-
ఏక్ షామ్.. చార్మినార్కే నామ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సాక్షి, చార్మినార్: చారిత్రక చార్మినార్ కొత్త శోభను సంతరించుకోనుంది. నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యాంక్బండ్ తరహాలోనే నో ట్రాఫిక్ జోన్గా మారనుంది. సందర్శకులకు మాత్రమే అనుమతించనున్నారు. ‘ఏక్ షామ్.. చార్మినార్కే నామ్’ కార్యక్రమానికి ఈ ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లోకి వాహనాల అనుమతించబోమని శనివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు, సందర్శకుల పార్కింగ్ వివరాలను ఆయన వెల్లడించారు. వాహనచోదకులు, సందర్శకులు సహకరించాలని కొత్వాల్ సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. అఫ్జల్గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్ వైపు పంపిస్తారు. ఫలక్నుమా, హిమ్మత్పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్మొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. బీబీ బజార్, మొఘల్పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ధన్కా మాస్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్ చౌక్ వైపు పంపిస్తారు. ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను లాడ్ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్ రోడ్లోకి పంపుతారు. పార్కింగ్ ప్రాంతాలివీ.. అఫ్జల్గంజ్, నయాపూల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్ మహల్లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్ ఉల్ ఆనం బాయ్స్ హై స్కూల్లో పార్క్ చేసుకోవాలి. ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్స్, చార్మినార్ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్క్ చేసుకోవాలి. మదీనా, పురానాపూల్, గోషామహల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్ చేసుకోవాలి. -
చార్మినార్ చెంతా ‘సండే– ఫన్డే’ సందడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారంలా నిలిచిన చార్మినార్ను సిటిజన్లకు మరింత చేరువ చేసేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆదివారం ‘సండే– ఫన్డే’లో భాగంగా ట్యాంక్బండ్పై కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తరహాలోనే.. చార్మినార్ పరిసరాలు కూడా సిద్ధమవుతున్నాయి. వాహనాల రణగొణ ధ్వనులు లేని వాతావరణంలో పాదచారులు చార్మినార్ చుట్టూ తిరుగుతూ.. చారిత్రక నిర్మాణాన్ని అమూలాగ్రం పరిశీలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర కొత్వాల్ అంజనీకుమార్లతో కలిసి మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. చారిత్రక కట్టడాలపై భవిష్యత్ తరాలకు కళ్లకు కట్టినట్లు వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ‘ఏక్ షామ్.. చార్మినార్కే నామ్’ పేరుతో ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ‘సండే– ఫన్డే’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్విటర్ ద్వారా అర్వింద్కుమార్ వెల్లడించారు. సందర్శకుల కోసం లాడ్ బజార్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు. పోలీసు బ్యాండ్ మ్యూజిక్, ముషాయిరాలతో పాటు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొక్కల ఉచిత పంపిణీ కూడా ఉంటుందని చెప్పారు. చదవండి: 18 నుంచి హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ -
Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్ పెడతారా?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది. లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఎండీఏ పేర్కొంది. -
సండే-ఫన్ డే మళ్లీ షురూ!
-
ట్యాంక్ బండ్పై 'సన్డే-ఫన్డే' సందడి ఫొటోలు
-
ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
-
ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్ డే’ మళ్లీ షురూ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ షురూ కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ ఈవెంట్ మరింత రంగులమయం అవనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 నుంmr రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన కనులవిందు కానుంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. అంతేకాదు తినుబండారాలు, చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది. కాగా ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్-19 ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణలు తెలంగాణా పోలీస్ బ్యాండ్ ఆర్కెస్ట్రా - తెలుగు పాటలు ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం బాణాసంచా వెలుగులు తినుబండారాలు చేనేత, హస్తకళల ప్రదర్శన ఉచిత మొక్కలు పంపిణీ.. ఇంకా ఎన్నో #TankBund Sunday-Funday is back on sept 26th from 5-10 pm Attractions : 1. TS Police Band 2. Orchestra - Telugu songs 3. Oggu Dolu, Gussadi & Bonalu Kolatam 4. Fireworks 5. Eateries 6. Handlooms & handicraft 7. Free saplings by @HMDA_Gov & many more @KTRTRSghmc pic.twitter.com/ikGfZ9EbsE — Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2021 -
మ్యాగజైన్ స్టోరీ 17 September 2021
-
ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
-
కేరళలో మళ్లీ ఆదివారం లాక్ డౌన్
-
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
ఉత్తరప్రదేశ్ లో సండే లాక్డౌన్
-
సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఆదివార వ్రతం
మాఘమాసంలో ఆదివారం వ్రతం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతము. ఈ వ్రతం ఏ ఆదివారమైన చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆది వార లైనా వీలుకాక పోతే ఒక ఆది వారమైనా చేయపచ్చు. సూర్యభగవానుడు ఆనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు. శుభాలను కలిగించేవాడు.ముల్లోకాలకు చూడామణి.దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం.ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది.పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక అవ్వ ఉండేది.ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి పరురాలు. తెల్లవారు ఝామునే లేచి ఆవు పేడతో నీళ్లు జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరు గింటివారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం గాను సంతోషంగాను ఉండడం చూసి పోరుగామె ఈర్ష్య పడేది. నా ఆవు పేడవల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నాది.సుఖంగాఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖసంతోషాలు వుండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు.కాకతాళీయంగా ఆ రోజు మాఘపాదివారం.నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేక పోయింది.రాత్రల్లా ఒకే ఆలోచన.రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి.అనుకుంది.కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది.ఆమె ఆనందానికి హద్దులు లేవు.గుమ్మం ముందు ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఆవు అక్కడ ఉంది. అవ్వను చూడగానే పేడ వేసింది.అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతు న్నాయి. గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తి చేసింది.ఆవు అక్కడ నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది.రాత్రైనా ఆవు కదల లేదు. దేవుడే తన కిచ్చాడని అనుకోని ఇంట్లో కట్టింది. రోజూ ఆవుకు మేత పెడుతోంది పొరుగింటామె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చా రు. బహుశా దొంగలించిందని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది.గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి అవును తోలుకెళ్ళి పోయారు.ఆ రాత్రి ఆమె దేవుడిని తలచుకుంటేనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కన్పించి ఆ అవ్వ దొంగ కాదు. ఆవునునేనే ఇచ్చాను. తెల్ల వారక మునుపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూక లియ్యిఅన్నాడు. కోడి కూతతో లేచి ఈ రోజు అయినా పోరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికివచ్చింది.గ్రామాధికారి మనిషి ఆవును అవ్వ అప్పగించి "అవ్వా! ఈ ఆవు నీదే. నష్ట పరిహారంగా మా యజమాని పదిరూకలిచ్చాడు తీసుకో " అన్నాడు అది మాఘమాసం.ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘపాదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమనుంచి కలశం పెట్టి సూర్యభాగవానుడి షోడషోపచారపూజ చేయాలి ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మజన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతే కాక రోగ భయాలుండవు.సిరిసంపదలతో ఇల్లు కళకళలాడుతుంది. -గుమ్మా ప్రసాద రావు -
మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని..
సండే అంటే హాలిడే మాత్రమే కాదు.. ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. విలక్షణమైన వినోదాన్ని అందించడంలో ముందుండి, కొత్త రకం కంటెంట్తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న స్టార్ మా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు "బిగ్ బాస్ ఉత్సవం" పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది. రెండు కళ్ళూ చాలనంత మంది తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెబుతోంది స్టార్ మా. స్టార్ మా లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. ఇంతమంది సెలెబ్రిటీలు ఒక చోట కలవడం, ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని షేర్ చేసుకోవడం, ఆటలు పాటలు అన్నీ కలిసి ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మలచబోతోంది "బిగ్ బాస్ ఉత్సవం”.ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ షోలు ఎప్పటిలాగే అలరించబోతున్నాయి. కాబట్టి .. మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని. -
నారాయణమ్మవ్వా
‘ఆకాశవాణి కడప కేంద్రం... ఇపుడు మీరు వినబోయే పాట లక్ష్మి నివాసం చిత్రం లోనిది... గీత రచన శ్రీ ఆరుద్ర. సంగీతం శ్రీ కె.వీ.మహదేవన్. ధనమేరా అన్నిటికీ మూలమ్... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం....ధనమేరా అన్నిటికీ......... మూ ల...మ్....l ఎం నారాయణమ్మవ్వా కూడు తిన్యావూ? అబుడే ఆకేసుకొని నిమ్మలంగా రేడియో ఇంటా కూకున్యవ్? బట్టీ కాడికి బోలా? అంటా చేతిలో గిన్నె బట్టుకుని వచ్చింది ఎదురింటి సత్తెమ్మ. ‘ల్యా, తిన్లా, నువ్ ఎందో తెచ్చావ్, నాకు పెడ్తవనీ కాస్కోని అట్టే కూకుని వుండాలేమ్మే’ అంది నారాయణమ్మ ఎగతాళిగా నవ్వుతా! ‘నీకు పెట్టకేం లేవ్వా! రోంత చెనిక్కాయ ఊరిబింమ్డి నూరుకుందెమని నీ రోటికాటికి వచ్చినా లే! అద్దో తుమ్మమాను కింద పొయ్యి మీంద, సట్టిలో సంగటికి పెట్టినా! అయితానె గెలికి యేడేదిగా నీగూఢ్ఖ పెడ్తాలే’ అంది సత్తెమ్మ గూడా నవ్వుతా! ‘పెట్టినంత మాట జెప్పినావు లేమ్మే! సాల్లే! నేను తిన్యా గానీ..నువ్ బోయ్ బెన్నా దినుబో, కుడేళ దాటి పాయ’ అంది నారాయణమ్మ. నారాయణమ్మకు నా అనే వోళ్లు ఎవరూ లేరు. భర్త వెంకటయ్య చాల యేండ్ల కిందటే కాలంజేశాడు. పిల్లలు గూఢ్ఖా లేరు. వున్నీకి మాత్తరం తనకి ముసలాయన కాలంలో కట్టిన రెండు బోధ కొట్టాలు వుండాయి. వొక్క దానికి రెండేమిటికి అనీ...వోటి తను ఉండీ, పక్కనున్న కొట్టం ఇంగోటి కాలేజీలో బుద్దిగా సదువుకునే పిల్లోలకి నూటాభై రూపాయల్కి బాడుక్కిచ్చింది. అరబై సంచ్చరాలు దాటినా నారాయణమ్మ ఆరోగ్గింగా ఉంటుంది. చూన్నీకికెప్పుడూ గుళ్లో దేవతికి మల్లే పశాంతంగా చిర్నవ్వతాంటది. నారాయణమ్మ వారొంలో మూడు దినాలు సున్నం బట్టీ బెడుతుంది. మిగతా దినాలు గంపదీసకపొయ్ పచ్చి సున్నం రాళ్ళు గొట్టిదెచ్చుకోనీకీ బోతాది. ఆదోరం వొక దినం మాత్తరమే ఊల్లో రచ్చబండగాడ సిమెంటు పట్టా పర్సుకొనీ, ఓ పక్క కాల్చిన సున్నం రాళ్ళూ, ఇన్గో పక్కన సున్నం పొడి అమ్ముతా....