Surgeries
-
ప్రతిష్టాత్మకం.. వైఎస్సార్ నవశకం
అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1 నుంచి కొత్త కార్డులను ముద్రించి, పంపిణీ చేయాలి. వైఎస్సార్ నవశకం మార్గదర్శకాలు చేరని జిల్లాలకు వెంటనే పంపించండి. అర్హులైన ప్రతి వారూ లబ్ధి పొందాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులు సీరియస్గా పని చేయాలి. సంక్షేమ పథకాల వర్తింపులో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడొద్దు. కేవలం అర్హతే ప్రామాణికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోయేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉండాలి. అధికారులందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫలానా కలెక్టర్ హయాంలో ఇళ్ల పట్టా ఇచ్చారన్న పేరు చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయేలా పని చేయాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా గరిష్టంగా రూ.5 వేలు ఇస్తాం. ఆ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్గా తీసుకోవాలి. మనసా, వాచా, కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తుది జాబితాను డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాజిక తనిఖీల కోసం డిసెంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు ఆయా పథకాల అర్హుల జాబితాను అక్కడే ప్రదర్శించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రారంభమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తామని చెప్పారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం, రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయం, అర్చకులు, ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారుల ఎంపిక కోసం సాగుతున్న ప్రక్రియ తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి రోగులకు ఆర్థిక సాయం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద నిర్ధారించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోలుకునే సమయంలో దేశంలో తొలిసారిగా ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం ఆరోగ్య మిత్రలకు అవసరమైన ఓరియెంటేషన్ ఇవ్వాలని సూచించారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పని తీరు ఉండాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. సికిల్సెల్ ఎనీమియా, తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేలు, ఎలిఫెంటియాసిస్, పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోపీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చే వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం స్పందనపై సమీక్షలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతామని ఉన్నతాధికారులతో ప్రమాణం చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్ 45.82 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకర్లతో సమావేశమై మిగిలిన రైతులకు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమ చేసుకోవడానికి వీలు లేకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. అన్ ఇంకంబర్డ్ అకౌంట్ కింద మాత్రమే భరోసా మొత్తాన్ని రైతులకు చెందేలా జమ చేయాలని మరోసారి స్పష్టం చేశారు. ‘ఉపాధి’తో వర్క్షాపుల అనుసంధానం గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వర్క్షాపులపై కలెక్టర్లు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో వర్క్షాపులను కచ్చితంగా తెరవాలని.. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని రైతులకు విక్రయించాలని చెప్పారు. ఈ వర్క్షాపుల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, జనవరి 1 నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు చెల్లింపుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి కటాఫ్ తేదీగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 22.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని అధికారులు వివరించారు. 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ 15 నాటికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అవినీతిని తగ్గించడం, ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యమని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని స్పష్టీకరించారు. ఇది సక్రమంగా అమలవుతోందా లేదా అనేది జిల్లా ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో, సెక్రెటరీలు సచివాలయ స్థాయిలో పర్యవేక్షిస్తారని సీఎం పేర్కొన్నారు. 21న వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారులను గుర్తించారని, మగ్గమున్న ప్రతి ఇంటికీ ఈ పథకం వర్తించాలని చెప్పారు. అర్హత ఉండీ పథకం వర్తించని వారు ఉండకూడదన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి డిసెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడిని ఈ పథకానికి దూరం చేయరాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ వాహన మిత్రకు నేటితో గడువు ముగిసిందని, అర్హులైన లబ్ధిదారులందరకీ చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు 92 శాతం చెక్కులు పంపిణీ జరిగిందన్నారు. వచ్చే సమావేశం నాటికి నూరు శాతం చెక్కులు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం షాపులను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించామని సీఎం అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని, ఎస్పీలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక.. రెండింటిలోనూ అక్రమాలకు అడ్డుకట్టు వేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రతి వారం ఇసుక ధరలు, లభ్యతపై జిల్లా స్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఏర్పాటు చేసిన 439 చెక్ పోస్టుల్లో నైట్ విజన్ సీసీ కెమెరాలను కూడా అదే రోజుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తోందని, రోజుకు 80 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 3 లక్షల 95 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఆన్లైన్లో ఇవాల్టికి (మంగళవారం) అందుబాటులో ఉంచామని మైనింగ్ శాఖ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సీఎం సూచించారు. ‘స్పందన’ కింద వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 4న అనంతపురం, కర్నూలులో ఆఖరి విడతగా ఓరియెంటేషన్ తరగతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవినీతిపరుల భరతం పట్టాలి - 14400 కాల్ సెంటర్కు ఫోన్ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఒక్క ఫోన్ కాల్తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పించాలి. - ఎవరూ లంచాలు తీసుకోకూడదనేలా చర్యలుండాలి. - ప్రతి దశలోనూ అట్టడుగు స్థాయి వరకూ ఇది ప్రజల్లోకి వెళ్లాలి. - నా (సీఎం) స్థాయిలోనో, అధికారులగా మీ స్థాయిలోనో అవినీతికి నో చెబితే 50 శాతం వరకూ పోతుంది. మిగిలిన 50 శాతం అవినీతి పోయినప్పుడే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఇందుకోసం ఐఐఎం, ఏసీబీ రెండూ కలిసి పని చేస్తాయి. - ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పుడు వాటిని అవినీతికి తావులేకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే. సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గదర్శకాలు - నిబంధనలను సరళతరం చేయాలి. - 52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయాలి. - డిసెంబర్ 3న వరల్డ్ డిజేబుల్డ్ డే నాటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలి. - డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించాలి. - అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. - కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్ అందించడమే లక్ష్యంగా పని చేయాలి. -
విర్డ్లో ఆధునిక కీళ్ల చికిత్స
ఆధునిక కీళ్ల చికిత్సా విధానం లింబ్ ప్లిజర్వేషన్ సిస్టం ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలోఅందుబాటులోకి వచ్చింది. అమెరికాకే పరిమితమైన ఈ విధానంపై ఆదివారం వైద్యులకు లైవ్ శస్త్రచికిత్స ద్వారా అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి ,ద్వారకాతిరుమల: ఇటలీలో పుట్టిన లింబ్ ప్లిజర్వేషన్ సిస్టమ్, ప్రస్తుతం అమెరికా వైద్యుల చేతులో ఉందని, ఆ వైద్యాన్ని తాము విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్నట్టు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, తిరుమల తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు జగదీష్ తెలిపారు. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని విర్డ్ ఆసుపత్రిలో ఆదివారం లైవ్ శస్త్ర చికిత్సలను నిర్వహించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వైద్యులే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, అసిస్టెంట్ సర్జన్లు 106 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ ఆపరేషన్ చేసే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా లైవ్లో వైద్యులకు వివరించారు. వైద్యులకు కలిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విర్డ్ ఆసుపత్రిలో చేస్తున్న శస్త్రచికిత్సలకు వినియోగిస్తున్న అధునాతన, నాణ్యమైన పరికరాల గురించి ఆయన వైద్యులకు వివరించారు. అనంతరం డాక్టర్ జగదీష్, విర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, వైస్ చైర్మన్, రాజు వేగేశ్న ఫౌండేషన్ అధినేత ఆనందరాజు, సభ్యులు చెలికాని రాజబాబు, గుప్తా, ఆడిటర్ సాయి, వెంపరాల నారాయణమూర్తి, సుధాకరరావులు గత శిబిరంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా కాలిపర్స్లను అందజేశారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ లింబ్ ఎముక ఏర్పడేందుకు ప్లిజర్వేషన్ సిస్టమ్ చికిత్సను ఏడాదిన్నర పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో మాత్రమే చేస్తున్న ఈ చికిత్సను విర్డ్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి శస్త్రచికిత్స అయినా సరే.. ఆర్థోపెడిక్ విభాగంలో ఎలాంటి శస్త్రచికిత్సనైనా విర్డ్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నట్టు జగదీష్ తెలిపారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి తిరుమల తిరుపతి బర్డ్ అయితే, అవే తరహా వసతులతో సేవలందిస్తున్న ఆసుపత్రి ఇక్కడి విర్డ్ అన్నారు. కీళ్ల మార్పిడి, వెన్నెముక, మోకాళ్ల శస్త్ర చికిత్సలతోపాటు, పొట్టిగా ఉన్న వారిని పొడవుగా చేసే చికిత్సలు కూడా చేస్తున్నట్టు చెప్పారు. చైర్మన్ సుధాకరరావు మాట్లాడుతూ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే వంద పడకల ఆసుపత్రిగా విర్డ్ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 15 వేల మంది పోలియో వికలాంగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి, అందులో అవసరమైన వారికి కాలిపర్స్లను అందించామన్నారు. రోజు రోజుకు విర్డ్ సేవలు విస్తరిస్తున్నాయని చైర్మన్ అన్నారు. కార్యక్రమంలో పెనుమత్స నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
నీళ్లు లేవని ఆపరేషన్ చెయ్యట్లేదు..
