాబ్, రెమిడెసివిర్, లిపొసొమల్ ఆంఫోటెరిసిన్, ఫ్లావిపిరవిర్, మాల్న్యూపిరవిర్, బరిసిట్రినిబ్.. ఇలా నోరు తిరగని పేర్లను మందులకు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో మీకేమైనా తెలుసా? సరదాగా అడుగుతున్నా’అని మంత్రి కె.తారక రామారావు గురువారం ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించే కేటుగాళ్ల గురించి 100కు ఫోన్చేసి సమాచారమివ్వాలని లేదా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై పోలీసులు ఇప్పటివరకు 128 కేసుల నమోదుతో పాటు 258 మందిని అరెస్టు చేశారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం మందులు కావాల్సిన వారు dme@telangana.gov.in లేదాentmcrm @telangana.gov.inల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కరోనా: ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
న్యూఢిల్లీ: ఐబూప్రూఫెన్ లాంటి కొన్ని పెయిన్ కిల్లర్లు కరోనా కారక ఇబ్బందులను మరింత పెంచుతాయని, హృద్రోగ, కిడ్నీ పేషెంట్లకు ఇవి ప్రమాదకారులని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కరోనా సమయంలో నొప్పుల బాధకు ఎన్ఎస్ఏఐడీఎస్ (నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డగ్స్ర్)ను తీసుకోవద్దని, వీటి బదులు అవసరమైతే పారసిటమాల్ టాబ్లెట్లను వాడాలని సూచించింది. బీపీ, సుగర్, హృద్రోగులు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. సూచనలు, సలహాలు... ► బీపీకి వాడే ఏసీఈ ఇన్హిబిటర్లు(రామిప్రిల్ లాంటివి) కానీ, ఏఆర్బీలు(లోసార్టిన్ లాంటివి) కానీ కరోనా తీవ్రతను పెంచుతాయనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. నిజానికి ఈ మందులు హృదయం పనితీరుకు మేలు చేయడంతోపాటు, అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అందువల్ల సొంతంగా వీటిని మానేయాలనే నిర్ణయం తీసుకోవద్దు. అలా చేస్తే హృదయ సంబంధిత ముప్పు పెరుగుతుంది. ► కరోనా సోకిన రోగుల్లో 80 శాతం మందికి శ్వాససంబంధిత ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. అయితే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు అధికమనే వాదన ఉంది. కానీ ఈ వాదన నిజం కాదు. ఈ సమస్యలున్నవారిలో కొందరికి మాత్రం కోవిడ్ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల ఈ బాధలున్నవారు అధిక జాగ్రత్త తీసుకోవడం మంచిదే! షుగర్ అదుపులోలేని వ్యక్తులకు ఇన్ఫెక్షన్ల రిస్కు ఎక్కువ. ► కోవిడ్ సోకినా సరే ఇప్పటికే వివిధ సమస్యలకు మందులు వాడుతున్నవారు వాటిని కొనసాగించాలి, కేవలం డాక్టర్ సూచిస్తేనే మానేయాలి. ► సమూహాల్లోకి వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరి. మాస్కును మూతి, ముక్కు, గడ్డం కవర్ చేసేలా ధరించాలి. దీంతోపాటు, సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్ను కంట్రోల్ చేయవచ్చు. ► కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే గైడ్లైన్స్ ప్రకారం ఐసోలేషన్ పాటించాలి, పరిస్థితి విషమిస్తే డాక్టర్ను సంప్రదించాలి. ► మద్యపానం, ధూమపానం మానేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమబద్దమైన వ్యాయామం చేయడం, బీపీ, సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, కరోనా గైడ్లైన్స్ను కచ్ఛితంగా పాటించడం ద్వారా ప్రజలు కరోనాను కట్టడి చేయవచ్చు. చదవండి: Last 24 Hours: అక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు -
నకిలీ మందుల గుట్టు రట్టు
సాక్షి, అమరావతి: యాంటీబయోటిక్స్ పేరుతో డొల్ల ట్యాబ్లెట్లు తయారు చేసి, దేశ వ్యాప్తంగా రోగులను మోసగిస్తున్న ముఠా బండారం బట్టబయలైంది. ఉత్తరాఖండ్ చిరునామాతో తయారైన ఈ నకిలీ మందులపై అనుమానం రావడంతో రాష్ట్రానికి చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ మందులను తయారు చేసిన కంపెనీ చిరునామాను బట్టి ఆరాతీస్తే ఉత్తరాఖండ్లోని ఉద్దంసింగ్ నగర్లో అలాంటి కంపెనీ లేదని తేలింది. విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరంలలో ఈ నకిలీ మందులు బయటపడ్డాయి. దీంతో సుమారు 45 రోజుల పాటు పరిశోధించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారుల బృందం ఎట్టకేలకు ఈ కుంభకోణాన్ని ఛేదించింది. నకిలీ మందుల గుట్టు బయట పడిందిలా.. హెచ్పీహెచ్ఐఎన్ కంపెనీ తయారీ పేరుతో కొన్ని మందులు తొలుత భీమవరంలోని మందుల దుకాణాలకు చేరాయి. తనిఖీల ద్వారా ఈ విషయం ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిసింది. వారు ఆ మాత్రలను ల్యాబ్కు పంపించారు. ఇందులో ఎలాంటి మందు లేదని తేలింది. ఆ తర్వాత విజయవాడలోని హరిప్రియ మెడికల్స్ ద్వారా రాజమండ్రిలోని లోకేశ్వరి ఫార్మసీ వాళ్లు ఎక్కువగా అజిత్రోమైసిన్, సిఫిగ్జిమ్ ట్యాబ్లెట్లు కొన్నారు. వీటిని పరిశీలిస్తే ఇవి కూడా డమ్మీ అని తేలింది. ఆ తర్వాత పాలకొల్లులోనూ ఇలాంటి నకిలీ మందులే దొరికాయి. గొల్లపూడిలోని సహస్ర మెడికల్స్లోనూ కొన్ని నకిలీ మందులు లభించాయి. ఇవి విష్ రెమిడీస్ సంస్థ తయారు చేసినట్టు తేలింది. దీంతో ఏపీ ఔషధ అధికారుల బృందం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. చండీగఢ్లో మూలాలు బయటకు.. హెచ్పీహెచ్ఐఎన్ అనే కంపెనీ లేకుండా మందులెలా వచ్చాయి.. వీటికి మూలాలెక్కడ? అని ఆరా తీస్తే చివరకు చండీగఢ్లో బయటపడ్డాయి. క్యాన్ కేర్ అనే ఫార్మాసూటికల్ సంస్థ వీటిని తయారు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఆ సంస్థను ప్రశ్నించారు. అయితే ఎక్కడా ఆ మందులు తయారు చేసినట్టు ఆధారాలు లభించలేదు. మరింత లోతుగా పరిశీలించగా, హెచ్పీహెచ్ఐఎన్ మందులు మార్కెట్ చేసినట్టు, దానికి జీఎస్టీ చెల్లించినట్టు ఆధారాలు లభించాయి. దీంతో దొంగలు దొరికిపోయారు. వీరిపై వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కేసులు నమోదు చేశారు. కోవిడ్ సమయంలో ఎలాంటి మందులు తయారు చేసినా అమ్మకాలు బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా సొమ్ము చేసుకోవాలనుకున్నారు. 29 మందిపై చార్జిషీట్ నకిలీ మందులు తయారు చేసిన కంపెనీలు, వాటిని కొనుగోలు చేసిన ఇక్కడి ఫార్మసీ యాజమాన్యాలు మొత్తం 29 మందిపై చిర్జిషీట్ వేశారు. వీరిలో ఇప్పటికే చండీగఢ్లో నలుగురు జైలుకు వెళ్లారు. ఏపీలో నకిలీ మందులు కొనుగోలు చేసిన హరిప్రియ, కాళేశ్వరి ఫార్మసీ యాజమాన్యాల లైసెన్సులు రద్దు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. దేశ వ్యాప్తంగా నకిలీ మందులు అమ్ముతున్న విషయం గురించి ఏపీ ఔషధ నియంత్రణ అధికారులు కేంద్ర ఔషధ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర సంస్థ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఈ విచారణలో ఔషధ నియంత్రణకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ కె.రాజభాను, డ్రగ్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున రావు, వినోద్, అన్వేష్ రెడ్డి, ఎ.క్రిష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ క్రిష్ణ, కానిస్టేబుల్ అచ్చన్నలు కీలక పాత్ర పోషించారు. తక్కువ కాలంలో ఛేదించగలిగాం నకిలీ మందులు అమ్ముతున్నారన్నది ఫిర్యాదుల ద్వారా రాలేదు. మేమే గుర్తించాం. వెంటనే అప్రమత్తమయ్యాం. వాటి మూలాలన్నీ శోధిస్తూ 45 రోజుల్లోనే అతి పెద్ద కేసును ఛేదించగలిగాం. వీళ్లందరికీ కఠిన శిక్ష పడేలా చార్జిషీట్ రూపొందించాం. నకిలీ మందుల విచారణకు వేసిన బృందం అద్భుతంగా పని చేయడం వల్లే తొందరగా కేసును ఛేదించగలిగాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
తరచూ పారాసిటమాల్ తీసుకున్నా ప్రయోజనం సున్నా!