అట్టా కాలం ఎల్లదీస్తుంది. నారాయణమ్మ కొట్టంకి ఎదురుమల్లే వున్న ముప్పై సెంట్ల స్థలమంతా ఆమెదే కావడంతో తుమ్మ కంప పెరిగి, తొండలు గుడ్లు పెట్టి అట్టా ఉత్తగా పడుండడం ఏంటికిలేనీ, సైకిల్ పై ఊరంతా తిరుగతా పాత ఇనప, పిలాస్టికు డబ్బా రేకులకూ, అంటు మాడికాయలూ, తెల్లవాయలూ అమ్ముకుని బతికే సంచారులకీ, చిక్కెంట్రుకలకి పిన్నీసులూ, బుడగలు అమ్ముతా దిరిగే బీద, బిక్కీ జనెంకి ఊల్లో వున్నెంతకాలం వుండనీకి గుడిసెలేసుకునే దానికి ఆ స్థలమిచ్చింది. అందుకే ఆ జనెమంతా నారాయణమ్మవ్వా అంటా ఆదరంగా జూచ్చారు. నారాయణమ్మ ఇచ్చిన తావులో గుడిసెలు బేసుకున్న సంటిబిల్లల తల్లులు బొద్దున్నే బిడ్డలకి నెత్తికి సమురంటి, కొడుపు నిండుతా పాలిచ్చి, సిలవరి సెరవళ్ళో కట్టెల పొయ్యిపై బాగా మసల్నిచ్చిన ఉడుకునీళ్లతో తానం జేపిచ్చి, అక్కడ గుడిసెల మద్దెన వుండే యాపమాన్లకి చీరలతో ఉయ్యాల గట్టి, పిల్లోలని బండేసి, నిద్ర బోంగానే సైగ్గా తప్పుకుని కూలికి బోయేవాళ్లు. కోట్టం దెగ్గరున్నపుడు నారాయణమ్మ గుఢ్ఖా వాళ్ళని ఒక కంట కాపెట్టుకొనుండేది. అందుకే వాళ్లకి అవ్వంటే ఇంగా గౌర్వం. నారాయణమ్మ ఇంటి చుట్టూత పెద్ద పెద్ద శింత, యాపమాన్లూ దండిగా వుండాయి. తనకీ, ఆ మాన్లకి ఏందో దెలీని అనుబంధం ఉందని బో గట్టి నమ్మకం నారాయణమ్మకి. తాను సూడని అశోకొనంలో సీత కాటిన్నూండీ, తాను ఇష్టంగా వినే ఒసేయ్ రాములమ్మ సినిమాలో...‘రామ చక్కని తల్లి రాములమ్మ పాట’ విన్నెప్పుడూ, కార్ణం(కారణము) ల్యాకున్యా...ఎందుకో మాట్రాని మాన్లే ఆడదాని కట్టాలినే నేచ్చగత్తేలు అనిపిచ్చాది తనకి. అసలు తనని అడిగితే, మాన్లన్నీ ఆడియే అనిపిచ్చాది తనకి. ‘మొక్క మొలిచింది, మాను అయ్యింది, పువ్వు పూచిందీ, పిందే పెట్టింది’.....అంటాం గానీ మొలిచాడు, పూచాడూ అనం గదూ! అని తనలో తానే అనుకుంటా...తన ఆలోచనకి తానే నవ్వుకుంటా ఉంటాది. తన కొట్టం ముందురున్న యాప్మాను కిందున్న నడుములెత్తుండే పెద్ద రోట్లో చుట్టు పక్కల వాళ్లందరూ కారమో, పచ్చడో ఎదో ఒకటి ఉదర,బదరా నూరుకుని టిపిను డబ్బాల్లో బెట్టుకుని కూలికి బోయేటోళ్లూ. కొందరు సనువున్నోల్లయితే అవ్వగ్గుడా రోంత గిన్నెలో దీసి, లోపలకు బోయి గుడిసెలో »ñ ట్టి బొయ్యేటోళ్లూ. ఓ దినం ఎదురు గుడిసెలోండే ముత్తాలు..ఊరిబింమ్డి నూరుకోనికి రోలు కడగి పొడి గుడ్డతో రోటిని దుడస్తా..‘రోట్నీండా యాపాకు చెత్త పడ్తంది గానీ, ఎవులన్నా మొగోళ్లకి జెప్పువ్వా! ఆ పక్క వొంగిన కొమ్మలు రోంత నరకమనీ’ అంది. నూన్లో ఏంచి దెచ్చిన ఎండిమిరబకాయల్తో బాటూ, ఒక్క రవ్వ గళ్ళుప్పునూ రెండు తెల్ల వాయలనుగలిపి, తుడిసిన రోట్లో ఏసి దంచతా! అది వింటానే నారాయణమ్మ ఎం కయ్యాల్లో వుందో ముత్తాలు మీదకు తోక దొక్కిన తాచులా ఇంతెత్తున లేచింది. ‘ఏం మే సూచ్చాంటే నీదేందో బో కథలాగుందే! పోనీలే పాప్మని మీకుండనీకి తావిచ్చే బాగుందే నీ కథ’ అంటా తిట్ల దండకం అందుకునింది. ‘ఆ మానుకేమన్న మనం కూడు పెడతాండామా? నీళ్లు బోచ్చాన్నెమా? ఆ మాను. మీ పిలకాయలకే కదూ మే నీడనిచ్యాందీ...’ ఎండ పొద్దన ‘అబ్బా ఉడకబెడతందవ్వా’ అంటా ఆ మానుకిందే గదూ! మంచం వాల్చుకుని చల్లగా ఆరేసుకుని పొడుకుంటావే’ అని దెప్పిపొడుస్తూ తనే మళ్ళీ ఇలా అంది. ‘అసలు యాప్మానుకి ఎందుకు పూజలు జేచ్చారు మే నాకు దెలీకడగుతా! యామన్నా దేవత దాంట్లో దూరుకుని ఉంటదా ఆ మాన్లో, ఇమ్గ యాడా తావు లేనట్లూ. లేదు మ్మే! అట్టా జెప్తే మీ లాంటోళ్లు నరక్కండా వుంటారని గదూ. మే ముత్తాలూ! నీకు దెలీదా? మాన్లలో ఎన్ని మేలు చేసే లచ్చనాలుండాయనీ. సల్లగాలిచ్చాయి, నీడ నిచ్చాయి. కొట్టాన్కి కావల్సిన కట్టే ఇచ్చాది. ఆఖరిన మన కట్టే కాల్చేందుకు గూడా అదే పనికొచ్చాది గదమ్మే’ అంది కోపంగా. ‘రాలినాకు పక్కకు దోసేసి, రోన్ని నీళ్లు బోసి