-
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్కూ, ట్రంప్కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు కావాలి
దుబాయ్: సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు ప్రపంచానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ తమ మంత్రమన్నారు. బుధవారం దుబాయ్లో బుధవారం ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం లేదనే భావన ప్రజలకు కలగకూడదని, ప్రభుత్వాల ఒత్తిడి వారిపై ఉండకూడదని అన్నారు. భారత్లో కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అనంతరం దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్–మక్తూమ్తో మోదీ సమావేశమయ్యారు. -
సీఎం జగన్ గురించి ఇండియా టుడే శివాని సింగ్ గొప్ప మాటలు
-
విశాఖలో దక్షిణ భారత హోటల్ యజమానుల సదస్సు
-
నేటి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్’
గాంధీనగర్/అహ్మదాబాద్: 10వ ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్–హోరా్ట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో సంబంధాలపై చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోదీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రాత, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మారి్టన్, సుజుకీ మోటార్ కార్పొరేసన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ తదితరులు వీరిలో ఉన్నారు. గాంధీనగర్లో ‘వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో–2024’ను మోదీ ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. -
అబ్బురపరచిన ‘ప్రత్యేక’ ఆవిష్కరణలు.. స్ఫూర్తి నింపిన ప్రసంగాలు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) హైదరాబాద్లోని టీ హబ్ 2.0లో ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ 4.0 (ATS 4.0) నాలుగో ఎడిషన్ ముగిసింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎస్ఐసీ ఇన్క్లూషన్ టాక్స్’ పేరుతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని టీఎస్ఐసీ నిర్వహించింది. దివ్యాంగులు, అంధులు, ప్రత్యేక అవసరాలవారు, విభిన్న ప్రతిభావంతులు ఇలా ప్రతిఒక్కరూ ఇతరులతో సమానంగా ముందుకు సాగడం, అభివృద్ధి సాధించడంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాత్రపై వివిధ సంస్థలు, ఎన్జీవోలకు చెందిన పలువురు తమ ప్రసంగాలను వినిపించారు. దీంతోపాటు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల వ్యక్తుల కోసం రూపొందించిన అబ్బురపరిచే పలు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు. అసిస్టెక్ ఫౌండేషన్ (ATF) కోఫౌండర్, సీఈవో ప్రతీక్ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత, ఎన్ఐఈపీఐడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డా. అంబాడి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కౌన్సెలర్ టి.వి. ఐశ్వర్య, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణవ్, ఐటీఈ&సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, యూత్4జాబ్స్ వ్యవస్థాపకురాలు మీరా షెనాయ్ తదితరులు ప్రసంగించారు. సమగ్ర సమాజాన్ని రూపొందించడంలో ఆవిష్కరణల కీలక పాత్రపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టీఎస్ఐసీ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం పేర్కొన్నారు. -
భారత్లో టెస్లా ఎలక్ట్రిక్.. కార్ల ధరలు ఇంత తక్కువా?