చాలా మంది వెన్నునొప్పికీ, నడుమునొప్పికి లాంటి నొప్పులకు పారాసిటమాల్ (అసిటమైనోఫెన్) తీసుకుంటూ ఉంటారు. హానిలేని మందుగా చాలామంది వైద్యులూ దీన్ని ఫస్ట్లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటారు. నిజానికి తరచూ పారాసిటమాల్ వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు ఆస్ట్రేలియా అధ్యయనవేత్తలు. దాదాపు 1500 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. నడుము, వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్న ఆ గ్రూపులోని కొందరికి పారాసిటమాల్ ఇచ్చారు. ఇంకొందరికి కూడా పారాసిటమాల్ మాత్ర ఇచ్చారు కానీ నిజానికి అందులో ఏ మందూ లేదు. అంటే అసిటమైనోఫెన్ మందులేకుండా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. పదిహేడు రోజుల తర్వాత పరీక్షించి చూడగా... నిజానికి మందు తీసుకున్నవారిలోనూ, మందుతీసుకోకుండా కేవలం ‘ప్లాసెబో’ఎఫెక్ట్తో ఉపశమనం పొందినవారిలోనూ పెద్దగా తేడా ఏదీ లేదని అధ్యయనవేత్తలు గుర్తించారు. అందుకే నడుము, వెన్ను నొప్పి వచ్చినప్పుడు పైపూత మందులు లేదా ఫిజియో వ్యాయామాలే మంచివంటున్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలు ‘ల్యాన్సెట్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు!
వాలెంటైన్స్ డే సందర్బంగా శామ్సంగ్ డేస్ సేల్ పేరుతో కొత్త సేల్ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. శామ్సంగ్ డేస్ సేల్ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. శామ్సంగ్ డేస్ సేల్లో కొన్ని స్మార్ట్ఫోన్లు శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎం31, గెలాక్సీ ఎఫ్41 ఉన్నాయి. అలాగే టాబ్లెట్లలో గెలాక్సీ టాబ్ ఎస్7+, గెలాక్సీ టాబ్ ఎ7 వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్, సెలెక్ట్ ఇ-కామర్స్ పోర్టల్స్, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా గెలాక్సీ టాబ్లను కొనుగోలు చేస్తే వినియోగదారులు పదివేల వరకు డిస్కౌంట్ లభించనుంది. చదవండి: ఆన్లైన్లో లీకైన ఆండ్రాయిడ్12 ఫీచర్లు రియల్ మీ ఎక్స్ 7 ప్రో ఫస్ట్ సేల్ -
8-10 టాబ్లెట్లు.. 4 గంటల మత్తు!
చెన్నై : మత్తుకు అలవాటు పడి మెడికల్ షాపులను దోచుకుంటున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైకి చెందిన పింకీ అలియాస్ అరుణ్ కుమార్(21) మత్తుకు అలవాటు పడ్డాడు. మందు, గంజాయి కొనటానికి డబ్బులేని సమయంలో మెడికల్ షాపులనుంచి టాబ్లెట్లు దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఖరీదైన మందులను మాత్రమే దొంగిలించేవాడు. తను దొంగతనం చేయబోయే షాపులలో ఆ టాబ్లెట్లు ఉన్నాయా లేదా అని విచారించుకునేవాడు. బాక్సుల మీద ఉన్న పేర్లను గుర్తుపట్టి వాటిని తీసుకెళ్లేవాడు. ( ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు ) అనంతరం 8-10 టాబ్లెట్లను నీళ్లతో కలిపి ఓ మిశ్రమంలా తయారుచేసేవాడు. ఆ తర్వాత దాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు మత్తులో ఉండేవాడు. ఓ మెడికల్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి అరుణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. చదవండి : ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’ -
ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ హబ్గా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీల తయారీ కేంద్రంగా భారత్ మారడం ద్వారా ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను పొందవచ్చు. విధానపర జోక్యంతో వీటి తయారీ పరిశ్రమ దేశంలో 2025 నాటికి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఇండియన్ సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) బుధవారం వెల్లడించింది. ఈ సామర్థ్యం భారత పరిశ్రమకు ఉందని ధీమా వ్యక్తం చేసింది. ఇదే జరిగితే ప్రపంచ ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్ తయారీ పరిశ్రమలో భారత వాటా ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 26 శాతానికి చేరుతుందని తెలిపింది. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అలాగే రూ.5.62 లక్షల కోట్ల మేర విదేశీ మారకం భారత్కు వస్తుంది. రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులూ ఉంటాయని ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల తయారీ అవకాశంపై ఐసీఈఏ–ఈవై రూపొందించిన నివేదిక తెలిపింది. ఇదీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్.. భారత్లో ఎల్రక్టానిక్స్ మార్కెట్ రూ.4.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక వాటా మొబైల్ ఫోన్లదేనని అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. ‘ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ల విషయంలో ఇప్పటికీ దిగుమతులపై భారత్ ఆధారపడింది. అయిదేళ్లలో ల్యాప్టాప్స్ దిగుమతులు 42 శాతం ఎగసి రూ.31 వేల కోట్లు దాటింది. ఈ దిగుమతుల్లో చైనా వాటా ఏకంగా 87 శాతముంది. ఐటీ ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్ల తర్వాత ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ వరుసలో ఉన్నాయి. 2019 జాతీయ ఎల్రక్టానిక్స్ విధానం ప్రకారం.. 2025 నాటికి దేశంలో ఎల్రక్టానిక్స్ తయారీ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో మొబైల్ ఫోన్ల విభాగం నుంచి రూ.14.2 లక్షల కోట్లు సమకూరనుంది’ అని వివరించారు. వ్యయాలు తగ్గితే.. దేశంలో ల్యాప్టాప్, ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ చాలా చిన్నది. ఇక్కడ తయారైనవి అధికంగా యూఎస్, యూరప్ తదితర దేశాలకు ఎగుమతి కోసం ఉద్ధేశించినవి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎల్రక్టానిక్స్ రంగానికి బూస్ట్నిస్తోంది. వ్యయాలు తగ్గితే ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ తయారీ అధికమవుతుంది. మొబైల్స్ తయారీలో ఉన్న భారతీయ సంస్థలకు ట్యాబ్లెట్స్ ఉత్పత్తిలో అపార అవకాశాలు ఉన్నాయి. అధిక విద్యుత్ టారిఫ్, పన్నులు, వ్యాపారానికి అనువైన పరిస్థితుల విషయంలో తయారీ సంస్థలకు అడ్డంకులు ఉన్నాయి. దీంతో వియత్నాం, చైనాలతో పోలిస్తే 10–20 శాతం తక్కువ పోటీలో ఉన్నాం. దీర్ఘకాలంలో ఈ సమస్యలను భారత్ పరిష్కరించాలి. ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలను అందించాలి అని నివేదిక వెల్లడించింది. -
నెట్రావిట్ మాత్ర.. మత్తులోకి యాత్ర..