రోలు కడుక్కోనీకి పెద్ద వగలు బడ్తండావే పిల్లవూ, పని అయిపాతానే అట్ట తిప్పుకుంటా లేచి బోకుంటే ఆ పక్కన పాలీసు బండ పెట్టిన గదా! అది రోటి మీంద మూపెట్టరు గానీ! కొమ్మలు నరకమంటంది పిల్ల’ అంది ఇంగా ఇంగా అట్టే గొనుగతా! ‘అబ్బా ఎదో దభిక్కీన ఒక్క మాట జారి అన్యా లే వ్వా తల్లీ! బొరపాటయింది, ఇమ్గ ఎబ్బుడూ అట్టా అన్నులే గానీ! ఇన్గ నన్ను ఇడిసిబెట్టూ’ అంటా నూరుకున్న ఎండిమిరక్కాయల కారం దబా దబా... గిన్నెకెత్తుకుని అట్టే సక్కా అదే పాయ. నారాయణమ్మంటే అందరికి ఎంత అభిమోనమో, అంతే భయం గూడా! తమకి ఆమే పెద్దదిక్కాయే! అదిగాకా ఎక్కడ ఆ స్థలం ఇడ్సమంటాదో అని! అందుకే ఎవరూ ఎదుర్తిగి మాట్లాడనుగూడ్క మాట్లార్రు. నారాయణమ్మకి తన భర్త వెంకటయ్య తరపునుండీ కొందరు దూరెం వర్సెకి దాయాదులుండారు. ఆమెను దగ్గరికి దీచ్చే ఆ స్థలం అంతా కొట్టేయవచ్చు అని వాళ్ళ పథకం. అది అర్ధమైన నారాయణమ్మ వోళ్ళను దగ్గరకిదీసేది గాదు. ‘మంచిగా ఉంటే నేనే వాళ్ళను సూద్దును గదా!’ అని అనుకుంటుంది. ఆ దాయాదులు రబోవూ కాలంలో ఆ ముప్పై సెంట్ల భూమి ఎంత ఇలువ జేచ్చాదో లెక్కలేచ్చా అంతటి ఆచ్చి చేజారి బోద్దెమోని బో బాధబడేవాళ్లు. అసూయతో ఒక దశలో అసల్కి ఆమె వెంకటయ్య భార్యే గాదు, ఉంపుడుగత్తే అని గూడా తెగించి ప్రచారం జేశారు వాళ్లు. దేనికి బెదర్ని నారాయణమ్మ ‘యా నా కొడకనో రమ్మను, సున్నం బట్టిలో యేసి కాలచ్చ ఒక్కొక్కర్నీ’ అనేది ఆవేశంగా. ‘మేంమంతా నీతో బాటూ వుండంగా అట్ట యేం జరగనీయంలే నారాయణమ్మవ్వా’ అంటూ అందరూ అవ్వకి దైర్నం జెప్పేవాళ్ళు. దుడ్లతోనే పెపంచకమంతా నడుచ్చాందని ఎప్పుడూ బాధ పడతాండేది నారాయణమ్మ. కానీ నారాయణమ్మ మనసులో బాగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం దీసుకుని హాయిగా ఉపిరి పీల్చుకునింది. నీళ్లకిబ్బంది బడకుండా తన స్థలంలో నడిమద్దెన బాయి తవ్వించింది. నారాయణమ్మ మనసులాంటి సచ్చమైన, కొబ్బరి నీళ్ల తీర్ణుండే తియ్యటి నీరు రివ్వున ఊరింది. అదేంశిత్రమో ఏ కాలమైనా సరే బాయిలో సగాన్కి పైగా ఎప్పుడూ నీళ్లతో నిండుగా వుండేది. ‘నారాయణమ్మ బాయి’గా అందరి నోళ్ళలో పిలువబడేది. ‘కొళాయిలొచ్చే ఈ రోజుల్లో బాయేందివ్వా’ అని అన్నోళ్లు గూడా తరువాత ‘బో మంచి పని జేశినవ్ వ్వా’ అని మెచ్చుకున్నేరు. ఒకరోజు పొద్దన్నే...వాతావొరణంలో ఏందో మార్పుందని అందరికి అనిపించబట్టే! అయినా రోజులాగే ఎవ్వరి పనుల హడావిడిలో వాళ్లువుండారు. మేస్త్రీ టాకిటేరు దీసుకుని వచ్చేతలికి తయారుగా వుండాలని ఆడోళ్లు బెరీన వంటలు జేయబట్టిరి. మట్టి పనులకు బోయ్యేటోళ్లూ పారా,తట్టా తీసి బయట పెట్టుకున్యారు. ‘పొద్దన్నే ఏందీ నల్లకుక్క అట్టా ఒకటేమైయంగా ఈడీడే తచ్చాడుతా ఏడుచ్చాంది..దీని ధూమ్దగలా! దాని రద్దుకి నారాయణమ్మ తోలన గూడా బేటీకి రాలే’... యపపుల్లతో మోఖం తోమతా పెళ్ళాన్ని పిలిసి,అవ్వ ఏం జేచ్చాన్దో లోపల్కిబోయ్ జుడమన్యాడు పక్కనుండే రాముడు. రాముడికి ఈ మద్దెనే బిల్డింగ్ పని జేచ్చా మిద్దెపై నుండీ కింద బడీ, రెండు కాళ్లు సచ్చుబడిపోయె! సచ్చి బతికిన రాముడంటే అవ్వకి బో జాలి. రాముడు హాస్పటేల్ నుండీ కోలుకొని ఇంటికి దిరిగి వచ్చేందాకా అంతో, ఇంతో వున్నికాడికి డబ్బిచ్చా సాయంగుండీ, దైర్నం జెప్పేది. కష్టకాలంలో తనను అమ్మలా జూసుకునిందని నారాయణమ్మంటే రాముడికీ ఇన్గ వల్లమాలిన అభిమానం. ఎదురుగుండే చంద్రమ్మ గూడా ‘అవ్ బ్బా! అదేందీ! ఇంత పొద్దయింది నారాయణమ్మ అలికిడి లేదూ..శిత్రంగా ఉండాదే! ఈ యాల్కి ఇన్గ అపుడే బట్టీ కాడికి కూడా బోదు ముసల్ది..పా ఎందో సూజ్జం’ అనుకుంట గుడిసెలోకి బోయి ఇద్దరూ ఆడోళ్ళు గోళ్ళున ఏడస్తా బయటికి వచ్చిరి. వెంటనే ఊళ్లో అందరికీ విషయం దెలిసిపాయ. నారాయణమ్మ నిద్దర్లోనే పాణంబాయ. ‘ఏం సుగం సావు సచ్చే ముసల్ది’ అని అందరూ గోడు,గోడున ఏడ్చబట్టే. అవ్వని తన నులక మంచంలోనే అవ్వకి ఇష్టమైన ‘రామబాణం పూల చెట్టూ, యాప్మానూ’ కలిసిన పెద్ద మాను కింద పడుకోబెట్టిరి. దాయాదులంతా అవ్వ సుట్టూత జేరి వగలేడుపులు ఏడ్చబట్టిరి. ఆ ఏడ్పులేమిటికో అందరికీ దెల్సినా ఏమీ జేయలేక అందరూ గమ్మున సూచ్చాండారు. అంతలో రెండు కార్లు రయ్యిన వచ్చి నారాయణమ్మ గుడిసె ముందు ఆగె. దాంట్లోంటి నల్ల సూటూ, బూటూ వేసుకున్న వొక లాయరూ, కొందరు సారోళ్లు కిందకు దిగిరి. నారాయణమ్మకి పూలదండ యేసి..ఎనుదిరిగి, అక్కడ జనాలనందరిని సూచ్చా... ‘నా పేరు రంగనాథ్...నేను లాయర్నీ.... అవ్వ పక్కన కొట్టంలో ఉండే కాలేజీ అబ్బాయి నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను’ ‘నారాయణమ్మ తన స్థలం దురాక్రమణకు గురి కాకుండా, వీలునామా రాసి, ఆ బాధ్యతను మాకు అప్పగించింది. వీళ్లు శాంతినికేతన్ అనాధ శరణాలయం నుంచీ వచ్చారు’ అంటా తనతో పక్కనే నించుకున్న వోళ్ళని పరిచయం జేసి... ‘నారాయణమ్మ వీలునామాలో ఎం రాసిందో మీకు అందరికీ ఇప్పుడు వినిపిస్తాను’ అంటా. నారాయణమ్మ తన స్థలంలో సగభాగంలో అనాధ పిల్లల కోసం, తన లాంటి ముసలి వాళ్ల కోసం వొక ఆశ్రమం కట్టించమని శాంతి నికేతన్ సంస్థ వాళ్లకు రాసిచ్చింది. మిగతా సగం ..... ఇన్నాళ్లు తనని నమ్ముకుని తనని అవ్వా అంటూ ఆదరించిన వాళ్లందరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదనీ...తాన జాగాలోనే స్థిరంగా వుండాలని తన వీలునామాలో రాసింది’ ఇంకా ..... ‘తన అకౌంట్లో వున్న లక్ష రూపాయలనూ బేల్దారి రాముడికి చిల్లర కొట్టు పెట్టుకోనికి ఆర్ధిక సహాయంగా రాసి ఇచ్చింది’. అని లాయర్ సదవొడం ఆపగానే... అందరూ వొక్కసారిగా ‘నారాయణమ్మ వ్వా’ అంటూ నేలపై పడి, పొర్లి పొర్లి ఏడస్తా ‘మా మింద ఇంత జాలి, పేమ ఉండాయనుకోల, మా తల్లికి’ అని ఏడ్చబట్టిరి. అప్పటి దాక ఆశతో వున్న దాయాదులు ‘తూ....నీ..దీనమ్మా! సచ్చా గూడా సాధించి బోయిందిరా ముసిలిది’ అంటా కోపంగా అక్కడి నుండీ లేశి వెళ్ళిపోయిరి. హోరుమని పెద్ద గాలొకటి వీచడంతో.... చెట్టుపై నుండీ వొక్కసారిగా ‘రామబాణం పూలూ, ఎండిన యాపాకూ కింద ప్రశాంతంగా శాశ్వత నిద్రలోన్న అవ్వపై జల జలా రాలుతున్నెయి తమ చివరి వీడ్కోలుగా! -
ఆదివారం అంతే మరి!
సాక్షి, కొడవలూరు: మండల కేంద్రంలోని పీహెచ్సీ తలుపులు ఆదివారం తెరచుకోలేదు. ఫలితంగా కుక్క కాటుకు గురైన బాలుడితో సహా పలువురు రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కొడవలూరు మండల కేంద్రంలో పీహెచ్సీకి రోజూ 20 నుంచి 30 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తుంటారు. ఏదైనా అత్యవసరమైనా ప్రాథమిక చికిత్సకు ఇక్కడకే వస్తారు. నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు ఇక్కడ అమలు కావడంలేదు. తెరచుకోని పీహెచ్సీ ఆదివారం కూడా పీహెచ్సీలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్టాఫ్నర్స్, ఫార్మాసిస్ట్, ఆయాలు విధిగా ఉండాలి. ఆస్పతికి వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వాలి. ఆదివారం పీహెచ్సీకి సిబ్బంది రాకపోవడంతో పూర్తిగా మూత పడింది. ఫలితంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. పద్మనాభసత్రానికి చెందిన మూడేళ్ల బాలుడు రామలింగం మహేష్ను ఆదివారం కుక్క కరవడంతో వైద్యంకోసం తండ్రి సురేష్ ఉదయం 11 గంటలకు పీహెచ్సీకి వచ్చారు. పీహెచ్సీ తలుపులు తెరచుకోకపోవడంతోపాటు సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ లేరు. దీంతో నార్త్రాజుపాళెంలోని ప్రైవ్రేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. పాము కాటైనా పరిస్ధితి ఇంతేనా అంటూ బాలుడి తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు వృద్ధులు పీహెచ్సీకి వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. విడవలూరు మండలం ఊటుకూరులో ఇటీవల బోరు బావిలో బాలుడు పడిపోగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి దగ్గరుండి బాలుడ్ని వెలికి తీయించి రామతీర్థం వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని కోవూరు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. -
ఎంజాయ్ ఏమాయె!
రాయదుర్గం: ఆదివారం వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేసే రోజులు నగర శివారులో పూర్తిగా కరువయ్యాయి. ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోడ్డంతా ఆటాపాటలతో సందడి చేసేవారు. వారమంతా పడ్డ కష్టాన్ని మరిచి ఎంజాయ్ చేసేవారు. ఆదివారం వచ్చిందంటే కొన్నాళ్లు రాహ్గిరి కార్యక్రమం, ఆ తర్వాత ఫిజికల్ లిటరసీ కార్యక్రమంతో నడిరోడ్డంతా నాలుగు గంటలపాటు సందడిగా ఉండేది. మొదట్లో వంద మంది వస్తే గగనమే అనుకుంటే ఆ తర్వాత వేల సంఖ్యకు చేరుకోవడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం వీటి సందడి లేకుండా ఆదివారం రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పటి రాహ్గిరి, ఫిజికల్ లిటరసీ డే వంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక కలగా మారుతాయా? అని పలువురు చర్చించుకుంటున్నారు. తీరిక లేకుండా నిత్యం బిజీబిజీగా గడిపే వారికి వీకెండ్లో మళ్లీ నడిరోడ్డుపై ఆటాపాటలతో కూడిన సందడి అవసరమని అభిప్రాయపడుతున్నారు. అనంతరం ‘ఫిజికల్ లిటరసీ డే’.. రాహ్గిరిని అంతా మరిచిపోతున్న వేళ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ చొరవతో కొంతమంది ఔత్సాహికుల తోడ్పాటుతో ఫిజికల్ లిటరసీ డేను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీ కారిడార్కు వెళ్లే రోడ్డులోని పుల్లెల గోపీచంద్ అకాడమీ రోడ్డులో షురూ చేశారు. 19 వారాలపాటు ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం రోడ్డు విస్తరణ కోసం నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని జీఎంసీ బాలయోగి స్టేడియం ఎదుటకు మార్చారు. ఇక్కడ కొన్ని వారాల పాటు సాగినా వర్షాలు కురుస్తుండడంతో నిలిపివేశారు. ఆ తర్వాత ఇక ఇలాంటి కార్యక్రమాల కొనసాగింపు సందేహాస్పదంగా మారాయి. ఇప్పటికైనా నిర్వాహకులు పునరాలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం వేళల్లో నిర్వహించేలా చూడాలని సిటీజనులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి ♦ ఆదివారం ఆటాపాటలతో అంతా సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ♦ శాశ్వత వేదికను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలి ♦ ఆటాపాటల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి ♦ నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి ♦ శాశ్వత వేదికలో పాఠశాల విద్యార్థులకు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి ♦ నిర్వహణ కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టాలి ♦ స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారినిప్రోత్సహించాలి మొదట్లో ‘రాహ్గిరి’ షురూ.. సైబరాబాద్ పోలీసులు, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు, ఇతర ఔత్సాహికుల కలయికతో రాహ్గిరి కార్యక్రమం నగరంలో మొదటిసారిగా మొదలైంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్స్పేస్ వరకున్న ఎడమవైపు రోడ్డుపై ఆదివారం రోజు ఉదయం పూట పూర్తిగా ఆటాపాటలతో ఎంజాయ్ చేసేవారు. ఆటలతో పాటు పలు పోటీలలో పాల్గొనేవారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, మెడిటేషన్, కబడ్డీ, గల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్, పెయింటింగ్లు వేస్తూ సరదాగా గడిపేవారు. 68 వారాల పాటు సాగిన రాహ్గిరి.. రోడ్డు విస్తరణ చేపట్టాల్సి రావడంతో నిలిపివేశారు. సర్కారే సమకూర్చాలి.. సండే సందడి మళ్లీ మొదలు కావాలంటే ఒక శాశ్వత వేదిక, నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వమే సమకూర్చాలి. వ్యక్తుల సమూహం ఇలాంటి లాంగ్టర్మ్ కార్యక్రమాలు నిర్వహించా లంటే సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి ఔత్సాహికులతో కమిటీ వేసి నిర్వహణ బాధ్యత అప్పగిస్తే విజయవంతం కావడం ఖాయం. – విశాలరెడ్డి, రాహ్గిరి వ్యవస్థాపకురాలు, ఐడెంట్ సిటీ మానవ సంబంధాలు మెరుగు.. ప్రస్తుత యాంత్రిక జీవనంలో అందరూ బిజీబిజీగా గడిపేస్తున్న తరుణంలో రాహగిరి, ఫిజికల్ లిటరసీ డే కార్యక్రమాల నిర్వహణతో మానవ సంబంధాలు, పరిచయాలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇలాంటి వాటి నిర్వహణ చాలా అవసరం. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే శాశ్వత ప్రాతిపదికన నిర్వహణ సాధ్యం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.– టి.రామస్వామియాదవ్, కన్వీనర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
జగ్గంపేటలో ఆదివారం వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం
-
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
హైదరాబాద్కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు
పశ్చిమగోదావరి, నరసాపురం : ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపనున్నారు. తరువాత కూడా అదే తరహాలో రద్దీ ఉంటే ఈ సర్వీస్ను శాశ్వతంగా కొనసాగిస్తారని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధుబాబు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. 4 జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్లు ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని స్టేషన్ మాస్టర్ చెప్పారు. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రి పూట నరసాపూర్ ఎక్స్ప్రెస్, పగటిపూట నాగర్సోల్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఈ రైళ్లలో రిజర్వేషన్ దొరకని పరిస్థితి. పండుగలు, సెలవులు సమయాల్లో అయితే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్లో నడపబోతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడనుంది. -
మండిన సండే
సాక్షి, హైదరాబాద్ : సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ ఎండాకాలంలో ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్లోనూ ఈ సీజన్లో మొదటి సారిగా అధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వడదెబ్బతో ఆరుగురి మృతి సాక్షి నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకటయ్య (45) ఆత్మకూర్–ఎస్ మండలం పాత సూర్యాపేటకు చెందిన బైరు యల్లమ్మ (80), అనంతగిరి మండలం లకారం గ్రామానికి చెందిన కూరపాటి మాణిక్యమ్మ (100) వడ గాలుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాతపడ్డారు. అలాగే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలకేంద్రంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన గాండ్ల రుక్మాబాయి(70), కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొర్రి ఆశన్న(60), మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన రామడుగు వెంకటాచారి(55)అనే వడ్రంగి వడదెబ్బతో మృతిచెందారు. -
ఆదివారం.. భాగ్యనగరంలో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : గత రెండు రోజుల నుంచి వరుణుడు హైదారాబాద్ను విడవడం లేదు. శుక్రవారం ఈదురు గాలులతో బీభత్సం సృష్టించిన వర్షం ఆదివారం కూడా భాగ్యనగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో సిటీవాసులు నిరాశకు గురవుతున్నారు. వారంతం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతాకుతలం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వీటి కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయనగరంలో జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు ఎగిరిపడ్డాయి. -
రెండు గ్రామాల్లో ఉద్రిక్తత
♦ ఆదివారం చికెన్షాపు తెరవడంతో మరోమారు గొడవ ♦ దాడిలో ఇద్దరికి గాయాలు సాక్షి, నారాయణవనం: సత్యవేడు నియోజకవర్గంలోని నారయణవనం మండలం సముదాయం, కీళగరం దళితవాడల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం సముదాయంకు చెందిన దొరస్వామి, అతని అల్లుడు దినకరన్ నారాయణవనంలోని కీళగరం క్రాస్ వద్ద చికెన్ షాపును తెరిచారు. దీంతో కీళగరం దళితవాడకు చెందిన యువకులు షాపును ధ్వంసం చేసి వారిపై దాడికి పాల్పడారు. ఈ దాడుల్లో దినకరన్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, నలుగురు డీఎస్పీలతో పాటు 10 మంది సీఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏఆర్ పొలీసులు, పుత్తూరు సబ్డివిజన్లోని అన్ని సర్కిళ్ల పోలీసులు నారాయణవనానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు పుత్తూరులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మండల పార్టీ మన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ సుబ్బరాయశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరవి ఆదివారం సాయంత్రం పోలీసులతో చర్చించారు. అనంతరం సమస్య పరిష్కారానికి పీఎస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పుత్తూరు సీఐ సాయినాథ్ ప్రకటించారు. గొడవలకు కారకులైన వారి వివరాలను తెలపాలని సీఐ కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండుగ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రెండు గ్రామాల మధ్య జరిగిన దాడిలో ఏడుమంది గాయపడిన సంఘటన తెలిసిందే. అమాయకులపై కేసులు వద్దు మండలంలోని సముదాయం, కీళగరం దళితవాడ వాసుల మధ్య నెలకొన్న ఘర్షణల్లో అమాయకులపై కేసులు పెట్టకుండా పోలీసులు న్యాయం చేయాలని సమన్వయకర్త ఆదిమూలం పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘర్షణలకు దూరంగా ఉన్న వారిపై కేసులు పెట్టొద్దన్నారు. రెండు గ్రామాల్లో పీఎస్ కమిటీæ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. -
బీచ్లో సందర్శకుల సందడి
మొగల్తూరు:పాఠశాలలకు సెలవులు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పేరుపాలెం బీచ్కు సందర్శకులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి వచ్చి కెరటాలపై కేరింతలు కొట్టారు. సాయంత్రం వరకూ సాగర తీరంలో ఆనందంగా గడిపారు. -
ఉపాధ్యాయుల వినూత్న నిరసన
భీమవరం టౌన్:ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్కు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోని అసంబద్దతలను తొలగించాలని కోరుతూ ఫ్యాప్టో, జాక్టోల సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాశంచౌక్లో ఫ్లకార్డులను ప్రదర్శించి, ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఫ్యాప్టో, జాక్టో నాయకులు మాట్లాడుతూ వెబ్కౌన్సెలింగ్ రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ఇచ్చిన పనితీరు పాయింట్లును ఉపసంహరించాలని, హేతబద్ధీకరణ పేరుతో పాఠశాల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ సంఘ నాయకుల అక్రమ అరెస్ట్ను ఖండించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, జిల్లా కార్యదర్శి సీహెచ్ పట్టాభి రామయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.సీతారామరాజు, పి.శ్రీనివాసరాజు, ఎన్.భాను మహేష్, జి.సుధాకర్, కె.రవిచంద్రకుమార్, కె.వామనమూర్తి, ఆర్ఆర్ శర్మ, ఐవీఆర్ మోహనరావు, సీహెచ్ ప్రసాదరావు, ఎ.లక్ష్మీ నారాయణ, ఎ.సురేష్కుమార్, జి.సూర్యసత్యనారాయణ, ఎస్.మధుసూదనరావు, ఎం.వెంకటేశ్వరరావు, కె.చంద్రరావు పాల్గొన్నారు.