-
India's T20 World Cup 2024 Victory: టీమిండియా ఘన విజయంతో దేశవ్యాప్తంగా అంబరానంటిన అభిమానుల సంబురాలు (ఫొటోలు)
-
ICC: టాప్ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్ వన్ ఎవరంటే?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానం కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న ఈ ముంబై క్రికెటర్ రెండో స్థానానికి పడిపోయాడు.గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య కేవలం రెండు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.ఆరంభంలో తడ‘బ్యా’టు కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ పరుగులు రాబట్టలేక సతమతమయ్యాడు. ఆ తర్వాత అమెరికా(50 నాటౌట్), అఫ్గనిస్తాన్(28 బంతుల్లో 53) జట్లపై వరుసగా హాఫ్ సెంచరీలతో మెరిశాడు.ఇక వరల్డ్కప్ తాజా ఎడిషన్లో 33 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 139.25 స్ట్రైక్రేటుతో 149 పరుగులు చేశాడు.అద్భుత ప్రదర్శనమరోవైపు.. 30 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రవిస్ హెడ్ టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్-8 మ్యాచ్లో టీమిండియాపై అర్థ శతకం(43 బంతుల్లో 76)తో దుమ్ములేపాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి ఓవరాల్గా సగటు 42.50, స్ట్రైక్రేటు 158.38తో 255 పరుగులు సాధించాడు.ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ టోర్నీలో సెమీస్ చేరగా.. ఆస్ట్రేలియా సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.ఐసీసీ టీ20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్- టాప్-5 బ్యాటర్లు వీరే1. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 844 రేటింగ్ పాయింట్లు2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 842 రేటింగ్ పాయింట్లు3. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 816 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 755 రేటింగ్ పాయింట్లు5. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 746 రేటింగ్ పాయింట్లు. -
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
-
T20 World Cup 2024 Super 8: అఫ్గాన్పై అలవోకగా...
టి20 ప్రపంచ కప్ ‘సూపర్–8’ దశలో భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్ చక్కటి బౌలింగ్తో టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా ఆపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. ఈ ఫార్మాట్లో తన నంబర్వన్ హోదాకు న్యాయం చేస్తూ, తనేంటూ నిరూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్గాన్ టీమ్ ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. టీమిండియా పదునైన బౌలింగ్ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ను సమర్పించుకుంది. ఇక మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్తో శనివారం భారత్ తర్వాతి సమరానికి సిద్ధమైంది. బ్రిడ్జ్టౌన్: వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరే దిశగా భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. సూపర్–8 గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. రషీద్ ఖాన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. బుమ్రా (3/7), అర్‡్షదీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కీలక భాగస్వామ్యం... ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 8; 1 ఫోర్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రషీద్ రెండు వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. నబీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో జోరు ప్రదర్శించిన రిషభ్ పంత్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోగా...రషీద్ తర్వాతి ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్తో స్కోరు వేగంగా సాగింది. రషీద్ ఓవర్లో సూర్య ఫోర్, సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో మరో ఎండ్లో శివమ్ దూబే (7 బంతుల్లో 10; 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో సూర్యకు పాండ్యా జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు మెరుగైన స్థితికి చేరింది. నూర్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 6 కొట్టగా... ఫజల్ ఓవర్లో సూర్య వరుసగా 6, 4 బాది 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను అవుట్ కాగా, మరుసటి ఓవర్లో పాండ్యా ఆట ముగిసింది. జడేజా (5 బంతుల్లో 7; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (6 బంతుల్లో 12; 2 ఫోర్లు) కీలక పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో జట్టు 79 పరుగులు చేయగా, తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. మరోవైపు గురువారం మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్కు నివాళిగా మన ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా తొలి ఓవర్లో అనవసర షాట్కు ప్రయత్నించి గుర్బాజ్ (11; 1 ఫోర్, 1 సిక్స్) అవుట్ కావడంతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. ఎవరు కూడా భారత బౌలింగ్ ముందు పట్టుదలగా నిలవలేకపోయారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ వనరులు ఉన్నా ...