1956: శస్త్రచికిత్స తదితర సందర్భాల్లో రోగులకు మత్తు కలిగించడం కోసం శాస్త్రవేత్త పార్కే–డవీస్ కెటమ హైడ్రోక్లోరైడ్ను కనుగొన్నాడు. 1969: మత్తుకు బానిసైన వారు ఈ ఇంజెక్షన్ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో దీనిని ‘నియంత్రణ మందు’గా మార్చారు. 2011: కెటమైన్ నుంచి పొడిని తయారుచేసి నిషా కోసం వాడుతుండటంతో కేంద్రం ఈ పొడిని నిషేధిత మాదకద్రవ్యాల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం.. దీన్ని ఇంట్లోనే తయారుచేస్తూ విక్రయించే ట్రెండ్ నడుస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఇదొక్కటే కాదు.. మాదకద్రవ్యాలు కాని ఇలాంటి అనేక మత్తు ‘మందు’లకు యువత బానిసవుతోంది. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలు పక్కదారి పడుతున్నాయి. వీటిని విక్రయించేందుకు వ్యవస్థీకృత ముఠాలు పుట్టుకొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు. పట్టుబడిన ఔషధాల్లో కొన్ని మెడికల్ షాపులు, డీలర్ల నుంచి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. మాదకద్రవ్యాలతో పాటు ఈ ఔషధాల దుర్వినియోగంపైనా నిఘా పెట్టారు. ఈ ఔషధాలను ‘మత్తు’ కోసం వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు నగరంలోని ఓయూ ఠాణా పరిధిలోనూ కెటమైన్ ఇంజెక్షన్లను అక్రమంగా కలిగిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. టోలిచౌకి ప్రాంతంలో కెటమైన్ ఇంజెక్షన్ను వినియోగించి పొడిని తయారుచేయడం వెలుగులోకొచ్చింది. ఈ పొడిని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు. దీన్ని వినియోగించే వారితో పాటు విక్రయించే వాళ్లు నగరంలో పలువురు ఉన్నారు. నగరంలో గంజాయికి బానిసైన యువత ప్రస్తుతం నెట్రావిట్ టాబ్లెట్స్ వాడుతున్నారు. వీటిని మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగర పోలీసులు ఇటీవల ఆసిఫ్నగర్ ప్రాంతంలో ఓ విక్రేతను అరెస్టుచేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో తీవ్రమైన వాసన వెలువడుతుంది. దీంతో అందరి కంట్లో పడుతున్నామని భావిస్తోన్న యువత.. ప్రత్యామ్నాయంగా ‘నెట్రావిట్’ మాత్రల్లో మత్తును వెతుక్కుంటోంది. తీవ్ర రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టక ఇతర రుగ్మతలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకనే వైద్యులు వీరికి నెట్రావిట్ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. శస్త్రచికిత్స జరిగిన వారికీ ఆ నొప్పి తెలియకుండా ఒకట్రెండు రోజులు వీటిని రాస్తారు. ప్రస్తుతం యువత ఈ ‘మత్తు’ బారినపడటంతో కొందరు మహారాష్ట్ర నుంచి నెట్రావిట్ మాత్రల్ని నగరానికి అక్రమ రవాణా చేస్తున్నారు. 15 మాత్రలతో ఉండే స్ట్రిప్ ఖరీదు రూ.85 కాగా, గంజాయి బానిసలకు రూ.200కు అమ్ముతున్నారు. దగ్గు మందులే ఎక్కువ..: ఇటీవల పలువురు విద్యార్థులు, యువకులు ‘సేఫ్ డ్రగ్స్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫుట్పాత్లపై ఉండే వారు సైతం వీటినే వాడుతున్నారు. వీరంతా వాడే వాటిలో దగ్గు మందు ప్రధానమైందని అ«ధికారులు చెబుతున్నారు. ఇంకా ఈ జాబితాలో నిద్రమాత్రలు, వైట్నర్ వంటివీ ఉన్నాయి. నిద్రమాత్రల్ని సేకరించడం కొంచెం కష్టం. వైట్నర్ను ఖరీదు చేయడం తేలికే అయినా, వాడేటప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలుంటాయి. దీంతో మత్తుకు బానిసలవుతున్న యువత, వైట్నర్ లభించని వారు దగ్గు మందును ఎక్కువ వాడుతున్నారు. సాధారణంగా దగ్గు మందుల్ని డెక్స్ట్రోమెథార్ఫిన్, కోడైన్లతో తయారుచేస్తారు. కోడైన్తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్నికేవలం ఔషధాల తయారీకే వినియోగిస్తుంటారు. డెక్స్ట్రోమెథార్ఫిన్ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలవుతున్నారు. కండల కోసం ఇంజెక్షన్: అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్ను నగర యువత స్టెరాయిడ్గా వాడుతోంది. జిమ్ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి, ఎక్కువ బరువులు ఎత్తడానికి ఈ సూది మందును తీసుకుంటోంది. దీన్ని అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠాను ఇటీవల టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మెఫన్టెరై్మన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రోగులకు సర్జరీలు చేసేటపుడు మత్తు (అనస్థీషియా) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పనిసేలా చూస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాలక్రమంలో ఈ ఇంజెక్షన్ నగరంలో జిమ్లకు వెళ్తున్న యువతకు ‘అథ్లెట్స్ స్టెరాయిడ్’గా మారిపోయింది. మెడికల్ షాపులపై డేగకన్ను: ఇలాంటి ఔషధాలను నిబంధనల ప్రకారం వైద్యుడి చీటీ లేనిదే అమ్మడానికి లేదు. కొందరు అక్రమార్కులు వీటిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెస్తున్నారు. నగరంలోని కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు చీటీ లేకుండానే విక్రయించేస్తున్నారు. కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కొరి యర్లో ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వస్తున్నాయి. ఈ నేపథ్యం లో నగరంలోని మెడికల్ దుకాణాలు, కొరియర్ సంస్థలపై పోలీ సులు డేగకన్ను వేశారు. మెడికల్ దుకాణాల నిర్లక్ష్య ధోరణిపైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్కు లేఖ రాయాలని నిర్ణయించారు. మున్ముందు అనారోగ్య సమస్యలు ఈ మత్తు‘మందుల్ని’, స్టెరాయిడ్స్ను వినియోగించే వాళ్లకు తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని వాడే వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. వీటికి ఒకసారి అలవడితే.. అది దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతారు. వైద్యులు సైతం అత్యంత అరుదుగా రాసే కొన్ని ఔషధాలను అక్రమంగా వాడటం వల్ల గుండెజబ్బులతో పాటు కిడ్నీ, లివర్, మొదడుతో పాటు నరాల వ్యవస్థ దెబ్బతింటాయి. ఒక్కోసారి గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు పెరిగి తీవ్ర పరిణామాలు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలి. – డాక్టర్ పి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి అమ్మే, కొనేవారిపైనా కేసులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని ఔషధాలను విక్రయించడం నేరం. ప్రధానంగా దగ్గు మందులతో పాటు మత్తును కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వీటి కిందికి వస్తాయి. ఇలాంటివి విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతున్నాం. అమ్మిన వారితో పాటు కొన్న వారిపైనా కేసులు పెడుతున్నాం. ఇప్పటికే ఈ తరహా కేసులు పలు నమోదయ్యాయి. వైట్నర్ను మత్తు కోసం వాడుతున్నారనే సమాచారం ఉంది. – పి.రాధాకిషన్రావు, ఓఎస్డీ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ -
గుణిషా అగర్వాల్ ‘డిజిటల్’ సాయం
నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు గమనించింది ఓ టీనేజ్ అమ్మాయి. ఐటీ కంపెనీలను సంప్రదించింది. వారి సాయంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ కుమార్తె పేరు గుణిషా అగర్వాల్. 12వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల గుణీషా తన తల్లి ఆన్లైన్ క్లాస్లో పాల్గొనడానికి ఇంట్లో పనిచేసే అతడి కుమార్తెకు ల్యాప్టాప్ ఇవ్వడం చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరు ఆన్లైన్లో చదువుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య ఒకటే కాదు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు వంటి పరికరాలు కావాలి. ఇదంతా గమనించిన గుణిషా అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. కంపెనీల చొరవ చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ల్యాప్టాప్లను గుణిషాకు విరాళంగా ఇస్తున్నారు. అలాగే, ఓ ఐటి కంపెనీ, థింక్ఫినిటీ అండ్ కన్సల్టింగ్ కూడా గుణిషాకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సంస్థ 50,000 రూపాయలతో గుణిషా కోసం ఉచితంగా వెబ్సైట్ను తయారు చేసింది. అదే సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు విద్యార్థులకు ఇచ్చిన పాత పరికరాలను ఆన్లైన్ తరగతుల ప్రకారం ఫార్మాట్ చేస్తారు. సలహాదారు బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘ఐటి విభాగంలో పనిచేసిన తరువాత కూడా, విద్యార్థులకు సహాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుణిషా కారణంగా, మేం కూడా ఈ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం లభించింది’ అని ఆనందంగా తెలిపారు. వారు ఇప్పటివరకు 25 పరికరాలను విద్యార్థులకోసం కేటాయించారు. ఈ వారం, మరో 15 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను ఇవ్వబోతున్నారు. ‘కరోనా కాలం కారణంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాను. వాటిని అవసరమైన వారికి అందించడమే ఇప్పుడు నా బాధ్యత. తద్వారా వారి ఆన్లైన్ చదువులు నిరాఘాటంగా కొనసాగుతాయి’ అంటోంది గుణిషా. -