భారతీయులకు శుభవార్త. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా రాకకు మార్గం సుగమమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్లో టెస్లామోడల్ 3 కారు బడ్జెట్ ధరలో వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అపరకుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరికొద్ది రోజుల్లో భారత్లో పర్యటించనున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్లో పర్యటించన్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్ను గుజరాత్లో ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్కు కావాల్సిన అనుమతులు, స్థల అన్వేషణ త్వరగా జరిగేలా గుజరాత్ సమ్మిట్ దోహదం చేయనుంది. ఈ నివేదికలపై టెస్లా యూనిపై కేంద్రం గాని అటు టెస్లా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్లో ప్రధాని మోదీ సమక్షంలో ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టెస్లా కార్ల ధరలు ఎంతంటే? పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన మోడల్ టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,240 (సుమారు రూ. 33.5 లక్షలు). ఈ మోడల్ను భారత్లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రూ.60-66 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVలు) 100 శాతం దిగుమతి పన్నును విధించింది. అన్నీ సవ్యంగా జరిగితే అన్నీ సవ్యంగా జరిగితే టెస్లా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని ధర అనూహ్యంగా రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. -
చెక్కుచెదరని మైత్రి
అంతర్జాతీయంగా ఒక అస్పష్ట వాతావరణం అలుముకున్న వేళ భారత్–రష్యాలు తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని ప్రతినబూనాయి. ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం ఆ దేశంలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా తమ నమ్మదగిన మిత్ర దేశమని మరోసారి చాటారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తలేదని అనలేం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై అమెరికా వైపు మొగ్గుచూపటం మొదలైనప్పటినుంచీ రష్యా కలవరపడుతోంది. అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఏర్పడిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో మన భాగస్వామ్యం రష్యాకు ససేమిరా నచ్చలేదు. దాన్ని ‘ఆసియా–పసిఫిక్ వ్యూహం’గా సవరించి తనతో సహా ఆసియా దేశాలన్నిటికీ అందులో భాగస్వామ్యం కల్పించాలన్నది రష్యా డిమాండ్. అదే సమయంలో చైనాకు రష్యా సన్నిహితం కావటం, పాకిస్తాన్తో సైతం మైత్రి నెరపటం మన దేశాన్ని ఇబ్బందిపెట్టే అంశాలు. ఇక ఇటీవలిఅంతర్జాతీయ పరిణామాల్లో ఇరు దేశాలూ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా వున్నాయి. దౌత్య సంబంధాలుఎంతో సున్నితమైనవి. ఒక దేశంతో మనకు ఏర్పడే చెలిమి అంతవరకూ మనతో మిత్రత్వం నెరపుతున్న మరో దేశానికి సమస్యగా అనిపించవచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. ఆ రెండు దేశాలమధ్యా వుండే పొరపొచ్చాలే అందుకు కారణం. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చినప్పటినుంచీ రష్యా–అమెరికా సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాతకాలంలో క్రిమియాను రష్యా దురాక్రమించాక అమెరికా మరింత ఆగ్రహించింది. ఆ దేశంతో ఎవరూ సన్నిహితంగా వుండరాదని కోరుకుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచీ రష్యాపై అనేక ఆంక్షలు విధించి, పాశ్చాత్య దేశాలను కూడగట్టింది. మన దేశంపై కూడా ఒత్తిళ్లు తెస్తూనేవుంది. అయినా ద్వైపాక్షిక వాణిజ్యం 1,200 కోట్ల డాలర్ల నుంచి నిరుడు 5,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా యూరొప్ దేశాలకు ముడి చమురు అమ్మకం ఆగిపోయిన పర్యవసానంగా మన దేశానికి రష్యా చవగ్గా చమురు విక్రయించటంతో ఈ వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. మున్ముందు ఇది మరింత పెరుగుతుందని జైశంకర్ చెబు తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని మన దేశం వ్యతిరేకించినా బాహాటంగా రష్యాను విమర్శించలేదు. మన జాతీయ భద్రతా వ్యూహంలో రష్యా పాత్ర అత్యంత కీలకం. మొదటినుంచీ మన రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా అధికం. ఇప్పటికీ ఆయుధాల మరమ్మత్తు బాధ్యత