భానుగుడి (కాకినాడ సిటీ): రక్తం కొరతతో శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తారు ... సంబంధిత వైద్య నిపుణులు లేకపోయినా వాయిదా వేడయం చూశాం...కానీ కేవలం నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఆపరేషన్లు చేయకపోవడం విచిత్రమే. ఇది ఏ మారుమూలనో ఉన్న ఆసుపత్రిలో చోటుచేసుకుందంటే ‘సరేలే’ అని సరిపెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే ఈ దుస్థితి నెలకొంది. రెండు జిల్లాలకు అతి పెద్ద పేదల ఆసుపత్రిగా గుర్తింపుపొందిన ఇక్కడ నీళ్ల సరఫరా లేదంటూ ముందస్తుగా తేదీలు ఇచ్చిన రోగులకు కూడా తిరిగి పంపించేస్తున్నారు. రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరిగితే గానీ ఆపరేషన్లు చేసేందుకు సంబంధిత వైద్యులు నిర్ధిష్ట తేదీని ఇవ్వరు. ఆ తేదీ నాటికి సిద్ధపడి ...కుటుంబ సభ్యులతో అన్నీ సర్దుకొని వస్తే ఇలా చేస్తారా అని రోగులు మండిపడుతున్నారు. ఒకటి, రెండు కాదు గురువారం ఒక్క రోజునే 14 శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. కాకినాడ జీజీహెచ్లో ట్విన్ ఆఫరేషన్ థియేటర్స్ (టీఓటీ), ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో నీటి సరఫరా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటనతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు పలు అవస్థలకు గురయ్యారు. దీనిపై ఆసుపత్రి సూపరిండెంట్ ఎం.రాఘవేంద్రరావును వివరణ కోరగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్లాల్సిన వాటర్ మోటార్లు పాడైపోయిన కారణంగా ఈ రోజుకు ఆపరేషన్లు నిలుపుదల చేశామన్నారు. త్వరితగతిన మోటార్లు మరమ్మతు చేయించే ఏర్పాట్లు చేయాలని మెకానిక్లకు ఆదేశించామని తెలిపారు. -
అపర బ్రహ్మలు.. ‘గాంధీ’ వైద్యులు
హైదరాబాద్: పాడైపోయిన రూపాన్ని సరిచేసి అపర బ్రహ్మలుగా నిలిచారు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గుర్తు పట్టలేనంతగా మారిన ముఖాలకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి కోల్పోయిన రూపాలను తిరిగి తెచ్చారు గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు. గాంధీ ఆస్పత్రిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్తో కలసి పాస్టిక్ సర్జరీ విభాగాధిపతి సుబోధ్కుమార్, అనస్థీషి యా వైద్యులు అప్పారావు ఆరోగ్య శ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించిన 4 అరుదైన శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. తెగి ఊగిసలాడుతున్న చేతికి.. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండ లం కల్సిపురికి చెందిన అభినవ్ (21) నగరంలో బీటెక్ చదువుతున్నాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఎడమచేయి తెగి ఊగిసలాడుతోంది. దీంతో గతనెల 6న గాంధీలో చేరాడు. వైద్యులు మైక్రోవాస్కులర్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి తొడవద్ద కండను తీసి చేతికి అతికించి, రక్తనాళాలకు కనెక్షన్ ఇచ్చారు. విద్యుదాఘాతానికి గురైన మరో ఇద్దరికి.. విద్యుదాఘాతానికి గురై గుర్తుపట్టలేనంతగా ముఖం కాలిపోయిన మరో ఇద్దరు బాధితులకు పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించి కొల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. నల్లగొండజిల్లా కంచనపల్లికి చెందిన శ్రీను (45), సిద్దిపేట జిల్లా కొయిడ మండలం బసవపూర్ జ్యోతిరాం తండాకు చెందిన నెహ్రూ (50) విద్యుదాఘాతంతో ముఖరూపాన్ని కోల్పోయారు. వీరికి మల్టిపుల్ ప్లాప్ సర్జరీలు చేసి పేషియల్ రీకనస్ట్రక్షన్ శస్త్రచికిత్స ద్వారా కోల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు వెంకటేశ్వర్లు, అప్పారావు, రమేశ్, మహేందర్, చంద్రకళ, అర్జున్, సృజనలతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎముకను వంచి.. దవడగా మార్చి.. రంగారెడ్డి జిల్లా కొత్తగూడకు చెందిన జనార్దన్ (32) దవడ ఎముకకు క్యాన్సర్ సోకింది. ఎముక పూర్తిగా పాడైపోవడంతో గతనెలలో గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చేరాడు. వైద్యులు పాడైన దవడ ఎముకను తొలగించారు. ఎమలోబ్లాష్టోమా అనే అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి నిలువుగా ఉన్న కాలి ఎముకను తీసి దాన్ని యు ఆకారంలో వంచి దవడకు విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.15 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. -
ఏదో సరదాకోసం అలా చేశా!
హీరోయిన్ మీద అభిమానంతో 50 సర్జరీలు చేయించుకుని.. దయ్యంలా మారిన యువతి గురించి మీకు తెలిసేఉంటుంది. ఏంజెలీనా జోలీ వీరాభిమానిగా చెప్పుకుంటూ.. అలా మారిపోయేందుకు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని.. గుర్తుపట్టలేనంత మారిపోయిన ఇరాన్ యువతి.. సహర్ తబర్ నిజానికి ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదట. మోడ్రన్ మేకప్తో పాటు.. ఫొటోషాప్ టెక్నాలజీతో సహర్ తబర్ ఫొటోలను అలా మార్చుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. సహర్ ఒక పత్రికతో పాట్లాడుతూ.. నాకు నిజంగానే ఏంజెలినీ జోలీ అంటే ఇష్టం. నేను ఆమెలా ఉంటాను.. అనే నమ్మకం నాకుంది. నేను ఆమెలా మారితో ఎలా ఉంటుందోనన్న ఆకాంక్షతో ఈ ప్రయోగం చేసినట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే.. ఆ ఫొటో కోసం 40 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డట్లు తెలిపింది. ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోను చూసి చాలామంది షాక్గురయ్యారని సహర్ తబర్ చెప్పింది. ‘నేను అందవికారంగా లేనని.. ఇదిగో ఇలా ఉన్నానంటూ’ ప్రస్తుత ఫొటో ఒకటి తాజాగా ఇన్స్టాగ్రామ్లో మరోసారి పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు.. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఫాలోవర్లు.. ఉండేవారు. ఇప్పుడు దాదాపు.. ఫాలోవర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరింది. -
కల చెదిరింది.. దెయ్యంలా మారింది
సాక్షి, న్యూఢిల్లీ : అభిమానం తారా స్థాయికి చేరి ఓ యువతి చేసిన పని ఆమె ముఖాన్ని పూర్తిగా మార్చేసింది. తన ఫేవరెట్ హీరోయిన్లా మారిపోవాలని ఏకంగా 50 సర్జరీలు చేయించుకుంది. అవన్నీ వికటించటంతో ఇప్పుడు ఆమె ముఖం దారుణంగా మారిపోయింది. ఇరాన్కు చెందిన 19 ఏళ్ల సహర్ తబర్ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వీరాభిమాని. స్వతహాగా అందగత్తె అయిన తబర్.. జోలీలా లేనని తరచూ నిరుత్సాహం చెందేది. ఈ క్రమంలో శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు సిద్ధమైపోయింది. ముఖానికి మొత్తం 50 సర్జీలు చేయించుకుంది. అంతేకాదు డైటింగ్ చేసి 40 కేజీలకు బరువు మించకుండా చూసుకుంది. ఇప్పుడు ఆమె ముఖంగా దారుణంగా మారిపోయింది. అయినప్పటికీ తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సహర్ కు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. క్షణక్షణానికి ఆమెను అనుసరించేవారు పెరిగిపోతూ ప్రస్తుతానికి దాదాపు 4 లక్షలకు చేరుకుంది. అయితే వారిలో చాలా మంది పాపం ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టడం విశేషం. నీ ముఖంపై ఎవరైనా బాంబు వేశారా? జాంబీ, నువ్వు చాలా భయంకరంగా ఉన్నావ్, సర్జరీ కంటే ముందు చాలా అందంగా ఉన్నావ్, నువ్వసలు మనిషివేనా? ఇలాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. مدرسه نابه..!😁❤️ A post shared by سحرتبر..!👾✌🏻 (@sahartabar_official) on Jun 7, 2017 at 2:14am PDT -
మా క్లినిక్కు వచ్చేయండి..