ఎప్పటిలాగే బ్యాటర్ల వైఫల్యం దెబ్బ తీసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్ 8; కోహ్లి (సి) నబీ (బి) రషీద్ 24; పంత్ (ఎల్బీ) (బి) రషీద్ 20; సూర్యకుమార్ (సి) నబీ (బి) ఫజల్ 53; దూబే (ఎల్బీ) (బి) రషీద్ 10; పాండ్యా (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32; జడేజా (సి) గుల్బదిన్ (బి) ఫజల్ 7; అక్షర్ (రనౌట్) 12; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–11, 2–54, 3–62, 4–90, 5–150, 6–159, 7–165, 8–181. బౌలింగ్: ఫజల్ హక్ 4–0–33–3, నబీ 3–0–24–0, నవీన్ ఉల్ హక్ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–26–3, నూర్ అహ్మద్ 3–0–30–0, అజ్మతుల్లా 2–0–23–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పంత్ (బి) బుమ్రా 11; హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8; గుల్బదిన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17; అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26; నజీబుల్లా (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 19; నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; రషీద్ (సి) జడేజా (బి) అర్ష్ దీప్ 2; నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; నవీన్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 0; ఫజల్హక్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–23, 4–67, 5–71, 6–102, 7–114, 8–121, 9–121, 10–134. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–36–3, బుమ్రా 4–1–7–3, అక్షర్ పటేల్ 3–1–15–1, హార్దిక్ పాండ్యా 2–0–13–0, కుల్దీప్ 4–0–32–2, జడేజా 3–0–20–1. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా X బంగ్లాదేశ్వేదిక: నార్త్సౌండ్; ఉదయం గం. 6 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికావేదిక: గ్రాస్ఐలెట్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
వరల్డ్ నంబర్ వన్గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్.. సుమారు గత రెండేళ్లుగా టీ20 ఫార్మాట్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టు కెప్టెన్గానూ వ్యవహరించి పలు సిరీస్లు గెలిచాడు కూడా!అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు ఈ ముంబైకర్. అమెరికా వేదికగా జరిగిన లీగ్ దశలో మూడు మ్యాచ్లలో కలిపి సూర్యకుమార్ యాదవ్ కేవలం 59 పరుగులు చేశాడు.తొలుత ఐర్లాండ్తో మ్యాచ్లో రెండు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పాకిస్తాన్పై ఏడు పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో సూర్య బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో అమెరికాతో మ్యాచ్లో బ్యాట్ ఝులిపించిన స్కై.. 49 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి సూపర్-8కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా తదుపరి దశకు సిద్ధమవుతున్న వేళ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు.ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘రెండేళ్లుగా వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉండి.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలుగుతూ.. వికెట్కు అనుగుణంగా తనను తాను మలచుకోగల ఆటగాడు.. బ్యాట్స్మన్షిప్ చూపగలడు.నేను కూడా అదే ట్రై చేస్తున్నా. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు బౌలర్లు మన గేమ్ను రీడ్ చేస్తూ.. అద్భుతంగా బౌలింగ్ చేయగా.. పిచ్ కూడా వారికి అనుకూలిస్తే మనమేమీ చేయలేకపోవచ్చు.అలాంటపుడు మనం మరింత జాగ్రత్తగా.. తెలివిగా ఆడాలి. అయినప్పటికీ ఇన్నింగ్స్ పొడిగించుకునే అవకాశం దొరకకపోవచ్చు. పరిస్థితికి తగ్గట్లుగా మనం మారిపోవాలి.అంతేకాదు.. అపుడు మనతో పాటు క్రీజులో ఉన్న భాగస్వామితోనూ సరైన సమన్వయం ఉండాలి. పరస్పర అవగాహనతో పరుగులు రాబట్టడమే ధ్యేయంగా ముందుకు సాగాలి.నిజానికి న్యూయార్క్లో ఇదే తొలిసారి ఆడటం. అక్కడి పిచ్ కాస్త భిన్నంగా ఉంది. బ్యాటర్లకు సవాలుగా పరిణమించింది. అయితే, వెస్టిండీస్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు.అక్కడ ఆడిన అనుభవం ఉంది. న్యూయార్క్ కంటే ఇక్కడ మెరుగ్గానే బ్యాటింగ్ చేస్తామనే నమ్మకం ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.సూపర్-8 దశలో తప్పకుండా బ్యాట్ ఝులిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా గ్రూప్-1లో ఉన్న టీమిండియా జూన్ 20న అఫ్గనిస్తాన్తో సూపర్-8లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
కోహ్లితో పరిచయం లేదు.. వికెట్ తీసినందుకు ఏమన్నాడంటే!
