-
ఆగని టీడీపీ గుండాల దాడులు పచ్చని పల్లెలో కక్ష పెట్టిన "కారు" చిచ్చు
-
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
-
శ్రీకాకుళంలో తండేల్
శ్రీకాకుళంలో ల్యాండ్ అయింది ‘తండేల్’ టీమ్. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ‘లవ్స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్యతో ఈ సినిమా కోసం మళ్లీ జోడీ కట్టారు సాయి పల్లవి. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత నాగచైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.2018లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీకాకుళంలో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, సాయి పల్లవిపై లవ్, ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
కూన ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.కూన రవికుమార్తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి. -
పసుపు బిళ్ల .. అచ్చెన్న తొలి జెల్ల!
‘ నేను మాటిస్తున్నాను.రేపు అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను.రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా..ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా.. ఎండీఓ దగ్గరకు వెళ్లినా..ఏ ఆఫీసుకు వెళ్లినా..మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి.. మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పనిచేయించే విధంగా అధికారులను లైనులో పెడతాను.ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా’..కార్యకర్తల ఆత్మీయ సభ, ఉద్యోగుల తొలి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.ఇప్పుడీ వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియానూ కుదిపేస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు రాష్ట్రంలో సంచలనంతో పాటు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకొచ్చాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను కుదిపేశాయి. టీడీపీ శ్రేణులను ప్రభుత్వ కార్యాలయాలకు దూకుడుగా వెళ్లేలా ప్రోత్సహించేలా ఉన్నాయి.అచ్చెన్నాయుడుకు మంత్రిగా పనిచేయడం కొత్తేమీ కాదు. 2014–19లో కూడా పనిచేశారు. అప్పట్లో కూడా కాస్త కటువుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈ సారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చిన తొలి పర్యటనలోనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని.. కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.‘టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్లండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు’ అని కార్యకర్తల ముందు చెప్పడం సరికాదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బెదిరింపు ధోరణిగానే ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేశాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. -
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
కుమారుడి మృతి తట్టుకోలేక..
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
-
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
-
అచ్చెన్న అడ్డాలో.. రక్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: 👉 నిమ్మాడలో కింజరాపు కుటుంబానికి కాదని సర్పంచ్గా నామినేషన్ వేసిన కింజరాపు సూరయ్య... ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన ఎచ్చెర్ల సూర్యనారాయణను చిట్టయ్యవలస తోటలో హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు ఎమ్మెల్యేగా పోటీకి అడ్డుపడిన కింజరాపు భుజంగరావు (బుజ్జి) కత్తులతో హత్యకు గురయ్యారు. 👉 నిమ్మాడ రాజకీయంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తి శవమయ్యాడు. 👉 పిన్నింటిపేటలో రిగ్గింగ్కు అడ్డుపడిన కూన రామారావుని 1994లో డిసెంబర్ 3న కత్తితో పొడిచి చంపేశారు. 👉 కింజరాపు గణపతి కుమార్తె మేనకమ్మను మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా అక్కడే వివస్త్రను చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు. వాటి వెనక ఎవరున్నారో చనిపోయిన వారి శత్రువులకు తెలియాలి. నిమ్మాడ రాజకీయమంటే అలాగే ఉంటుందనేది అందరి నోట మాట. తొలుత బెదిరింపులు..ఆ తర్వాత దౌర్జన్యాలు..అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం నిమ్మాడలో పరిపాటిగా మారిపోయింది. ఏళ్ల క్రితం నుంచి 18 ఎకరాల రైతు మెండ రామ్మూర్తిని ఇబ్బంది పెడుతున్న విషయం ఇప్పటికీ కొనసాగుతోంది. అన్న కుమారుడిపైనా దౌర్జన్యం.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్న టార్గెట్ అయ్యారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అప్పన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అప్పన్న భార్య చంద్రకళ మెళియాపుట్టి కేజీబీవీలో హిందీ పండిట్గా పనిచేసేవారు. 2014లో మంత్రి అయ్యాక ఆమెను తొలగించారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ వద్ద 15 ఏళ్ల క్రితం రూ. 2లక్షలను అప్పన్న అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తమంతా చెల్లించినప్పటికీ ముందుగా రాసుకున్న నోటు పత్రం ఈ రోజుకూ ఇవ్వలేదని అప్పన్న మొరపెట్టుకునే వస్తున్నారు. అదే అప్పన్న నిమ్మాడ సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తే అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ తదితరులు దాడి కూడా చేశారు. అచ్చెన్నపై నమోదైన కేసులు, ఫిర్యాదులు👉 కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సర్పంచ్ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు కింజరాపు హరిప్రసాద్, కింజరాపు కృష్ణ, కింజరాపు అచ్చెన్న, కింజరాపు దాముమోహన్, మెండ సత్యం తదితరులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో సర్పంచ్ గణేశ్వరరావు కుమార్తె మేనకపై కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అనుచరులు దాడి చేసి అవమానపరచినట్లు ఆమె తండ్రి గణేశ్వరరావు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. 👉 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన అచ్చెన్నాయుడును అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ ప్రయత్నాలు చేశారు. 👉పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేశారు. 👉 1995లో కాంగ్రెస్ మద్దతుదారులుపై అచ్చెన్న వీరంగం చేసి నిమ్మాడలో తన పినతండ్రి వరుసైన బుజ్జి అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 👉 కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేసి, ఆ ఘటనను కప్పి పుచ్చేందుకు అధికారులను బెదిరించారు. ఈ కేసును కొట్టివేశారు. 👉 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ తో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్కు ఫిర్యాదు చేశాడు. -
చంద్రబాబు చిమ్మిన కాలకూటమి విషం
మండుటెండలో పండుటాకులు రెండోరోజూ అవే కష్టాలు ‘చంద్రబాబూ మా ఉసురు నీకు తగులుతుంది..’పింఛన్ డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చినఓ వృద్ధుడి శాపమిది.‘బాబూ.. మాకు అన్యాయం చేయడం తగదు..’బ్యాంకు క్యూలో నిలుచోలేక ఓ పింఛన్దారు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చంద్రబాబూ.. మమ్మల్ని బతకనీయవా..’ ఎండలకు తట్టుకోలేక మరో పెన్షన్ లబ్ధిదారు సూటిగా వేసిన ప్రశ్న ఇది. చంద్రబాబు చిమ్మిన కాల‘కూటమి’ విషం పింఛన్దారులను నరకయాతన పెడుతోంది. వలంటీర్ల సేవలు వద్దంటూ మొదట ఆయనే తనవాళ్లతో ఫిర్యాదు చేయించారు, బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయాలంటూ ఎన్నికల కమిషన్కు సిఫార్సులు చేశారు, ఇప్పుడు లబ్ధిదారులు అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వమే ఇదంతా చేయించిందంటూ నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. కానీ నిజం తెలిసిన జనాలు మాత్రం ప్రతి బ్యాంకు క్యూలోనూ చంద్రబాబు వైఖరిని దునుమాడుతున్నారు.మమ్మల్ని బతకనివ్వరా..?నాయనా చంద్రబాబు నాయుడా మాకు చివరి దశలో చుక్కలు చూపిస్తున్నావు. ఇలా మండుటెండలో బ్యాంకుల చుట్టూ డేకిరిస్తూ కాళ్లాడని నాలాంటివారి ఉసురు పోసుకుంటున్నావు. ప్రతి నెలా కడుపులో చల్ల కదలకుండా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు. ఇదేం ఘోరం బాబూ...ఎవరికి అడిగినా నీ పుణ్యమే ఇది అంటున్నారు.– కుప్పిలి రాములు, మర్రిపాడుకాలనీ, సవలాపురం, ఆమదాలవలస నియోజకవర్గంమా ఉసురు చంద్రబాబుకి తగులుతుందిపింఛన్ కోసం నా బోటి ముసలోళ్లను ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుకి మా ఉసురు తప్పకుండా తగులుతుంది. వలంటీర మ్మ ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం మా ఇంటికి వచ్చి రూ.3000 లు పింఛన్ డబ్బులు చేతికి అందించేది. ఇప్పుడు పింఛన్ కోసం గుబులుగా ఉంది. నడ్డి ఈడ్చూకుంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. బాబు చేసిన పాపం మాకు శాపంగా మారింది. మా ఉసురు ఊరికినే పోదు. – తమ్మినాన లత్సమ్మ, పింఛన్ లబ్ధిదారు,వజ్రపుకొత్తూరు మండలం -
అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
‘ఒరే.. ఏరా..’ ఉద్యోగులను అచ్చెన్నాయుడు పిలిచే విధానమిది. ‘బట్టలూడదీసి కొడితే నీకు దిక్కెవరే..’ ఓ మహిళా కానిస్టేబుల్ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న మాట ఇది. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ పోలీసులను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలివి. ఒంటి నిండా మదం, గొంతు నిండా విషం నింపుకున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను చాలాకాలంగా చులకనగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన తీరు మారలేదు. ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న వ్యవహార శైలిని ఉద్యోగులు విశ్లేషించుకుంటున్నారు.👉ఆర్ అండ్ బీ ఉద్యోగి కళ్యాణి అనే మహిళపై అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆమైపె దౌర్జన్యం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.👉 గతంలో కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేసి, నీకు బట్టలు ఊడదీసి కొడితే దిక్కెవరే అంటూ బెదిరించాడు. ఆ సంఘటనను కప్పి పుచ్చేందుకు అప్పట్లో పోలీస్ అధికారులను బెదిరించి కంప్లైంట్ నమోదు కాకుండా చేశారు.👉 గతంలో పోలాకి మండలం రహీమానుపురంలో జన్మభూమి కమిటీ సభ్యుడు బాలక గోపి తండ్రి డెత్ సర్టిఫికెట్ విషయంలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు త్రివేణి అక్కడ నిబంధనల మేరకు వ్యవహరించిందని నిమ్మాడ పిలిపించి ఆగ్రహించడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.👉గతంలో టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి అప్పటి ఎంపీడీఓగా పనిచేసిన లోకనాథంను బెదిరించారు. చెప్పినట్టు చేయలేదన్న ఆగ్రహంతో తలుపులేసి తంతే నీకు దిక్కెవరు అని భయపెట్టారు.👉గతంలో పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూర్యారావు అనే కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేశారు. ‘నిన్ను తుపాకీ తిరగేసి కొడితే నీకు దిక్కెవరం’టూ అచ్చెన్నాయుడు బెదిరించారు. సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.👉‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికి కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయారు.👉ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరైస్టెనప్పుడు కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద వైద్య పరీక్షలు నిర్వహణ కోసం పోలీసులు తీసుకురాగా...అక్కడున్న సీఐ నీలయ్యను బెదిరించారు. ‘హోం మినిష్టర్ను అవుతాను. నీ లెక్క తేలుస్తాను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కింజరాపు అచ్చెన్నాయుడికి ఉన్న గౌరవిమిది. ఒరే..ఏరా అన్న పిలుపే తప్ప ఆయనలో అంతకుమించి సంస్కారం లేదని పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. మంత్రి హోదాలోనే కాదు ప్రతిపక్ష నేతగా కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నా, అధికారులన్నా చిన్నచూపే. ప్రతి దానికి అధికారులపై మండిపడటం, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం చేయడం, పరుష పదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించడం ఆయన రాజకీయ జీవితంలో సర్వసాధారణమైపోయింది. అచ్చెన్నాయుడు వస్తే చాలు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక, ఫోన్ బెదిరింపులైతే చెప్పనక్కర్లేదు. తన అనుయాయులకు పనిచేయకపోగా, చెప్పినట్టుగా అధికారులు నడుచుకోకపోయినా ఫోన్ చేసి తిట్టడం, దూషణలకు దిగడం అచ్చెన్నకు పరిపాటిగా మారిపోయింది.ఉద్యోగులపై నిత్యం జులుంటీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శించారు. ఎవరైనా జీ హుజూర్ అన్నట్టుగానే ఉండాలి. లేదంటే వారందరికీ శంకర గిరి మాన్యాలు పట్టిస్తానంటూ బెదిరింపులు చేసేవారు. చేయి చూపించి వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిపోయాక కూడా ఆయన మదం తగ్గలేదు. నోటికొచ్చినట్టు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులనే కాకుండా పోలీసు అధికారులను బెదిరించారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లను చూసుకుని మిగతా టీడీపీ నాయకులు కూడా ఉద్యోగులపైన, అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.బేరీజు వేసుకుంటున్న ఉద్యోగులు ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు, అటు కూన రవికుమార్ వ్యవహార శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారులకు గానీ, ఉద్యోగులకు గానీ గౌరవం లేకుండా పోయిందని, అదే సంస్కృతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించారని ప్రభుత్వ ఉద్యోగులు విశ్లేíÙంచుకుంటున్నారు. అధికారులపైన, ఉద్యోగులపైన జులుం ప్రదర్శించడంతో పాటు దూషణలు, బెదిరింపులకు దిగే టీడీపీ నాయకులెక్కడ, ఉద్యోగులను గౌరవించే ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలకులెక్కడ అని బేరీజు వేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నామన్నదానిపై ఎన్నికల నేపథ్యంలో తేడాలు గమనించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసుకునే తరుణంలో ఎవరు బెస్ట్ అనే దానిపై పోల్చి చూసుకుంటున్నారు. -
టెక్కలి సభలో సీఎం జగన్ పొలిటికల్ పంచ్లు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్..బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలువిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోందిమాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగ్పూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇంటింటికి కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తారంట నమ్ముతారా?.ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు -
22 రోజులు.. 2100 కిలోమీటర్లు.. ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan Memantha Siddham Bus Yatra Live Updates..నేటితో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్6 ప్రత్యేక సమావేశాలకు హాజరయిన సీఎం జగన్9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రఅక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంఅక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయి.అక్కవరం, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది.సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారుజగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకేచంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేమూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలిఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు.పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ.ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతంఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం.రాయలసీయ నుంచి ఉత్తరాంద్ర వరకు జన సునామీ చూశాంసంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది.విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకువచ్చాం.గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం.పేద ధనిక విద్యార్ధులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం.పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలిమరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమేనా?జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధంవిప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్య, ఆరోగ్య రంగంలో మార్పులతో ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధంలక్షా 35 వేల మంచి ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు సిద్ధంగ్రామస్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం1వ తేదీ ఇంటికే వచ్చే రూ.3 వేలు పింఛను సిద్ధంమీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధంమరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయిమేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాంపొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారుమంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు...అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పనిఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూజతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలిఅబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారుదోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటుచంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుబాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు..ఇంటికి బంగారం, బెంజ్ కారు అంటున్నాడు..నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్నికాపాడేందుకు మీరంతా సిద్ధమామీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండిశ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్ బస్సు యాత్రకు జననీరాజనందారిపొడవునా జై జగన్ అంటూ నినాదాలుదారి పొడవునా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళల హారతులుఅభిమాన నేత కోసం ఎండను సైతం లెక్క జేయకుండా తరలివస్తున్న జనం చిన్నారి చికిత్సకు సాయం.. సీఎం జగన్కు కృతజ్ఞతలు►అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్►ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్►చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి►2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్►కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా సీఎంకి చెప్పిన శ్రీధర్► నరసన్నపేటకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►ఆముదాలవలస ఫ్లై ఓవర్ చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర. ►ఎచ్చెర్ల చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►చిలకపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర►అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం►శ్రీకాకుళం సిద్ధమా?. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. Memantha Siddham Yatra, Day -22.ఉదయం 9 గంటలకు అక్కివలస రాత్రి బస నుంచి ప్రారంభంసాయంత్రం 3:00 గంటలకు టెక్కలి వద్ద బహిరంగ సభ#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/U5fyZ9Vt5d— YSR Congress Party (@YSRCParty) April 24, 2024 ►బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాగా, నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగియనుంది. ►ఇక, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్రలో జగనన్న జన ప్రభంజనం✊🏻Memantha Siddham Yatra, Day -21.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/axMpaCHQ68— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 -
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల జీవన ప్రమాణాలను పెంచారు
-
ప్రచారంలో దుమ్ములేపుతున్న తమ్మినేని..
-
ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంటి హల్ చల్
-
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు. దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్కి కన్ఫర్మ్ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు. -
విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రేయ్ చంద్రబాబు.. అబ్బా కొడుకులకి ఇచ్చిపడేశారు టీడీపీ నేతలు
-
శ్రీకాకుళం టీడీపీలో సిటు మంటలు