♦ గర్భిణులపై ఘోష ఆస్పత్రి వైద్యుల ఒత్తిడి ♦ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని వైనం ♦ మాట వినని వారికి సేవల్లోనూ వివక్ష ♦ క్లినిక్లలో శస్త్రచికిత్సలు.. పేదలపై బిల్లుల భారం ♦ వైద్యులపై డీఎంహెచ్వోకు ఫిర్యాదు ఇది ప్రభుత్వాస్పత్రి.. ఇక్కడ వైద్యసేవలు బాగోవు.. ఎవరూ పట్టించుకోరు.. మా మాట వినకుంటే మీకు ఘోసే మిగులుతుంది.. మీ కోసమే చెబుతున్నాం.. ప్రయివేటు క్లినిక్కు వచ్చేయండి.. గర్భిణులకు శస్త్రచికిత్స చేసి పురుడుపోస్తాం.. తల్లీపిల్లలను రక్షిస్తాం.. మంచి సేవలు అందిస్తాం.. ఇదీ విజయనగరం జిల్లాలోని ఘోష ఆస్పత్రిలో చేరిన గర్భిణులు, వారి బంధువులకు వైద్యులు ఇచ్చే సూచన, సలహా. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదలకు ఉత్తమ సేవలందించాల్సిన వైద్యులు ఆర్థిక భారం వేస్తున్నారు. సొమ్ము సంపాదనే లక్ష్యంగా డాక్టర్ వృత్తికే మచ్చతెస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలను నిర్వీర్యం చేస్తూ పేదల ప్రాణాలను పణంగా పెడుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఫోర్ట్: ‘గజపతినగరం మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం ఇటీవల ఘోష ఆస్పత్రిలో చేరింది. ఆమెను రెండు, మూడు రోజుల వరకు వైద్యులు పట్టించుకోలేదు. అ తర్వా త ఓ వైద్యురాలు తన క్లినిక్కు వస్తే బాగా చూస్తానని చెప్పి అక్కడకు తీసుకెళ్లిపోయింది. క్లినిక్లో ప్రసవం జరిపించి రూ.27వేలు బిల్లు వసూలు చేశారు. ఆస్పత్రిలో అయితే తమకు ఉచితంగా ప్రసవం అయ్యేదని, క్లినిక్లో ప్రసవం జరిపించడం వల్ల రూ.27 వేలు ఖర్చుయిందని, అప్పుచేసి డబ్బులు కట్టామంటూ గర్భిణి బంధువులు డీఎంహెచ్ఓకు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఇది వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే. తరచూ ఆస్పత్రిలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్టు పలువురు గర్భిణులు, బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే అధికశాతం మంది గర్భిణులను ఏదో ఒక వంక చూపి ప్రయివేటు క్లినిక్లకు రిఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. గర్భిణులు చికిత్స పొందే వార్డుల్లోకి వైద్యులు ప్రతి రోజు వెళ్లినా పట్టించుకోరనే అపవాదు ఉంది. కొంతమంది వైద్యులు అయితే గర్భిణులతో నేరుగా మా క్లినిక్కు రావచ్చు కదా.. బాగా చూస్తానని చెబుతున్నారు. కొంతమంది ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక వైద్యుల చెప్పిన విధంగా క్లినిక్లకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నంతసేపు అంతగా పట్టించుకోని వైద్యులు క్లినిక్కు వచ్చిన వెంటనే ప్రసవం జరిపించేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో అయితే ఉచితంగా ప్రసవం జరిపించాలి. అదే క్లినిక్ల్లో అయితే వేలకు వేలు ఫీజులు వస్తాయి. సాధారణ ప్రసవం అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు, సిజేరియన్ అయితే రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీని వల్ల రెక్కాడితేగాని డొక్కాడాని బడుగుజీవులు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక అప్పులు పాలువుతున్నారు. విచారణ జరిపిస్తాం.. గజపతినగరానికి చెందిన ఓ గర్భిణిని ఘోష ఆస్పత్రి నుంచి క్లినిక్కు తీసుకెళ్లి ప్రసవం అనంతరం రూ.27 వేలు వరకు బిల్లు వసూలు చేశారని గర్భిణి బంధువు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతాం. ఆస్పత్రిలో సక్రమంగా వైద్యసేవలు అందేలా చూస్తాం. –డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్వో -
ఆరోగ్య భాగ్య విధాత
స్వస్థ భారతం స్వాతంత్య్రం వచ్చిన 1947 నాటితో పోలిస్తే ఇప్పటికి ఆరోగ్య రంగంలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంది. మనదేశ ఆరోగ్యరంగం పురోగతి చోటు చేసుకుందని చెప్పేందుకు చాలా తార్కాణాలే ఉన్నాయి. ఉదాహరణకు ఒకనాడు విదేశాల్లోనే సాధ్యమనుకున్న సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల కిందట కూడా ధనవంతులు గుండె ఆపరేషన్ల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు ఆసుపత్రుల్లో కూడా గుండెశస్త్రచికిత్సలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. ఇక గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి కీలకమైన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య ఎంతగానో పెరిగింది. దాంతో అప్పట్లో మనం విదేశాలకు వెళ్లడం మానేయడం అనే పరిణామం ఎలా ఉన్నా... విదేశీయులే ఇక్కడికి రావడం అనే ఒక ట్రెండ్ మొదలైంది. దాంతో హెల్త్ టూరిజం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రజల ఆయుఃప్రమాణం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది. మందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనమే అనేక దేశాలకు మందులను, వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. మశూచీ లాంటి మహమ్మారులను పూర్తిగా నిర్మూలించాం. ఇక వైద్య పరీక్షలను చేసే ఉపకరణాల తయారీ విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్షా సాధనాలను మనమే తయారు చేసుకుంటున్నాం. వైద్య విద్య కూడా గణనీయంగానే అభివృద్ధి చెందింది. స్వాతంత్రం వచ్చే నాటితో పోలిస్తే వైద్య కళాశాలల సంఖ్య ఈ 70 ఏళ్లలో ఇరవై రెట్లు పెరిగింది. అలాగే ఒకనాడు చిన్న చిన్న వైద్య అవసరాల కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి నుంచి విదేశీయులే వారికి ఇక్కడ చవగ్గా లభ్యమవుతున్న వైద్య సదుపాయాల కోసం ఇక్కడికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈ పురోభివృద్ధి సామాన్యుడికి ఏమేరకు అందిందనే అంశం మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. శీర్షికలవారీగా ఆయా అంశాలను పరిశీలిస్తే... ఆయుః ప్రమాణాలు పెరిగినప్పటికీ... ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పులతో మన దేశవాసుల ఆయుఃప్రమాణం బాగానే పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో భారతీయుల ఆయుఃప్రమాణం 32 ఏళ్లు మాత్రమే. కానీ తాజాగా ఇప్పుడు 2016 నాటి లెక్కల ప్రకారం మన దేశవాసుల ఆయుఃప్రమాణం 68.3 ఏళ్లు. దీన్ని బట్టి మన ప్రజలకు మంచి ఆరోగ్యం అందుతోందనే భావన వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరు. బొగ్గు, పెట్రోలియం, విద్యుత్ వంటి శక్తి వనరుల వినియోగాలతో క్రమంగా అన్ని రకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం విపరీతమైంది. శారీరక శ్రమ చేయడం నామోషీ అయ్యింది. మొక్కలు నాటకపోవడం, చెట్లు నరకడంతో అనర్థాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల వంటి నాన్కమ్యూనికబుల్ డిసీజ్లు బాగా పెరిగిపోయాయి. నేటి సమాజంలో పైన పేర్కొన్న జబ్బుల్లో ఏదో ఒకదానితో బాధపడేవారు ప్రతి ఇంట్లోనూ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి జబ్బులు తగ్గాయా లేక పెరిగాయా అనేది ఆలోచించాల్సిన అంశం. మందుల లభ్యత మంచికా... చెడ్డకా? కొన్ని కొత్త మందులు కనిపెట్టాక అవి రోగనిరోధక శక్తికి బాసటగా నిలవడంతో కొన్ని జబ్బులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఉదాహరణకు... మశూచీ వ్యాక్సిన్ కనిపెట్టాక ఆ రోగం పూర్తిగా మటుమాయం అయ్యింది. అలాగే అనేక రకాల వ్యాక్సిన్లు, మందుల కారణంగా ఇప్పుడు పోలియో పూర్తిగా అదుపులో ఉంది. ధనుర్వాత మరణాలు, క్షయ రోగుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చింది. ప్లేగు లాంటి జబ్బులు కనబడటం లేదు. కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులకు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. 70 ఏళ్ల కిందట మన దేశం అనేక ఔషధాలను దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. ఇప్పుడు చాలా మందులను ఎగుమతి చేసేంతగా దేశం అభివృద్ధి చెందింది. అయితే 2000 సంవత్సరంలో డబ్ల్యూటీఓ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో చేరి మన ప్రాసెస్ పేటెంటు చట్టాన్ని ప్రాడక్ట్ పేటెంట్గా మార్చుకున్నందున చాలా నష్టపోయాం. అయినప్పటికీ మనదేశం ఇంకా మందులను ఎగుమతి చేసే పరిస్థితుల్లోనే ఉండటం విశేషం. అయితే మందుల లభ్యత ఇంత విశేషంగా ఉన్నా ఇక్కడ మన దేశ విధాన రూపకర్తలు ఆలోచించాల్సిన కీలకమైన అనేక జటిల అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ప్రజలకు అవసరమైన మందులను గురించి వివరిస్తూ... 116 ఔషధాలు ఉంటే ప్రజారోగ్యానికి అవి చాలని 1975లో హాథీ కమిటీ పేర్కొంది. అయితే ఆ సంఖ్య 150గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది. అన్ని జబ్బుల వైద్య చికిత్స కోసం మొత్తం 256 మందులు అవసరమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కానీ ప్రస్తుతం మన దేశ మార్కెట్లో 85,000 ఫార్ములేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలావరకు అవసరమైన, అర్థరహితమైన కాంబినేషన్లు, ప్రమాదకరమైన మందులే ఉన్నాయి. ఈ దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు మందుల లభ్యత అన్నది అభివృద్ధేనా లేక ప్రతికూల అంశమా అన్నది కీలక చర్చనీయాంశం. వైద్యపరీక్ష ఉపకరణాల విషయంలో... ఇక వైద్య ఉపకరణాల విషయానికి వస్తే... దాదాపు 90 శాతం చిన్న చిన్న వైద్యపరీక్ష సాధనాలను మనమే తయారు చేసుకునే స్థాయికి వచ్చాం. కానీ సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి అనేక పైస్థాయి వైద్య పరీక్ష సాధనాలను మాత్రం ఇంకా విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. నగర ప్రజల అవసరాలను మినహాయిస్తే... పట్టణాలు, మారుమూల గ్రామాలకు వాటి లభ్యత ఇంకా చేరువ కాలేదు. ఆ మాటకొస్తే కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ అత్యున్నత స్థాయి వైద్య నిర్ధారణ పరీక్ష ఉపకరణాలు అందుబాటులో లేవు. వైద్య విద్య – మెడికల్ కాలేజీలు... ఈ 70 ఏళ్లలో మన దేశంలో ప్రైవేటు వైద్యకళాశాలల సంఖ్య పెరిగింది, స్వాతంత్య్రం వచ్చిన నాటికి మన దేశంలో మొత్తం 23 మెడికల్ కాలేజీలు ఉండేవి. కానీ ఇప్పుడు (2016) నాటికి వాటి సంఖ్య 439కి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే మెడికల్ కాలేజీల సంఖ్య దాదాపు 20 రెట్ల అభివృద్ధి కనిపిస్తున్నా ఇది సరిపోదు. ప్రస్తుతం ప్రతి 2000 మంది రోగులకు ఒక పడక మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు ప్రతి ఏడాది 50,000 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. అయినా ఈ సంఖ్య సరిపోదు. 2034 నాటికి 35 లక్షల పడకలు అవసరమవుతాయనేది ఒక ఉజ్జాయింపు లెక్క. ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించేలా చేసే ‘సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్’ అనే అంశం మీద వైద్యవిద్యార్థులకు ప్రేమా, గౌరవం రెండూ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించి పెట్టే స్పెషలైజేషన్ మీదే ఇప్పుడు వైద్య విద్యార్థుల దృష్టి ఉంటోంది. ఇక 70 ఏళ్ల వైద్య భారతాన్ని గొప్పగా ఆవిష్కరించుకుంటూ... ఇంతగా అభివృద్ధి చెందిందని మనం గొప్పలు చెప్పుకుంటున్న వేళ ఆక్సిజన్ అందక యూపీలో సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందడం ఒక మాయనిమచ్చ. హెల్త్ టూరిజం పెరుగుతూనే ఉన్నప్పటికీ... ప్రస్తుతం దేశంలోని ఆసుపత్రుల్లో కార్పొరేట్ రంగ ప్రభావం విస్తృతమవుతోంది. ఆరోగ్య పర్యాటకం అనే అంశంలో ఒకనాడు దాదాపు ఏమీ లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మనదేశం రూ. 19, 226 కోట్లు (మూడు బిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించే స్థితిలోకి వచ్చింది. 2020 నాటి అంచనా లెక్కల ప్రకారం ఇది రూ. 51,270 కోట్లు (8 బిలియన్ యూఎస్ డాలర్లు)కు చేరనుంది. అయితే కార్పొరేట్ రంగంలో హార్ట్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మెదడులోని అత్యంత సున్నితమైన సర్జరీలు వీలుకాని చోట్లలోనూ రేడియేషన్ ఇవ్వగల స్టీరియోటాక్టిక్ రేడియేషన్ చికిత్సలను అందించగల అత్యాధునిక స్థాయి వైద్యకేంద్రాలు ఇక్కడ కొత్తవి ఎన్నో వస్తున్నాయి. దాంతో పాశ్చాత్యదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే చాలా మంది విదేశీయులు సైతం భారత్కే తరలి వస్తున్నారు. కానీ మనదేశస్తులకే వాటిని అందిపుచ్చుకునేంత ఆర్థిక స్తోమత లేదు. అంటే విదేశీయుల కరెన్సీలతో పోల్చుకున్నప్పుడు వాళ్లకు చాలా చవకగా లభ్యమయ్యే చాలా ఆధునాతన వైద్య సదుపాయాలు స్వదేశీయులకు మాత్రం అందడం లేదు. అందరికీ ఆరోగ్యం కోసం జరగాల్సిందేమిటి? చిన్న చిన్న అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం ద్వారానే చాలా ఆరోగ్యరంగంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. దాంతో సమాజమూ ఆరోగ్యంగా మారే అవకాశమూ ఉంది. ఉదాహరణకు...అందరికీ పుష్టికరమైన పోషకాహారం లభ్యత ద్వారా ఆరోగ్యం బాగుటుంది. అయితే సమాజంలోని 30 శాతం మందికి ఆహార లభ్యత లేని కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బులు వస్తున్నాయి. మరో 30 శాతం మందికి ఆహారం ఎక్కువైన కారణంగా డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకే అందరికీ సమతులాహారం అందేలా విధానాల రూపకల్పన జరగాలి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీళ్లు దొరకడం లేదు. దాంతో చిన్న చిన్న గ్రామాల్లోనూ ‘సీసాలలో మంచినీళ్లు’ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ‘కొనుక్కోగలిగితేనే నీళ్లు’ అనే ప్రస్తుత పరిస్థితి నుంచి ‘ఆరోగ్యం కోసం అందరికీ నీళ్లు’ అనే విధంగా ప్రభుత్వాలు సురక్షితమైన మంచినీరు అందించాలి.మంచినీళ్లు లభ్యం కావడం లేదు కానీ... అలాంటి చోట్ల కూడా జబ్బులను ప్రేరేపించే మద్యం, సారాయి వంటివి మాత్రం విరివిగా దొరుకుతున్నాయి. ప్రభుత్వాలే మద్యాన్ని ఒక లాభదాయకమైన ఆదాయ వనరుగా చూస్తూ, మద్యం మీద భారీగా వ్యాపారం చేస్తున్నాయి. ఇది సరికాదు. అలాగే పొగతాగడం హానికరం అనే సూచనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. పనిచేసే అలవాటును మరింతగా ప్రోత్సహించాలి. పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది. ఆదాయం బాగుంటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ, అంశాలను కొనుక్కోవచ్చు. కానీ మనం మన పిల్లలను స్కూలు దశ నుంచే క్రమంగా శారీరక శ్రమకు దూరం చేస్తున్నాం. దాంతో పని అలవాటుతో పాటు వ్యాయామాలు సైతం కొరవడి జబ్బులు వస్తున్నాయి.ఆహారం, నీళ్లు, పని, దురలవాట్లు దూరం చేయడం అనే ఈ ప్రాథమిక అంశాలతోనే చాలావరకు సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంతో పాటు... అనేక రుగ్మతలను మొదట్లోనే తుంచేయవచ్చు. అనేక జబ్బులను సమర్థంగా నివారించవచ్చు. – డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు -
శంకర్దాదాలు!
కాసులకోసం కడుపుకోత అవసరం లేకపోయినా 22మందికి సిజేరియన్ కాన్పులు ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు వసూలు కోయిలకొండలో ఓ ఆర్ఎంపీ ఆగడాలు గ్రామాల్లో ప్రభుత్వవైద్యంపై కొరవడిన అవగాహన కోయిల్కొండ మండలం చన్మన్పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాపకు కడుపునొప్పిరావడంతో పాఠశాలనుంచి తండాకు వచ్చింది. రాధికను ఆమె తాత అభంగపట్నం గ్రామంలోని ఖలీం అనే ఆర్ఎంపీ నడుపుతున్న దవాఖానాకు తీసుకెళ్లాడు. అక్కడ చూపిస్తే ఆపరేషన్ చేయించాలని, మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశాడు. మరుసటి రోజు రాధికకు ఆపరేషన్ చేశారు. ఇంతకు రాధికకు కడుపునొప్పి ఎందుకు వచ్చిందో చెప్పింది లేదు. కేవలం డబ్బుల కోసం చిన్నారి కడుపును కోశారు. కోయిల్కొండ మండల పరిధిలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు చేశారని తేలింది. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. అంటే వీరు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారన్నది సుస్పష్టమవుతోంది. సాక్షి, మహబూబ్నగర్ పేదల ప్రజల అమాయకత్వం వారికి ఆసరా.. శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా కాసుల కోసం ఆపరేషన్లు చేసేస్తున్నారు. కమీషన్ వస్తుందంటే చాలు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనవసరపు ఆపరేషన్లు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండ మండలంలో కన్నతల్లులకు కడుపుకోతలు మిగుల్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ రొనాల్డ్రోస్ తనిఖీలతో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని అభంగపట్నం గ్రామంలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నా ఖలీం అనే వ్యక్తి చిన్నచిన్న జబ్బులకు వైద్యంచేస్తూ నిర్లక్షరాస్యులు, పేదలను నమ్మించాడు. కొన్నిరోజుల తరువాత కడుపునొప్పితోపాటు ఇతర వ్యాధులు వచ్చినవారు ఖలీం వద్దకు వైద్యం కోసం వస్తే ‘మీకు ఆపరేషన్ చేయాలని లేకుంటే రోగం నయం కాదని’ చెప్పి జిల్లా కేంద్రంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. గ్రామంలో ఎవరిని తట్టినా తమకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందని, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయని చెబుతుండడం ఖలీం వైద్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కో ఆపరేషన్కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు దండుకుని తనకిచ్చే కమీషన్ను తీసుకుంటున్నాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 20ఆర్ఎంపీల క్లీనిక్లు ఉండగా, అనధికారికంగా 150కిపైగా ఉంటాయి. కలెక్టర్ పర్యటనతో వెలుగులోకి.. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన ది నోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు వేయిం చేందుకు కలెక్టర్ రొనాల్డ్రోస్ కోయిలకొండ మండలంలోని చన్మయిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్కు ఇద్దరు బాలికలు కనిపించారు. బడికి వెళ్లకుండా బయటకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ బాలికలు తమకు ఆపరేషన్ అయిందని చెప్పడంతో ఎవరు చేశారని.. ఏం ఆపరేషన్ అని కలెక్టర్ వారిని అడిగారు. దీంతో ఆర్ఎంపీ ఖలీల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. వెంటనే కలెక్టర్ రొనాల్డ్రోస్ అతడిపై విచారణ చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ఎంపీ వైద్యంపై కొరవడిన నిఘా గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన ఆర్ఎంపీ క్లీనిక్లపై జిల్లా వైద్యాధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. క్లీనిక్లకు వచ్చిన నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్ఎంపీలు ప్రసవాలు, ఆపరేషన్లు, ఆబార్షన్లు చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్కొండమండలంలోని అభంగపట్నంలో క్లీనిక్ సెంటర్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆపరేషన్లు చేయించిన ఆర్ఎంపీ ఖలీంపై కేసునమోదు చేసినట్లు కోయిల్కొండ ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పరారీలో అతడిని వెంటనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు. విచ్చలవిడిగా ఆర్ఎంపీ కేంద్రాలు మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ, నారాయణపేట, కోస్గి, జడ్చర్ల, నవాబ్పేట, ధన్వాడ మండలాల్లో ఆర్ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెబ్యులైజర్, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినవారికి అత్యవసర సేవలు అందించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీలు ఎక్స్రే, ప్రిస్కిప్షన్లు రాస్తూ చికిత్స చేస్తున్నారు. ఇటీవల నారాయణపేటలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన చికిత్సకారణంగా రోగి కాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోగి ప్రమాదకరస్థితిలో ఉండగానే సంబంధిత నకిలీ వైద్యులు ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయా శాఖలో ఉండే ఉన్నతాధికారులకు భారీస్థాయిలో ముడుపులు ముట్టచెప్పుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 112 ఆపరేషన్ల గుర్తింపు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి విచారణ చేయగా 112మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీటిలో గర్భసంచి తొలగించినవి 41, అపెండిసైటిస్ 22, సిజేరియన్లు 49 ఉన్నాయి. దీంట్లో ఖలీల్ అనే ఆర్ఎంపీ 22ఆపరేషన్లు చేయించినట్లు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా, పేదల వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం గ్రామీణులకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం కలిగించలేకపోతుంది. ఏ చిన్నజబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కలెక్టర్ పర్యటనలో వెలుగులోకి వచ్చిన ఆపరేషన్లను పరిశీలిస్తే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినవే కావడం గమనార్హం. -
వారి హృదయాలు.. పదిలం..!
విజయవాడ (లబ్బీపేట) : వారంతా ఇంగ్లాండ్ దేశానికి చెందిన వారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రోగులకు సేవలందించడంలో అత్యంత నిష్ణాతులు. ఇంగ్లాండులోని హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా హాస్పటల్లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఐదు రోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ చికిత్సలు చేసేందుకు పిడియాట్రిక్ కార్డియాలజీ విభాగానికి చెందిన నిష్ణాతులైన వైద్యులతో పాటు, ఇంటెన్సివ్ కేర్ నర్సింగ్ సిబ్బంది విచ్చేశారు.ఆరు నెలల వయస్సు నుంచి పదేళ్ల వయస్సున్న 26 మంది చిన్నారులకు ఐదురోజుల పాటు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆత్మీయ సేవలు శస్త్ర చికిత్స అనంతరం కార్డియాక్ ఐసీయూలో వున్న చిన్నారులకు ఇంగ్లాండ్ ఇంటెన్సివ్ కేర్ బృందం విశేష సేవలందించారు. ఆప్యాయంగా చిన్నారులను పలుకరిస్తూ వారిలో ఉల్లాసాన్ని నింపేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. వారికి రక్తం ఎక్కించడం, మందులు వేయడం వంటి అన్ని పనులను వారే చూసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్లో సర్జరీ అయిన తర్వాత చిన్నారులకు అందించే సేవలపై ఇక్కడి నర్శింగ్ సిబ్బందికీ అవగాహన కల్పించారు. కాగా దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ సేవలు అందించిన ఇంగ్లాండ్ బృందం సేవలపై చిన్నారుల తల్లిదండ్రులతో పాటు, ఇక్కడి వైద్యం బృందం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చేందుకు వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులు వీరే యూకే నుంచి వచ్చిన బృంద సభ్యులలో పిడియాట్రిక్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, పిడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు డాక్టర్ రమణ దన్నపనేని, డాక్టర్ ఆనంద్వా, డాక్టర్ అపర్ణహాస్కోట్, డాక్టర్ బలరామ్బాబు, డాక్టర్ ఫిల్ ఆర్నాల్డ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం చెల్లప్పన్, సిబ్బంది లూయిగి సెరిల్లో, జాన్ గిల్రాయ్, షారోన్ గోమనీ గ్రాన్ఉడ్, రాచెల్ వెబ్స్టార్లు ఉన్నారు. వీరికి ఆంధ్రా హాస్పటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె. శ్రీమన్నారాయణ, కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్, కార్డియో అనస్థీషియా రమేష్ తమవంతు సహకారం అందించారు. -
వయసు 25.. సర్జరీలు 100
⇒ పాకిస్తానీ యువతికి 100వ సర్జరీ లాహోర్: జీవితంలో ఎప్పుడో తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తేనే శస్త్రచికిత్స వరకు వెళ్తాం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సర్జరీ చేసుకున్నవారు కాస్త బలహీనంగానే ఉంటారు. అలాంటిది ఒకసారికాదు రెండుసార్లు కాదు.. ఏకంగా వందోసారి శస్త్రచికిత్స చేయించుకుంది ఓ పాకిస్తానీ యువతి. ‘అరుదైన చర్మవ్యాధితో బాధపడుతున్న ఫౌజియా యూసుఫ్కు 100వ శస్త్రచికిత్సను పూర్తిచేశాం. ఫిబ్రమటోసెస్గా పిలిచే ఈ సమస్య ఆమెకు చిన్నతనంలోనే ఎదురైంది. దీంతో పదే పదే సర్జరీ చేయడం మినహా మరో మార్గం లేకపోవడంతో ఇన్నిసార్లు సర్జరీ చేయాల్సి వచ్చింద’ని షేక్ జాఝెద్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఫౌజియా మీడియాతో మాట్లాడుతూ... ‘మరిన్నిసార్లు కూడా సర్జరీ చేయించుకునేందుకు నేను సిద్ధమే. అంతే కానీ వ్యాధి కారణంగా పెరుగుతున్న నా కుడి భుజాన్ని తొలగించుకునేందుకు నేను సిద్ధంగా లేను. నా ప్రాణాలు కాపాడేందుకు భుజాన్ని తొలగించుకోవడం మేలని వైద్యులు చెప్పారు. లేదంటే వ్యాధి మెడవరకు వ్యాపిస్తుందని హెచ్చరించారు. అయినా సరే.. చావడానికైనా సిద్ధమేకానీ భుజం లేకుండా బతకలేను. ఓ వికలాంగురాలిగా బతకడం నావల్ల కాదు' అని ఫౌజియా చెప్పింది. -
ఆ గుండెల్లో నువ్వు పదిలం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ.. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్సార్! ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల ముంగిట నిలిపిన ఈ పథకం లక్షలాది మంది బతుకుల్లో వెలుగులు నింపింది. ఆరిపోతున్న జీవితాలకు ఆయువు పోసింది. గుండెకు పడిన చిల్లులను ఉచితంగా పూడ్చింది. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు తెలంగాణలో 14.72 లక్షల మంది పేదలకు శస్త్రచికిత్సలు చేశారు. అందుకు వైఎస్ హయాం నుంచి ఇప్పటివరకు రూ.3,858 కోట్లు ఖర్చు చేశారు. పథకం ప్రారంభమైన 2007-08లో తెలంగాణలో 7,105 మందికి శస్త్రచికిత్సలు చేశారు. అందుకు నాటి ప్రభుత్వం రూ.31.12 కోట్లు ఖర్చు చేసింది. 2008-09 నుంచి పథకం పేదలకు మరింత దగ్గరైంది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. 2008-09లో ఏకంగా 86,287 శస్త్రచికిత్సలు నిర్వహించారు. అందుకు వైఎస్ ప్రభుత్వం రూ.261.15 కోట్లు వెచ్చించింది. 2009-10లో ఆపరేషన్ల సంఖ్య 1.29 లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో 2.36 లక్షల మందికి, 2015-16లో 2.60 లక్షల మందికి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ పథకం కింద గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవ మార్పిడులను కూడా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్యాన్సర్లో కీలమైన నాలుగు శస్త్రచికిత్సలకు కూడా అవకాశం కల్పించింది. -
నీళ్లు లేక ఉస్మానియాలో ఆగిన ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో నీరు లేకపోవడంతో శనివారం పలు శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్స సమయంలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక ఏకంగా నాలుగు ఆపరేషన్ థియేటర్లకు తాళాలు బిగించారు. ఫలితంగా 50కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో తెల్లవారుజామునే ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. అంతేకాదు మూత్రశాలలు, మరుగుదొడ్లకు గత మూడు రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, ఇతర రోగులు, వారికి సహాయంగా వచ్చిన బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేక వైద్యులు కూడా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. రోజుకు 50 లక్షల లీటర్లు అవసరం: ఆస్పత్రి ఔట్పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 2,000-2,500 మంది రోగులు వస్తుంటారు. ఇన్పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వైద్యులు మరో 200 ఉంటారు. ప్రతి రోజు 150-200 శస్త్రచికి త్సలు జరుగుతుంటాయి. రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా 29.47 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని 14 ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ట్యాంకులకు మూతల్లేక పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకుల్ని 15 రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారీ చేయడం లేదు. పది మంది ఆర్ఎంవోలున్నా..: పంపింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ట్యాంకులను క్లీన్ చేయడంతో పాటు నీటి సరఫరా, నిల్వలను పరిశీలించాలి. కానీ వీరెవరూ కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదు. పది మంది ఆర్ఎంవోలు పని చేస్తున్నా.. వీరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకున్నా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పుచ్చుకుని వంద శాతం మార్కులు వేస్తుండటం కొసమెరుపు. -
‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్
కేసును సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్ సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ), లోకాయుక్త సీరియస్గా స్పందించాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం శుక్రవారం సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం శనివారం ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించనుంది. బాధితులకు చికిత్సలు.. కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారిలో 13 మంది ఇన్ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి కార్నియాను సేకరించి బాధితుల్లో ఒకరైన నూకాలమ్మతల్లికి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా తెలిపారు. ఇక సరోజినీ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేయడంతో శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ థియేటర్లను తిరిగి తెరిచేదాకా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్సలు చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను కూడా ఉస్మానియా, గాంధీలకు తరలించి, శస్త్రచికిత్సలు చేయనున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ ఫిర్యాదు..: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కో-కన్వీనర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైదరాబాద్లోని హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి ‘‘రాష్ట్ర ప్రభుత్వం రోగుల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదు. నాసిరకం మందులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టాలి. ఎంతో పేరుపొందిన సరోజిని ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. సర్జరీలకు ముందే ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసుకోవాలన్న కనీస సూత్రాన్ని వైద్యులు పాటించలేదు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’’. - చెరుకు సుధాకర్,తెలంగాణ ఉద్యవు వేదిక చైర్మన్ వైద్యులపై కేసులు నమోదు చేయొద్దు: టీజీడీఏ నాసిరకం మందులు తయారు చేసిన కంపెనీలను, కొనుగోలు చేసి సరఫరా చేసిన టీఎస్ఎంఐడీసీ అధికారులను వదిలేసి రోగులకు చికిత్స చేసే వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం దుర్మార్గమని తెలంగాణ వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. వైద్యులపై కేసులు నమోదు చేయాలని చూస్తే ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. -
నిమ్స్లో కోల్డ్వార్
► ఇమడలేక వీడిపోతున్న వైద్యులు ► దీర్ఘకాలిక సెలవులో సర్జికల్ ఆంకాలజిస్ట్ ► సీనియర్లు లేక మూతపడుతున్న థియేటర్లు సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని కొంతమంది వైద్యుల మధ్య నెల కొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వైద్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. విభాగాధిపతులు, ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రతిభావంతులైన పలువురు సీనియర్ వైద్యులు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆస్పత్రిలో 70కి పైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అంతర్గత పోరు, వనరుల లేమికి తోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఇదే కారణంతో ఆస్పత్రిని వీడుతున్నట్టు అధికారులే అంగీకరిస్తున్నారు. మనస్తాపంతో దీర్ఘకాలిక సెలవు సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాదే పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులు భర్తీ చేయక పోవడంతో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో 50 పడకలను సర్జికల్ ఆంకాలజీ రోగులకు కేటాయించారు. ఇక్కడ నిత్యం 50-60 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి కేటాయించిన రెండు ఆపరేషన్ థియేటర్లలో రోజుకు సగటున 8-10 శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. సర్జికల్ ఆం కాలజీ విభాగానికి మూడు ఐసీయూ బెడ్స్ను కేటాయించారు. వీటిని కూడా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడు కబ్జా చేశాడు. దీంతో ఇరు విభాగాధిపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ అంశాన్ని డెరైక్టర్ దృష్టికి తీసుకెళితే.. తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. మెడికల్ సూపరింటిండెం ట్ కూడా జనరల్ సర్జరీ విభాగాధిపతికి కొమ్ముకాస్తున్నారు. మనస్తాపం చెందిన సదరు సర్జికల్ ఆంకాలజీ అధిపతి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని వారం రోజుల్లో ఇంటికి తిరిగి వెళ్తామని భావించి వచ్చిన రోగులు నెలల తరబడి వార్డుల్లోనే మగ్గాల్సి వస్తోంది. వేధింపులతో ఇమడలేక.. న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి ఇప్పటికే వెళ్లిపోగా, సీని యర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా నిమ్స్ ను వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇం దుకు కారణమని తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీ నామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు 10-15 శాతానికి పడిపోవడానికి కూడా ఇదే కారణం. పాత భవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు. ల్యామినర్ ఎయిర్ ఫ్లో లేదు. చిన్నపాటి వ ర్షం కురిసినా పైకప్పు కారుతోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండడం వల్ల రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్ఎస్పై వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడడం గమనార్హం. -
వైద్యసేవ డబ్బుల సంగతి తేల్చండి
గత ఏడాది జూన్ నుంచి చెల్లింపులు లేవు ఇలాగైతే సర్జరీలు చేస్తాం.. కానీ రిజిష్టర్ చేయం వైద్యశాఖ కార్యదర్శికి వైద్యుల సంఘం వినతి విజయవాడ (లబ్బీపేట) : ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో సర్జరీలు చేయించుకున్న ప్రభుత్వాస్పత్రి రోగులకు ఇంటికి వెళ్లేటపుడు చెల్లించాల్సిన చార్జీల విషయం తేల్చాలని మెడికల్ కో-ఆర్డినేటర్లు కోరుతున్నారు. రోగులకు వైద్యసేవ పథకంలో సర్జరీలు చేయడంతో ప్రభుత్వాస్పత్రికి ఆదాయం వస్తుంది. కానీ ఆ రోగులు ఇంటికెళ్లేటప్పుడు ఇవ్వాల్సిన చార్జీలను నిలిపి వేయడంతో మెడికల్ కో-ఆర్డినేటర్లు తమ జేబులో డబ్బులు ఇవ్వవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఎన్టీఆర్ పథకం ద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతున్నా, వాటిని వైద్యులకు రావాల్సిన చెల్లింపులతో పాటు, రోగులకు ఇచ్చే చార్జీల డబ్బులు కూడా నిలిపివేసారని వారు పేర్కొంటున్నారు. నిబంధనలు ఇలా.. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినపుడు ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ సర్జరీలకు వచ్చే డబ్బులతో 20 శాతం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వద్ద ఉంచుకుని మిగిలిన 80 శాతం ఆస్పత్రికి విడుదల చేశారు. వాటిలో 35 శాతం సర్జరీ బృందం తీసుకోవాల్సి ఉంది. ఏడాదికి ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవ పథకంలో సర్జరీలు చేస్తున్నా వైద్యులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలేం జరిగిందంటే.. ప్రభుత్వాస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సమకూరిన నిధులు ప్రత్యేక అకౌంట్లో ఉండేవి. వాటిపై జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెక్ పవర్ ఉండేది. రూ.100 చెల్లింపునకు సైతం ఆయన వద్దకు చెక్కు కోసం వెళ్లడం కష్టమవడంతో చెల్లింపులు జాప్యం జరుగుతుందని అప్పట్లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం పలువురు వైద్యులు నాటి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఓ వైద్యునికి ఆరోగ్యశ్రీ చెల్లింపులకు సంబంధించి చెక్పవర్ ఇచ్చారు. కొన్నాళ్లు పని సజావుగానే జరిగింది. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేవారు. అయితే కలెక్టర్గా బాబు.ఎ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ అకౌంట్ లావాదేవీలు తానే చేస్తానని వైద్యునికి ఇచ్చిన డ్రా పవర్ను రద్దు చేశారు. దీంతో గత ఏడాది జూన్ నుంచి అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి. వైద్య శాఖ కార్యదర్శికి వినతి ఎన్టీఆర్ వైద్య సేవ చెల్లింపులు నిలుపుదల చేయడంపై ప్రభుత్వాస్పత్రికి తనిఖీలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శికి టీచింగ్ వైద్యుల సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.అప్పారావు వినతిపత్రం సమర్పించారు. ఇలాగైతే తాము సర్జరీలు చేస్తాము కానీ, ఎన్టీఆర్ వైద్య సేవలో రోగిని రిజిస్ట్రేషన్ చేయమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఆరోగ్యశ్రీ నిధులు రూ.కోట్లలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. వారి వినతిపై స్పందించిన పూనం మాలకొండయ్య ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. ఇదే వినతిపత్రాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ అయ్యర్, డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావులకు కూడా అందజేశారు. -
కటింగ్ అప్పుడే మొదలైంది!
ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆధునిక కాలంలోనూ వాడుకలో ఉన్న పురాతన వస్తువుల్లో కత్తెర ఒకటి. ప్రాచీన ఈజిప్టులో కత్తెరల వాడుక క్రీస్తుపూర్వం 1500 ఏళ్ల నాడే మొదలైంది. అప్పట్లో పలచని లోహపు రేకును మధ్యకు వంచి, రెండువైపులా పదునైన చాకుల్లా ఉండేలా తయారు చేసేవారు. అప్పటి కత్తెరలను అడకత్తెరలా అరచేత్తో నొక్కాల్సిందే తప్ప వేళ్లతో తేలికగా ఆడించేందుకు రింగుల పిడి ఏర్పాటు ఉండేది కాదు. అప్పట్లో వాడే కత్తెరలకు మధ్యన వంచిన భాగం స్ప్రింగులా ఉపయోగపడేది. మధ్యయుగాల్లో కత్తెరల తయారీ కాస్త పరిణామం చెందింది. ఇనుము లేదా ఉక్కుతో రెండు చాకులను విడివిడిగా తయారు చేసి, తేలికగా కదిపేందుకు వీలుగా వాటి మధ్యలో స్ప్రింగు అమర్చేవారు. అయితే, రింగుల పిడితో విడివిడిగా ఉన్న రెండు చాకులతో ఆధునిక కత్తెరలను ఇంగ్లండ్కు చెందిన విలియమ్ వైట్లీ అండ్ సన్స్ కంపెనీ క్రీస్తుశకం 1760 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. ఆ కంపెనీ ద్వారా తొలిసారిగా ‘332’ ట్రేడ్మార్కుతో బ్రాండెడ్ కత్తెరలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రకరకాల పరిమాణాల్లోని కత్తెరలు రకరకాల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినా, వాటి డిజైన్లో పెద్ద మార్పు రాలేదు. కత్తెరలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత శస్త్రచికిత్సలు చేయడం తేలికైంది. దుస్తుల తయారీ సహా ఫ్యాషన్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. వంటింటి అవసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు రకరకాల కత్తెరలు విరివిగా ఉపయోగంలోకి వచ్చాక ఇవి మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారాయి. -
ఆ‘పరేషాన్’..!
వనపర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు, శస్త్రచికిత్సలు(సిజేరియన్) నిలిచిపోయాయి. కొన్ని ఆస్పత్రుల్లో మత్తు(అనస్తిషీయా)వైద్యులు లేకపోగా.. మరికొన్నిచోట్ల గైనకాల జిస్టులు లేరు. కాన్పుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల కు వెళ్లిన పేదలకు పగలే చుక్కలు కనిపిస్తున్నా యి. సాధారణ ప్రసవమైనా సరే రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతున్నాయి. జి ల్లా ఆస్పత్రిలో తప్పితే.. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట, సీహెచ్ఎస్ బాదేప ల్లి, షాద్నగర్, కల్వకుర్తి, అలంపూర్, కల్వకుర్తి, రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు అస లు జరగడమే లేదు. కాన్పులు కూడా అరకొరగానే జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో మత్తుమందు వైద్యులు, గైనకాల జిస్టులను నియమిస్తే సమస్య కొంత తీరేది. కా నీ చాలా ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులు లే రు. జిల్లాలో కార్పొరేట్ తరహాలో రూపొం దించిన ఏరియా, సీహెచ్ఎస్ ఆస్పత్రుల్లో జిల్లా నలుమూలల నుంచి పురిటినొప్పులతో వచ్చే గర్భిణులకు సర్కారు ఆస్పత్రుల్లో సేవలు అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకువేలు ఖర్చుచేస్తున్నారు. పీజీ వైద్యులు వెళ్లిపోవడంతో.. గైనకాలజిస్టులు పీజీకోర్సుల్లో భాగంగా జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులకు ఏడాది క్రితం వచ్చారు. సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు వారిని సమన్వయం చేస్తూ వైద్యసేవలను విని యోగించుకునేవారు. శిక్షణ గైనకాలజిస్టులకు చే దోడువాదోడుగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఇ తర వైద్యులు ఆపరేషన్లు కొనసాగించేవారు. ఏ డాది శిక్షణకాలం పూర్తయిన తరువాత వారు గతనెల చివరిలో వెళ్లిపోవడంతో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. గైనకాలజి స్టులు, మత్తుమందు వైద్యుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండటంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్ర భుత్వ ఆస్పత్రులు ఈనెల చివరివారంలో జరిగే పీజీ వైద్యుల కౌన్సెలింగ్పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే పలుమార్లు డీసీహెచ్ఓ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. డిప్యూటేషన్ వైద్యులు వీరే.. గైనకాలజిస్ట్లు బాదేపల్లిలో ఉమ, డీసీహెచ్ఓ పద్మ, కల్వకుర్తిలో సంధ్యరాణి, అచ్చంపేటలో అర్చన, చిన్నపిల్లల వైద్యులు షాద్నగర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వినోద్కుమార్, జిల్లా ఆస్పత్రిలో బి.శంకర్, నాగర్కర్నూల్లో ఫిరోజోద్దీన్, వి జయ్కుమార్, ఘనపురంలో హర్షదుల్లా, మత్తముందు వైద్యులు షాద్నగర్లో లక్ష్మి, మహబూబ్నగర్ తేజస్విని, అలంపూర్లో రాంబాబు డిప్యూటేషన్లో కొనసాగుతున్నారు. -
ఫ్యామిలీ ‘ప్లానింగ్’
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడంలో మన జిల్లా ముందువరుసలో నిలిచింది. నూటికి నూరుశాతం శస్త్రచికిత్సలు నిర్వహించి తన సత్తా చాటుతూ వస్తోంది. గతంలో వరుసగా ఏకంగా పదమూడు సంవత్సరాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఘనత జిల్లాకే దక్కింది. అదే రీతిలో మూడేళ్లుగా లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తూ జిల్లాకు పూర్వవైభవాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకువస్తోంది. నల్లగొండ టౌన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో రాష్ట్ర స్థాయిలో 2012-13 సంవత్సరంలో అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ వస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 24 వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా 24,045 ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు దక్కించుకుంది. అదే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అవార్డును పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరింత రెట్టింపు ఉత్సాహంతో మార్చి 31 నాటికి 22,050 శస్త్ర చికిత్సలను నిర్వహించి నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను చేసిన ఘనతను సాధించిన జిల్లాల జా బితాలో చేరింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో పాటు సంబంధిత అధికారులు ప్రతి నెలా మండలా ల వారిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సమీక్షలను నిర్వహించిన కారణంగానే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు. అదే స్ఫూర్తితో పనిచేసిన సిబ్బంది తిరిగి జిల్లాను మూడోసారి కూడా ల క్ష్యానికి మించి శస్త్రచికిత్సలను చేసిన జిల్లాల జాబితాలో చేర్చారు. గతంలో కూడా కుటుంబ నియంత్రణలో జిల్లా 1993-94 ఆర్థిక సంవత్సరం నుంచి 2005-06 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 13 సంవత్సరాలు నూటికి నూరుశాతానికి మించి శస్త్ర చికిత్సలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో వరసగా అవార్డులను సాధించిన ఘనత వైద్య ఆరోగ్య శాఖకు ఉంది. కుటుంబ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులే ప్రజలలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులకు తోడు కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లా ప్రజలు అత్యధికంగా కుటుంబ నియంత్రణను పాటిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దానికి తోడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కుటుంబ నియంత్రణపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇద్దరు పిల్లలకే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందుకువస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. ఇక ఉద్యోగస్తులతో పాటు సంపన్నులు ఒక్కరికే సరిపుచ్చుకునే ఆలోచనకు రావడం కలిసివచ్చినట్లు అయ్యింది. కుటుంబ నియంత్రణను పాటించడంలో మగవారికంటే మహిళలే ముందు వరుసలో ఉంటున్నారు. కుటుంబపోషణ, పిల్లల పెంపకం, వారిని స్కూళ్లకు పంపడం, ఇంటి పని, వంట పనులతో పాటు ఉద్యోగం, వ్యవసాయ పనులు, కూలీ పనులతో బిజీబిజీగా ఉండే మహిళలు ఒక్కరు లేక ఇద్దరు చాలు అనే ఆలోచనకు రావడం వల్ల కుటుంబ నియంత్రణలో వారే ముందుకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు సింహభాగంలో.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను చేయించుకోవడంలో మహిళలే సింహభాగంలో ఉంటున్నారు. వేళ సంఖ్యలో మహిళలు శస్త్ర చికిత్సలను చేయించుకుంటుంటే మగవారు మాత్రం కేవలం పదుల సంఖ్యలో వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకుంటూ కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలదే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. వేసెక్టమీ చేయించుకున్న మగవారి సంఖ్య ఇలా ఉంది. 2008-09 సంవత్సరంలో 162 మంది, 2009-10లో 126, 2010-11లో 73 , 2011-12లో 47, 2012-13లో 45, 2013-14లో 39 , 2014-15లో 28 మంది మగవారు మాత్రమే వేసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. ఏటేటా సంఖ్య పెరగకుండా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళలకు ఎంత ఉంటుందో మగవారికి కూడా అంతే ఉంటుందని గ్రహించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సమష్టి కృషితో సాధించాం ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, టెక్సీషియన్లతో పాటు అన్ని తరగతుల అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే లక్ష్యానికి మించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికి త్సలు నిర్వహించాం. వరుసగామూడేళ్లుగా నూటికి నూరుశాతం మించి శస్త్ర చికిత్సను నిర్వహించడం ఆనందంగా ఉంది. కుటుంబ నియంత్రణపై ప్రజలలో బాగా అవగాహన పెరి గింది. స్వచ్ఛందంగా శస్త్రచికిత్సలను చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మహిళల మాదిరిగా మగవారు కూడా వేసెక్టమీ ఆపరేషన్లను చేయించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో అందరం సమష్టిగా పనిచేసి 2015-16 లక్ష్యాన్ని కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతాం. - డాక్టర్ పి.ఆమోస్,డీఎంహెచ్ఓ -
అమెరికన్ ‘ఎవడు’!
ఎవడు సినిమా చూశారా? అందులో హీరో అల్లు అర్జున్ ముఖం కాలిపోవడంతో చనిపోయిన మరో హీరో రాంచరణ్ తేజ్ ముఖాన్ని అమరుస్తారు. ఇదీ అదే స్టోరీ! సినిమా కన్నా ముందే అమెరికాలో నిజంగా జరిగింది. కథలోకెళితే.. రిచర్డ్ లీ నోరిస్ అనే వర్జీనియా యువకుడు ఓ రోజు తప్పతాగి ఇంటికొచ్చాడు. తల్లి చెడామడా తిట్టేసింది. మనోడు నాటు తుపాకీ అందుకున్నాడు. దవడ కింద ఉంచుకుని కాల్చుకుంటానని బెదిరించాడు. ఆమె వెనక్కి తగ్గడంతో తుపాకీ కిందకి దించాడు. తూటా పైకి దూసుకుపోయింది. ఇంకేం.. ముఖం పచ్చడైంది. దవడలు పగిలాయి. ముక్కు ఎగిరిపోయింది. నాలుక ఒక్కటే మిగిలి.. నోటి భాగంలో పెద్ద బొక్క పడింది! 1997లో ఇది జరిగింది. అప్పటి నుంచి 18 ఏళ్లు నరకం చూశాడు. 30 శస్త్రచికిత్సలు జరిగాయి. ముఖం వికృతంగా తయారైంది. ముఖం మార్చకపోతే చస్తాడు. మారిస్తే బతికే చాన్స్ 50 శాతమేనని వైద్యులు తేల్చారు. నిత్యనరకానికి తోడు బయటకెళ్లడమే మానేశాడు. వెళ్లాల్సి వస్తే పెద్ద టోపీ, మాస్కుతో ముఖాన్ని కప్పుకునేవాడు. ఆత్మహత్య గురించీ ఆలోచించాడు. ఇంతలో ఇతనికోసమే అన్నట్లు.. మూడేళ్ల క్రితం జోషువా అవెర్సనో(21) అనే యువకుడు కారు ప్రమాదంలో మరణించాడు. అతడి ముఖాన్ని దానం చేసేందుకు కుటుంబం అంగీకరించింది. దీంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డో రోడ్రిగ్ నేతృత్వంలోని 150 మంది వైద్యుల బృందం 36 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ పూర్తిచేసింది. కొత్తముఖంతో మరో జన్మెత్తిన నోరిస్ను జోషువా సోదరి రెబెకా ఇటీవల తొలిసారిగా కలుసుకుంది. చనిపోయిన తన సోదరుడి ముఖాన్ని మళ్లీ సజీవంగా చూసుకుని ఆనందబాష్పాలు రాల్చింది. అయితే.. కథ సగమే సుఖాంతమైంది! ఎందుకంటే నోరిస్ వయసు ప్రస్తుతం 39. అంతా సవ్యంగా జరిగితే కొత్త ముఖం 20 నుంచి 30 ఏళ్లు పనికొస్తుందట. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరించకుండా ఉండేందుకు జీవితాంతం మందులు వాడాలి. మళ్లీ మందుకొట్టినా, పొగ తాగినా, గాయం అయినా.. కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుంది! అందుకే.. ఎప్పుడు కొత్త ముఖాన్ని దేహం తిరస్కరిస్తుందో.. ఎప్పుడు మృత్యువు ముంచుకొస్తుందోనన్న భయంతోనే ఇతడు రోజూ నిద్రలేస్తున్నాడు. -
గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: గ్రహణమొర్రి బాధిత బాలల పెదవులపై చిరునవ్వులు పూయిం చేందుకు ‘స్మైల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలోని శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు ఉచితంగా శస్త్ర చికిత్సలు జరపనున్నారు. కార్యక్రమ నిర్వహణలో భాగం గా శుక్రవారం స్మైల్ నెట్వర్క్ మెడికల్ టీం అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిం ది. ఫౌండేషన్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, టామ్ చిత్తా వీరికి స్వాగతం పలికారు. బేగంపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘ఏపీ, తెలంగాణలోని గ్రహణ మొర్రి బాధితులైన 60 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని, బాధితులకు వారి సహాయకులకు హాస్పిటల్ ఖర్చులు, భోజన వసతి, రవాణా ఖర్చులు కూడా సమకూర్చుతామం.’ అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెటైడ్ స్టేట్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ మల్లిన్స్, ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు సహకరిస్తున్న ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎన్.వి. సతీష్కుమార్రెడ్డి .. ఎఫ్.సి.ఎన్, స్మైల్ నెట్వర్క్ సేవల్ని ప్రశంసించారు. -
ఆపరేషన్ కష్టాలు
⇒ చేవెళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 20 ⇒ కు.ని. శస్త్రచికిత్సలు చేసింది 96 మందికి ⇒ బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు ⇒ వసతుల కల్పనలో విఫలమైన యంత్రాంగం చేవెళ్ల రూరల్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒకవైపు భారీగా ప్రచారం చేస్తున్నా.. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తరచూ ఇబ్బందుల మధ్యే ఆపరేషన్లు జరుగుతున్న విషయం జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనడానికి చేవెళ్లలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళల అవస్థలే నిదర్శనం. ఆస్పత్రిలో ఉన్నవి 20 పడకలే అయినా 96 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు. అందరికీ బెడ్లు సరిపోక కొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలోని పీహెచ్సీల నుంచి 96 మంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఉదయాన్నే పస్తులతో వచ్చారు. కానీ ఆపరేషన్లను మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేశారు. దీంతో మహిళలు చాలా నీరసించిపోయారు. దీనికి తోడు ఆస్పత్రి వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న 20 మంచాలపై ఇద్దరు చొప్పున 40 మందిని పడుకోబెట్టారు. మిగిలినవారిని వరండాలోని నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు. మహిళల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఆరుబయట వేసిన చిన్న టెంటు సరిపోకపోవటంతో చెట్ల కిందనే నిరీక్షించారు. తాగునీరు, బాత్రూంలు లేక అవస్థల పాలయ్యారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో వచ్చేవారికి ఆస్పత్రిలోని బెడ్లు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. మొదట ఆపరేషన్ పూర్తయినవారిని పంపిస్తూ.. ఆ తర్వాత చేసేవారికి బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కు.ని. ఆపరేషన్లలో వైద్యులు జయమాలిని, క్యాంపు ఇన్చార్జి కరీమున్నీషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సంస్కృతిని కాపాడుకుందాం
నెల్లూరు (కల్చరల్) : భారతదేశ ఉన్నతమైన సంస్కృతిని అందరం కలిసి కాపాడుకుందామని నార్త్ అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కోరారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన తానా ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ మాట్లాడుతూ మొదటి సారిగా జిల్లా చరిత్రలో తానా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు వారి ఐక్యతను చాటేందుకు కొంతమంది అమెరికాలో ఈ సంఘాన్ని స్థాపించారన్నారు. అతిపెద్ద ప్రవాస తెలుగు సంస్థగా నిలిచినందుకు గర్విస్తున్నామన్నారు. ఏ ప్రవాస భారత అసోసియేషన్ చేయని విధంగా రాష్ర్టంలో రూ.300 కోట్లతో సేవా కార్యక్రమాలు, కంటి శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో ఉన్నతమైన మనదేశ సంస్కృతిని రేపటి తరానికి అందజేయాలని ఎన్ఆర్ఐల సహకారంతో ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామన్నారు. అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను చిన్నారులకు పరిచయం చేయడం కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన చాలా మంది ఈ వేదికపై స్థానం పొందారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ భవిష్యత్ను నిర్మించుకోవాలని మోహన్ పిలుపునిచ్చారు. పుట్టిన గ్రామాలను మరవొద్దు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తల్లిదండ్రుల, పూర్వీకుల జ్ఞాపకాలతో నిండి ఉన్న మీ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరచాల్సిందిగా తానా కార్యక్రమాలకు విచ్చేసిన ఎన్ఆర్ఐలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. భారతీయులంతా, ప్రత్యేకంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా తమ ఐక్యతను చాటేందుకు ఈ తెలుగు సంఘాన్ని స్థాపించారన్నారు. కన్వెన్షన్ సెంటర్లో చేసిన ఈ ఏర్పాట్లను చూస్తుంటే అమెరికాలో జరుగుతున్న సభకే మనం వెళ్లినంత ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యాలయాలు, వైద్యాలయాలు, శ్మశానవాటికలను, పచ్చదనాన్ని పెంచడం ద్వారా మీ సేవలు చిరకాలం నిలిచిపోతాయని విన్నవించారు. ప్రతి ఏటా తనకు ప్రభుత్వం అందజేస్తున్న వేతనం రూ.60 లక్షలను ప్రజా ప్రయోజనానికే వెచ్చిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జూలై లో అమెరికాలో జరిగే 20వ ైద్వైవార్షిక తానా సభలు విజయవంతం కావాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు. సంప్రదాయానికి నిదర్శనం ఈ వేడుక : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నామనడానికి ఈ వేదిక ప్రత్యక్ష నిదర్శనం అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంచి ఉద్దేశంతో చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్లో మరిన్ని జరపాలని తానా నిర్వాహకులను ఆయన కోరారు. తానా సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వైద్య సదుపాయాలను అందించడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉన్నా జన్మభూమిని మరవకుండా, సంప్రదాయం, సంస్కృతిని కాపాడేందుకు ఎన్ఆర్ఐలు చేపట్టిన కార్యక్రమాలను వాకాటి కొనియాడారు. విద్యార్థులంతా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నెల్లూరు చరిత్ర ఘనమైనది : ఏపీఐఐసీ చైర్మన్ క ృష్ణయ్య నెల్లూరు జిల్లా ఘనమైన చరిత్ర కలిగినదని ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహా కవులను అందించిన ఘనత మన గడ్డదే అన్నారు. చరిత్రకు సంబంధించిన వివరాలను విశ్లేషించి స్మారక చిహ్నాలను నిర్మించాల్సిన అవసరముందన్నారు. గతంలో సంక్రాంతి అంటే హరిదాసు, జంగం దేవర తదితర కళాకారులతో పల్లెలు కళకళలాడేవన్నారు. నేటి తరం అలాంటి వేడుకల ప్రాశస్తాన్ని తెలుసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహనపెంచుకుని ఆరోగ్య కరమైన పద్ధతులను పాటించాల్సిందిగా విద్యార్థులను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్లో నడుస్తుందని, ఎన్ఆర్ఐలంతా రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తానా నిర్వాహకులను కోరారు. తెలుగు పండగలన్నింటిని అత్యంత సంప్రదాయంగా, సంస్కృతిని కాపాడే విధంగా జరుపుకోవడంలో తానా సభ్యులు ముందున్నారని ప్రశంసించారు. స్ఫూర్తిని ఇచ్చే కార్యక్రమం చేపట్టడం హర్షణీయం : మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే విధంగా, చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసే విధ రూపొందించిన ఈ కార్యక్రమాల నిర్వహణ హర్షణీయమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన తానా కార్యక్రమాలను నగరంలో నిర్వహించడం అభినందనీయం అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సాహిత్యంలో విశేష కృషి నెరిపిన ఆచార్య రవ్వా శ్రీహరికి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారాన్ని, జానపద కళకు కొత్త రూపం తీసుకువచ్చిన గొర్రెల రాములుకు నరసింహమూర్తి జ్ఞాపకార్థం స్మారక పురస్కారాన్ని అందజేశారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలందించిన అనురాధ, రామకృష్ణ దంపతులకు నగదు పురస్కారాన్ని, ఆర్థికంగా చితికిన రైతులు తోట హరిప్రసాద్, పి బాలకృష్ణారెడ్డి, ఎన్. రఘునాథ్కు ప్రత్యేకంగా తానా నిర్వాహకులు ఆర్థిక సహయాన్ని అందజేశారు. పాత్రికేయ పురస్కారాన్ని సింహపురి రైతు సంపాదకుడు నిరంజన్రెడ్డికి, విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్ట్లు శ్రీనివాసులు (హెచ్ఎంటీవీ), ఇబ్రహీం అలి (సీవీఆర్ న్యూస్) కుటుంబాలకు నగదు సహాయాన్ని అందజేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జబర్దస్త్ టీం ప్రేక్షకులను తమ హాస్యవల్లరితో రంజింప జేసింది. జిల్లాలో తానా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన చైతన్య స్రవంతి అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ రవి సన్నారెడ్డిని తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. 3 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించిన ఎస్వీఎస్ పోషక ఆహార సంస్థ వ్యవస్థాపకుడు ఆనందరావును సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్రావు, వైఎస్సార్సీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జేసీ రేఖారాణి, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపాల చౌదరి, తుంగా శివప్రభాత్రెడ్డి, ఎన్ఆర్ఐలు గంగాధర్ నాదెళ్ల, జయరామ్ కోమటి, సతీష్ వేమన, మధు తోట, లావు అంజయ్య చౌదరి, రవి గౌరినేని, రజని ఆకురాతి, వాసుదేవరెడ్డి, రవి పోట్లూరి, గౌతమ్ గుర్రం, రామ్ జక్కేపూడి, నరేంద్ర ఏలూరు, హరిత చదివె, రామ్ ఎలమంచిలి తదితరులు పాల్గొన్నారు.