-
దసరా రేస్లో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Dear all It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024 -
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.సూర్య ప్రధాన పాత్రలో 'వాడివాసల్' చిత్రాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాడివాసల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం. -
51 మంది మృతి.. ప్రభుత్వంపై భగ్గుమన్న సూర్య, విజయ్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించారు. అయితే, ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. క్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు.ఈ సంఘటనపై కోలీవుడ్ టాప్ హీరోలు భగ్గుమంటున్నారు. ఈ సంఘటన గురించి దళపతి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేయడమే కాకుండా.. బాధితులను పరామర్శించాడు. 'గతేడాది కూడా ఇలాంటి ఘటనతో 22మందికి పైగా చనిపోయారు. అయినా, ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ విధానాలు మార్చుకోలేదు. ఇప్పటికైనా మద్యం విషయంలో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. ఈ మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. వారి మరణ వార్త వినగానే నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మద్యం విషయంలో ప్రభుత్వ తీరును తప్పకుండా మార్పుచేయాలి. ఇలాంటి ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైన తమిళనాడు ప్రభుత్వం కఠన నిర్ణయం తీసుకోవాలి.' అని విజయ్ కోరారు.ఈ ఘటనను ఖండిస్తూ హీరో సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్పకాలిక పరిష్కారాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కల్తీ మద్యం, అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. తమిళనాడు పరిపాలన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా ప్రభుత్వం చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మద్యం విషయంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి.' అని సూర్య కోరారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలని సూర్య ప్రార్థించారు. -
సూర్య హిట్ సినిమా అక్షయ్ కుమార్ రీమేక్.. ట్రైలర్ విడుదల
సౌత్ ఇండియా స్టార్ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు 'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది. -
లారెన్స్ సినిమాలో అతిథిగా సూర్య?
రాఘవ లారెన్స్.. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి నృత్య దర్శకుడిగా, ఆ తరువాత కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన జిగర్తండ డబులెక్స్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను రాసి, సొంతంగా నిర్మిస్తున్న 'బెంజ్' చిత్రంలో లారెన్స్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారట!ప్రస్తుతం ఈయన కంగువ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన చేతిలో వాడివాసల్ తదితర చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా చివరి ఘట్టంలో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో మెరిసి పెద్ద ఇంపాక్ట్నే కలిగించారు. ఇదే పాత్రతో సూర్య హీరోగా పూర్తి చిత్రాన్ని చేయనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు కూడా. తాజాగా ఈయన రాఘవ లారెన్స్ బెంజ్ మూవీలో రోలెక్స్ తరహా పాత్రలో అతిథిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్ -
ఫ్యాన్స్కు సూర్య డబుల్ ధమాకా ఇస్తారా..?
కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య హీరోగా, దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. సూర్య కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో తెరకెక్కించారు. ఈ క్రమంలో పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పార్ట్ 1 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విజయం ఆధారంగా సీక్వెల్స్ తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, కంగువ విడుదల తేదీని ఇప్పటికి కూడా మేకర్స్ ప్రకటించలేదు. దీంతో సూర్య ఫ్యాన్స్ నుంచి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు అయిన స్టూడియో గ్రీన్, యు.వి.క్రియేషన్స్పై ఒత్తిడి పెరుగుతుంది.గంగూవా చిత్రం సూర్య, డైరెక్టర్ శివకు ముఖ్యమైన చిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే శివ గత సినిమా రజనీకాంత్తో తీసిన అన్నాతై (తెలుగులో పెద్దన్న) భారీ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి శివ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జ్ఞానవేల్ రాజా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఇది కావడం గమనార్హం. భారీ అంచనాలతో వస్తున్న కంగువ విడుదల తేదీని జులై 23న సూర్య పుట్టినరోజు కానుకగా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే రోజున సూర్య 44 అప్ డేట్స్ విడుదలయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సూర్య పుట్టినరోజున ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ని ఆశించవచ్చు. -
కోలీవుడ్ స్టార్ హీరోతో మూవీ ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్డే
నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్తో రూపొందుతున్నవే. అందులో కంగువ చిత్రం ఒకటి. పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తిచేసిన సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా జనరంజకమైన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇది ఆయన నటిస్తున్న 44 చిత్రం అవుతుంది. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించనున్నారు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ అండమాన్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా ఇందులో సూర్యతో నటించే నటి ఎవరన్న సస్పెన్స్ ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. అయితే పూజా హెగ్డే ఇందులో కథానాయకిగా నటిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డేకు ఈ చిత్రం చాలా కీలకం కానుంది. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం ముగముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. కాగా చాలా కాలం తర్వాత ఈ మధ్య విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంపై పూజాహెగ్డే చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. అదేసమయంలో తెలుగులో కూడా పూజాహెగ్డే నటించిన చిత్రాలు బాగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి ఆమె చేతుల్లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి కష్టకాలంలో సూర్య సరసన నటించే అవకాశం రావడం నిజంగా ఆమెకు లక్కే. -
ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.సూర్య కెరియర్లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. -
‘అరి’కి ముందే మరో చిత్రం
కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్ ఒకరు. పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి తదితరులు పాల్గొన్నారు. అరి మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్య పురిమెట్ల రెండో మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన cinematography minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , సుందర్ పాలుట్ల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు , పేపర్ బాయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతుంది... pic.twitter.com/OiR51KtiGB— ARI (MY NAME IS NOBODY) (@ArvyCinemas) May 21, 2024 -
Kanguva: దీపావళికి కంగువ?
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహించగా, దిశా పటానీ హీరోయిన్గా, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రధారులుగా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. (చదవండి: కంగువా మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా పదివేల మందితో వార్ సీన్..!)కాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. డిఫరెంట్ టైమ్స్ లైన్స్లో సాగే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని, తొలి భాగం ఈ ఏడాదిలో, మలి భాగం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుందని టాక్. -
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
-
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
హిట్ లిస్ట్ టీజర్ బాగుంది: సూర్య
‘‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజయ్ కనిష్కతో పాటు టీమ్కి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సూర్య కతిర్ కాకల్లార్, కె. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ని సూర్య లాంచ్ చేశారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్లో రూపొందిన చిత్రం ‘హిట్ లిస్ట్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది’’ అన్నారు మేకర్స్. -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
'హిట్ లిస్ట్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య
దర్శక నటుడు కేఎస్.రవికుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం హిట్లిస్ట్. ఈ సంస్థలో ఇంతకు ముందు కమలహాసన్ 'తెనాలి', ఈ మధ్య 'గూగుల్ కుట్టప్పా' అనే సినిమాల్ని నిర్మించారు. తాజాగా 'హిట్లిస్ట్' పేరుతో మూవీ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కినిష్కాను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూర్య కథీర్, కే. కార్తీకేయన్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ కుమార్, కేఎస్ రవికుమార్, గౌతమ్మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!)నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను తెచ్చుకుందని, తాజాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు సూర్య ఆవిష్కరించి యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా రెడీ చేశామని, త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తామని నిర్మాత కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) #I_Am_The_Danger first single from #HitList out now! 💥Song link - https://t.co/XxQoHVyKtpA @CSathyaOfficial Musical!@realsarathkumar @kanvikraman #RKCelluloids @ksravikumardir @menongautham @thondankani @smruthi_venkat @Aishwaryadutta6 @Abinakshatra @RIAZtheboss @V4umedia_ pic.twitter.com/8BTeyaGEzs— K.S.Ravikumar (@ksravikumardir) May 10, 2024 -
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్లో 97, గణితంలో 94, ఫిజిక్స్లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్లో 98, సోషల్లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్. ఇది తెలుగువాడి బయోపిక్. అంధుడైన శ్రీకాంత్ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ టీచర్ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ తుషార్ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.రిజెక్ట్ చేసిన జ్యోతికఅవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్ బయోపిక్లో ఆఫర్ను తను రిజెక్ట్ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్ చేసి సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్ అంతా చదివాడు.మిస్ చేసుకోవద్దుఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి.. -
సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ‘కంగువా’.. అన్ని కోట్లా?
కంగువా చిత్రం సౌండ్ సినీ వర్గాల్లో బాగా పెరిగిపో తోంది. నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీక్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కంగువా. చారిత్రిక, సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్లో తమిళం, తెలుగు, మలమాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.కాగా ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న కంగువ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాండమైన గ్రాఫిక్స్, సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే కంగువ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తాజా సమాచారం. నటుడు సూర్య కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
'కంగువ' స్పెషల్ పోస్టర్.. ఆ సినిమా గుర్తొచ్చిందిగా!
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్కు పరిచయమవుతోంది. శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. పీరియాడికల్, ప్రస్తుత అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూర్య గెటప్, టీజర్ ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మాట్లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) అందులో పీరియడ్ కాలానికి చెందిన సూర్య ఫొటోను, మరో పక్క ప్రస్తుత ఫొటోను పొందుపరచారు. మధ్యలో 2024లో విడుదల అని పేర్కొన్నారు. దీంతో కంగువా చిత్రంలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియడ్ పాత్రధారి చేతిలో కత్తి పట్టుకోగా, ప్రస్తుతం పాత్రధారి చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్కు ఎట్రాక్షన్గా మారింది. అదేవిధంగా ఇది గత జన్మకు, పునర్జన్మకు సంబంధించిన కథా చిత్రం అని కూడా అనిపిస్తోంది. దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఈ మధ్య 'బింబిసార' అనే మూవీతో తెలుగులో వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు అదే చిత్రం గుర్తొస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்! ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ! ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! & Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3 — Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024 -
హీరో సూర్య భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా?
సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులో మన బడా హీరోల రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఇతడు.. దీని తర్వాత పలు చిత్రాలు చేయబోతున్నాడు. అయితే సూర్య చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. పాపకు వెరైటీ పేరు) తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ ది సెపరేట్ బ్రాండ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అద్భుతమైన చిత్రాలు తీస్తుంటారు. ఇతడు సూర్యతో 'వడివాసల్' అనే మూవీ చేస్తానని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ అని దర్శక, నిర్మాతలు ప్రకటించారు కూడా. సినిమాలో పాత్ర కోసం సూర్య ఓ ఎద్దును కూడా పెంచాడు. కానీ షూటింగ్ అనుకున్నట్లు ప్రారంభమే కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే సూర్య, వెట్రిమారన్ ఎవరికి వాళ్లు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన వెట్రిమారన్.. తాను తీసే 'విడుదలై 2' ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని, దీని తర్వాతే వాడివాసల్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. దీనిబట్టి చూస్తే 'వడివాసల్' ఉంది కానీ ఇప్పట్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)