కోవిడ్-19కు డాక్టర్ రెడ్డీస్ నుంచి ట్యాబ్లెట్లు
కరోనా వైరస్ సోకి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించగల ఫావిపిరవిర్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తాజాగా పేర్కొంది. అవిగాన్ బ్రాండుతో ఈ ఔషధ ట్యాబ్లెట్లను 200 ఎంజీ డోసేజీలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రెండేళ్ల కాలావధి కలిగిన ఈ ఔషధ పూర్తి ప్యాక్ 122 ట్యాబ్లెట్లతో లభిస్తుందని తెలియజేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చే యోచనతో ఆన్లైన్ ద్వారా 42 పట్టణాలలో వీటిని హోమ్ డెలివరీ సైతం చేస్తున్నట్లు వివరించింది. హెల్ప్లైన్ కేంద్రం ద్వారా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో సెప్టెంబర్ మొదటి వారానికల్లా కోవిడ్-19 చికిత్సకు మరో ఔషధం రెమ్డెసివిర్ను సైతం మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఫుజిఫిల్మ్ టొయామా నుంచి జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీ నుంచి పొందిన గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా వీటిని విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్ధమాన మార్కెట్ల బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ పేర్కొన్నారు. దేశీయంగా వీటి తయారీ, విక్రయం, పంపిణీలకు ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో వీటి తయారీని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 కారణంగా ఓమాదిరి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినియోగించేందుకుగాను ఈ ట్యాబ్లెకు డీసీజీఐ అనుమతి ఉన్నట్లు వివరించారు. -
కోవిడ్-19కు ట్యాబ్లెట్లు- జెన్బర్క్ జోరు
కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బీఎస్ఈకి వెల్లడించడంతో ప్రవేశపెట్టనున్నట్లు జెన్బర్క్ ఫార్మా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క యూఎస్ అనుబంధ సంస్థలో వాటా విక్రయ వార్తలతో ఐటీ సేవల సంస్థ మజెస్కో లిమిటెడ్కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెన్బర్క్ ఫార్మా కరోనా వైరస్ సోకడంతో స్వల్ప లేదా మధ్యస్థాయి లక్షణాలతో ఇబ్బందిపడే రోగులకు ఉపశమనాన్ని ఇవ్వగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెన్బర్క్ ఫార్మాస్యూటికల్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా 200 ఎంజీ డోసేజీలో వీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జెన్బర్క్ ఫార్మా షేరు బీఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 470 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 6 శాతం జంప్చేసి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. మజెస్కో లిమిటెడ్ పీఈ సంస్థ థోమా బ్రావోకు యూఎస్ అనుబంధ సంస్థను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు మజెస్కో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. యూఎస్ మజెస్కోలో మజెస్కో లిమిటెడ్కు 74 శాతం వాటా ఉంది. ఈ సంస్థను 59.4 కోట్ల డాలర్లకు(రూ. 4455 కోట్లు) విక్రయించేందుకు థోమా బ్రావోతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి మజెస్కో రూ. 3154 కోట్లను అందుకోనుంది. ఈ నేపథ్యంలో మజెస్కో లిమిటెడ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. 406 సమీపంలో ఫ్రీజయ్యింది. -
25 లక్షల సీ-విటమిన్ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్) చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్డు లేని వారికీ ఉచిత రేషన్ చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి) -
మందుల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ) అధికారుల అవినీతి, అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మాస్పత్రులు దగా పడుతున్నాయి. రోగుల అవసరాలతో సంబంధం లేని, గడువు సమీపించిన నాసిరకం మందులు కొనుగోలు చేయడం, తీరా అవి ఎక్స్ఫైరీ అయినట్లు పేర్కొని గుట్టుచప్పుడు కాకుండా తిప్పి పంపడం ఇటీవల పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఖరీదైన మందుల సంగతేమో గానీ, బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు మందుల చీటీ పట్టుకుని ప్రైవేటు ఫార్మసీలను ఆశ్రƬంచాల్సిన దుస్థితి తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల మందులకు భారీగా బడ్జెట్కేటాయించినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రకాల మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులతో కొనుగోలు చేసినా.. రోగుల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేక పోతున్నారు. ఫలితంగా ఇన్పేషెంట్లతో పాటు అవుట్ పేషెంట్లకు మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కొరతపై ఉస్మానియా ఆస్పత్రి అధికారులు ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు లేఖ రాయడం గమనార్హం. మందుల సరఫరా బంద్ ఉస్మానియా ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 2 వేల మంది రోగులు వస్తుండగా, ఇన్పేషెంట్ వార్డుల్లో వేయి మందికి పైగా చికిత్స పొందుతుంటారు. చిన్న, పెద్దా కలిపి ఇక్కడ రోజుకు 150–200 చికిత్సలు జరుగుతుంటాయి. సర్జకల్ డిస్పోజల్స్, సర్జికల్ బ్లేడ్స్, గ్లౌజులు సహా ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ ఫిలిమ్స్ సహా హెచ్ఐవీ రాపిడ్ కిట్స్ అందుబాటులో లేకపోవడంతో రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. అంతేకాదు డిసైక్లోఫెనిక్ సోడియం 50 ఎంజీ, ఎల్పీఎం 4 ఎంజీ, అజింత్రో, స్టెరిలేన్ వాటర్ ఫర్ ఇంజక్షన్ 10 ఎంఎల్, టెటనస్ టాక్సెడ్, ల్యాక్టోసెల్ సొల్యూషన్, యాసిడ్ కార్బల్ 100 ఎంజీ, లైసోల్ 500ఎంజీ, పారసిటమాల్ 100 ఎంజీ, సోడియం హైడ్రోక్లోరైడ్, కెటమిన్ 50ఎంజీ, డోపమిన్ 200 ఎంజీ, హెపటైటీస్–బి, హిమోగ్లోబిన్ సహా మొత్తం 120 రకాల మందులకు ఇరువై రోజుల క్రితమే టీఎస్ఎంఐడీసీకి ఇండెంట్ పంపారు. కానీ ఇప్పటి దాకా ఆయా మందులు సరఫరా చేయలేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది మధుమేహులు వస్తుంటారు. టీఎస్ఎంఐడీసీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో వారంతా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఒక్కో ఇంజక్షన్కు రూ.150 వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని కొనుగోలు చేసే శక్తి లేక మధుమేహులు తరచూ ఆందోళనకు దిగుతుండటం గమనార్హం. ఇలా ఒక్క ఉస్మానియాలోనే కాదు గాంధీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అవసరాలకు భిన్నంగా కొనుగోళ్లు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఆస్పత్రులు, రోగుల అవసరాలతో సంబంధం లేకుండా ఇతర మందులు కొనుగోలు చేస్తుండడం, వినియోగం లేక ఏళ్ల తరబడి స్టోర్స్లోనే మగ్గిపోతుండడం, తీరా గడువు ముగియడంతో గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. సర్జరీలు చేసే ఆస్పత్రులకు సరఫరా చేసే ‘ట్రమడాల్’ వంటి పెయిన్ కిల్లర్ మందులను అవసరం లేకపోయినా ఏరియా ఆస్పత్రులకు సరఫరా చేయడం తెలిసిందే. ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ తర్వాత పారసిటమాల్కు బదులు పిల్లలకు ట్రమడాల్ ఇవ్వడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం, ఆ సంస్థపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ పరిశీలిస్తే మందుల సరఫరా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలోని అన్ని ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం మందుల కోసం కేటాయించిన బడ్జెట్లో 80 శాతం నిధులు టీఎస్ఎంఐడీసికి, 20 శాతం నిధులు ఆస్పత్రికి కేటాయిస్తుంది. ఇలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ఏటా రూ.30 కోట్లకు పైగా కేటాయిస్తుంది. టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయని మందులను ఆస్పత్రి వైద్యులే 20 శాతం వాటా నుంచి కొనుగోలు చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీజన్లో రోజు వారి సగటు ఓపీ మూడు వేలకుపైగా నమోదైంది. అంచనాలకు మించి రోగులు రావడంతో మందుల కొరత తీవ్రమైంది. ఆరోగ్యశ్రీ, నిధులతో కొన్ని రకాల మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ రోగుల పూర్తిస్థాయి అవసరాలు తీర్చలేక పోతున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్ మేనేజ్మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ రోగుల కోసం కొనుగోలు చేసిన మందులను సాధారణ రోగులకు సర్ధుబాటు చేయాల్సి వస్తోందని ఆయా ఆస్పత్రుల అధికారులు వాపోతున్నారు. -
జనం నెత్తిన రుద్దేస్తున్నారు..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాశిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. తక్కువ ధరకు లభించే జనరిక్ మెడిసిన్, గడువు ముగిసిన ఖరీదైన బ్రాండెడ్ మందులకు కొత్తగా లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. వీటిని వేసుకున్న వారికి వ్యాధి తగ్గక పోగా మరింత ముదురుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్సేట్ మెడికల్ దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి గడువు ముగిసిన, నాశిరకం మందులను గుర్తించి, విక్రయదారులపై కేసులు నమోదు చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతుండటతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేన్సర్, పక్షవాతం, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్పేషెంట్లకు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగుల బంధువులు ఎవరైనా దీనిని గుర్తించి, ఫిర్యాదు చేయాలని భావించి డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఫోన్ చేస్తే...వారిలో పలువరు అసలు ఫోన్లే ఎత్తడం లేదు. డీసీఏ అధికారుల వైఖరితో విసుగుచెందిన రోగులు, వారి బంధువులు ఏసీబీని ఆశ్రయిస్తుండటం విశేషం. ఇటీవల డీఐ లక్ష్మిఓ రక్తనిధి కేంద్రం నుంచి నగలరూపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన విషయం తెలిసిందే. తనిఖీలకు వచ్చి... రాష్ట్ర వ్యాప్తంగా 500పైగా మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. 27వేలకు పైగా హోల్సేల్, రిటైల్ దుఖానాలు కొనసాగుతున్నాయి. ఇందులో 80 శాతం కంపెనీలు, హో ల్సేల్ దుఖానాలు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. వాస్తవానికి తుది గడువుకు మూడు నెలల ముందే స్టోర్లో నిల్వ ఉన్న మందులను గుర్తించి ఆయా ఔషధ కంపెనీలకు తిప్పి పంపాల్సి ఉంది. అయితే నగరంలోని కొన్ని ఆస్పత్రుల్లోని మందుల దుఖానాలు ఇందుకు విరుద్ధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అమాయక ఇన్పేషంట్లకు గుట్టుగా ఈ మందులను వాడుతున్నట్లు తెలిసింది. ఓపీ రోగులు కొనుగోలు చేసిన మందులు బయట ఎవరైనా గుర్తించే ప్రమాదం ఉండటంతో ఇన్పేషెంట్లకే వాటిని వినియోగిస్తున్నారు. దీంతో సర్జరీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నయం కావాల్సి గాయం వారం పదిరోజులైనా మానకపోవడం, వ్యాధి తీవ్రత తగ్గక పోవడానికి ఇదే కారణమని పలువురు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి ఆయా దుఖానాల్లో తనిఖీలు నిర్వహించిగడువు ముగిసిన, సమీపించిన మందులను ముందే గుర్తించి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే తనిఖీలకు వెళ్తున్న ఇన్స్పెక్టర్లలో పలువురుఫార్మసీల ముఖం చూడకుండానే బయటికి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. తనిఖీలు ముమ్మరం చేశాం నాశీరకం మందులు అమ్ముతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీలు, రిటైల్, హోల్సేల్ దుఖానాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యేంగా దృష్టిసారించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నాశిరకం మందుల విక్రయాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. తనిఖీల విషయంలో డీఐలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో 20,200 దుఖానాల్లో తనిఖీలు నిర్వహించి, 5700 ఉల్లంఘన లు గుర్తించాం. 20 నాశిరకం మందులను గుర్తించాం. లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్న 64 దుఖానాలను సీజ్ చేశాం. వీరిలో 24 మందికి ఇప్పటికే శిక్షలు కూడా పడ్డాయి. 2019లో ఇప్పటి వరకు 13370 తనిఖీలు నిర్వ హించాం. 4780 ఉల్లంఘనలు, తొమ్మిది నాశిరకం మందులను గుర్తించి ఆ మేరకు కేసులు నమోదు చేశాం. లైసెన్సులు లేకుండా మందులు అమ్ముతున్న 42 మందుల దుఖానాలను సీజ్ చేశాం. 32 మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. వీటిలో గడువు ముగిసిన మందులు నిల్వ చేయడం, కనీస అర్హత లేని నాన్ఫార్మసిస్ట్ మందులు విక్రయిస్తుండటం, మందులు కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించడం వంటి ఉల్లంఘనలే ఎక్కువగా ఉన్నాయి. –వెంకటేశ్వర్లు, జాయింట్ డైరెక్టర్, డీసీఏ -
మందుల దుకాణాల్లో మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లోని మందుల దుకాణాల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. ఒకే లైసెన్సుపై రెండు మూడు షాపులునిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధికధరలకు మందులు విక్రయిస్తున్నారు.మరోవైపు అనర్హులను ఫార్మాసిస్టులుగా నియమిస్తుండడంతో... వారు వైద్యుడొకటి రాస్తే బాధితులకు మరొకటి అంటగడుతున్నారు. ఎంఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు లేని వారికి స్వల్పకాలిక శిక్షణనిచ్చి మందులవిక్రయాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఒకే ఆస్పత్రి భవనంలో రెండు మూడు ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మందులకు బదులు జనరిక్ మెడిసిన్అమ్ముతున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లోనే కాదు... నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతను పరిశీలించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ పరోక్షంగా వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.తాజాగా బోయిన్పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్బ్యాంక్ నిర్వాహకురాలు ఏసీబీని ఆశ్రయించడానికి ఇదే కారణమని తెలిసింది. తనిఖీలు... మామూళ్లు గ్రేటర్లో 8,500లకు పైగా మందుల దుకాణాలు ఉండగా... 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు (డీఐ) ఉన్నారు. తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పరీక్షలు, కొత్త దుకాణాలకు లైసెన్సుల జారీ, పాత వాటికి రెన్యూవల్ తదితర పనుల కోసం ఒక్కో డీఐకి 400–500 దుకాణాలు కేటాయించారు. వీరు ఎప్పటికప్పుడు ఆయా దుకాణాలను తనిఖీ చేసి, మందుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీల పేరుతో అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం డీఐలకు పరిపాటిగా మారింది. గతంతో పోలిస్తే శివారు ప్రాంతాలు విస్తరించాయి. బోడుప్పల్, బీఎన్రెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, కర్మన్ఘాట్, నందనవనం, మీర్పేట్, చర్లపల్లి, నారపల్లి, జీడిమెట్ల, సూరారం, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ తదితర బస్తీల్లో ఇప్పటికీ ఆర్ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సేవలతో పోలిస్తే మందుల విక్రయాల్లోనే భారీగా లాభాలు వస్తుండటంతో.. ఎలాంటి అనుమతులు పొందకుండానే వారు ఆయా క్లినిక్స్లోనే మందులు విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్తో పాటు గర్భవిచ్ఛిత్తి మందులనూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బేగంపేట సమీపంలోని ఓ యువతి గర్భ విచ్ఛిత్తి మందులు వాడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. స్వదేశీయే విదేశీ... గ్రేటర్ పరిధిలో 20 కార్పొరేట్ ఆస్పత్రులు, 85 పాలీక్లినిక్స్, 228 డయాగ్నోస్టిక్స్, 234 దంత ఆస్పత్రులు, 372 ఇరవై పడకల ఆస్పత్రులు ఉన్నాయి. 21–50 పడకల ఆస్పత్రులు 88 ఉండగా.. 101–200 పడకల ఆస్పత్రులు 94, 200కు పైగా పడకల ఆస్పత్రులు 13 ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లోకి ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లున్న రోగులు వస్తే చాలు అందినకాడికి దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఆయా పేషెంట్లకు తక్కువ ఖరీదుతో కూడిన జనరిక్ మందులిచ్చి ఎక్కువ ధరున్న బ్రాండెడ్ మందులు ఇచ్చినట్లు బిల్లులు సమర్పిస్తున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్స్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టంట్లను అమర్చుతున్నాయి. గుండె రక్తనాళాలల లోపల వీటిని అమర్చుతుండడంతో రోగులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు? దాని ఖరీదు ఎంత? రోగి ఎంత చెల్లించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా యథేచ్ఛగా ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డీసీఏలో వసూల్ రాజాలు ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఆ కంపెనీ తయారు చేసిన మందులను మార్కెట్లోకి విడుదల చేయాలన్నా, చివరకు స్వచ్ఛందంగా ఓ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ఓ మెడికల్ షాపు పెట్టుకోవాలన్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లైసెన్సు తప్పనిసరి. ఇదే అదనుగా డీసీఏలోని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్లడ్బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సి వస్తోంది. మెడికల్ షాపునకు (హోల్సేల్, రిటైల్) రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ను ఇన్వార్డులో సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి టేబుల్కు చేరుకోవాలంటే వారికి ముందే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. తనిఖీకి వచ్చే ఇన్స్పెక్టర్కు అడిగినంత అందించాల్సిందే. లేదంటే వివిధ రకాల లోపాల పేరుతో సవాలక్ష కొర్రీలు పెట్టి లైసెన్స్ జారీ కాకుండా అడ్డుకుంటారు. పాతవాటిని పునరుద్ధరించరు. నేరుగా దరఖాస్తు చేయడం కంటే కన్సల్టెంట్ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇందుకు డీసీఏ అధికారులే ఓ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడితో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 8,500 గ్రేటర్లోని మందుల దుకాణాలు డీఐ టార్గెట్స్:దిల్సుఖ్నగర్, మలక్పేటకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) మందుల దుకాణాలు, రక్తనిధి కేంద్రాలకుప్రత్యేకంగా టార్గెట్లు విధించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితేనే ఆయా ప్రాంతాల్లోనినిర్వాహకులంతా హడలిపోతున్నారు. -
మందుల్లేవ్
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు ఖాళీ అయిపోయాయి. ఖరీదైన మందుల సంగతేమో కానీ సాధారణ బీపీ, షుగర్, బి–కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మాత్రలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. ఆస్పత్రిలో మందులు అయిపోయాయని, రోగులకు అవసరమైన మందులను వెంటనే పంపించాల్సిందిగా ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగం.. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఎంఐడీసీ)కి మూడుసార్లు ఇండెంట్లు పంపినా ఎలాంటి స్పందనా లేదు. నెల రోజుల్లో మూడు సార్లు ఇండెంట్లు పంపితే.. ఇండెంట్ పంపిన ప్రతిసారి ‘సరఫరా లేదంటూ’ తిప్పపంపడం గమనార్హం. ఇది ఒక్క ఉస్మానియా లోనే కాదు ప్రతిష్టాత్మాక గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, పేట్లబురుజు, సుల్తాన్ బజార్, ఫీవర్, ఛాతి, మానసిక చికిత్సాలయాలతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. రోగుల అవసరాలతో సంబంధం లేకుండా మందులు కొనుగోలు చేయడం, తర్వాత ‘ఎక్సైఫైరీ’ పేరుతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా పారబోయడం పరిపాటిగా మారింది. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రి ఫార్మసీలో మందులు లేకపోవడంతో వైద్యుడు రాసిన చీటి పట్టుకుని రోగి బంధువులు ప్రైవేటు పార్మసీలను ఆశ్రయింయించే పరిస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ సర్జరీలు చేయించుకుని, డిశ్చార్జైన రోగులకు తర్వాత నెలవారి ఫాలోప్ మందులు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అక్కడ సగం మందులతోనే సరి.. ఇక వనస్థలిపురం, మలక్పేట్, కింగ్కోఠి, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి, లాలాపేట్ ఏరియా ఆస్పత్రుల్లో పరిస్థితి మరోలా ఉంది. ఒక్కో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యం ఉంటుంది. వాటిలో ఆర్థో, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు సైతం ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి మందుల కోసం ప్రతి మూడు నెలలకు ఓసారి రూ.3.5 లక్షల చొప్పున మంజూరు చేస్తుంది. 145 రకాల మందులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో 30–35 రకాలకు మించి దొరకడం లేదు. ఒక్కో గర్భిణికి 100 బికాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆస్పత్రికి ప్రతిరోజూ వంద మంది గర్భిణులు వస్తే ఒక్కొక్కరికి 30 గోళీల చొప్పున రోజుకు 3000 గోలీలు అవసరం. కానీ రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు లేకపోవడంతో పది రాస్తే.. ఐదు గోళీలు ఇచ్చి పంపుతున్నారు. బి–కాంప్లెక్స్, కాల్షియం, డయోనిల్, ఫోలిక్ యాసిడ్ వంటి సాధారణ మందులతో పాటు ‘ఐసాక్స్ సుఫ్రిన్ హెచ్సీఎల్’ ఇంజెక్షన్లు కూడా దొరకడం లేదు. రోగులే వీటిని సమకూర్చు కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల అంతర్గత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి, వాడుతున్నారు. బయట కొనుక్కోమన్నారు.. మాదాపూర్కు చెందిన రత్తమ్మ(40) దినసరి కూలీ. రెండు రోజుల క్రితం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయాలపాలైన రత్తమ్మను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మందులు లేవని చెప్పి వైద్యులు బయట నుంచి మందులు తెచ్చుకోమన్నారని రత్తమ్మకు సహాయకురాలుగా ఉన్న ఆమె కూతురు సుశీల పేర్కొంది. రూ.150 విలువ చేసే మందులను కొనుగోలు చేశానని తెలిపింది. మందులు లేవన్నారు.. నూర్ఖాన్బజార్కు చెందిన రెహనాబేగంకు చేతి రెక్కలు నొప్పిగా ఉండడంతో ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమెకు కుమారుడైన హైదర్ సహాయకుడిగా ఉన్నాడు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో రెహనాబేగం వైద్యానికి కావాల్సిన మందులు లేవని వైద్యులు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పారు. దీంతో అతడు ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ షాపులో కొనుగోలు చేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో సైతం మందులు లేకపోవడం శోచనీయం. అత్యవసరం మేరకు కొంటున్నాం ఉస్మానియా ఆస్పత్రిలో అత్యవసర మందులు సరఫరా పూర్తిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ద్వారా జరుగుతుంది. అన్ని విభాగాల విభాగాధిపతులను సంప్రదించి వారి సూచనల మేరకు కమిటీ అత్యవసర మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. టీఎస్ఎంఐడీసీ ద్వారా సరఫరా కాని మందులను ఆయా విభాగాధిపతుల సిఫార్సు మేరకు ఆస్పత్రి అంతర్గత నిధుల ద్వారా సమకూర్చుతున్నాం. కొత్తగా అవసరమైతే, ఆ విభాగం కమిటీ సూచనతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పిస్తు న్నాం. – నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రిసూపరింటిండెంట్ -
జ్వరానికీ మాత్రల్లేవు!
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంతో వచ్చే బాధితులకు మూడు రోజులకు పది పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక్కో బాధితులకు ఆరు మాత్రలే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే స్టాకు లేదంటున్నారు. ఇక రెండు నెలలుగా పారాసిటమాల్ మాత్రలు సరఫరా లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది బయటి మెడికల్ దుకాణాల్లో రూ.10 లక్షలు అప్పుచేసి మాత్రలు కొన్నారు. బాకీ తీర్చమని దుకాణ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో హెచ్డీఎస్ నిధుల నుంచి రూ.7 లక్షలు చెల్లించారు.’’ చిత్తూరు అర్బన్: ఇదొక్కటేకాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ప్రభుత్వం పారాసిటమాల్ మాత్రలను సరఫరానే చేయలేదు. ఫలితంగా రోజుకు సర్కారీ ఆస్పత్రికి వచ్చే చాలామంది జ్వరబాధితులకు పారాసిటమాల్ మాత్రలు లేవని చెబుతున్న సిబ్బంది రోగులనుతిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో కలిపి రోజుకు జ్వరంతో వచ్చేవారి సంఖ్య పది వేల వరకు ఉంటుంది. ఒక్కసారి జ్వరంతో వచ్చే బాధితులను పరిశీలించిన వైద్యులు సూదిమందు వేయడంతో పాటు పది పారాసిటమాల్ మాత్రలను రాసిస్తారు. వీటిని మూడు రోజుల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు రోజులకే మాత్రలు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి మాత్రలు, సూది మందులు, సిరప్లాంటి వాటిని రాష్ట్ర వైద్యశాఖ సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కు టెండర్లను అప్పగించి ప్రతి జిల్లాకు కావాల్సిన మందులను తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్కు (సీడీఎస్) పంపిణీ చేస్తారు. జిల్లా నుంచి ప్రతి వైద్యశాలకు ఏయే మందులు కావాలని ఈ–ఔషధి ద్వారా ఆన్లైన్లో అడిగితే వాటిని తిరుపతిలోని డ్రగ్స్టోర్ నుంచి తీసుకోవచ్చు. సంవత్సరంలో నాలుగుసార్లు మందుల జాబితాను ఈ–ఔషధి ద్వారా తీసుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు మూడు నెలలకు ఓసారి మందుల జాబితాను ఆన్లైన్లో ఉంచి సీడీఎస్ నుంచి వీటిని తీసుకుంటారు. జిల్లాకు జనవరిలో పారాసిటమాల్ మాత్రలు ఇచ్చిన ప్రభుత్వం దాని తరువాత ఇప్పటివరకు సరఫరాను ఇవ్వలేదు. గతనెల సీడీఎస్లో మిగిలిన మాత్రలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సర్దేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క పారాసిటమాల్ మాత్ర సీడీఎస్లో నిల్వలేకపోవడం ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనీసం నెల రోజులకు పారాసెట్మాల్ మాత్రలను జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో రిజర్వులో ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు జిల్లాకు 60 లక్షల పారాసిటమాల్ మాత్రల కొరత ఉంది. కొనుగోలుకు నిధులేవీ? ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొనుగోలుకు డీసెంట్రలైజ్డ్ లోక్ పర్చేస్ డ్రగ్స్ బడ్జెట్ను ప్రతి మూడు నెలలకోసారి విడుదలచేయాలి. ఒక్కో ఆస్పత్రికి 10 శాతం నిధులను ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. వీటితో అవసరమైన మందులను కొనుగోలు చేసుకుంటూ రోగులకు ఇబ్బందిలేకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. అయితే ఏడాది కాలంగా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలాగైతే కష్టమని ప్రశ్నిస్తున్న వైద్యులకు ఓ ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో అప్పులు చేయమని చెబుతున్నారు. విధిలేక ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు రూ.లక్షల్లో అప్పులు చేశాయి. -
విటమిన్ ఏది?