రష్యాదే. ఇటీవలి కాలంలో అమెరికా, ఫ్రాన్స్ల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. తన సలహాను బేఖాతరు చేసి రష్యానుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయటం అమె రికాకు నచ్చలేదు. ఇలా ఎన్ని ఒత్తిళ్లున్నా రెండు దేశాల బంధం సడలలేదు. జైశంకర్ తాజా పర్యటనలో తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా మరింత సాంకేతిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలయ్యాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తుండగా మరో నాలుగు మొదలుకావాల్సివుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి వుంది. ఇదిగాక ఔషధాలు, వైద్య పరికరాలు వగైరాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. యూరేషియన్ ఎకనామిక్ జోన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించాలన్న రష్యా ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. సాధారణంగా వేరే దేశాల మంత్రులు పర్యటించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని కలిసే సంప్రదాయం లేదు. కానీ దాన్ని పక్కనబెట్టి ఆయన జైశంకర్తో సమావేశం కావటం, తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపటం భారత్తో బంధానికి పుతిన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియబరుస్తోంది. అయితే సమస్యలున్నాయి. ముడి చమురు కొనుగోళ్లకు మన దేశం రూపాయల్లో చెల్లింపులు మొదలు పెట్టినా, దాని అస్థిరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, అందుకోసం అదనంగా చెల్లించాలనీ రష్యా చమురు సంస్థలు కోరుతున్నాయి. అదింకా పరిష్కారం కావలిసేవుంది. దౌత్యం ఎంతో క్లిష్టమైనది. అవతలి పక్షంనుంచి కావలసినవి రాబట్టుకోవటం, అదే సమయంలో వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవటం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి. కల్లోల సమయాల్లో మరింత చాకచక్యం తప్పనిసరి. వాస్తవానికి భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఇరు దేశాల అధినేతలూ హాజరు కావలసివుంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా 2020లో అసలు సమావేశమే జరగలేదు. ఉక్రెయిన్ యుద్ధంతోరెండేళ్లుగా మోదీ శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లలేదు. అయినా సరే ఈసారి కూడా జైశంకరే వెళ్లక తప్పలేదు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రష్యాకు ఒకప్పుడు మనం జూనియర్ భాగస్వామిగా వుండేవాళ్లం. ఉదాహరణకు 1991 నాటికి రష్యా జీడీపీ 51.80 కోట్ల డాలర్లు కాగా, మన జీడీపీ 27 కోట్ల డాలర్లు. ఇప్పుడు రష్యా జీడీపీ 2 లక్షల 20 వేల కోట్ల డాలర్లయితే, మన జీడీపీ మొత్తం విలువ 3 లక్షల 60 వేల కోట్ల డాలర్లు. అయినా ఇరు దేశాల సంబంధాలూ యధాతథంగా వున్నాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడే చెలిమి ఎప్పటికీ చెక్కుచెదరదు. ఎన్నో అవాంతరాలనూ, కాలపరీక్షలనూ తట్టుకుని నిలబడిన భారత్–రష్యా సంబంధాలు మున్ముందు సైతం ఇదే రీతిలో కొనసాగుతాయని ఆశించాలి. -
అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్
ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన వారం రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ నాయకత్వంతో వ్యూహాత్మక సంభాషణలు సహా, వాతావరణ మార్పులపై చర్చించే కాప్ 28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాలలో శ్రీశ్రీ రవిశంకర్ గణనీయమైన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. పర్యటనలో భాగంగా శ్రీశ్రీ మొదటగా ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన గౌ. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో అతని రాజ నివాసంలో సమావేశమై, ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించటం, శాంతియుత సహజీవనపు ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై చర్చించారు. భారతదేశంలోని 70 నదులు ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి, 36 దేశాల్లో 8 కోట్ల 12 లక్షల చెట్లను నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, అలాగే 22 లక్షల రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా, గురుదేవ్ తన అభిప్రాయాలను కాప్ 28 సమావేశాలలో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగించనున్నారు. బ్రహ్మ కుమారీస్కు చెందిన మోరీన్ గుడ్మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేగాక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదటగా మనలో రావలసిన అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను, అంతర్గత పరివర్తనకు మార్గాలను శ్రీశ్రీ వివరిస్తారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి గౌ. షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. కాప్28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో భాగంగా, గురుదేవ్ డిసెంబర్ 6న కొలంబియన్ పెవిలియన్లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 సంవత్సరాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు, దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015 సంవత్సరంలో జరిపిన చర్చలను, వాటి ఫలితాన్ని, సభ్యులతో శ్రీశ్రీ పంచుకోనున్నారు. మానవత్వానికి, ప్రేమకు, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే గురుదేవ్ విధానాలు సంఘర్షణలతో అతలాకుతలమౌతున్న ప్రజలకు ఆశారేఖలుగా దారిచూపుతాయనడంలో సందేహం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకు అనుగుణంగా ఈ ఆరు రోజల అరబ్బుదేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15 వేల మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్బు దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వ్యాపారవేత్తలను, సంఘ సేవకులను, సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. (చదవండి: ప్రధాని జస్టిన్ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!) -
డల్లాస్ లో SVES కాలేజీల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
-
మెగా మెడిటేషన్ సమ్మిట్ 2023
-
భారత్లో ఐసీసీసీ సదస్సు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ద కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ఐసీసీసీ) సదస్సుకు భారత్ వేదిక కానుంది. 2027లో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఐసీసీసీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ, స్విట్జర్లాండ్ సైతం పోటీపడ్డాయి. దిగ్గజాలు, విద్యావేత్తలు, నిపుణులు ఈ రంగంలో పరిశోధన పురోగతిపై సదస్సులో చర్చిస్తారు. 1918 నుండి సాధారణంగా 4–6 ఏళ్ల వ్యవధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 16వ ఐసీసీసీ సెపె్టంబర్ 18–22 మధ్య బ్యాంకాక్లో జరుగుతోంది. -
ద్రవ్యోల్బణంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
బీ20 సమ్మిట్ ఇండియా 2023లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశ మొదటి త్రైమాసికం బాగానే ఉందని, Q1 GDP సంఖ్యలు కూడా బాగుండాలని అన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత్ ఆర్థిక సంస్కరణల వేగవంతమైన వేగాన్ని ప్రదర్శించిందని కూడా వెల్లడించారు. కూరగాయల ధరలు పెరగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఇండియన్ క్యూ1 జిడిపి గణాంకాలు ఈ నెలాఖరున విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. దీనికి ప్రధాన కారణం టమోటాలు, ఇతర కూరగాయల ధరల పెరుగుదల అని తెలుస్తోంది. అయితే, ఆర్థిక పునరుద్ధరణకు గణనీయమైన సమయంతో పాటు వడ్డీ రేట్లు పెరగవచ్చని ఆమె అన్నారు. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంపై దృష్టి సారించామని, అయితే అవసరమైన దిగుమతులు ఆగవని సీతారామన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ), విదేశీ మూలధన ప్రవాహాలు వృద్ధికి కీలకమని కూడా ఆమె అన్నారు. ఆర్బిఐ తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఇటీవలే ప్రకటించింది. ఇందులో వడ్డీ రేటు - రెపో రేటు వరుసగా మూడోసారి యథాతథంగా ఉంచింది. -
బ్రిక్స్లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్గా రూపాంతరం చెందింది. బ్రిక్స్లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్బర్గ్ నుంచి గ్రీస్కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్బర్గ్లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో గురువారం జిన్పింగ్తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
24న స్టార్టప్ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
హైదరాబాద్: మాదాపూర్ లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ సదస్సు
-
జీ20 సమ్మిట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ఫొటోలు)
-
FIPIC summit: భారత్ విశ్వసనీయ భాగస్వామి
పోర్ట్ మోరిస్బై: ఆపదలోఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నవారు క్లిష్ట సమయంలో ఆదుకోకపోవడం నిజంగా దారుణమని అన్నారు. తద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యవహార శైలిని తప్పుపట్టారు. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరిస్బైలో సోమవారం ఫోరమ్ ఫర్ ఇండియా–పసిఫిక్ ఐలాండ్స్ కో–ఆపరేషన్(ఎఫ్ఐపీఐసీ) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. 14 పసిఫిక్ ద్వీప దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా నిలుస్తోందని మోదీ గుర్తుచేశారు. భారత్ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చని ఆయా దేశాలకు సూచించారు. తమ శక్తి సామర్థ్యాలను, అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి మార్గంలోనూ తోడుగా ఉంటామని మోదీ వివరించారు. తమ దృష్టిలో ఈ దేశాలు చిన్న దేశాలు ఎంతమాత్రం కావని, భారీ సముద్ర దేశాలుగా వాటిని పరిగణిస్తున్నామని మోదీ చెప్పారు. మూడు దేశాల అధినేతలతో భేటీ మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిష్ హిప్కిన్స్, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ అధ్యక్షుడు సురాంగెల్ ఎస్.విప్స్ జూనియర్, పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, క్రీడలు, సాంకేతికత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. హిప్కిన్స్తో భేటీ అద్భుతంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. పాలౌ ప్రజలు వాడే ఎబాకిల్ పరికరాన్ని మోదీకి సురాంగెల్ బహూకరించారు. ఆస్ట్రేలియాతో సుదృఢ బంధం న్యూఢిల్లీ: ‘‘నేనంత త్వరగా తృప్తిపడే రకం కాదు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కూడా అంతే. ఇద్దరమూ కలిసి ఆస్ట్రేలియా, భారత బంధాలను మరింత దృఢతరం చేసి తీరతాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సిడ్నీలో ‘ద ఆస్ట్రేలియన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం, సముద్ర తీర భద్రత, పైరసీ దాకా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. విందులో భారతీయ రుచులు ఎఫ్ఐపీఐసీ శిఖరాగ్రం సందర్భంగా ఫసిíఫిక్ ద్వీప దేశాల అధినేతలకు సోమవారం మధ్యాహ్నం మోదీ ఇచ్చిన విందులో భారతీయ వంటకాలు, ముఖ్యంగా తృణధాన్యాల వెరైటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులు తృణధాన్యాల విశిష్టితను అడిగి తెలుసుకున్నారు. ఖాండ్వీ, వెజిటెబుల్ సూప్, మలై కోఫ్తా, రాజస్తానీ రాగి గట్టా కర్రీ, దాల్ పంచ్మెల్, మిలెట్ బిర్యానీ, నాన్ ఫుల్కా, మసాలా చాస్, పాన్ కుల్ఫీ, మాల్పువా, మసాలా టీ, గ్రీన్ టీ, మింట్ టీ, పీఎన్జీ కాఫీ తదితరాలను రుచిచూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు. మోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యున్నత గౌరవం లభించింది. పసిఫిక్ సముద్ర ద్వీప దేశాలైన పపువా న్యూ గినియా, ఫిజి తమ అత్యున్నత పురస్కారాలను ఆయనకు ప్రదానం చేశాయి. ఆయా దేశాలు మరో దేశ ప్రధానిని ఇలాంటి పురస్కారాలతో గౌరవించడం అరుదైన సంఘటన కావడం విశేషం. సొమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ డొడాయి ప్రధాని మోదీకి ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు(జీసీఎల్)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత్లో భారతరత్న తరహాలో పపువా న్యూగినియాలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందించినట్లు పపువా న్యూ గినియా ప్రభుత్వం వెల్లడించింది. జీసీఎల్ పురస్కారం పొందిన వారిని ‘చీఫ్’ అనే టైటిల్తో సంబోధిస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు ఈ అవార్డు లభించింది. ఫిజి ప్రధానమంత్రి సితివేణి రాబుకా భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని ప్రదానం చేశారు. మోదీ గ్లోబల్ లీడర్షిప్నకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలియజేసింది. ఇది భారత్కు లభించిన అరుదైన గౌరవమని వివరించింది. ఈ గౌరవాన్ని మోదీ భారతదేశ ప్రజలకు, ఫిజి–ఇండియన్ సమాజానికి అంకితం చేశారని పేర్కొంది. దేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తింపు ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు’, ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ గౌరవాలు తనకు దక్కడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూగినియా, ఫిజి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాలు భారత్కు, భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, మాల్దీవ్స్, బహ్రెయిన్ తదితర దేశాలు గతంలో తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి. -
ఆచి తూచి వ్యవహరించాలి
యుద్ధోన్మాదం పర్యవసానంగా మనిషి మృగంగా మారితే ఏమవుతుందో ప్రపంచానికి ఇప్పటికీ చాటుతూనే ఉన్న హిరోషిమా నగరంలో శుక్రవారం మూడురోజులపాటు జరిగే జీ–7 దేశాల శిఖ రాగ్ర సదస్సు ప్రారంభమైంది. 15 నెలలుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సహజంగానే ఈ సదస్సులో అది ప్రధానంగా చర్చకొస్తుంది. ఉక్రెయిన్లో రష్యా ‘వ్యూహాత్మక ఓటమి’కి అందరూ ఏకం కావాలంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. ఉక్రెయిన్కు ఆయు ధాలందిస్తూ రష్యా యుద్ధ వ్యూహాలను వమ్ముచేస్తున్నాయి. అయితే అదొక్కటే సరిపోదు. జీ–7 సమావేశాల వేదిక హిరోషిమా గనుక ఆ దేశాధినేతలందరూ చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా ఆలో చించి ఈ యుద్ధాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై దృష్టి సారించాలి. గెలుపోటముల సంగతలావుంచి ఇది అణుయుద్ధంగా పరిణమించకుండా ఏంచేయాలో ఆలోచించాలి. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి పట్టణాలపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 9న అమెరికా అణుబాంబులు ప్రయోగించటం పర్యవసానంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాటి విషాద ఉదంతాల్లో రెండు లక్షలమందికిపైగా మృత్యువాత పడ్డారు. అనంతర దశాబ్దాల్లో మరిన్ని లక్షలమంది దీర్ఘకాల వ్యాధుల బారినపడి చనిపోయారు. బాంబు జారవిడిచిన ప్రాంతానికి చుట్టూవున్న 11 చదరపు కిలోమీటర్ల పరిధిలో కనీవినీ ఎరుగని విధ్వంసం చోటు చేసుకుంది. తరాలు గడుస్తున్నా ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్నవారు అక్కడ ఎక్కువే. ఈ శిఖరాగ్ర సదస్సు అణు నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చర్యలపై దృష్టి సారిస్తుందంటున్నారు. అయితే అణ్వస్త్ర దేశాలన్నీ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులు కోవడానికి ముందుకు రానంతవరకూ ఈ లక్ష్యాలు నెరవేరవు. ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని తరచు పుతిన్ బెదిరిస్తున్నారు. ఉత్తరకొరియా అణు క్షిపణులను అభివృద్ధి చేస్తున్నానంటున్నది. ఈ పరిణామాలు ఆందోళనకరమైనవే. కాదనలేం. అయితే తమ దగ్గర తప్ప వేరే ఎవరివద్దా అణ్వస్త్రాలు ఉండరాదన్న వాదంతో ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనటం సాధ్యంకాదు. అసలు ఎవరిదగ్గరైనా మానవాళిని సర్వనాశనం చేసే ఆయుధాలు ఎందుకుండాలన్న ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. అమెరికా అణు ఛత్రఛాయలో కొనసాగుతున్న జపాన్ అణునిరా యుధీకరణ గురించి మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంలో వింతేమీ లేదు. జీ–7 సభ్యదేశాల ముందు పెద్ద ఎజెండాయే ఉంది. తైవాన్కు చైనా నుంచి వస్తున్న బెదిరింపులు, గతంలో పాశ్చాత్య దేశాలకు వలసలుగా ఉండి స్వాతంత్య్రం పొంది ఇప్పుడు రష్యా, చైనా లకు సన్నిహితమవుతున్న పేద దేశాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఇందులో చర్చకు రాబోతున్నాయి. ఆర్థిక స్థితిగతులు సరేసరి. అరబ్ దేశాల వైఖరితో తలెత్తిన చమురు సంక్షోభం, దాన్ని వెన్నంటి వచ్చిన ఆర్థిక మాంద్యంతో నిలువెల్లా వణికిన పాశ్చాత్య దేశాలు 1975లో ఒక్కటై జీ–6గా ఏర్పడ్డాయి. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్లతోపాటు అమెరికా చేరింది. ఆ మరుసటి ఏడాది కెనడా చేరికతో అది జీ–7 అయింది. చిత్రమేమంటే...అప్పటికి ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో యాభై శాతం వాటావున్న ఈ దేశాలకు ఇప్పుడు 30 శాతం మించిలేదు. చైనా, భారత్, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలు చురుకందుకున్నాయి. రష్యా, చైనాలవైపు మొగ్గుతున్న పేద దేశా లకు ఆరోగ్యం, ఆహారభద్రత, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో తోడ్పాటునందిస్తూ వాటిని అక్కున చేర్చుకోవాలని జీ–7 దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఓఈసీడీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు గనుక ఆ దిశగా విధాననిర్ణయాలుండొచ్చు. ఇక రష్యా చమురుపై విధించిన ఆంక్షల అమలుపై ఇందులో చర్చిస్తారంటున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారంలో కూడా రష్యాను కట్టడి చేయటంపై జీ–7 దృష్టి సారించబోతోంది. ఇది నేరుగా భారత్నూ, ప్రత్యేకించి గుజరాత్లో అధికంగా ఉన్న వజ్రాల పరిశ్రమనూ ప్రభావితం చేస్తుంది. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో 40 శాతం వాటా ఉన్న రష్యా, గుజరాత్లోని సూరత్ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమపై ప్రధానంగా ఆధారపడుతుంది. రష్యాపై విధిస్తున్న ఆంక్షలవల్ల ఆ దేశం ఒక్కటే కాదు... ముడి చమురు, వజ్రాలు తదితర ఉత్పత్తులపై ఆధారపడుతున్న భారత్వంటి దేశా లకు సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. జీ–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో మన వైఖరిని స్పష్టంగా తెలియజేయటం అవసరం. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి మూడు దశాబ్దాలవుతోంది. ఇన్నేళ్లుగా ప్రపంచ దేశాల మధ్య పర స్పర విశ్వాసం వల్ల అయితేనేమి, ఎవరూ తొలుత అణ్వాయుధాలు వినియోగించరాదన్న నియమం పెట్టుకోవటం వల్ల అయితేనేమి ప్రమాదం లేకుండా పోయింది. అయితే ఆ దశ ముగిసి పరస్పరం హెచ్చరికలు, సవాళ్ల పర్వం మొదలైంది. యుద్ధం సంప్రదాయ ఆయుధాల పరిధిలోనే పరిభ్రమిస్తుందనుకోవటం ఆత్మవంచనే అవుతుంది. కనుక జీ–7 దేశాలు అత్యంత జాగురూకతతో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఉక్రెయిన్కు ఆయుధాలందజేస్తూ పోవటం, ఆంక్షలు అమలు చేయటంవల్ల రష్యా లొంగుబాటులోకొస్తుందా, అది మరింత రెచ్చిపోయి ఉన్మాద స్థితికి చేరుతుందా అన్నది గమనించు కోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ యుద్ధాన్ని ఆపటమే ధ్యేయంగా తదుపరి చర్యలుండాలి. -
టెక్నాలజీతో సాధికారత
హైదరాబాద్:సర్వత్రా టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు వృద్ధి కోసం సాంకేతికతపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎస్హెచ్ఆర్ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) పనిప్రదేశాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్పునకు కారకులయ్యేలా టెక్నాలజీతో ప్రజలకు సాధికారత లభించగలదని వివరించారు. ఎస్హెచ్ఆర్ఎంఐ టెక్23 కాన్ఫరెన్స్, ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. (బీర్తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!) సదస్సు రెండో రోజున హెచ్ఆర్ సిస్టమ్స్ బ్లూప్రింట్ పేరిట రూపొందించిన రిపోర్టును ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 120 మంది పైగా వక్తలు, 4,000 మంది పైచిలుకు హెచ్ఆర్ నిపుణులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా, వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రజాస్వామ్యంతో సత్ఫలితాలు లభిస్తాయనడానికిదే నిదర్శనం’’ అన్నారు. గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’లో మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేశ ప్రజల సమ్మిళిత ప్రయత్నాలే తగిన బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. పాలకులను ప్రజలంతా కలిసి ఎన్నుకొనే ఆలోచన ప్రపంచ దేశాల కంటే చాలా ఏళ్ల ముందే భారత్లో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల ప్రథమ విధి పాలకులను ఎన్నుకోవడమేనని మహాభారతంలో ఉందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో ఎన్నో గణతంత్ర రాజ్యాలుండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయని వివరించారు. ‘‘గణతంత్ర రాజ్యాల్లో పాలనాధికారం వారసత్వంగా దక్కేది కాదు. పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక నిర్మాణం కాదని, అదొక స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’కు అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాల అధినేతలు ఆతిథ్యం ఇస్తున్నారు. -
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
విశాఖలో త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: మంత్రి అప్పలరాజు
-
విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్
-
బెంగళూరులో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రోడ్ షో