తనకు ఇష్టమైన రెండు రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. తన కెరీర్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని.. అంతా త్వరత్వరగా జరిగిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.ఏదేమైనా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం భావోద్వేగ క్షణంగా మిగిలిపోతుందని సౌరభ్ నేత్రావల్కర్ ఎమోషనల్ అయ్యాడు. కాగా భారత్కు చెందిన నేత్రావల్కర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిఅండర్-19 ప్రపంచకప్లోనూ యువ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. సీనియర్ జట్టులో చోటు దక్కకకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఒరాకిల్లో ఉద్యోగం సంపాదించిన నేత్రావల్కర్.. ప్రస్తుతం అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్-2024 బరిలో దిగాడు.విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్లో విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. రోహిత్ శర్మ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తన తొలి టీ20 ప్రపంచకప్లోనే రెండు బిగ్ వికెట్లు తీసి మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.అయితే, ఈ మ్యాచ్లో టీమిండియాతో మ్యాచ్లో అమెరికా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే కెనడా, పాకిస్తాన్లపై విజయాలతో గ్రూప్-ఏ సెకండ్ టాపర్గా సూపర్-8కు చేరువైంది.ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ అనంతరం తన భావాలు పంచుకున్న సౌరభ్ నేత్రావల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండు రంగాల్లో కెరీర్ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.విరాట్తో నాకు అంతగా పరిచయం లేదుఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇక గత రెండు మ్యాచ్లు(పాక్, భారత్) అత్యంత కీలకమైనవి. విరాట్ వికెట్ తీయడం ఓ ఎమోషనల్ మూమెంట్.అతడికి బౌలింగ్ చేస్తున్నపుడు ఆఫ్ స్టంప్ ఎగురగొట్టాలని భావించా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి వికెట్ తీశా. అండర్-15, అండర్-17 డేస్ నుంచే నాకు సూర్యకుమార్ యాదవ్ తెలుసు.మేము కలిసినపుడు నాటి డ్రెసింగ్రూం వాతావరణం గురించి చర్చించుకుంటాం. అయితే, విరాట్తో నాకు అంతగా పరిచయం లేదు కానీ.. అతడి వికెట్ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’’ అని సౌరభ్ నేత్రావల్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్! View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్!
సౌరభ్ నేత్రావల్కర్.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరు. ఈ రైటార్మ్ పేసర్ అండర్-19 కప్-2010 ఎడిషన్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు.దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన నేత్రావల్కర్.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ముంబైకర్ రోహిత్ శర్మకు జూనియర్. అదే విధంగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకున్నాడు.అంతేకాదు.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో.. భారత జట్టు ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు బౌలింగ్ చేసిన ఘనత కూడా సౌరభ్ నేత్రావల్కర్ సొంతం.ప్రత్యర్థిగా ఉన్న టీమ్లో ధోని, కోహ్లిముంబై తరఫున రంజీలు ఆడిన నేత్రావల్కర్.. ఎన్సీఏలో యువరాజ్ సింగ్ వికెట్ పడగొట్టడం ద్వారా 2009లో వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ పేస్బౌలర్.. యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలతో కలిసి డ్రెస్సింగ్రూం పంచుకున్నాడు.అప్పుడు వీరి జట్టుకు ప్రత్యర్థిగా ఉన్న టీమ్లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక అంచెలంచెలుగా ఎదిగి అండర్ క్రికెట్ వరల్డ్కప్ ఆడే అవకాశం దక్కించుకున్న సౌరభ్ నేత్రావల్కర్.. 2010 నాటి ఆ ఈవెంట్లో టీమిండియా తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉండటంతోఅయితే, సీనియర్ లెవల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు ఈ ముంబైకర్. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికీ పట్టుదలని నేత్రావల్కర్ 2013లో రంజీల్లో అరంగేట్రం చేశాడు.అయితే, సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ముంబైలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన అతడు.. ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లిన సౌరభ్ నేత్రావల్కర్కు 2015లో న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.యాప్ రూపకర్త ప్లేయర్ అనాలిసిస్ చేసేందుకు వీలుగా అతడు రూపొందించిన క్రిక్డీకోడ్ యాప్నకు ఫిదా అయిన యూనివర్సిటీ యాజమాన్యం అతడికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది.కార్నెల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసిన సౌరభ్ నేత్రావల్కర్కు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒరాకిల్ సంస్థ ఉద్యోగం ఆఫర్ చేసింది. అయితే, అక్కడే మళ్లీ తిరిగి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు నేత్రావల్కర్.అలా అమెరికా జట్టులో చోటుఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల సరళింపు నేపథ్యంలో.. H1B కార్డ్ హోల్డర్గా ఉన్న నేత్రావల్కర్కు 2018లో యూఎస్ఏ జట్టులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు కెప్టెన్గానూ వ్యవహరించాడతడు.ఈ నేపథ్యంలో యూఏఈతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2019లో సౌరభ్ నేత్రావల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పపువా న్యూగినియాతో మ్యాచ్తో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటి వరకు అమెరికా తరఫున 48 వన్డేలు ఆడిన సౌరభ్ నేత్రావల్కర్ 73 వికెట్లు తీశాడు. 30 టీ20లలో కలిపి 31 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటితొలిసారిగా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా తరఫున బరిలోకి దిగిన నేత్రావల్కర్ పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ రిజ్వాన్(9), ఇఫ్తికార్ అహ్మద్ రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేసి పాక్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పాక్ పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక టీమిండియాతో మ్యాచ్లోనూ సౌరభ్ నేత్రావల్కర్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. స్టార్ బ్యాటర్, ఓపెనర్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన నేత్రావల్కర్.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మ్యాచ్లో అమెరికా భారత్ చేతిలో ఓడిపోయినా ఈ టెకీ మాత్రం తనదైన ముద్ర వేయగలిగాడు. ఈ క్రమంలో సౌరభ్ నేత్రావల్కర్పై ప్రశంసలు కురుస్తున్నాయి.కాగా ఒరాకిల్లో పనిచేస్తున్న నేత్రావల్కర్.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు దాదాపు నెల రోజుల పాటు సెలవు(జూన్ 17 వరకు) పెట్టినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా సూపర్-8కు గనుక క్వాలిఫై అయితే తన లీవ్ను పొడిగించుకుంటాడు.పేటెంట్ ఉందినెట్టింట సెర్చ్ క్వెరీలో భాగంగా అత్యంత వేగంగా ఆటోకంప్లీట్ అయ్యే వినూత్న అల్గారిథమ్ను సౌరభ్ నేత్రావల్కర్ రూపొందించాడు. ఇందుకు సంబంధించి అతడి వద్ద పేటెంట్ రైట్ కూడా ఉంది.ఇంకో అల్గారిథమ్ పేటెంట్ కోసం అతడు అప్లై చేశాడు. ఈ విషయాలను నేత్రావల్కర్ స్వయంగా క్రిక్బజ్తో పంచుకున్నాడు. తాను ఒక కోడర్ అని.. SQL(లాంగ్వేజ్) & C విభాగంలో పనిచేస్తానని పేర్కొన్నాడు. కేవలం ఉద్యోగం, క్రికెట్ మాత్రమే కాదు సంగీతంలోనూ నేత్రావల్కర్కు ప్రావీణ్యం ఉంది. ఇక అమెరికాపై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు ఈ 32 ఏళ్ల పేసర్.. ‘‘బ్రదర్’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేయడం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇక్కడ గెలవడం అంత సులువు కాదు.. క్రెడిట్ వాళ్లకే: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.బ్యాటింగ్ అనుకూలించని పిచ్పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.గెలుపు అంత తేలికగా రాదని తెలుసుఅదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.బౌలర్లు కూడాసూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.ముఖ్యంగా అర్ష్దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం. అతిపెద్ద ఊరటఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్ను చాలెంజింగ్గా తీసుకున్నాం.మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.కఠినమైన పిచ్పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్ఏ స్కోర్లు👉వేదిక: న్యూయార్క్👉టాస్: ఇండియా బౌలింగ్👉యూఎస్ఏ స్కోరు- 110/8 (20)👉ఇండియా స్కోరు- 111/3 (18.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్ఏపై ఇండియా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్దీప్ సింగ్(4/9).చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