నార్నూర్(ఆసిఫాబాద్): చిన్నారులకు భవిష్యత్లో ఎలాంటి కంటి చూపు సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉచితంగా విటమిన్ ఏ అందిస్తోంది. కానీ గత ఆరు నెలలుగా జిల్లాలో ఈ మందు సరఫరా నిలిచిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 126 సబ్సెంటర్లు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 05 అర్బన్ హెల్త్సెంటర్లు, 126 సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 9 నెలల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 30వేల మంది ఉన్నారు. చిన్నారులకు ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ద్వారా ఇంటింటికి లేదా సబ్సెంటర్లలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏ విటమిన్ సిరప్ను ఒక టీ స్పూన్ వేయాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా ఏ విటమిన్ సిరప్ లేని కారణంగా చిన్నారులకు వేయడం లేదు. ఆరు నెలలుగా నిలిచిన సరఫరా.. చిన్నారులకు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో ఏ విటమిన్ సిరప్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. కానీ ఆరు నెలలుగా సబ్ సెంటర్లకు ఏ విటమిన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులు రేచీకటి బారిన పడే అవకాశం ఉంది ఆరు నెలలకో డోసు.. తొమ్మిది నెలలు నిండిన చిన్నారులకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏ విటమిన్ సిరప్ను 5 ఏళ్ల చిన్నారుల వరకు అందిస్తారు. ఆరు నెలలుగా సరఫరా లేకపోవడంతో ఒక డోస్ సమయం ముగిసి రెండో డోస్ వచ్చే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు ఏ విటమిన్ సరఫరా కావడం లేదు. 100 మిల్లీలీటర్ల ఏ విటమిన్ బాటిల్ను 2 ఎంఎల్ చొప్పున 50 మంది చిన్నారులకు ఏఎన్ఎంలు అందిస్తారు. బయట దొరకని సిరప్ డబ్ల్యూహెచ్వో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఉచితంగా సరఫరా చేసే టీకాలు, సిరప్లు సకాలంలో జిల్లా స్థాయి అధికారులు తీసుకురాకుండా చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఏ విటమిన్ ఎక్కడా మార్కెట్లో లభించదు. దీంతో చిన్నారుల కంటిచూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏ విటమిన్ సిరప్ 9నెలల చిన్నారుల నుంచి 5 ఏళ్లలోను చిన్నారులకు ప్రతి ఆరు ఆరునెలలలకొకసారి తొమ్మది డోసులు వేయడంతో జీవితంలో వీరికి కంటి చూపునకు సంబందించిన సమస్యలు తలెత్తవు. ఇది పూర్తిగా చేప నూనెతో తయారు చేసిన ద్రావణం కాబట్టి ఇది మార్కెట్లో ఎక్కడ లభించదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సబ్సెంటర్లకు ఏ విటమిన్ సిరప్ను సరఫరా చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందుబాటులో ఉండేలా చూస్తాం విటమిన్ ఏ సిరప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ అన్ని పీహెచ్సీల నుంచి చిన్నారుల వివరాలతోపాటు ఇండెంట్ తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సరఫరా లేదు. ప్రభుత్వం నుంచి విటమిన్ ఏ సిరప్ రాగానే సబ్ సెంటర్లకు పంపిణీ చేస్తాం. – రాజీవ్రాజ్, జిల్లా వైద్యాధికారి ఆదిలాబాద్ -
మందు బిళ్లలకూదిక్కులేదు..!
విజయనగరం ఫోర్ట్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నరసమ్మ. ఈమెది నెల్లిమర్ల మండలం ఆత్మరాముని ఆగ్రహారం. నీరసంగా ఉందని కేంద్రాస్పత్రికి వచ్చింది. ఈమెను పరీక్షించిన వైద్యులు మల్టీవిటమిన్ మాత్రలు 30 రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆస్పత్రిలో ఉన్న ఫార్మసీ గది వద్దకు వెళితే అక్కడ సిబ్బంది మందులు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగింది. గంట్యాడ మండలానికి చెందిన పి. పాపమ్మ అనే వృద్ధురాలు నిద్రలేమితో బాధపడు తూ కేందాస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు అ ల్ప్రాజోలమ్ మందులు రాశారు. ఆ చీటీ పట్టుకుని ఫార్మసీ వద్దకు వెళితే మందులు లేవని చెప్పారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరుగింది. ఇది ఈ ఇద్దరి రోగులకు ఎదురైన అనుభవమే కాదు నిత్యం వందలాది మంది రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సర్కారీ ఆస్పత్రుల్లో మందుబిల్లలూ లేకపోవడంతో రోగులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు, సీహెచ్సీ, పీహెచ్సీల్లో కూడా మందుల కొరత వేధిస్తోందని రోగులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 68 పీహెచ్సీలు, 12 సీహెచ్సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. కేంద్రాస్పత్రిలో బీపీ వ్యాధికి వినియోగించే ఎటిన్లాల్ మాత్రలు, జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగించే పెంటాప్ మాత్రలు, గాయాలకు ఉపయోగించే సోప్రామైసిన్ మాత్రలు, నీరసానికి ఉపయోగించే మల్టీవిటమిన్ మాత్రలు, మానసిక రోగులకు ఉపయోగించే ఎమిట్రాపిన్, మందు బిళ్లలకూ దిక్కులేదు..! అల్ప్రాజోలమ్ తదితర మందులు లేవు. ప్రజారో గ్యానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెబుతు న్న చంద్రబాబు సర్కార్ మాటలకు చేతలకు పొం తన ఉండడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులంతా పేద, మధ్యతరగతి వర్గాలవారే. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో రోగాలు నమయ్యేం దుకు అవసరమైన మందులు దొరకకపోవడంతో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు మందుల దుకాణాలే దిక్కు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మందులు లేకపోవడంతో నిరుపేదలు సైతం ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరువల్లే ఆస్పత్రుల్లో మందుల కొరత నెలకొందని రోగులతో పాటు కొందరు వైద్యులు సైతం విమర్శిస్తున్నారు. మందుల కోసం వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఫార్మాసిస్టులు మదనపడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతా రామరాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మందుల కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదన్నారు. ఏవైనా మందులు లేకుంటే లోకల్గా కొనుగోలు చేసి అందిస్తామని చెప్పారు. -
ఫ్లిప్కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్తో మళ్లీ మన ముందుకు రాబోతుంది. ఈ సేల్లో భాగంగా మొబైల్స్, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, గేమింగ్ హార్డ్వేర్, ఆడియో యాక్ససరీస్పై పలు డీల్స్ను ప్రకటించింది. అయితే ఏఏ తేదీల్లో ఈ సేల్ను నిర్వహించనుందో మాత్రం ఫ్లిప్కార్ట్ వెల్లడించలేదు. గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్లో భాగంగా లెనోవో ఫ్యాబ్ 2పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. అదేవిధంగా లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ ధర 30 వేల రూపాయల నుంచి 22,999కు తగ్గించింది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్టాప్లపై నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్ను అందించనుంది. ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్స్ ల్యాప్టాప్లను ఈ వెబ్సైట్ లిస్టు చేసింది. అదనంగా హోమ్ యూజ్ ల్యాప్టాప్లు కూడా ఫ్లిప్కార్ట్ సేల్లో లిస్ట్ అయ్యాయి. వీటి ధర 11,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెల్ నుంచి బడ్జెట్ ల్యాప్టాప్లను 17,990 రూపాయలకు, లెనోవో నుంచి 18,990 రూపాయలకు అందిస్తుంది. ఈ సేల్లో భాగంగా గేమింగ్ ల్యాప్టాప్లను కూడా బెస్ట్ ధరల్లో అందుబాటులో ఉంచింది. గేమింగ్ ల్యాప్టాప్లపై ఎక్స్చేంజ్ కింద 12వేల రూపాయల తగ్గింపును ఇస్తుంది. ఆపిల్, శాంసంగ్, లెనోవో, మైక్రోమ్యాక్స్, ఐబాల్ వంటి బ్రాండుల టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ ఐప్యాడ్ మోడల్స్ ధర 24,900 రూపాయల నుంచి ప్రారంభమవనున్నాయి. ఐప్యాడ్ మోడల్స్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లెనోవో ట్యాబ్ 4 సిరీస్పై 25 శాతం వరకు డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తుంది. అదనంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3పై 10,500 రూపాయల డిస్కౌంట్ను అందిస్తుంది. -
పాప నోట్లో పుండ్లు... తగ్గేదెలా?
మా పాప వయసు ఆరేళ్లు. మొన్నీమధ్య గొంతునొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాం. పాప నోటిలోన, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. పాపకు గొంతులో ఇన్ఫెక్షన్లా కొంచెం ఎర్రబారింది. ఏమీ తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – వైదేహి, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేకరకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. గోడకున్న సున్నం తింటున్నాడు మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఇంట్లో పెచ్చుల్లా లేచిన సున్నాన్ని తింటున్నాడు. క్లాస్లో చాక్పీసులు కూడా తింటున్నాడని వాడి టీచర్ చెబుతున్నారు. వాడు తెల్లగా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ వయసులో ఉండాల్సినంత బరువు లేదు. మందులు వాడినా బరువు పెరగడం లేదు. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తెలియజేయండి. – సుధారాణి, టెక్కలి మీ అబ్బాయికి ఉన్న కండిషన్ను వైద్యపరిభాషలో పైకా అంటారు. అంటే... ఆహారంగా పరిగణించని నాన్–న్యూట్రిటివ్ వస్తువులను పదే పదే తినడం, ఆ అలవాటును దీర్ఘకాలం కొనసాగించడం అన్నమాట. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ప్లాస్టర్, బొగ్గు (చార్కోల్), మట్టి, బూడిద, పెయింట్, బలపాలు, చాక్పీసులు లాంటివి తింటుంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా రెండేళ్లలోపువారు తమ పరిసరాలను తెలుసుకోవాలనే ఆసక్తితో నాన్–న్యూట్రిటివ్ వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్ద పిల్లల్లోనూ ఇదే లక్షణం ఉంటే... అలాంటి కండిషన్ను తేలికగా తీసుకోకూడదు. ఈ కండిషన్ ఉన్నపిల్లల్లో చాలా సాధారణమైన సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన మానసిక రుగ్మతల వరకు ఉండే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినప్పటికీ సాధారణంగా... కుటుంబంలో సంబంధాలు సవ్యంగా లేకపోవడం, పిల్లలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కొన్ని మానసిక సమస్యలు, ఐరన్ లోపం, కడుపులో నులిపురుగుల వంటివి ఈ సమస్యకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పిల్లల్లో రక్తహీనత కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం. మీ అబ్బాయికి రక్తహీనత కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కంప్లీట్ బ్లడ్పిక్చర్తో పరీక్షతో పాటు, రక్తంలో లెడ్ పాళ్లు ఉన్నాయేమో అని పరీక్ష చేయించడం చాలా ప్రధానం. ఆహారం విషయానికి వస్తే మాంసాహారంలో కాలేయం, కోడిగుడ్లు, కూరగాయల్లో బీన్స్, సోయాబీన్, పప్పుధాన్యాలు, బ్రకోలీ, మస్టర్డ్, పాలకూర, రాగి వంటి వాటిల్లో ఐరన్ పాళ్లు ఎక్కువ. మీరు మీ అబ్బాయికి పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు కొద్దిగా కొవ్వుపాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం మంచిది. అదేవిధంగా విటమిన్–సి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. మీరు ఒకసారి మీ అబ్బాయికి కడుపులోని నులిపురుగులు పోవడానికి మందులు వాడటం కూడా అవసరం. మీరు మీ పిల్లల వైద్యనిపుణుణ్ణి సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు పాస్ పోసేటప్పుడు నొప్పి... మా బాబుకి పదేళ్లు. యూరిన్ పోసేటప్పుడు ఫ్రీగా కాకుండా కొంచెం, కొంచెంగా పోస్తుంటాడు. కొన్నిసార్లు పాస్ పోసేటప్పుడు నొప్పిగా ఉందంటాడు. డాక్టర్ను సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ ఉందని టాబ్లెట్స్ రాసిచ్చారు. అవి వాడినన్ని రోజులు తగ్గి, మళ్లీ మొదలవుతోంది. ఈ మధ్య సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తే తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. దయచేసి మా బాబు సమస్యకి పరిష్కారం తెలియజేయండి. – రియాజుద్దిన్, గుంటూరు మీరు చెప్పిన దాన్ని బట్టి్ట మీ బాబుకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కూడా తరుచుగా చూస్తుంటాం. ఇది అబ్బాయిల్లో ఒక శాతం ఉంటే అమ్మాయిల్లో 3–5 శాతం ఉంటుంది. అనేక కారణాల వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తు ఉండవచ్చు. ఉదా. సరైన విసర్జన అలవాట్లు లేకపోవడం (ఇంప్రాపర్ టాయిలెట్ ట్రెయినింగ్), బిగుతు దుస్తులు వంటి సాధారణ అంశాలు కాక.... యూరినరీ ట్రాక్ట్లో అబ్నార్మాలిటీస్, వాయిడింగ్ డిస్ ఫంక్షన్, వియు రిఫ్లక్స్, బ్లాడర్కు ఉండే న్యూరలాజికల్ సమస్యలు, యూరెథ్రల్ అబ్స్ట్రక్షన్, మలబద్ధకం వంటి రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల పిల్లల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుండవచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ పరీక్షలతో పాటు కెయుబి, అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ అనే టెస్ట్లు చేయించడం చాలా ప్రధానం. ఈ పరీక్షలు చెయ్యడం వల్ల ఎనటమికల్ సమస్యలేమయినా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి యూరాలజిస్టును కలిసి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పరి పరిశోధన
అన్ని మందులు ఒక్కటి చేసే త్రీడీ ప్రింటర్.. బీపీకి ఒక ట్యాబ్లెట.. షుగర్ ఉంటే ఇంకోటి. ఇతర జబ్బులకు మరిన్ని ట్యాబ్లెట్లు. ఈ కాలంలో కొంతమందికి ఈ బాధ తప్పనిసరి అయిపోయింది. కానీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పుణ్యమా అని త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. రకరకాల మందులన్నింటినీ మన అవసరాలకు తగ్గట్టుగా ఒకే ట్యాబ్లెట్లోకి చేర్చి అందించేందుకు అమెరికాకు చెందిన విటే ఇండస్ట్రీస్ అనే స్టార్టప్ ఓ వినూత్న యంత్రాన్ని సిద్ధం చేసింది. ఈ యంత్రం చిటికెలో వేర్వేరు మందులను ఒక క్యాప్సూల్ రూపంలోకి చేర్చి అందిస్తాయి. ‘ద ఆటో కాంపౌండర్’ అని పిలుస్తున్న ఈ యంత్రం కారణంగా అవసరం లేకపోయినా అధిక మోతాదులో మందులు మింగాల్సిన పని తప్పుతుందని కంపెనీ సీఈవో జియానీ సిననన్ సింగ్ తెలిపారు. ఒక్కో మాత్ర తయారు చేసేందుకు ఈ యంత్రం పది నిమిషాలు మాత్రమే తీసుకుంటుందని, కేవలం ఏ మందులు ఎంత మోతాదులో ఇవ్వాలో కంప్యూటర్ ద్వారా చెబితే చాలని వివరించారు. సాధారణంగా వాడే మందులతో కూడిన పెట్టెల నుంచి తీసుకుని క్యాప్సూల్ను ముద్రించడం మొదలైపోతుందన్నారు. ప్రింటింగ్ పూర్తయిన ప్రతిసారి యంత్రం తనంతట తానే మొత్తం శుభ్రం చేసుకుంటుంది కాబట్టి దుష్ప్రభావాలకు అవకాశమూ తక్కువని వివరించారు. ఈ యంత్రం ఖరీదు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల వరకూ ఉంటుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ యంత్రాన్ని కొన్ని చోట్ల పరీక్షిస్తామని, ఆ తరువాత అవసరమైన మార్పులు చేర్పులు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సింగ్ తెలిపారు. కేన్సర్పై యుద్ధానికి శుక్రకణాలు! ప్రాణాంతక కేన్సర్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు తాజాగా శుక్రకణాలపై దష్టి పెట్టారు. గర్భాశయ ముఖద్వారా కేన్సర్ చికిత్సకు వాడే మందులను సమర్థంగా చేర్చేందుకు జర్మనీకి చెందిన లెబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ శాస్త్రవేత్తలు వీటిపై ప్రయోగాలు చేపట్టారు. అయస్కాంతాల ద్వారా శుక్రకణాలను హైజాక్ చేయడం.. ఆ తరువాత వాటిని కేన్సర్ కణితులు ఉన్నచోటికి మందులు సరఫరా చేయగల మాధ్యమంగా వాడుకోవడం ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం. డోక్సోరోబిన్ అనే మందుతో జరిపిన ప్రయోగాల్లో శుక్రకణాలు కేవలం మూడు రోజుల్లో దాదాపు 87 శాతం కేన్సర్ కణాలను నాశనం చేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హైఫింగ్ షూ తెలిపారు. శుక్రకణాల త్వచంలో మందును నిక్షిప్తం చేయగలగడం, తోకద్వారా కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం ఉండటం, కణంతో కలిసిపోగల లక్షణం ఉండటం వల్ల మందు సక్రమంగా వాడే అవకాశాలు పెరగడం శుక్రకణాలను ఎంచుకునేందుకు ఉన్న మూడు కారణాలని వివరించారు. అయితే ప్రస్తుతం తాము పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు జరిపామని, వాస్తవ పరిస్థితుల్లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందన్నది పరిశీలించాల్సి ఉందని షూ వివరించారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ నానో జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
విక్స్ యాక్షన్, డీకోల్డ్లపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు నిషేధం ఎత్తేసిన విక్స్ యాక్షన్ 500, డీకోల్డ్ లాంటి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) మందులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ)కు అప్పగించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. కోరెక్స్ దగ్గు మందు, క్రోసిన్ కోల్డ్, విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా, డీకోల్డ్, సారిడాన్, అస్కోరిల్, అలెక్స్ దగ్గు మందు, ఫెన్సెడిల్ దగ్గు మందు, గ్లెకోడిన్ దగ్గు మందు లాంటి ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఎఫ్డీసీల వాడకంతో మనుషులు, జంతువులకు ముప్పు ఉందంటూ కేంద్రం వాటిని 2016లో నిషేధించగా,డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది.