-
సోదరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
కంటోన్మెంట్(హైదరాబాద్): ఆస్తి తగాదాలతో వరుసకు సోదరుడైన ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 70 శాతం గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయిన్పల్లి కంసారిబజార్ రామమందిరం సమీపంలో కందికొండ సత్తయ్య, ముత్తయ్యలకు నివాసస్థలం ఉంది. ముత్తయ్య కుమారుడు శ్రీనివాస్(62) ఇటీవల తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఇంటినిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చాడు. తాను సమీపబస్తీలో నివాసం ఉంటున్నాడు. కంసారి బజార్లో తన ఇంటి పక్కనే వరుసకు సోదరుడైన వినోద్ (సత్తయ్య కుమారుడు) మరో ఇంటిలో నివాసముంటున్నాడు. వీరిద్దరి ఇళ్ల నడుమ ఉన్న చిన్నపాటి సందు గుండానే శ్రీనివాస్ ఇంటికి దారి ఉంది. ఈ స్థలం విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం శ్రీనివాస్ అద్దె వసూలు నిమిత్తం తన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా వినోద్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన అన్నను చంపానంటూ అరుస్తూ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్లో శ్రీనివాస్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గేమ్ ఛేంజర్ సినిమాతో మేమేంటో తెలుస్తుంది
-
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్జగన్కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్షీట్లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
హైబీపీతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మృతి
కల్వకుర్తి టౌన్: విధి నిర్వాహణలో పోలీస్స్టేషన్ వాచ్ ఇన్చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ వివరాల ప్రకారం.. పట్టణ పోలీస్స్టేషన్లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్ (51) వాచ్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్ స్వస్థలం నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది. పోలీసుల నివాళి డ్యూటీలో శ్రీనివాస్ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్ చిత్రపటానికి సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కామెడీ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
నా తలకు కోటి రూపాయలు..TV5 కొలికిపూడిపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు
-
వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి! అసలు కారణాలేంటి?
సిద్దిపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండు శ్రీనివాస్(35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న సందర్భంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. పక్కన ఉన్న వారు గొడవను ఆపారు. శ్రీనివాస్ను గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ స్పృహ కోల్పోయి, నోటిలో నుంచి నురగ రావడంతో అదే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానం ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని అతడి భార్య రాధ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గృహిణి మృతి.. అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్కు చెందిన నాచారం మరియమ్మ (41) ఈ నెల 16వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఈనెల 17న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పిల్లికోటాల్ శివారులో గల పిల్లికుంట వద్ద సోమవారం మరియమ్మ చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుంటలో వెతుకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై గాయం ఉండడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ టౌన్ సీఐ తెలిపారు. ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం!
మహబూబ్నగర్: మండలంలోని దారారం చెందిన ఆవుల శ్రీనివాసులు(43) ఆత్యహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుల శ్రీనివాసులు శుక్రవారం కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చగట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి: వివాహేతర సంబంధమే కారణమా..? -
నాన్నగారి ప్యాషన్ మమ్మల్ని నిలబెట్టింది
‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. యానిమేషన్ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ అధినేతలు రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక ‘చిలకప్రోడక్షన్’ బ్యానర్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాజీవ్ చేసిన ‘చోటా భీమ్’ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్ని రాజీవ్లో చూశాను’’ అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్లకు అభినందనలు’’ అన్నారు శరత్ మరార్. రాజీవ్ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్ కింగ్’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్ గోల్డ్ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘ ‘2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్’ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్ని స్టార్ట్ చేశాం’’ అని శ్రీనివాస్ చిలక అన్నారు. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
నాలుగేళ్లు పరిశోధన చేశాను
హన్సిక టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఓంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలో చేసిన నాకు ‘మై నేమ్ ఈజ్ శృతి’ దర్శకుడిగా తొలి చిత్రం. ఓ అమ్మాయి జీవితంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రకథ రాసుకున్నాను. స్కిన్ మాఫియా గురించిన స్క్రీన్ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. హన్సికగారి అమ్మగారు స్కిన్ డాక్టర్ కావడంతో ఈ కథకు హన్సికగారు బాగా కనెక్ట్ అయ్యారు. జీవితంలో ఓ కలను నిజం చేసుకునేందుకు గ్రామం నుంచి సిటీకి వచ్చిన శృతి (హన్సిక పాత్ర పేరు) స్కిన్ మాఫియా ట్రాప్లో ఎలా చిక్కుకుంది? ఆ తర్వాత తనను తాను ఏ విధంగా కాపాడుకోగలిగింది? అనేది ఈ చిత్రం కథాంశం. మగవారికంటే మహిళలు చాలా స్ట్రాంగ్గా ఉంటారని, పెప్పర్ స్ప్రేలు లేకపోయినా తలలో ఉండే ఓ సేఫ్టీ పిన్తో కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోగలరని ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా కోసం నాలుగేళ్లు పరిశోధన చేశాను’’ అని అన్నారు. -
నా మనసుకు దగ్గరైన కథ ఇది
హన్సిక టైటిల్ రోల్ చేసిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు అశోక్ అతిథులుగా హాజరై, ఈ సినిమా హిట్టవ్వాలన్నారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ ఫిల్మ్ ఇది. నా మనసుకు దగ్గరైన కథ. దర్శకుడు శ్రీనివాస్గారు ఎంతో కష్టపడ్డారు. ప్రభాకర్గారు రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరోసారి ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేను కొత్త దర్శకుడిని అయినా కథను నమ్మి, నన్ను ప్రోత్సహించిన హన్సికగారికి, సపోర్ట్ చేసిన ప్రభాకర్గారికి, సహకరించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. శ్రీనివాస్ ఓంకార్. ‘‘ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా చేసిన హన్సికకు థ్యాంక్స్’’ అన్నారు ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, కెమెరామేన్ కిశోర్, కో ప్రోడ్యూసర్ బండి పవన్ కుమార్, లైన్ ప్రోడ్యూసర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే..
సాక్షి, ఆదిలాబాద్: లోకేశ్వరం మండలంలోని గడ్చాంద గ్రామంలో గురువారం రాత్రి ఒకరిపై కత్తితో దాడిచేయగా గాయాలయ్యాయి. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం... గడ్చాంద గ్రామానికి చెందిన గొల్ల సంజీవ్ బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. సంజీవ్ భార్యకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మూడేళ్లుగా గల్ఫ్ నుంచి పంపించిన డబ్బుల విషయమై భార్యను ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మరింతగా అనుమానం పెంచుకున్నాడు. తాను లేని సమయంలో తన భార్యకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులన్నీ వాడుకున్నాడని శ్రీనివాస్పై అనుమానం పెంచుకుని గురువారం రాత్రి తెల్లకల్లు దుకాణంలో ఉండగా కత్తితో దాడిచేశాడు. గాయాలపాలైన శ్రీనివాస్ను లోకేశ్వరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం శ్రీనివాస్ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ పంపినట్లు ఎస్సై పేర్కొన్నాడు. -
శ్రీనువస్తే...బాబు, లోకేష్ కు సిన్ సితారే !
-
స్కిల్ స్కాంలో కీలక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ ?
-
చంద్రబాబు కన్నింగ్ ప్లాన్.. శ్రీనివాస్ ఎక్కడ?
స్కిల్ స్కాంలో వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా లోకేష్కు అందించిన కిలారు రాజేష్ నెల రోజులకుపైగా అజ్ఞాతంలో ఉండి హఠాత్తుగా సీఐడీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక రోజు విచారణ తర్వాత మళ్లీ మాయం. మరి చంద్రబాబు నాయుడి పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ ఉన్నట్లు?. శ్రీను విదేశాలకు చెక్కేశాడా? లేక కిలారు రాజేష్ మాయ మాటలు చెప్పినట్లు అతగాడు కూడా ఏపీలోనో ఢిల్లీలోనో దాగి ఉన్నాడా?. స్కిల్ కార్పొరేషన్లో అసలు కుంభకోణమే జరగలేదని వాదిస్తున్న టీడీపీ నేతలు కానీ.. వారికి వంతపాడే ఎల్లో మీడియా కానీ ఏ తప్పూ జరగకపోతే పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ఎందుకు పారిపోయారో? ఎందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు హాజరు కాలేదో చెప్పాలంటున్నారు న్యాయ రంగ నిపుణులు. రూ.371 కోట్లు అవినీతి బాగోతంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గుడ్డిగా విడుదల చేసిన 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన ఘరానా దొంగలు.. ఆ తర్వాత ఆ డబ్బును హవాలా మార్గంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. లోకేష్ సన్నిహిత సహచరుడు కిలారు రాజేష్లకు పంపారు. ఆ ఇద్దరూ డబ్బు అందుకున్నట్లు ఇప్పటికే ఆధారాలు వెలికి తీసింది ఈడీ. తాము అందుకున్న డబ్బును వారు చంద్రబాబు, లోకేష్లకు అందజేశారని ఆరోపణ. అందులో రూ.27 కోట్ల రూపాయలను చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఖాతాలో జమ చేసిన ఆధారాలను కూడా సీఐడీ సేకరించి కోర్టు ముందు ఉంచిన సంగతి తెలిసిందే. సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు అరెస్ట్కు నాలుగు రోజుల ముందు సెప్టెంబరు 5న హవాలా లావాదేవీపైనే విచారించడానికి శ్రీనివాస్కు.. లోకేష్ కుడిభుజం కిలారు రాజేష్లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. అంతే రాత్రికి రాత్రే ఇద్దరూ మాయం అయిపోయారు. ఇద్దరూ విదేశాలకు చెక్కేశారని ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత నేనిక్కడే ఉన్నా అంటూ కిలారు రాజేష్ సీఐడీ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఇన్ని రోజులూ ఏ కలుగులో దాగున్నావని పోలీసులు అడిగితే రాజేష్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలేశాడు. ఇక రెండో కీలక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ కూడా బయటకు వస్తే దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అంతే కాదు, ఆ డబ్బు ఏ ఖాతాలోకి పంపారో కూడా తేలిపోతుంది. అయితే, శ్రీనివాస్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. నిజంగానే చంద్రబాబు కానీ.. శ్రీనివాస్ కానీ ఏ పాపం ఎరక్కపోతే, ఏ నేరానికి పాల్పడకపోతే సీఐడీ నోటీసులు ఇచ్చిన మరునాడే విచారణకు హాజరయ్యేవారు. అలా జరగలేదంటే వాళ్లు తప్పు చేసినట్లు రుజువైనట్లే అంటున్నారు నిపుణులు. శ్రీనివాస్ గురించే ఢిల్లీలో ఓ చానెల్ డిబేట్లో నారా లోకేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ అర్జంట్గా అమెరికాకి పిక్నిక్ వెళ్లాడని చెప్పారు. ఏ పిక్నిక్కు వెళ్లాడు? ఎవరు పంపించారు? తిరిగి ఎప్పుడు రావాలని చెప్పారు? అన్నవి లోకేష్ చెప్పలేదు. కాకపోతే శ్రీనివాస్ కూడా ఎక్కడో దూరాన టీవీల ముందు కూర్చుని చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాను భాగస్వామి అయిన కుంభకోణం గురించి కోర్టుల్లో ఏం విచారణ జరుగుతోందో.. తమ గురించి ఏమనుకుంటున్నారో గమనిస్తూనే ఉండచ్చు. కాకపోతే, ఏదో ఒక రోజున కిలారు రాజేష్లానే శ్రీనివాస్ కూడా సీఐడీ ముందు కనిపించి నేను కూడా ఏపీలోనే ఉన్నానని ఓ కథ చెప్పినా చెప్పవచ్చంటున్నారు విశ్లేషకులు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు. -
యూత్ఫుల్ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్లుక్ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. ‘‘బెస్ట్ బడ్డీస్ కామెడీ బ్యాక్డ్రాప్లో సాగే ఫన్ రైడ్ ‘కిస్మత్’. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్
-
చంద్రబాబుకు మరో షాక్..
సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల ప్రకార.. చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక, స్కిల్ కుంభకోణం కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్రమంలో శుక్రవారంలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్పై సస్పెన్షన్ విధించారు. మరోవైపు.. నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: విశాఖ బీచ్కు కొట్టుకొచ్చిన అరుదైన పెట్టె.. చూసేందుకు ఎగబడ్డ జనం! -
సింగరేణిలో పోరు సైరన్
ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం/కరీంనగర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సింగరేణి కార్మిక సంఘాలు, యాజమాన్యం ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ సమావేశమైంది. తీవ్ర ఉత్కంఠల నడుమ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్కమిషనర్ (సెంట్రల్) శ్రీనివాసులు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ ఇలా: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 30న ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, మార్పులుచేర్పుల తర్వాత తుది జాబితా అక్టోబర్ 5న విడుదల చేస్తారు. 6, 7 తేదీల్లో సాయంత్రం 5గంటల వరకు హైదరాబాద్లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 10న గుర్తులు కేటాయిస్తారు. 28న సింగరేణి సంస్థ విస్తరించిన 11 ఏరియాలు, కార్పొరేట్ లో పోలింగ్ జరుగుతుంది. సింగరేణిలో ప్రస్తుతం 42,390 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాయిదాకు ససేమిరా: హైకోర్టు తీర్పు అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలపై బుధవారం హై దరాబాద్లో జరిగిన సమావేశంలో హైడ్రామా చో టు చేసుకుంది. మొత్తం 16 కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఏఐటీయూసీ, బీఎంఎస్ కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వ హించాలని తమ అభిప్రాయం తెలిపాయి. టీబీజీకేఎస్తో పాటు మరికొన్ని సంఘాలు ఎన్నికలు వాయిదా వేయాలన్నాయి. కొందరు కార్మిక సంఘాల ప్రతినిధులు తటస్థంగా ఉన్నా రు. దీంతో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసేందుకు యాజమాన్యం తరఫున హాజరైన ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. వాయిదాపై ఏకాభిప్రాయం వస్తే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దామంటూ మంతనాలు సాగించారు. అయితే సమావేశం చివరివరకు కూడా ఎన్నికల వాయిదాకు ఏఐటీయూ సీ, బీఎంఎస్లు అంగీకరించలేదు. ఎన్నికలు నిర్వహించాల్సిందేన ని పట్టుబట్టాయి. దీంతో కోర్టు తీర్పు ప్రకారం ఎ న్నికల షెడ్యూల్ జారీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలై ఉంది. సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమే అంటూ ఇదివరకే ఆ జిల్లాల పరిదిలోని అధికారులు చేతులెత్తేశారు. మెజారిటీ సంఘాలు కూడా ఎన్నికల వాయిదాకే పట్టుబట్టాయి. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్లో ఉంది. 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించే అవకాశం సింగరేణికి లభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 20కిపైగా బొగ్గుగనుల బృందాలు రానున్నాయి. ఇదే కాకుండా అతి కీలకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతోంది. -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ టూ కాంగ్రెస్.. వాట్సాప్లో రౌడీషీట్ వైరల్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్ సర్పంచు పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్పార్టీ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్లోనే ఉండి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీనివాస్ దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సర్పంచు శ్రీనివాస్పై గతంలో కరీంనగర్రూరల్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేసిన సర్క్యులర్తోపాటు పలుకేసుల వివరాలు సోషల్మీడియాలో జోరుగా ప్రచారమైనాయి. ఈక్రమంలో శనివారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్పార్టీలో చేరారు. టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సర్పంచు శ్రీనివాస్ కలుసుకోవడం జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కరీంనగర్ టికెట్ను ఆశిస్తున్న పలువురు నాయకులు హైదరాబాద్ స్థాయిలో టీపీసీసీ నాయకులతో ప్రయత్నిస్తుండగా శ్రీనివాస్ ఏకంగా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు చేయడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్లో చేరిన మరుసటిరోజే టికెట్ కోసం ఏఐసీసీ అధ్యక్షుడిని కలుసుకునే అవకాశం రావడం పార్టీలోని మిగతా ఆశావహులను కలవరపరుస్తోంది. ఎది ఏమైనా శ్రీనివాస్ ఢిల్లీలో రెండు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. -
అనుమతి లేకుండా విదేశాలకు పారిపోయిన చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్
-
చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్కు ప్రణాళిక శాఖ మెమో జారీ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు ఏపీ ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ అనుమతి లేకుండా విదేశాలకు పారిపోవడంపై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో ఇచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో విచారించేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారయ్యాడు. అనుమతి లేకుండానే అమెరికా చెక్కేశాడు. అయితే స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో శ్రీనివాస్ను కీలక వ్యక్తిగా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ స్కాం వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారపోయిన విషయం తెలిసిందే. నోటీసుల గురించి తెలుసుకున్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లినట్లు అధికారులు గుర్తించగా..పలు కాంట్రాక్టుల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ వెళ్లారు. యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ ఇప్పటికే తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైంది. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని ఇప్పటికే ఐటీ నోటీసుల ద్వారా వెల్లడయింది అరెస్ట్ సందర్భంగా చంద్రబాబుకు వాట్సాప్ స్క్రీన్షాట్లు 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసు అధికారులు ఇటీవల చంద్రబాబుకు చూపించారు. ఇవి చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ బాబు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. చదవండి: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి -
అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ నేత శ్రీనివాసులు అరెస్ట్
మదనపల్లె: మాజీ సీఎం చంద్రబాబు ‘యుద్ధభేరి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో మదనపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులును శనివారం అరెస్ట్చేసి రిమాండ్కు పంపారు. ముదివేడు పిచ్చలవాండ్లపల్లె ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చిన నేపథ్యంలో... ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు అంగళ్లుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు వారిని కొట్టాలని, చంపాలని ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో రైతులపై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ముదివేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 20మందికి పైగా టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం దేవరింటి శ్రీనివాసులును రూరల్ సీఐ శివాంజనేయులు అరెస్ట్ చేశారు. ఆయనకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు.