-
నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-S
-
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్
తిరుపతి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రైవేట్రాకెట్ను రూపొందించింది. ‘మిషన్ ప్రారంభ్’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్. రాకెట్కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
ఇస్రో గ‘ఘన’ విజయం
-
ఇస్రో దీపావళి ధమాకా
సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. శనివారం అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్సెంటర్ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్, భారతి ఎంటర్ప్రైజెస్ భాగస్వాములుగా వన్వెబ్ ఇండియా లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. వన్వెబ్ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్వెబ్తో న్యూస్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది. రాకెట్ పేరు మార్చారు జీఎల్ఎల్వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్వెహికల్ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్ఎల్వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్ జీటీవోకి పంపట్లేదు. ఎల్ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్వెహికల్ ఎం3–ఎం2 రాకెట్ సొంతం. ప్రయోగం ప్రత్యేకతలు ►36 శాటిలైట్ల మొత్తం బరువు 5,796 కేజీలు. ►ఇంతటి బరువును 43.5 మీటర్ల ఎత్తయిన ఒక భారతీయ రాకెట్ మోసుకెళ్లడం ఇదే తొలిసారి. ►ఎల్వీఎం3–ఎం2 రాకెట్తో తొలి వాణిజ్యపరమైన ప్రయోగం ►ఈ రకం రాకెట్తో లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం -
ఇస్రోకి చేరిన 36 వన్వెబ్ ఉపగ్రహాలు
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్వెబ్కి చెందిన 36 ఉపగ్రహాలు శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి చేరుకున్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ–షార్) నుంచి జీఎస్ఎల్వీ–ఎంకే ఐఐఐ రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించనున్నారు. ఇందుకోసం వన్వెబ్ సంస్థ .. ఇస్రోలో భాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)తో చేతులు కలిపింది. ఈ ఏడాది మరో విడత, వచ్చే ఏడాది మరో మూడు విడతలు లాంచింగ్లు ఉంటాయని వన్వెబ్ తెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఉపగ్రహాల ద్వారా ఇప్పటికే అలాస్కా, కెనడా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ సర్వీసులు అందిస్తున్నట్లు వివరించింది. వన్వెబ్లో దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ప్రధాన ఇన్వెస్టరుగా ఉంది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
రాకెట్ లాంచ్ని ప్రత్యక్షంగా చూడాలనుందా?..అయితే ఇది మీకోసమే!
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్ మిషన్ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి మరి. ఎస్ఎస్ఎల్వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్లో పేర్కొంది ఇస్రో. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ లింక్ను షేర్ చేసింది. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu — ISRO (@isro) August 1, 2022 ఇదీ చదవండి: Viral Video: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం -
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట: నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం. చదవండి: సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది.. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
ISRO: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే.. ►వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం ►భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్ఎస్-2టీడీ ►భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహం ►భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహం స్పందించిన ఇస్రో చైర్మన్ పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. -
గగన్యాన్ మిషన్ కోసం మరో కీలక ప్రయోగం: ఇస్రో
శ్రీహరికోట : మానవ సహిత యాత్ర కోసం భారత్ గగన్యాన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కోసం రష్యాలో ఒక సంవత్సరం పాటు భారత వ్యోమగాములు శిక్షణను కూడా పూర్తి చేశారు. గగన్ యాన్ మిషన్ కోసం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. గగన్యాన్ మిషన్తో డేటా వినిమయం జరపడం కోసం ప్రత్యేకంగా డాటా రిలే సాటిలైట్ను ప్రయోగించనుంది. గగన్యాన్ మిషన్కు ముందుగా ఈ శాటిలైట్ను ఇస్రో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)కు పంపడానికి ఉపయోగపడుతుంది. మొదటి దశలో భాగంగా ఈ మానవరహిత మిషన్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా వ్యోమగాములు వెళ్లే అంతరిక్ష నౌకకు డేటారిలే ఉపగ్రహంగా పనిచేస్తోందని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు ఆమోదం తెలిపిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నిర్ణీత కక్షలో తిరిగే శాటిలైట్కు, భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషనుకు సరైన సంబంధం లేకుంటే శాటిలైట్ అందించే డేటా భూమి పైకి చేరదు. దీన్ని నిరోధించడానికి డేటా రిలే శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, నాసా మానవ సహిత అంతరిక్ష నౌకల కోసం, అత్యంత బలమైన డేటా రిలే ఉపగ్రహాన్ని కలిగి ఉంది. భూమిపై ఎలాంటి ప్రత్యేకమైన గ్రౌండ్ స్టేషన్ అవసరం లేకుండానే నిర్ణీత కక్షలో తిరిగే అన్ని ఉపగ్రహాలను ఈ డేటారిలే శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిషస్, బ్రూనై, ఇండోనేషియా, బియాక్లో ఉండే గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో ఉపయోగిస్తుంది. గగన్యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్పర్సన్ కే శివన్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్తో గగన్యాన్ సహకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సంతకం చేసింది. చదవండి: షార్లో పాక్షిక లాక్డౌన్ -
ఇస్రో సూపర్ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్ విజయంతో శుభారంభమైంది. పీఎస్ఎల్వీ సిరీస్లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ51 రాకెట్కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్లో బ్రెజిల్కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ51 రాకెట్లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్లోని జెప్పియర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్శాట్, మహారాష్ట్ర నాగపూర్లోని జీహెచ్ రాయ్సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్ఆర్సీ ఈశాట్ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్ను, న్యూ స్పేస్ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్ ధవన్ శాట్లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది. 14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్ కె.శివన్, ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ షార్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్ పుల్గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ అమోఘం అని, ఈ రాకెట్ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారత్లో ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్ తెలిపారు. భారత్లో ప్రైవేట్ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రముఖుల అభినందనలు వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రోకు ఏపీ గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సి–51 రాకెట్ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు పీఎస్ఎల్వీ –సీ 51 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సీ 51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్ఆర్సీఈ శాట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వైఎస్ జగన్ అభినందనలు.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
శ్రీహరికోట షార్లో అగ్నిప్రమాదం
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. యూపీఎస్లో సాంకేతిక లోపంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా
సాక్షి, శ్రీహరికోట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రారంభించిన కౌంట్డౌన్ ప్రక్రియను నిలిపివేశామన్నారు. కాగా ప్రయోగాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో అధికారులు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్ టైమ్ ఇమేజ్లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్ చేస్తుంది. జీశాట్-1 బరువు 2275 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్-1 ఉపగ్రహం... జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనున్నది. The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course. — ISRO (@isro) March 4, 2020 -
నేడే కౌంట్డౌన్
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ♦ ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతులు మీదుగా బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం. 10 గంటలకు ఎంఆర్ఆర్ సమావేశం ♦ బుధవారం ఉదయం 10 గంటలకు షార్లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం. ♦ రాకెట్లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు ప్రయోగ పనులు. ♦ ‘ల్యాబ్’ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్. ♦ జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది ♦ బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండోదశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ ♦ గురువారం ఉదయం నుంచి రాకెట్కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు. ♦ గురువారం సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది. ♦ ఇది షార్ కేంద్రం నుంచి 76వ ప్రయోగం. ♦ జీఎస్ఎల్వీ మార్క్–2 సిరీస్లో 14వ ప్రయోగం. ♦ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లతో నిర్వహిస్తున్న 8వ ప్రయోగం. ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్ 2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవకక్ష్య)లోకి మాత్రమే పంపేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు), నావిగేషన్ శాటిలైట్స్ (దిక్సూచి ఉపగ్రహాలు)ను భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పని చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం. దీని తరువాత జూలైలో జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ద్వారా జీఐశాట్–2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. -
నేటి ముఖ్యాంశాలు
⇒ ఏపీలో ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ⇒ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..ఉదయం 8:45లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ ⇒ ఏపీ కేబినెట్ సమావేశం.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై చర్చ ⇒ శ్రీహరికోట: జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగానికి రంగం సిద్ధం.. నేటి సాయంత్రం 3:43గంటలకు కౌంట్డౌన్, రేపు సాయంత్రం 5:43 గంటలకు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్-10 హైదరాబాద్లో నేడు ⇒ దివా వెడ్నస్ డే విత్ డిజే వినిష్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేడీస్ కిట్టీ పార్టీ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ఇండియా సాఫ్ట్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కాన్క్లేవ్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, సెలబ్రేషన్స్ బై కే లక్ష్మి వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేబల్ లవ్ – ఎగ్జిబిషన్, సేల్ బై శశి నహతా వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ⇒ వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక:కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ – ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ⇒ సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ⇒ ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం:మధ్యామ్నం 12–30 గంటలకు ⇒ చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ వినికిడి ఉచిత వైద్య పరీక్షలు వేదిక: నోవా ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ సమయం: ఉదయం 9 గంటలకు -
విదేశీ ఉపగ్రహ మార్కెట్పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహాలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్శాట్ ఉపగ్రహాలు, జపాన్కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్యాన్కు సమాయత్తమవుతోంది. భవిష్యత్లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్డౌన్ స్టార్ట్
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ–48
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్ కె.శివన్ సమక్షంలో కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్శాట్ ఉపగ్రహాలు, జపాన్కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. -
షార్లో హై అలర్ట్..
సాక్షి, నెల్లూరు: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు శుక్రవారం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ మేర సీఐఎస్ఎఫ్, మెరైన్ పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షార్ తీరంలో తిరిగే పడవలపై మరింత నిఘా పెట్టారు. తీర ప్రాంతంలో రోజూ కన్న మరింత ఎక్కువ బలగాలను మోహరించిన గస్తీని కట్టుదిట్టం చేశారు. మరోవైపు శ్రీహరికోట మొదటి, రెండో గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారి కదలికలపై నిఘా ఉంచారు. శ్రీహరికోట సమీపంలోని అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపట్టారు. అలాగే రొట్టెల పండుగ సందర్భంగా వేనాడు దర్గాకు వచ్చే వాహనాల తనిఖీలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. -
షార్.. నిశ్శబ్దం!
షార్లో కొన్ని గంటలకు ముందు హుషార్. చివరి క్షణాల్లో ఉద్విగ్న వాతావరణం. అంతలోనే నిశ్శబ్దం. భారత్కు ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత క్షణాల కోసం యావత్ ప్రపంచంతో పాటు షార్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి పావుగంటలో ల్యాండర్ నిర్ణీత కక్ష్యలో పయనిస్తూ వచ్చింది. అన్ని స్టేజీల్లోనూ సవ్యమార్గంలో వచ్చిన ల్యాండర్ చివరి స్టేజీలో గతితప్పింది. ల్యాండర్ చివరి క్షణంలో సిగ్నల్స్ అందకపోవడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మరి కొన్ని క్షణల్లో సంబరాలకు సిద్ధంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. షార్ కేంద్రంగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేశారు. గ్రహాంతర ప్రయోగాలు చేసి ఉత్సాహంగా గగన్యాన్కు ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో ఈ విఫలం వారిని ఎంతో బాధకు గురి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కళ్లల్లో ఒత్తులేసుకుని టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. సాక్షి, సూళ్లూరుపేట: జిల్లాలోని షార్ కేంద్రంగా ఇప్పటి వరకూ 73 ప్రయోగాలు చేశారు. అందులో పది మాత్రమే విఫలం అయ్యాయి. 2004లోనే గ్రహాంతర ప్రయోగాలకు షార్ వేదికగా ఇస్రో శ్రీకారం చుట్టింది. 2008లో చంద్రయాన్–1 ప్రయోగించిన అనంతరం చంద్రయాన్–2కు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దశాబ్దం పాటు అహర్నిశలు శ్రమ కోర్చి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రదేశాలకు దీటుగా చంద్రయాన్–2ను తయారు చేశారు. 2009 నుంచి ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేశారు. పూర్తి స్థాయిలో అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏడాది జూలై 14 జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ద్వారా సుమారు 3.6 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్–విక్రమ్ ల్యాండర్– రోవర్ (ప్రజ్ఞాన్) త్రీఇన్వన్ ప్రయోగాన్ని చేయాలని మహూర్తం నిర్ణయించుకున్నారు. ప్రయోగం మరో గంటలో ఉందనగా ఆఖరి గంటలో కౌంట్డౌన్ సమయాన్ని నిలిపివేశారు. అయినా నిరాశ చెందకుండా చాలెంజ్గా తీసుకుని క్రయోజనిక్ దశలో చిన్నపాటి లీకేజీని వారం రోజుల్లో సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. జూలై 22వ తేదీన చంద్రయాన్ మిషన్ను షార్ రెండో నింగిలోకి పంపారు. ఆ తర్వాత అన్ని దశలనూ విజయవంతంగా నిర్వహించారు. అనుకున్న దానికంటే వ్యోమనౌక నింగిలో దూసుకుపోతూ జాబిల్లి చెంతకు పయనిస్తుండడంతో శాస్త్రవేత్తల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది. ఈ నెల 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఈ నెల 3, 4 తేదీల్లో ల్యాండర్లోని ఇంధనాన్ని మండించి చంద్రుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటలలోపు చంద్రుడి ఉపరితలంపై దించే ఆపరేషన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చంద్రుడికి 2.1 కిలో మీటర్లు దూరంలోకి చేరుకున్నాక ల్యాండర్ నుంచి బైలాలులోని భూనియంత్రత కేంద్రానికి సిగ్నల్స్ తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ 15 నిమిషాలు.. ముందు నుంచి శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగే 15 నిమిషాలు ఎంతో కీలకంగా భావించారు. అంతా సవ్వంగా సాగిపోతూ 14 నిమిషాలు దాటిపోయింది. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయి అవాంతరం ఏర్పడింది. ఇస్రో చైర్మన్ డాక్టక్ కే శివన్తో పాటు శాస్త్రవేత్తలంతా కలత చెందారు. పదేళ్లు చేసిన కఠోర శ్రమ, మరో వైపు ప్రయోగం జరిగిన తర్వాత 48 రోజులు పడిన శ్రమ ఇలా అయిందని ఆవేదన చెందారు. ఏదైనా అద్భుతం జరుగుతుందా! వికమ్ర్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోతే ప్రయోగం విఫలం అయినట్టు కాదని షార్ ఉద్యోగులు అంటున్నారు. ల్యాండర్ చంద్రుడి వైపునకు వెళుతున్న సమయంలో దానికి ఉన్న సౌరపలకాలు విద్యుత్ సరఫరా చేస్తాయి. అంటే సూర్యుడి కిరణాలు సౌర పలకాలపై ప్రసరిస్తే అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తి అయి భూనియంత్రిత కేంద్రానికి సిగ్నల్స్ అందజేస్తుంది. ఇది చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ సౌర కుటుంబంలోని గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావడంతో సూర్య కిరణాలు ప్రసరించకపోవడం వల్ల సౌర పలకాల నుంచి విద్యుత్ అందకపోవడంతో సిగ్నల్స్ అందలేదని వాదన వినిపిస్తోంది. ఒక లూనార్ డే అంటే 14 రోజుల పాటు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు ఉంటుందని, ఈ 14 రోజులు గడిస్తే మళ్లీ సౌరపలాకలపై సూర్యకిరణాలు ప్రసరించి విద్యుత్ అందజేసిన వెంటనే ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోలేదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రయాన్–2 చూసొద్దాం
సాక్షి, రామగుండం : సాధారణంగా ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. అలాంటిది ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి చంద్రయాన్–2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకుగాను ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించచే ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. భారత సాంకేతిక ఎదుగుదల గురించి విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ‘ఇస్రో మైగవ్’ ఆన్లైన్ ప్రతిభాపాటవ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యర్థనలు పంపుకోవాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పొందుపరిచారు. ఎనిమిది నుంచి పదో తరగతిచదువుతున్న విద్యార్థులెవ్వరైనా ‘ఇస్రో మై గవ్’లో మొదట ఆన్లైన్ ఖాతా ప్రారంభించాలి. విద్యార్థి నమోదు ధ్రువీకరణ జరిగిన అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థికి పెద్దవారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు చెబుతున్నారు. పోటీ ఇలా.. ఆన్లైన్ను అనుసంధానం చేసుకొని ‘ఇస్రో మై గవ్’ అని ఆంగ్లంలో చిరునామా నమోదు చేయగానే వివరాలు వస్తాయి. రెండో అంశంపై ఎంటర్ నొక్కగానే వివరాలు, నియమ నిబంధనలు తెలిసిపోతాయి. ఈనెల 10వ తేదీ 12.01 గంటల నుంచి 20వ తేదీ, 11.59 గంటల వరకు ఆన్లైన్లో సమాధానాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఇరవై ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం ఉండదు. తెరపై ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకొని తర్వాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఎంపిక విధానం.. వేగం కచ్చితత్వంతోపాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో అత్యధికంగా సరైన సమాధానాలు రాసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జయపత్రం అందిస్తారు. చంద్రయాన్–2 చంద్రుడి మీదకు దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించడానికి బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతోపాటు ప్రధానమంత్రి మోడీతో కలిసి చంద్రయాన్ చంద్రుడి మీదకు దిగే అపురూపమైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తగు ఆధారాలు, ధ్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు. -
చంద్రయాన్-2 విజయం వెనుక ఆ ఇద్దరు..
న్యూఢిల్లీ: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. చంద్రయాన్ -2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగింది. ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ పేరును లాండర్కు పెట్టారు. ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఉన్న ఇద్దరు మహిళలను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఇస్రో యాత్రకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. చంద్రయాన్-2 ప్రయోగానికి ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ కాగా, రితు కరిధల్ చంద్రయాన్ -2 మిషన్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కూడా కీలకం. దాదాపు 30శాతం మంది మహిళలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. భారతదేశపు అంతరిక్ష మిషన్ చరిత్రలో మొదటిసారి మహిళా శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రయోగం జరిగింది. ఈ మిషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను యావత్ దేశం అభినందిస్తోంది.