Sri Ram Sagar Project
-
ముంపు నుంచి తేలిన రత్నాపూర్
ఎస్సారెస్పీలో అడుగంటిన నీరు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం ముంపునకు గురైన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రత్నాపూర్ గ్రామ ఆనవాళ్లు బయటపడింది. ఇదివరకే కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం, రత్నాపూర్ గ్రామ ఆరాధ్య దైవం మల్లన్న గుట్ట వరకు రోడ్డు మార్గం బయల్పడింది. ప్రస్తుతం ఆ గ్రామ చెరువు, ఇళ్ల పునాదులు బయట పడ్డాయి. దీంతో మల్లన్న గుట్ట వద్ద పూజలు నిర్వహించేందుకు వస్తున్న ఆ గ్రామస్తులు తాము నివాసం ఉన్న ఇళ్ల ఆనవాళ్లను చూసి ఆవేదన, మరోవైపు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. రత్నాపూర్ గ్రామంలో మల్లన్న గుట్ట చుట్టూ నివాసాలు ఉండేవని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే గుట్ట చుట్టూ పునాదులు వరుస క్రమంలో కనిపిస్తున్నాయి. మల్లన్న గుట్టకు సమీపంలో వీరన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పూర్తిగా ప్రాజెక్ట్లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ గుట్ట పూర్తిగా బయటపడింది. అక్కడి వరకు రోడ్డు ఉంది. రత్నాపూర్ గ్రామం మల్లన్న గుట్టకు, వీరన్న గుట్టకు మధ్యలోనే ఉందనడానికి గుర్తులు కనిపిస్తున్నాయి. అలాగే, మల్లన్న గుట్టపై ఉన్న బురుజుపై గండదీపం ముట్టించే వారని చెబుతున్నారు. బురుజుపై గండ దీపం వెలిగిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్కు కనిపించేదని వృద్ధులు పేర్కొంటున్నారు. -
తరుముతున్న కరువు
మెట్పల్లి : రెండేళ్లుగా ఆశించిన వర్షాలు లేక జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. మంథని డివిజన్లో అడపాదడపా తప్ప మిగతా అన్నిచోట్ల లోటు వర్షపాతమే. భూగర్భజలాలు అడుగంటా యి.బావులు ఎండిపోయాయి. బోర్లు ఎ క్కడికక్కడే వట్టిపోతున్నాయి. అయినా ఆశచావని అన్నదాతలు కొత్తగా బోర్లు వేస్తూ అప్పులపాలవుతున్నారు. ఒక్కోరైతు 5 నుంచి 10 బోర్లు వేయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాకు వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడం రైతులకు ఆశనిపాతమైంది. రెండేళ్లుగా కాలువల నీరు రాక భూములన్నీ బీళ్లుగా మారాయి. వర్షాలు లేక చెరువుల్లో చుక్కనీరు చేరక మైదానాలను తలపిస్తున్నాయి. వర్షాలు పడతాయనే ఆశతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదమేర్పడింది. కరువుతో అప్పులపాలైన రైతన్నలు వలసలబాట పడుతున్నారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై అప్పుల భారంతోపాటు కుటుంబపోషణకు ముంబై, సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఎకరాల కొద్ది భూమి, పంటలు పడినప్పుడు ఓ వెలుగు వెలిగిన అన్నదాతలు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు గల్ఫ్లో కూలీల అవతారమెత్తుతున్నారు. భవన నిర్మాణరంగంతోపాటు బల్దియా, హోటళ్లు, ఆఫీసులు, ఇళ్లలో క్లీనింగ్ పనులకు వేల సంఖ్యలో ఖాళీలున్నాయని, వీటికే ఎక్కువగా వెళ్తున్నారని ఏజెంట్లు చెబుతున్నారు. ఈ పనులకు అక్కడ మన కరెన్సీలో నెలకు కంపెనీని బట్టి రూ.8 వేల నుంచి రూ.11 వేల వేతనం మాత్రమే దక్కుతోంది. వేతనం తక్కువగానే ఉన్నా... ఇక్కడ ఆ మాత్రం కూడా ఉపాధి లేకపోవడంతో వలసబాట పట్టక తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పనులకు అక్కడి కంపెనీలు ఉచితంగానే, మరికొన్ని నామమాత్రపు రుసుంతో వీసాలు మంజూరు చేస్తున్నా... ఇక్కడి ఏజెం ట్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నారు. సౌదీ అరేబియా, దుబయ్, దోహఖతర్, కువైట్, మస్కట్ వెళ్లేందుకు వీసాల కోసం చాలామంది ట్రావెల్ ఏజెంట్ల వద్ద పాస్పోర్టులతో క్యూ కడుతున్నారు. నాలుగు నెలల కాలంలో జిల్లా నుంచి 10 వేల మంది వలసబాట పట్టారని అంచనా. ఇటీవల రంజాన్ నెలతో గల్ఫ్ దేశాల నుంచి వీసాల జారీలో జాప్యం ఏర్పడింది. ఇప్పటికీ ఏజెంట్లకు పాస్పోర్టులు ఇచ్చి వేలాది మంది వీసాల కోసం ఎదురుచూస్తున్నారు. కానరాని వలస నియంత్రణ చర్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ దేశాలకు వలస పోవక్కరలేదని, ఉన్న ఊరిలోనే బతుకు సాగించేలా ఉపాధి కల్పిస్తామని ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ హామీలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారుు. తెలంగాణతో బతుకులు బాగుపడుతాయని ఆశించిన వలస జీవులకు నిరాశే మిగులుతోంది. ఖరీఫ్లో సగటు వర్షపాతంకంటే తక్కువగా నమోదైనా ఇప్పటివరకు కరువు మండలాల ఊసే లేకుండా పోయింది. కరువు నేపథ్యం లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నారుు. ఇప్పటికే 300... మరో 200 మంది రెడీ మెట్పల్లి మండలం ఊటుపల్లిలో 1200 జనాభా ఉంది. 480 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, కందులు, పసుపు పండిస్తారు. వర్షాలు లేక బావులు, బోర్లు ఎండిపోయాయి. కొందరు రైతులు 5 నుంచి 10 బోర్లు వేసినా దుబ్బ వచ్చిందే తప్ప నీటి జాడ లేదు. వ్యవసాయ పనులు లేక ఉపాధి లభించక, అప్పులభారం వెంటాడడంతో గత్యంతరం లేక గ్రామానికి చెందిన 100 మంది రైతులు గల్ఫ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. 5వేల జనాభా గల సాతారం గ్రామంలోనే ఇదే పరిస్థితి. 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు, సోయాబిన్ పండేది. ఈ గ్రామం నుంచి ఇప్పటికే 300 మంది గల్ఫ్లో ఉన్నారు. ఇప్పుడు కరువుతో మరో 200 మంది వలసపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఒక్క గ్రామం..నాలుగు టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజీలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వకు మరికొన్ని టీఎంసీలు అదనంగా నిల్వ చేసేందుకు నీటిపారుదల శాఖ శరవేగంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీరందించేందుకు వీలుగా నాలుగు టీఎంసీల నీటినైనా నిల్వ చేయాలని నీటి పారుదల శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రాజెక్టులో ముంపు గ్రామమైన తాళ్లకొత్తపేటను తరలించగలిగితే అదనపు నీటి నిల్వ సాధ్యమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఖరీఫ్ ల క్ష్యం 93 వేల ఎకరాలు కరీంనగర్ జిల్లాలోని 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వ చేయడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీనికోసం మొత్తంగా రూ. 2,871 కోట్లతో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరగ్గా, ఇప్పటి వరకు రూ. 2,625 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ. 889 కోట్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 7 గ్రామాలను తరలించారు. మరో 14 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. దీంతో పాటే 2 రైల్వే క్రాసింగ్, మరో 13 ఆర్అండ్బీ క్రాసింగ్లకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ముఖ్యంగా రాయపట్నం బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేస్తే ప్రాజెక్టు పనుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది. కానీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామాలను ఖాళీ చేయకపోవడం, భూ సేకరణ జరగకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఉంటోంది. ఈ నీటినే ఎన్టీపీసీకి అందించడంతో పాటు గతేడాది మంథని ఎత్తిపోతల కింద మరో 7 వేల ఎకరాలకు సాగునీరందించారు. అయితే ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామం ఒక్కదాన్ని ఖాళీ చేసినా మరో 4 టీఎంసీలకు నీటి నిల్వ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం దానిపై దృష్టి కేంద్రీకరించింది. గ్రామం నిర్వాసితులకు త్వరగా ఆర్అండ్ఆర్ (సహాయ పునరావాసం) పూర్తిచేసి ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కదిలిన అధికారులు ముంపు గ్రామాన్ని ఖాళీ చేయించే దిశగా కసరత్తులు చేస్తున్నారు. అనుకున్న మేరకు అదనంగా నీటిని నిల్వ చేయగలిగితే ప్రస్తుత ఖరీఫ్లో స్టేజ్-2 కింద 50 వేల ఎకరాలు, మంథని ఎత్తిపోతల కింద 13 వేల ఎకరాల కొత్త ఆయకట్టు నీరివ్వడంతో పాటు, మరో 30 వేల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించారు. -
ఆశలన్నీ గోదారిపైనే!
♦ ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు.. ♦ జూలై 1న బాబ్లీ గేట్ల ఎత్తివేతతో ఎస్సారెస్పీలోకి చేరే అవకాశం ♦ {తిసభ్య కమిటీలో తెలంగాణకు చోటుపై 6న సుప్రీంలో విచారణ సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1వ తేదీన తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బాబ్లీ గేట్లు మూసి ఉంచే గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. దీంతో అదేరోజు అర్ధరాత్రి గేట్లు తెరుస్తారు. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో స్వల్పంగా ప్రవాహం ఉంది. దీంతో ఆ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లోని ఏడు లక్షల ఎకరాలకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు మూసేసిన మహారాష్ట్ర.. వచ్చే నెల 1న తిరిగి తెరవనుంది. 6న సుప్రీంలో విచారణ.. సుప్రీంకోర్టులో బాబ్లీ కేసు వచ్చే నెల 6న విచారణకు రానుంది. బాబ్లీ కేసును పరిష్కరించిన సందర్భంగా ఆ ప్రాజెక్టు నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఒక త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఇందులో కేంద్ర జల సంఘం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల తరఫున ఒక్కో ప్రతినిధి ఉంటారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులిచ్చిన కోర్టు.. తదుపరి విచారణను జూలై 6న చేపడతామని పేర్కొంది. దీనిపై ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాబ్లీ పర్యవేక్షణ కమిటీలో తెలంగాణను చేర్చాలని కోరడంతోపాటు ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని ఏపీని తొలగించాలని నివేదించింది. -
ఎస్సారెస్పీకి భారీ భద్రత
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు భారీ భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కమాండెంట్ మాధవరావు అన్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ భద్రత ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ డీఎస్పీ పద్మనాభ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆనకట్ట ఎంత పొడువు ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణ క్రమం, ప్రాజెక్ట్కు రక్షణ గురించి ఎస్ఈ శ్యాంసుందర్ను అడిగారు. భద్రత కోసం డ్యాంపై గుర్తించిన 8 పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని 2007లోనే ఇంటెలిజెన్సీ విభాగాలు హెచ్చరించాయని, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్లకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించిందని చెప్పారు. నాగార్జున సాగార్, శ్రీశైలం ప్రాజెక్ట్ల మాదిరిగా ఎస్సారెస్పీకీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఈఈ రామారావు, డ్యాం డిప్యూటీ ఈఈ మొయినొద్దీన్ఖాన్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్యాం ఏఈ బోజదాసు, ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహ స్వామి, బాల్కొండ ఎస్సై సురేశ్ ఉన్నారు. -
‘ఎస్సారెస్పీ వెలుగు’లకు 26 ఏళ్లు
* ఆదివారం నుంచి 27వ వసంతంలోకి.. ‘జల విద్యుదుత్పత్తి కేంద్రం’ * 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యం * నాలుగు సార్లు మాత్రమే చేరిన వైనం బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 26 వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం 27వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1988 డిశంబర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా జల విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడి జల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ ప్రయోజనమే జల విద్యుతుత్పత్తి. దీంతో ప్రభుత్వం కాకతీయ కాలువ ప్రారంభంలో సెప్టెంబర్ ఒకటిన రూ. 23.5 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది. మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభించారు. రెండో దశలో నాల్గో టర్బయిన్ పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండవ టర్బయిన్ 1987 డిసెంబర్లో, మూడవ టర్బయిన్ 1988 జూలైలో పనులు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెంబర్లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పూర్తిచేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ కేంద్రాన్ని స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు. టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది. ప్రతి టర్బయిన్కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కే.వీ సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 24 గంటలకోసారి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుతుత్పత్తి జరుగుతుంది. 26 ఏళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. నాల్గు టర్బయిన్లతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాలుగు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడం లేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టినా, కాలువకు గండి పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి కేంద్రంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. విద్యుదుత్పత్తికి ‘వరద’ గండం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి వరద కాలువ జల విద్యుదుత్పత్తికి గండంగా మారింది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయార్ మానేరు డ్యాం నింపే అవకాశం ఉండగా, వరద కాలువ ద్వారానే నీటి విడుదల చేపడుతున్నారు. దీంతో విద్యుదుత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతోంది. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. -
సీఎం సారూ.. హామీలు మరిచారా!
ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది. ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు. గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ? మోర్తాడ్ : బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ‘పసుపు’.. ఊసే లేదు ! బడ్జెట్లో పసుపు పథకానికి దక్కని చోటు నిధులు కేటాయించని సర్కార్ మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. -
సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
హన్మకొండ చౌరస్తా : ప్రజల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆయన మంత్రి వర్గం ఇప్పటికీ జనాకర్షణ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప.. సంక్షేమ పథకాల అమలు శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి మండిపడ్డారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పంటలకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తన భూములే పోయాయంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ విలువకు నాలుగు రెట్ల నగదును అందజేయాలని డిమాండ్ చే శారు. రాష్ట్ర విభజనలో భాగంగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రలో కలిసిందని, అక్కడి నుంచి మనకు రావాల్సిన విద్యుత్పై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఐడీ విచారణ పేరుతో సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, వాటిని మళ్లీ ప్రారంభించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజలను గతంలో ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలనడం సబబుకాదన్నారు. భూదందా, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నవంబర్ 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి టీ శ్రీనివాసరావు, మడత కాళీదాసు, మేకల రవి, టి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టు వరకూ ఎస్సారెస్పీ నీరు
ప్రాజెక్ట్ కాల్వల ఆధునికీకరణ - కాల్వల సామర్థ్యంపై ఇంజనీర్ల సర్వే పూర్తి - సర్కారుకు నీటిపారుదల శాఖ నివేదిక అందజేత - 94 కి.మీల మేర నిర్మాణం, రూ.600 కోట్ల అంచనా - ప్రభుత్వం ఆదేశిస్తే.. కొత్త కాల్వలపైనా సర్వే - శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల వెల్లడి హన్మకొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాలను జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు అందించే నివేదిక సిద్ధమైంది. గత నెలలో జరిగిన సాగునీటి శాఖ సమీక్షలో వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వల పరిస్థితి, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలివ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థారుులో నీరందించేలా కాల్వల ఆధునికీకరణకు సంబంధించి పరిశీలనలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ జలాలతో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా కొత్త కాల్వల నిర్మాణం కోసం సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు జిల్లాలో కాల్వల ఆధునికీకరణపై సర్వే చేపట్టారు. 16 రోజులుగా సర్వే చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నివేదికలోని అంశాలు ప్రస్తుతం ఉన్న కాల్వల నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం, ఎస్సారెస్పీ రెండో దశకు నీరిందించాలంటే ప్రధాన కాల్వ సామర్థ్యం పెంపు తప్పనిసరి అని ఇంజనీర్లు నివేదికలో స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాల్వ సామర్థ్యాన్ని పెంచి రెండో స్టేజ్ కాల్వలకు లింకు చేయాలంటే... మొదటి విడత కాల్వల సామర్థ్యం పెంచాలని సూచించారు. కొన్ని చోట్ల టన్నెల్ కింది భాగంలో లీకులున్నాయని, వాటిని నిర్మాణ సమయంలో రాయితో నిర్మించారని, వాటిని అధునాతన పద్ధతిలో తిరిగి నిర్మాణం చేయాలని పేర్కొన్నారు. కాకతీయ కాలువ 146 కిలోమీటర్ (జిల్లా సరిహద్దు) నుంచి 284వ కిలోమీటర్ (వర్ధన్నపేట మండలం ఇల్లంద) వరకు 94 కిలోమీటర్ల మేర సామర్థ్యం పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం కాల్వ సామర్థ్యం 8,500 క్యూసెక్కులని, దాన్ని 12,000 క్యూసెక్కులకు పెంచి, రెండో దశకు లింకు చేస్తే కాల్వ నీరు అందించవచ్చని వివరించారు. ఇప్పుడు కాల్వల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో 3,000 క్యూసెక్కుల నుంచి 3500 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నామని, ఆధునికీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో ఇస్తామని ఇంజనీర్లు నివేదికలో పొందుపర్చారు. కాల్వల సామర్థ్యం పెంపునకు రూ. 600 కోట్లు అవసరమని లెక్కలేశారు. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ పరిధిలోని డీబీఎం-48లో 50వ కిలోమీటర్ నుంచి 83వ కిలోమీటర్ వరకు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు నీరిందించేందుకు కాల్వలను ఆధునికీకరించాలని నివేదించారు. ఇక్కడ కూడా కాల్వల నుంచి నీరు బయటకు లీకవుతోందని, షట్టర్ల ఏర్పాటు సరిగా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ఆధునికీకరిస్తేనే నీటిని అందించగల్గుతామని స్పష్టం చేశారు. ఇందుకు మరో రూ. 38 కోట్లు అవసరమని నివేదికల్లో పొందుపరిచినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. కొత్త కాల్వల నిర్మాణంపైనా... కాకతీయ కాల్వ నుంచి నర్సంపేట, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లోని కొన్ని మెట్ట ప్రాంతాలకు ఎస్సారెస్పీ నీటిని అందించాలంటే కొత్తగా కాల్వల తవ్వకం చేపట్టాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కొత్త కాల్వలు నిర్మాణం చేసే ప్రాంతాలు, వాటి మ్యాపులను ప్రభుత్వానికి సమర్పించామని, ప్రభుత్వం సర్వేకు అనుమతిస్తే.. వెంటనే ప్రారంభిస్తామని ఎస్సారెస్పీ అధికారులు చెప్పారు. -
స్వర్ణోత్సవ శోభ వచ్చేనా!
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు పునాది రాయి పడి నేటితో 51 ఏళ్లు పూర్తికాగా, 52వ వసంతం మొదలవుతోంది. 1963 జూలై 26న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎస్సారెస్పీ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. గతేడాది 50 ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణోత్సవాల నిర్వహణ కు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డు తగి లిందని ప్రభుత్వం కుంటిసాకు చెప్పింది. అధికారులు స్వర్ణోత్సవ వేడుకలకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ మోక్షం కలగలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ప్రాజెక్టు స్వర్ణోత్సవం జరుపుతుం దని అందరూ ఊహించారు. అయితే అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గా నీ ఎలాంటి చర్యలు చేపట్టినదాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్ పై ఇన్నాళ్లు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించారనే వచ్చిన విమర్శలు ఇక నుంచి కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎస్సారెస్పీని పట్టించుకోవాలని ఆయక ట్టు రైతులు కోరుతున్నారు. స్వర్ణోత్సవ సంబురాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మాయని మచ్చ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో 2007-2010 వరకు జరిగిన పనుల్లో అవినీతి అక్రమాల పంచాయతీ ఎడతెగకుండా సాగడం ప్రాజెక్ట్ అభివృద్ధికే ప్రతి బంధకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల గైడ్ వాల్స్, కాలువల లైనింగ్ పనులు 2007-10 వరకు మూడేళ్లలో రూ. 278 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో డివిజన్-2 నుంచి 227 పనులు, డివిజన్ -5 నుంచి 406 పనులు, డివిజన్-1 నుంచి 1247 పనులు చేపట్టారు. అయితే పనుల్లో అక్రమాలు జరిగాయంటూ,పనులు చేయకుండనే బిల్లులు ఎత్తారని అనేక ఆరోపణాలు వచ్చాయి. దీంతో తీగా లాగితే డొంక కదిలింది. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగి ప్రాజెక్ట్ అధికారులను ఒక కుదుపు కుదిపాయి. 87 మంది ఇంజినీర్లు నోటీసులు అందుకోగా, 21 మంది ఇంజినీర్లు సస్పెండ్ అయ్యారు అయినా సమస్య తొలిగి పోలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లు రాక గుండె పోటుతో మరణించినా, ఆపనుల తాలూకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం కరుణించడంలేదు. అందుకు కారణం పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడమే! అధికారులు బంగారు గుడ్లు పెట్టే బాతుల ఎస్సారెస్పీని వాడుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వర్క్ ఆర్డర్ చేయడమంటే ప్రాజెక్ట్ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చేయని పనులకు కూడ బిల్లులు అందించారని విమర్శలున్నాయి. ఫలితంగా శిక్ష కూడ అనుభవించారు. అయినా ఎస్సారెస్పీని ఆపనులు మచ్చలాగా వెంటాడుతునే ఉన్నాయి. చివరికి పనులు ఎంత వరకు నాణ్యతతో చేపడితే అంతవరకు కొలతలు చేసి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముందుగా బిల్లులు మంజూరైన కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు రికవరీ చేయాలని లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని మూడేళ్ల క్రితం నోటీసులు కూడ ఇచ్చింది. అయితే రికవరీ మాత్రం జరగలేదు. ఇతర పనులు కొలతలు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చె ందుతున్నారు.రెండేళ్ల క్రితం ఎల్ఎండీలో రూ. 30 లక్షల పనులు చేసి బిల్లులు అందక ఒక నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షుడు గుండె పోటుతో మృతి చెందాడు. కాగా ఎస్సారెస్పీ పనులు అంటేనే ప్రభుత్వాలకు విసుగు వచ్చేల అవినీతి జరిగిందని అంటున్నారు. దీంతో ఏపని చేపట్టినా నిధులు మంజూరు కావడం లేదంటున్నారు. ప్రస్తుతం ఒక పనికి అధికారులు అంచన విలువ తయారు చేసి ప్రతి పాదనలు పంపిణీ చేసేందుకు జంకుతున్నారు. బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం వలన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడంలేదు. కొత్త ప్రభుత్వంలోనైన ఎస్సారెస్పీకి మహర్దశ పట్టాలని రైతులు కోరుతున్నారు. -
నెరవేరనున్న వైఎస్సార్ కల
ఖానాపూర్, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు దిగువనున్న సదర్మాట్ ఆనకట్టను ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటాలే ఆధ్వర్యంలో 114 సంవత్సరాల క్రితం ఖానాపూర్ మండలం సుర్జాపూర్ పంచాయతీ పరిధి మేడంపల్లి శివారులోని గోదావరి నదిపై నిర్మించారు. ఈ ఆనకట్ట కాలువ ద్వారా కడెం, ఖానాపూర్ మండలాల్లో 26 గ్రామాల్లోని 15 వేల ఎకరాలకు అధికారికంగా, సుమారు 25 వేల ఎకరాలకు అనధికారికంగా నీరందుతోంది. అయితే ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యంలేక వర్షాకాలంలో నీరంతా గోదావరిలోకి వృథాగా పోతోం ది. దీంతో ఆనకట్ట పరిధిలో ఖరీఫ్ మినహా మిగతా సీజన్లో సాగుకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ నీటి నిల్వ కోసం ఇక్కడ బ్యారేజీ నిర్మించాలని శతాబ్దకాలంగా రైతులు కోరుతున్నారు. బ్యారేజీ నిర్మిస్తే సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు ఖరీఫ్, రబీ సీజన్లలో కలిసి రెండు, మూడు పంటలు వేసుకునే వీలు కలుగుతుంది. ఇదే డిమాండ్తో శతాబ్దకాలంగా రైతులు, వివిధ సంఘాలు దశలవారీగా ఆందోళనలు నిర్వహించాయి. అయినా వీరి సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారు. రైతుబాంధవుడి రాకతో.. 2008-09 ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పర్యటించారు. ఆ సమయంలో మండల రైతులు సదర్మాట్ బ్యారేజీ నిర్మించాలని వివిధ రూపాల్లో ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సదర్మాట్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. స్పం దించిన వైఎస్సార్ రైతుల విజ్ఞప్తిని మన్నించి ఒకరోజు ఖానాపూర్లోనే బసచేశారు. మండల కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సదర్మాట్ను సందర్శించారు. బ్యారేజీ నిర్మాణంతో రెండు సీజన్లలో రైతులు పంటలు పండించుకునే వీలుందని గమనించిన ఆయన బ్యారేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు బ్యారేజీ నిర్మాణానికి రూ.305 కోట్లు అవసరమని పేర్కొంటూ నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు 2009 జనవరి 27న ఖానాపూర్ బ హిరంగ సభ కు వచ్చిన వైఎస్సార్ రూ.305 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణానంతరం ఆర్థికశాఖ క్లియరెన్స్ లేక పనులకు టెండర్లు నిర్వహించలేదు. మళ్లీ విజ్ఞప్తులు.. సదర్మాట్ బ్యారేజీ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బ్యారేజీ నిర్మాణానికి రూ.486.27 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దీనికి అదనంగా ఐదుశాతం నిధులు కలిపి రూ.514 కోట్లతో అంచనాలు సమర్పించారు. ఎట్టకేలకు బుధవారం భారీ మధ్యతరహా నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్రెడ్డి రూ.486.27 కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ 71 విడుదల చేశాడు. దీంతో బ్యారేజీ నిర్మాణంపై స్థానిక ప్రజల ఆశలు చిగురించాయి. పొన్కల్ వద్ద నిర్మాణం? సదర్మాట్ బ్యారేజీ నిర్మాణాన్ని నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పొన్కల్ గ్రా మ సమీపంలో గోదావరి నదిపై నిర్మించనున్నా రు. గతంలో కేవలం కడెం, ఖానాపూర్ మండలాలకు కాలువ ద్వారా నీరందేది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే మామడ మండలంలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భజలాలూ పెంపొందనున్నాయి. దీంతో కడెం ప్రాజెక్టు ఫీడింగ్ సైతం పెరగడంతోపాటు జన్నారం మీదుగా లక్సెట్టిపేట వరకు సాగునీరందే అవకాశముందని అధికారులు పేర్కొం టున్నారు. బ్యారేజీ నిర్మిస్తే ఖరీఫ్, రబీలో పంట లు పండించొచ్చని ఈ ప్రాంత రైతులు ఆశిస్తున్నారు. ఇందుకు మూలకారకుడైన వైఎస్సార్కు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. -
తెలంగాణే లక్ష్యం
ఆర్మూర్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక్క సింగరేణిలోనే 50 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి పాలకులు తెలంగాణ ప్రాంత రైతుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అర్ధశతాబ్దం దాటినా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శ నం. సీమాంధ్రలో మాత్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు. తెలంగాణ ప్రాంత రైతాంగం కొట్లాడితే గాని పాలకులు స్పందించడం లేదు. ఆర్మూర్ ప్రాంత రైతులు దశాబ్దం పాటు పోరాడితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మించారు. సమైకాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోనే పసుపు పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే పసుపు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రలో పండించే ప్రమాదకరమైన పొగాకు పంట కోసం మాత్రం ప్రభుత్వం 1975లో గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వారి గోడును సీమాంధ్ర పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కార్మికులు ఇతర రాష్ట్రాల యాజమాన్యాలతో కొట్లాడి తమ హక్కులను సాధించుకుంటున్నారు. లక్కంపల్లి సెజ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలి. ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎర్రజొన్నల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు రావాల్సిన రూ.10 కోట్ల 83 లక్షలు ఇప్పిం చేందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం. -
సాగు నీటి కోసం జాగారం
బాల్కొండ,న్యూస్లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి కోసం ఆయక ట్టు రైతులు కాలువల వద్దనే పగలూ,రాత్రి కాపలా కాస్తున్నారు. తాము సాగు నీటి కోసం అవస్థలు పడుతుంటే పాలకులు మాత్రం ప్రాజెక్టు నుంచి పొరుగు జిల్లాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువ ఆధారంగా నిర్మించిన వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకం వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సక్రమంగా నీటి పంపకాలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో రైతులు కాలువ వద్ద టెంట్లు వేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. తమ వంతు వచ్చే వరకూ ఎదురు చూస్తున్నారు. కాలువ వద్దనే టెంట్లు వేసుకుని జాగారం చేస్తున్నారు. వేంపల్లి ఎత్తి పోతల పథకం నుంచి నీటి పంపకాలను సక్రమంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతుల మధ్య అవగాహన కుదరక వారు వంతుల వారీగా నీటి కోసం కాలువ వద్ద కాపలా కాస్తున్నారు. ఎత్తి పోతల నుంచి పది రోజుల పాటు నవాబు లిఫ్ట్కు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. అదే కాలువకు ఉన్న మిగతా గ్రామాల ఆయకట్టు రైతులు తూం లను తెరవడం ద్వారా నీరు గమ్యానికి చేరడంలేదు. దీంతో నవాబు లిఫ్ట్ గ్రామాల రైతులు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. కాలువలు సైతం పూడికతో, ముళ్ల పొదలతో నిండి నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నవాబు లిఫ్ట్ గ్రామాలు నవాబు లిఫ్ట్ గ్రామాలు వేల్పూర్, లక్కోర, వెంకటాపూర్, అంక్సాపూర్, సాహెబ్పేట్ ,కుకునూర్, కోమన్పల్లి, అమీనాపూర్, దొన్కల్ గ్రామస్తులు కాలువ వద్ద అక్కడక్కడ ఎనిమిది చోట్ల గ్రామస్తులు నీటి కోసం వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందుల నడుమ కాపలా కాస్తూ నీటిని నవాబు లిఫ్ట్కు చేర్చుతున్నారు. నీటి వినియోగదారుల సంఘాలు విఫలం నీటి పంపకాలపై రైతులకు అధికారులకు మధ్య సమన్వయపరచాల్సిన నీటి వినియోగదారుల సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో రైతులు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వేంపల్లి లిప్ట్ రెండో యూని ట్ ఆధారంగా చెరువులు నింపే గ్రామాలకు వంతుల వారీగా నీటిని విభజించి చెరువులు నింపాలి. అలా ఒకరి వంతులో ఒకరు నీటిని వినియోగించుకోకుండా నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మాట్లాడాలి. కాని వారి పదవీ కాలం కూడా దగ్గర పడటంతో రైతులను వారు పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రైతుల మధ్య విభేదాలు తలెత్తే పరి స్థితి ఏర్పండింది. నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించాలని రైతులు కోరుతున్నారు. -
రబీ పంటలకు నీటి విడుదల
బాల్కొండ,న్యూస్లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి రబీ పంటల కోసం సోమవారం అధికారులు నీటినివిడుదల చేశా రు. కాకతీయకాలువద్వారా ఉదయం రెండువే ల క్యూసెక్కులు వదిలిన అధికారులు సాయంత్రానికి మూడు వేల క్యూసెక్కులకు పెంచా రు. కాకతీయ కాలువ ద్వారా వారబందీ ప్రకారం పదిరోజులు నీటివిడుదల, ఐదు రో జులు నిలిపివేయాలని ప్రాజెక్ట్ నీటివిడుదల చే పట్టడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్నుంచి లక్ష్మీ కా లువ ద్వారా వంద క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండల ఉండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టు మొత్తానికి రబీలో నీరందిస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలేదు. ప్రా జెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.90 అడుగుల నీరు నిల్వ ఉంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 12 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్పై సోమవారం కూడా ప ర్యాటకుల తాకిడి కొనసాగింది. ప్రాజెక్ట్ సందర్శనకు అనేక మంది యువకులు వచ్చారు. డ్యాంపై స్నేహితులతోకలిసి ఫొటోలు దిగారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికపై ప్రారంభమైన సర్వే
భైంసా, న్యూస్లైన్ : జిల్లాలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతో నీటినిల్వ సామర్థ్యం నానాటికి తగ్గుతోంది. స్వర్ణ, కడెం, సాత్నాల, వట్టి, గడ్డెన్న, కొమురం భీమ్, ఎన్టీఆర్ సాగర్, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టులు జిల్లాలోనే ఉన్నాయి. ప్రధాన ప్రాజెక్టుగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పరిధి కూడా జిల్లాలో ఉంది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీ స్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1089.50 అడుగుల నీరు ఉంది. 112.02 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతో ప్రాజెక్టులో చెత్తాచెదారం చేరి నీటినిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీల నుంచి 90.31 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం తగ్గి సాగు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుచుకునే శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఏటా పూడిక వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టుతోపాటు మరో 11 ప్రాజెక్టులు నిర్మించింది. ఈ యేడు భారీ వర్షాలు ఉండడంతో ప్రాజెక్టులో నీరు కనిపిస్తుంది. వర్షాలు కురియకపోతే మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు నిండే వరకు ఎస్సారెస్పీలోకి నీరు రాదు. అదేగనుక జరిగితే ఎస్సారెస్పీ ఎడారిగా మారుతుంది. ఇలాంటి తరుణంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ప్రాజెక్టుకు మహర్దశ చేకూరుతుంది. లేదంటే మహారాష్ట్ర నిర్మించే ప్రాజెక్టుల నుంచి ఏటా చెత్తాచెదారం వచ్చి చేరి రైతులకు సాగుకు కష్టమవుతుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువల ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని 18 లక్షల ఎకరాలు సాగు నీరు అందుతుంది. ఈ జిల్లాలకు తాగునీరు కూడా అందిస్తుంది. పూడికపై సర్వే.. ఎస్సారెస్పీ పూడికపై ఎట్టకేలకు సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులను నిలువరించకపోయిన సర్కారు పూడిక సర్వేను ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సోమవారం బాసరకు చేరుకుంది. మంగళవారం బాసరలోని గోదావరినదిలో పూడికపై ఈ బృందం సర్వే ప్రారంభించింది. ఏపీ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ హైదరాబాద్ బృందం సభ్యులు పాల్గొంటున్నారు. డీఈఈ ఉమాదేవి సారథ్యంలో 12 మంది బృందం సభ్యులు సర్వే నిర్వహిస్తున్నారు. మొదటిరోజు ప్రత్యేకంగా తీసుకొచ్చిన బోటింగ్ ద్వారా గోదావరిలో సర్వే నిర్వహించారు. బాసర చుట్టు పక్కల నదిపరీవాహక ప్రాంతంలో ఈ బృందం సర్వే నిర్వహిస్తుంది. ప్రత్యేక బోటు ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో ఐదు మీటర్ల లోతులోని ఛాయాచిత్రాలను శాటిలైట్ ద్వారా తీసుకుని ల్యాబ్కు పంపించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో కొంత ఆలస్యంగానే సర్వే ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 20 రోజుల్లోనే సర్వే పూర్తి చేసుకుని ల్యాబ్కు వెళ్లి సంబంధిత వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి పోచంపాడు వరకు ఈ బృందం పూడికపై సర్వే చేపట్టనుంది. నాలుగోసారి అధికారుల సర్వే.. ఎస్సారెస్పీ పూడికపై నాలుగోసారి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 1984లో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నీటి సామర్థ్యం 112.02 టీఎంసీలు ఉంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ నివేదిక ప్రాజెక్టులో 21.17 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని నిర్ధారించింది. దీంతో నీటిమట్టం 90.13 టీఎంసీలకు పడిపోయింది. 2006లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ లేబోరేటరీ మరోసారి చేసి ప్రాజెక్టులో 32.06 టీఎంసీల పూడిక పేరుకుపోయిందని ధ్రువీకరించింది. ఈ సర్వే నమ్మశక్యంగా లేదని అధికారులు రీ సర్వే కోసం 2008లో ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ఇప్పటివరకు స్పందన రాలేదు. ప్రస్తుత నీటి సామర్థ్యం 90 టీఎంసీలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారి లెక్కట ప్రకారమే 22 టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గినట్టు తెలుస్తోంది. 2013లో మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే చేపట్టాక అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పూడిక తొలగిస్తేనే ఉత్తర తెలంగాణ కష్టాలు తీరుతాయి. లేదంటే ఇప్పుడు చేపట్టే సర్వే కూడా కాగితాలకే పరిమితం అవుతుంది. ప్రాజెక్టులో ఉన్న పూడికతో ఈయేడు భారీ వర్షాలు కురిసినా గేట్లు ఎత్తి బయటకు వదిలేశారు. సర్కారు మేల్కొని ప్రాజెక్టులో పూడిక తీయిస్తే మరింత నీటి నిల్వలు ఈ రబీ సీజన్లో రైతులకు ఉపకరించేవి. రైతుల భూములు సస్యశ్యామలం అయి ఉండేవి. -
అయ్యో..సరస్వతీ..
నిర్మల్, న్యూస్లైన్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ విలువైన భూములు, ఇళ్లు కోల్పోయారు జిల్లా వాసులు. అలాంటి జిల్లావాసుల భూములకు నీరందించే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా, పిల్లకాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం లేదు. పుష్కలంగా నీరు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న మహారాష్ట్రలో, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడంతో జలాశయం నీటితో కళకళలాడింది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన నాడే ప్రాజెక్టు గేట్లు ఎత్తి మిగులు జలాలు గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు ఉంటూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అంటే 1091 అడుగులు ఉంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భూములకు రబీలో పుష్కలంగా నీరందే అవకాశాలు ఉన్నాయి. అధ్వానం.. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా జిల్లా రైతాంగానికి మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం జిల్లా రైతాంగ భూములకు నీరందించే సరస్వతీ కాలువే. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లో మొత్తం 47 కిలోమీటర్ల పొడవుతో 28 డిస్ట్రిబ్యూటరీలు కలిగి 35వేల ఎకరాలకు సాగునీరందించడంతోపాటు దాదాపు 52 చెరువులు నింపే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా పిల్లకాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అనవాళ్లు లేకుండా పోయాయి. లక్ష్మణచాంద మండలం బాబాపూర్, వడ్యా ల్, వెల్మల్ నుంచి నర్సాపూర్(డబ్ల్యు) వరకు, మామడ మండలం కొరిటికల్, చందారం, నల్దుర్తిల వద్ద ప్రధాన కాలువ, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్, కొరిటికల్ వద్ద డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. ఇక పిల్లకాలువలు శిథిలావస్థకు చేరుకొని ఆనవాళ్లు లేకుండాపోయాయి. శాశ్వత మరమ్మతు కరువు.. సరస్వతీ కాలువ మరమ్మతులు ఆరేడేళ్ల క్రితం చేపట్టారు. అయితే పనుల పర్యవేక్షణ సరిగా లేక చేసిన పనులు అధ్వానంగా మారాయి. దీంతో భారీ వర్షాలకు తోడు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వంటి వాటి వల్ల ప్రధాన కాలువ కోతకు గురవుతోంది. గతంలో మామడ మండలం చందారం వద్ద, కొరిటికల్ వద్ద, లక్ష్మణచాంద మండలం బాబాపూర్ వద్ద, నిర్మల్ మండలం సోఫీనగర్ శివారులో ప్రధాన కాలువ కోతకు గురైంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూముల్లోకి నీరంతా వెళ్లి దెబ్బతిన్నాయి. ఇక కోతకు గురైన చందారం, కొరిటికల్ వద్ద పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలికంగా సంచులు వేసి పనులు కానిచ్చేశారు. ఏటా చివరి ఆయకట్టుకు ప్రశ్నార్థకమే.. ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలతోపాటు పిల్లకాలువలు దెబ్బతినడంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్మణచాంద మండలం పార్పెల్లి, చామన్పల్లి, మాచాపూర్, ధర్మారం గ్రామాల రైతులకు కాలువలు సక్రమంగా లేక నీరందడం లేదు. దీంతో రైతులు తీవ్ర వేదనలో పడిపోతున్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామ రైతులైతే తమ పంటపొలాలకు నీరందించుకునేందుకు రేయింబవళ్లు కాలువ వద్దే ఉంటూ నీటిని మళ్లించుకునే పరిస్థితి ఎదురవుతోంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పంట పొలాలకు మాత్రం నీరందకపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు ఇలా ఉండడంతో ఈ రబీలో కూడా రైతులకు మళ్లీ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు చేయించి రబీలో తమ పంటపొలాలకు నీరందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కష్టాలను గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి
వాజేడు,న్యూస్లైన్: గోదావరి వరద మరోసారి ఉధృతంగా పెరుగుతోంది. ఎగువనున్న శ్రీరామ్సాగర్ నుంచి వరదనీరు విడుదల చేస్తుండడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి ఎగపోటు కారణంగా మండల పరిధిలోని చీకుపల్లి వద్ద రహదారిపైకి వదర నీరు చేరింది. ఆదివారం ఉదయం 6 గంటలకు రహదారిపైకి వరద నీరు చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చప్టాకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చీకుపల్లివాగుకు అవతలిపై వైపు ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు స్తంభిం చాయి. నాటుపడవలు ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. కొందరు వరదనీటి నుంచే దాటుతున్నారు. కూలీలను ట్రాక్టర్ల ద్వారా దాటించారు. గోదావరికి ఎగువ ప్రాం తం నుంచి వరద నీరు ఇంకా వస్తుండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం 9.750 మీటర్లుగా ఉంది. గోదావరి ఉధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘కాకతీయ’కు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదలను నిలిపి వేశారు. ఆయకట్టుకు నీటి అవసరం లేకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 రోజులు నీటి విడుదల నిలిపివేత, 9 రోజులు విడుదల కొనసాగించేల అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 550 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాలువల ద్వారా నీటి విడుదల నిలిచి పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.70 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. నిలిచిన విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.24 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. నిలకడగా రామడుగు ప్రాజెక్ట్ నీటిమట్టం ధర్పల్లి : మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1278.50 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా 100 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది. కుడి కాలువ ద్వారా 100 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు. దీనికింద వాడి, చెంగల్, పచ్చల నడ్కుడ చెరువుల్లోకి నీటిని నింపుతున్నారు. ఎడుమ కాలువ ద్వారా కలిగోట్ గ్రామ చెరువును నింపుతున్నారు. 20 క్యూసెక్కూల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద చెరువులను నింపేందుకు కుడి, ఎడుమ కాలువల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ దేవేందర్ తెలిపారు. -
ఎస్సారెస్పీకి భద్రత పెంచుతాం ఎస్పీ మోహన్రావు
బాల్కొండ, న్యూస్లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భద్రత పెంచుతామని ఎస్పీ మోహన్రావు పేర్కొన్నారు. పర్యాటకులకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యంపై సోమవారం ‘సాక్షి’లో ‘విహారం.. ఓ విషాదం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ శుక్రవారం ప్రాజెక్టు వద్ద ఉన్న సబ్ కంట్రోల్ బూత్ను తనిఖీ చేశారు. పర్యాటకులు ప్రమాదకర స్థలాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన ఫ్లడ్ కంట్రోల్ రూంలో ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భద్రత సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. డ్యాంపై కలియ తిరిగి భద్రతను పరిశీలించారు. అనంతరం సబ్ కంట్రోల్ బూత్ వద్ద విలేకరులతో మాట్లాడా రు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సిబ్బంది సంఖ్యను పెంచుతామన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ లో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుందని, దీంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే రోజుల్లో భద్రత సిబ్బందిని పెంచుతామన్నారు. ఎస్సారెస్పీకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను నియమించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నట్లుగా ఎస్సారెస్పీకి కూడా భద్రత కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సబ్కంట్రోల్ రూం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్రోలింగ్ పెంచుతాం.. ప్రాజెక్టు ఆనకట్టపై అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి పెట్రోలింగ్ పెంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆనకట్టపై మద్యం సేవించే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం సందర్శన ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరును పరిశీలించారు. టర్బయిన్ల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నరేశ్, ఏఈలు భోజదాసు, ర వీందర్, జెన్కో ఏడీ కిషోర్కుమార్, ఏఈ సతీశ్, ఆర్మూర్రూరల్ సీఐ సంక్రాంతి రవికుమార్, ఎస్సై ప్రతాప్ లింగం తదితరులున్నారు