టి20 వరల్డ్ కప్ : అమెరికాపై గెలుపు..‘సూపర్–8’కు భారత్ (ఫొటోలు)
-
ప్రాక్టీస్ సెషన్కు రోహిత్, కోహ్లి డుమ్మా?.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2024లో ముందుకు సాగే క్రమంలో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆతిథ్య అమెరికాను ఓడించి గ్రూప్-ఏ నుంచి సగర్వంగా సూపర్-8లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.కాగా పసికూనే అయినా అమెరికాను తక్కువ అంచనా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే పాకిస్తాన్కు అవగతమైన విషయం తెలిసిందే. మినీ ఇండియాగా పేరొందిన యూఎస్ఏ జట్టు చేతిలో పాక్ ఓడి(సూపర్ ఓవర్) భారీ మూల్యమే చెల్లించింది.టీమిండియాతో సమానంగా ఉన్న అమెరికాకెనడా సైతం అమెరికా చేతిలో చిత్తుగా ఓడి పాక్తో పాటు సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు విజయాలతో టీమిండియాతో సమానంగా ఉన్న అమెరికా.. నెట్ రన్రేటు పరంగా వెనుకబడి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్రాక్టీస్ సెషన్కు రోహిత్, కోహ్లి డుమ్మా.. కారణం?ఇక టీమిండియా- అమెరికా మ్యాచ్కు న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియం వేదిక కానుంది. బుధవారం రాత్రి జరుగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ డుమ్మా కొట్టినట్లు సమాచారం.పాకిస్తాన్పై విజయం తర్వాత రోహిత్ శర్మ బ్రేక్ తీసుకోగా.. కోహ్లి సైతం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏతో మ్యాచ్కు ముందు జరిగిన ట్రెయినింగ్ సెషన్ ఆప్షనల్ కాబట్టి సూర్య కూడా దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీరంతా జట్టుతో కలిసి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేయడం గమనార్హం.టీమిండియా తదుపరి మ్యాచ్లు ఇవే కాగా పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏలతో పాటు గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టు.. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్తాన్లను చిత్తు చేసింది. తదుపరి బుధవారం యూఎస్ఏతో.. అనంతరం శనివారం కెనడాతో తలపడనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో రోహిత్ శర్మ(ఐర్లాండ్పై 52(రిటైర్డ్ హర్ట్), పాకిస్తాన్పై 13) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి(1, 4), సూర్యకుమార్ యాదవ్(2, 7 ) మాత్రం పూర్తిగా నిరాశపరిచారు.చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజంFielding drills ✅Target 🎯 hitting with match intensity ✅#T20WorldCup | #TeamIndia | #INDvUSAWATCH 🎥 🔽https://t.co/DlNDWYcgvL— BCCI (@BCCI) June 12, 2024 -
రోహిత్, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.తానే గనుక కోచ్ అయి ఉంటే ప్రతీ బ్యాటర్.. కచ్చితంగా కొన్ని ఓవర్లపాటైనా బౌలింగ్ చేయాలనే నిబంధన ప్రవేశపెట్టేవాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. 2007 టీ20, 2011 వరల్డ్కప్ ఈవెంట్లలో టీమిండియా ఇలాగే విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తమ వంతు పాత్ర పోషించారని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు జరుగుతున్న తరుణంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనే గనుక టీమిండియా కోచ్ అయితే.. ప్రతి బ్యాటర్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉండాలనే రూల్ పెడతా.ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, విల్ జాక్స్ తదితరులు బౌలింగ్ కూడా చేస్తారు. ఫ్రంట్లైన్ బౌలర్లతో పాటు వాళ్లు కూడా రాణిస్తారు.కానీ మన జట్టు పరిస్థితి అలా కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్యూర్ బ్యాటర్లు అస్సలు బౌలింగ్ చేయరు. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే మన జట్టు వెనుకబడినట్లే.ఈ ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటపుడు తుదిజట్టు కూర్పులో మనకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఫ్రంట్లైన్ బౌలర్లతో పాటు అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా వంటి వారిలో ఒకరు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.వరల్డ్కప్-2024: టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: Babar Azam: దమ్ముంటే వరల్డ్కప్ గెలవండి: బాబర్కు పాక్ మాజీ బ్యాటర్ సవాల్ -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
‘‘ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్మెంట్ టీమ్ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.కెప్టెన్ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్ టైటాన్స్లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.నిజానికి.. కెప్టెన్ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.కాగా ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అదే విధంగా హార్దిక్ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు.ఇక ఓవరాల్గా ఈ ఎడిషన్లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లను టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్#WATCH | On Hardik Pandya's captaining Mumbai Indians in IPL 2024, former Indian cricketer Harbhajan Singh says "I have played with Mumbai Indians for 10 years. The team management is great but this decision has backfired them. The management was thinking about the future while… pic.twitter.com/pGNW5gIRF5— ANI (@ANI) May 21, 2024 -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్లో ముంబై సన్రైజర్స్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్తో మ్యాచ్తో తాజా వరల్డ్కప్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్లోనే బ్యాటింగ్కు పంపాలి. వన్డౌన్లోనే అతడు ఆడాలి.టాపార్డర్లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్డౌన్లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.ఇక సన్రైజర్స్తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.అత్యుత్తమ బ్యాటర్పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: ముంబై.. బౌలింగ్👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)👉ముంబై స్కోరు: 174/3 (17.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్పై ముంబై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 102 రన్స్- నాటౌట్).చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్లు) తప్పించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘనవిజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. పవర్ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0. -
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న హార్దిక్ ప్రపంచకప్-2024లో కీలక పాత్ర పోషించగలడని జోస్యం చెప్పాడు.ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఇటు కెప్టెన్గా.. అటు ఆల్రౌండర్గా విఫలమవుతున్నాడు.అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచ్లలో మూడు మాత్రమే గెలిచింది. ఇక పేస్ ఆల్రౌండర్ పాండ్యా 197 పరుగులు స్కోరు చేయడంతో పాటు.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ధారాళంగా పరుగులు(ఎకానమీ 11) ఇచ్చి ఈ మాత్రం వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన మహ్మద్ కైఫ్.. పాండ్యాకు అండగా నిలిచాడు.‘‘ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఇంపాక్ట్ చూపగలడని నేను భావిస్తున్నా. పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ల సందర్భంగా ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.మెల్బోర్న్లో కోహ్లి 82 పరుగులు చేసినపుడు.. హార్దిక్ పాండ్యా 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు.ఆసియా కప్ టోర్నీలో పాక్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫినిషింగ్ టచ్తో ఆకట్టుకున్నాడు. నవాజ్ బౌలింగ్లో ఆఖరి ఓవర్లో దుమ్ములేపాడు. దినేశ్ కార్తిక్, జడేజా అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడి జట్టును గట్టెక్కించాడు’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుర్తుచేశాడు.మేజర్ ఈవెంట్లలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో ఉండటం ఎంత అవసరమో ఈ ఉదాహరణల ద్వారా వివరించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
PBKS Vs MI: గట్టెక్కిన ముంబై
ముల్లాన్పూర్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన పెద్ద లక్ష్యం ముందు పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో ఆరంభంలోనే మోకరిల్లింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల మెరుపులు కింగ్స్ను గెలుపు ట్రాక్లో పడేశాయి. కానీ వికెట్లు అందుబాటులో లేక 6 బంతుల్లో సులువైన 12 పరుగుల్ని చేయలేక చివరకు పంజాబ్ ఆలౌటైంది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై 9 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ (53 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హర్షల్ పటేల్ 3, స్యామ్ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్స్లు), శశాంక్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆశలు రేపారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా, కొయెట్జీ చెరో 3 వికెట్లు తీశారు. సూర్య ప్రతాపం... ఆరంభంలోనే ఇషాన్ (8) అవుట్ కాగా... కెరీర్లో 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ పవర్ ప్లేలో జట్టు స్కోరును 54/1కు తీసుకెళ్లారు. తర్వాత సూర్య దూకుడు కొనసాగడంతో పరుగుల వేగం పెరిగింది. సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై 86/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్ 34 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే 12వ ఓవర్ వేసిన స్యామ్ కరన్... రోహిత్ ఆట ముగించడంతో రెండో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ముంబై వంద పరుగులను చేరుకుంది. 14 ఓవర్లలో 115/2 స్కోరు చేసిన ముంబై... సూర్య, తిలక్ ధాటిగా ఆడటంతో మిగిలిన 6 ఓవర్లలో 77 పరుగుల్ని సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) తక్కువే చేసినా... తిలక్ మెరుపులు ముంబై జోరుకు దోహదం చేశాయి. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ (14), షెఫర్డ్ (1), నబీ (0) అవుట్ కావడంతో కేవలం 7 పరుగులే వచ్చాయి. 14/4 అయినా... వణికించిన అశుతోష్! పంజాబ్ ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో... అలా కుదేలైంది. 2.1 ఓవర్లలోనే 14/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది. అటు కొయెట్జీ, ఇటు బుమ్రా ధాటికి ఓపెనర్లు స్యామ్ కరన్ (6), ప్రభ్సిమ్రన్ (0), రోసో (1), లివింగ్స్టోన్ (1) పెవిలియన్కు దారి కట్టారు. ఈ దశలో శశాంక్, అశుతోష్ సిక్సర్లతో అలరించారు. కానీ 12.1 ఓవర్లలో 111/7 వద్ద శశాంక్ నిష్క్రమించడంతో పంజాబ్కు ఓటమి ఖాయమైంది. ఈ దశలో అశుతోష్, హర్ప్రీత్ బ్రార్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎనిమిదో వికెట్కు చకచకా 57 పరుగుల జోడించడంతో ఊహించని ఉత్కంఠ వచ్చేసింది. కానీ 168 పరుగుల వద్ద అశుతోష్ ఎనిమిదో వికెట్గా నిష్క్రమించడంతో పంజాబ్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) హర్ప్రీత్ (బి) రబడ 8; రోహిత్ (సి) హర్ప్రీత్ (బి) స్యామ్ కరన్ 36; సూర్యకుమార్ (సి) ప్రభ్సిమ్రన్ (బి) సామ్ కరన్ 78; తిలక్ వర్మ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి) హర్ప్రీత్ (బి) హర్షల్ 10; డేవిడ్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 14; షెఫర్డ్ (సి) శశాంక్ (బి) హర్షల్ 1; నబీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–18, 2–99, 3–148, 4–167, 5–190, 6–192, 7–192. బౌలింగ్: లివింగ్స్టోన్ 2–0–16–0, అర్‡్షదీప్ 3–0–35–0, రబడ 4–0–42–1, హర్షల్ 4–0–31–3, స్యామ్ కరన్ 4–0–41–2, హర్ప్రీత్ బ్రార్ 3–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 6; ప్రభ్సిమ్రన్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 0; రోసో (బి) బుమ్రా 1; లివింగ్స్టోన్ (సి అండ్ బి) కొయెట్జీ 1; హర్ప్రీత్ సింగ్ (సి అండ్ బి) గోపాల్ 13; శశాంక్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 41; జితేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ 9; అశుతోష్ (సి) నబీ (బి) కొయెట్జీ 61; హర్ప్రీత్ బ్రార్ (సి) నబీ (బి) పాండ్యా 21; హర్షల్ (నాటౌట్) 1; రబడ (రనౌట్) 8; ఎక్స్ట్రాలు 21; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–10, 2–13, 3–14, 4–14, 5–49, 6–77, 7–111, 8–168, 9–174, 10–183. బౌలింగ్: కొయెట్జీ 4–0–32–3, బుమ్రా 4–0–21–3, ఆకాశ్ మధ్వాల్ 3.1–0–46–1, పాండ్యా 4–0–33–1, శ్రేయస్ గోపాల్ 2–0–26–1, షెఫర్డ్ 2–0–20–0. ఐపీఎల్లో నేడు లక్నో X చెన్నై వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్ బాగా ఆడాడు.. బుమ్రా నా జట్టులో ఉండటం అదృష్టం: పాండ్యా
సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ మరోసారి సత్తా చాటింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచిన పాండ్యా సేన.. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది. అద్భుత ఆట తీరుతో గురువారం నాటి మ్యాచ్లో ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఐపీఎల్-2024లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఐదు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 మరోవైపు.. హార్డ్ హిట్టర్, ఇంపాక్ట్ ప్లేయర్గా దిగిన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 52)తో తిరిగి ఫామ్లోకి రావడంతో.. ముంబై శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఇద్దరు ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ICYMI - Surya lighting up the night SKY with a flurry of SIXES 🔥🔥🔥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB | @surya_14kumar pic.twitter.com/7CiLtcwTyI — IndianPremierLeague (@IPL) April 11, 2024 వరుసగా రెండో విజయం సాధించడంపై స్పందిస్తూ.. ‘‘ గెలవడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్లో గెలిచిన తీరు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కెప్టెన్గా నాకు కాస్త వెసలుబాటు కల్పించిందనే చెప్పాలి. రోహిత్(24 బంతుల్లో 38), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. వాళ్లిద్దరూ కలిసి మా విజయానికి పునాది వేశారు. నెట్ రన్ రేటు మెరుగుపరచుకునే క్రమంలో త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది మా ప్రణాళిక. బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్ నా జట్టులో ఉండటం నా అదృష్టం. ప్రతి ఓవర్లోనూ ప్రభావం చూపాడు. నేను తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. తను జట్టు కోసం ఏం చేయగలడో అదంతా చేశాడు. ఏ మ్యాచ్కు ముందైనా సరే నెట్స్లో తను తీవ్రంగా శ్రమిస్తాడు. అతడి నైపుణ్యాలు అమోఘం. ఇక నువ్వు ఫిఫ్టీ కొట్టడమే నీకు వెల్కమ్ బ్యాక్ లాంటిదని సూర్యకు చెప్పాను. సూర్య జట్టుతో ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. అపోజిషన్ కెప్టెన్గా ఉన్నపుడు కూడా తనను అవుట్ చేసేందుకు పదునైన వ్యూహాలు రచించాల్సి వచ్చేది. కొన్ని ఏరియాల్లో అతడు మాత్రమే హిట్టింగ్ ఆడగలడు. నేను ఇంతకు ముందు అలాంటి బ్యాటర్ను చూడలేదు’’ అని హార్దిక్ పాండ్యా.. బుమ్రా, సూర్యలను కొనియాడాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: టాస్: ముంబై.. బౌలింగ్ ఆర్సీబీ స్కోరు: 196/8 (20) ముంబై స్కోరు: 199/3 (15.3) ఫలితం: ఏడు వికెట్ల తేడాతో బెంగళూరుపై ముంబై విజయం చదవండి: చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు! లేదంటేనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. మిస్టర్ 360 వచ్చేశాడు
ఐపీఎల్-2024లో వరుస ఓటములతో సతమతవుతున్న ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఎట్టకేలకు నేషనల్ క్రికెట్ అకాడమీ మిస్టర్ 360 క్లియరన్స్ సర్టిఫికేట్ పొందాడు. ఈ క్రమంలో సూర్య కుమార్ ముంబై జట్టుతో కలిశాడు. ముంబై జట్టులో చేరిన సూర్యకుమార్ యాదవ్.. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు. నెట్స్లో సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముంబై జట్టు సెలక్షన్కు సూర్య అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సూర్య రాకతోనైనా ముంబై తలరాత మారుతుందో లేదో చూడాలి.