-
మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్ను పెళ్లి చేసుకున్నాడు.లండన్లో జూన్ 22న సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రస్టింగ్ సంగతులను షేర్ చేశాడు. ముఖ్యంగా కింగ్ఫిషర్ బీర్ ఇమేజ్ను షేర్ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్లో కింగ్ పిషర్కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్తో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను సిద్ధార్థ మాల్యా ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసి, తన ఫ్యాన్స్కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే. -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
ఢిల్లీకి మారిన శివరాజ్ సింగ్ చౌహన్.. కుమారుడికి లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీకి మకాం మార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ సీఎం హస్తీనాకు షిఫ్ట్ అయ్యారు.అయితే చౌహన్ నిర్ణయంతో ఆయన కుమారుడు కార్తీకే సింగ్ చౌహన్ రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బుధ్నీఅసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చౌహన్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మోరెనా నుంచి పోటీ గెలుపొందారు. ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బుధ్నీ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీకే బరిలో దిగనున్నట్లు సమాచారం. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
శాలిగౌరారం: కన్న తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతిచెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. మనిమద్దె గ్రామానికి చెందిన అంతటి శంకరయ్య(72)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను అనారోగ్యం బారిన పడి ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. చిన్న కుమారుడు రాంబాబు(34) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శంకరయ్య, అతడి భార్య మనిమద్దె గ్రామంలోనే ఉంటున్నారు. శంకరయ్య అనారోగ్యంతో మూడు నెలలుగా మంచం పట్టి ఆదివారం మృతిచెందాడు. తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న రాంబాబు హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మృతదేహాన్ని చూసినప్పటి నుండి శంకరయ్య తీవ్ర మనోవేదనతో రోదిస్తూ ఉన్నాడు. బంధువులు, ఎంత నచ్చజెప్పినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలో తండ్రి శంకరయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేక సాయంత్రం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెంటనే రాంబాబును నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. అక్కడ రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి రాంబాబు మృతదేహాన్ని మనిమద్దెకు తీసుకురాగా మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి పెంకుటిల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని ఆ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న తండ్రి, ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
Father's Day 2024: స్టార్ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)
-
నేను అధ్యక్షుడినే కాదు.. తండ్రిని కూడా: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(54)ను గన్ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్కు బానిసకాదంటూ ఆయుధ డీలర్కు అబద్దం చెప్పారని, ఆ గన్ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్ ఆప్పీల్ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్ అన్నారు. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్గా నిలవటం గమనార్హం.ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్ బైడెన్పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్లో విచారణ జరపనుంది. -
కన్నకొడుకే కాలయముడు
గంగవరం: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదన్న కోపంతో కన్నతల్లి అని కూడా చూడకుండా గోడకు తలను కొట్టి హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన మండలంలోని నూగుమామిడిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపిన వివరాలు... కొలుతూరి అబ్బాయి, ఆదమ్మ(54) భార్యాభర్తలు. వీరికి వివాహాలైన ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు బాలయ్య భార్యతో కలిసి అదే గ్రామంలో నివాసముంటున్నాడు. చిన్నకొడుకు కృష్ణను భార్య విడిచి వెళ్లిపోవడంతో గ్రామంలోనే తల్లిదండ్రులతో ఉంటున్నాడు. నిత్యం తాగుతూ తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. రోజూలాగే తాగేందుకు ఆదివారం రాత్రి కూడా తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోడంతో గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో తల్లి తలను గోడకు కొట్టాడు. గొడవ జరగడంతో కొడుకు తనను కూడా కొడతాడేమోనని భయపడి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన తల్లి ఆదమ్మ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. తల్లిని హత్య చేసి కృష్ణ పరారయ్యాడని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. అడ్డతీగల సీఐ రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారని, ఆయన ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్బీ హెచ్సీ రాజారావు వివరాలు సేకరించారు. -
రఘువరన్కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్లు రిలీజ్ చేశాడు. రఘువరన్కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
మనసుకు కష్టంగా అనిపించే, బాధించే టాక్సిక్ సంబంధాలను వదిలించుకున్న తరువాత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక మహిళలైతే సరికొత్త ఉత్సాహంతో తేజోవంతంగా ఉంటారు. భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అదే నిరూపిస్తోంది.భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న సానియా ఇంట్రస్టింగ్, సూపర్ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు నేమ్ప్లేట్ మార్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ మమ్మీ అంటూ కమెంట్ చేశారు.సానియా మీర్జా 2023లో టెన్నిస్కు వీడ్కోలు పలికి రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్తో కలిసి దుబాయ్లో ఉంటోంది. సూపర్ మామ్లా తన బిడ్డ ఇజాన్ను సంతోషంగా ఉంచేందుకు, ఏ లోటూ లేకుండా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar)బిజీ వర్క్ షెడ్యూల్లో కూడా కొడుకు ఇజాన్ గురించి తపన పడే సానియా తాజాగా ఇజాన్తో అద్భుతమైన జ్ఞాపకాల పిక్స్ను ‘ఇది, అది’ అంటూ షేర్ చేసింది. ఇంకా కార్ రైడ్ నుండి , హెయిర్కట్ దాకా ఈ సెల్ఫీలుండటం విశేషం. నేమ్ప్లేట్లో ఇజాన్ ముఖ్యంగా నేమ్ప్లేట్లో ‘సానియా అండ్ ఇజాన్’ అని ఉన్న ఫోటో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు ‘చూజ్ టూబీ హ్యాపీ’, ఫ్యూయల్డ్ బై కెఫీన్ అండ్ సర్కాజం’ అని రాసి వున్న విభిన్న కప్పులను కూడా షేర్ చేయడం గమనార్హం. -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
సమస్తిపూర్ కుస్తీ.. మంత్రుల వారసుల ఫైట్
పాట్నా: బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్పై ఎన్డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది. -
ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్, కుమారులు వినోద్(6), రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు. -
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
బిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. మానసికంగా, శారీరంగా బలహీనంగా ఉన్నా, లోపాలతో పుట్టినా అపూరూపంగా సాదుకుంటారు. కానీ ఒక తండ్రి శాడిస్ట్లా ప్రవర్తించాడు. లావుగా ఉన్నాడంటు కన్న కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి క్రూరత్వంగా ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన వివరాలు..న్యూజెర్సీలో నివసించే క్రిష్టోపర్ గ్రెగర్ ఆరేళ్ల తన కుమారుడు కోరీ కొంచెం బొద్దుగా ఉండటంతో జిమ్కు తీసుకెళ్లాడు. కుమారుడితో ట్రెడ్మిల్పై పరిగెత్తించాడు. బలవంతంగా ట్రెడ్మిల్పై పరిగెత్తించడంతో బాలుడు పరిగెత్త లేకపోయాడు. పదే పదే కిందపడిపోయాడు. అయినా ఏమాత్రం కనికరం లేకండా కర్కశంగా ప్రవర్తించాడు. క్రిష్టోపర్. ఉన్మాదిలో మారి మళ్లీ మళ్లీ ఒత్తిడి చేసి, చాలా వేగంగా కదులుతున్న ట్రెడ్మిల్పై పరుగెత్తించాడు. దీంతో కోరీ డస్సి పోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాటలు తడబడటం, సంయమనం కోల్పోవడం, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల కారణంగా కోరీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలు, గుండె, కాలేయ పల్మనరీ కంట్యూషన్, సంబంధిత కారణాలతో చనిపోయినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్లోతేలింది. కోరీ మూర్ఛ వచ్చి మరణించినట్టు సీటీ స్కాన్ రిపోర్ట్లో వెల్లడైంది.NEW: Mother breaks down in court as she watches her son’s father abuse her child by making him run on the treadmill because he was “too fat.”New Jersey father Christopher Gregor is accused of killing his 6-year-old son Corey Micciolo.New footage shows the boy repeatedly face… pic.twitter.com/aVKknkOGd5— Collin Rugg (@CollinRugg) May 1, 2024 ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ కోరీది హత్యగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్లో జరిగింది. కన్నకొడుకును హత్య చేశాడన్న ఆరోపణలపై 2022 మార్చి 9న గ్రెగర్ను అరెస్టు చేశారు. బాండ్ లేకుండా ఓషన్ సిటీ జైలులో ఉంచారు. తాజాగా జరిగిన కోర్టు విచారణలో న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. ఈ దృశ్యాలు చూసిన తల్లి బ్రె మిక్కియోలో తల్లడిల్లిపోయింది. దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
-
కొడుకు డ్రీమ్ : బిడ్డను ‘కన్న’తల్లి టీవీ నటి, క్యూట్ బేబీ (ఫోటోలు)
-
లోక్సభ బరిలో మాజీ ప్రధాని కొడుకు..
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. తాను ఇప్పటికీ సోషలిస్టు సిద్ధాంతంతోనే ఉన్నానని, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలకు సమాజ్వాదీ పార్టీ దూరం జరిగిందని విమర్శించారు. "సోషలిస్టు భావజాలాన్ని ఎస్పీతో ముడిపెట్టకూడదు. నేను ఇప్పటికీ వ్యక్తిగతంగా సోషలిస్టు భావజాలంతోనే ముడిపడి ఉన్నాను" అని నీరజ్ శేఖర్ పీటీఐతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి దివంగత చంద్రశేఖర్ సోషలిస్ట్ భావజాలాన్ని ప్రతిపాదించినవారు. కాషాయ పార్టీని తీవ్రంగా విమర్శించేవారు. చంద్ర శేఖర్ కుటుంబం మొత్తం ప్రస్తుతం బీజేపీలో ఉంది. అతని పెద్ద కుమారుడు పంకజ్ శేఖర్, చిన్న కుమారుడు నీరజ్ శేఖర్ కాషాయ పార్టీలో ఉండగా, అతని మనవడు రవిశంకర్ సింగ్ పప్పు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. గతంలో బల్లియా నుంచి ఎస్పీ ఎంపీగా పనిచేసిన నీరజ్ శేఖర్ 2014 లోక్సభ ఎన్నికల్లో బల్లియా నుంచి బీజేపీ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో నీరజ్ శేఖర్కు ఎస్పీ టికెట్ నిరాకరించింది. తర్వాత ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసినప్పటికీ, నీరజ్ శేఖర్ పార్టీని వీడి 2019 జూలైలో బీజేపీలో చేరారు. బల్లియా నుంచి ప్రస్తుత ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ స్థానంలో నీరజ్ శేఖర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ తాజాగా ప్రకటించింది. 2019లో అప్పటి ప్రస్తుత ఎంపీ భరత్ సింగ్పై కాషాయ పార్టీ మస్త్కు ఎన్నికల టిక్కెట్ను ఇచ్చింది. -
కసాయి తల్లి.. కన్న పిల్లల్నే చంపేసి..
కర్ణాటక: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను ఓ తల్లి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన బెంగళూరు జాలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగాదేవి తన ఇద్దరు పిల్లలైన లక్ష్మీ (9), గౌతమ్ (7)లను చంపేసి పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి చెప్పింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన గంగాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం వలసవచ్చి జాలహళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేసేది, ఆమె భర్త బీబీఎంపీ కాంట్రాక్టు పౌర కార్మికుడు. గత నెలలో భర్తపై గంగాదేవి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అరెస్ట్చేశారు. ఇద్దరు పిల్లలతో మంగళవారం ఉగాది పండుగ చేసుకున్న గంగాదేవి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలను దిండుతో ఉపిరాడకుండా చేసి హత్యచేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీస్ సహాయవాణికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ జరుగుతోంది, రావాలని కోరింది. జాలహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా, పిల్లలను తానే చంపానని ఆమె చెప్పిందని ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. భర్తతో గొడవలు, ఆర్థిక సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళను జాలహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
సినిమాని తలపించే కథ! వందల కోట్ల ఆస్తులున్న కొడుక్కి చెప్పని తండ్రి..!
అత్యంత సంపన్న కుటుంబం..20 ఏళ్లు వచ్చేవరకు కొడుక్కి చెప్పని తండ్రి సినిమాల్లో, కథల్లోనూ వింటాం ఇలాంటి కథను. నిజ జీవితంలో కనిపించడం అరుదు. అయినా మిలయనీర్ కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కచ్చితంగా ఆ రేంజ్ తగ్గట్టు బతుకుతారు. అంతలా సాధారణ పిల్లల్లా ఉండేందుకు వారి తల్లిదండ్రులే ఒప్పుకోరు. వాస్తవికంగా అలా జరగదు. కానీ ఈ మిలియనీర్ కొడుకు కథ సినిమాని తలపించేలా వేరేలెవెల్లో ఉంది. ఇంతకీ అతడి కథ ఏంటంటే.. తండ్రి వందల కోట్ల వ్యాపార సామ్రజ్యానికి అధిపతి. అత్యం సంపన్న కుటుంబం. అయినా ఆ విషయం కొడుక్కి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. చైనాలో అత్యంత విలువైన ప్రొడక్ట్ హునాన్ స్పైసీ గ్లూటెన్ లాటియో బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్ కొడుకు జాంగ్ జిలాంగ్ జియుపాయ్ కథ. అతడే స్వయంగా తన తండ్రి ఆస్తిని తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిపాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు తన తండ్రి మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పేవాడు. తన తండ్రి జాంగ్ యడాంగ్ ప్రసిద్ధ బ్రాండ్ ఓనర్ అని తెలుసు. కానీ ఎప్పుడూ కుటుంబం అప్పులు పాలయ్యిందని చెప్పేవాడు. కౌంటీలో ఓ సాధారణ ప్లాట్లో తాము నివశించేవారమని చెప్పుకొచ్చాడు. పైగా తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించకుండానే తాను ఓ మంచి పాఠశాలలో ప్రవేశం పొంది చదువుకున్నట్లు తెలిపాడు. తన కాలేజ్ చదువు పూర్తయ్యాక వెంటనే కనీసం నెలకు రూ. 60 వేలు వేతనం వచ్చే మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంటే..? ఆ డబ్బుతో కుటుంబ అప్పుల్ని తీర్చాలని జిలాంగ్ భావించాడు. అయితే తండ్రి తమకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్న విషయం గ్యాడుయేషన్ పూర్తి అవుతుండగా చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి తమ కుటుంబాన్ని దాదాపు రూ. 11 కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాకు మార్చారని అన్నాడు. ప్రస్తుతం జిలాంగ్ తన తండ్రి కంపెనీ ఈ కామర్స్ విభాగంలోనే పనిచేస్తున్నాడు. అయితే అతడు కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాడు. కానీ అతడి తండ్రి మాత్రం జిలాంగ్ పనితీరు బాగుంటేనే కంపెనీనీ అతడికి అప్పగిస్తానని చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అద్భత కథలు నవలల్లోనూ, సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో సాధారణ యువకుడిలా పెరిగిన ఈ యువరాజు కథ చాలా అద్భుతంగా ఉంది కదూ..!. ఈ కథ పిల్లలకు ఏ వయసులో ఏది తెలియడం మంచిది అనేది బోధిస్తోంది. వారికి బాధ్యత తెలియాలంటే తండ్రి బ్యాంగ్రౌండ్తో పనిలేదని, స్వతహాగా అతడి కాళ్లపై నిలబడేలా పెంచితే చాలని తెలియజేస్తోంది ఈ గొప్ప కథ!. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కనపెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
మరో అమరావతి ‘అనకొండ’.. అడ్డంగా దొరికేసింది
అమరావతిని దోచేసిన మరో అనకొండ అడ్డంగా దొరికింది. ప్రజా ధనాన్ని వాటాలేసుకుని మరీ మింగేసిన మరో టీడీపీ నేత దొరికిపోయాడు. అమరావతిలో నిర్మాణాల పేరుతో రచించిన దోపిడీ కథ జైలుకి చేరింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్, జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్ అయిన ప్రత్తిపాటి శరత్ను రిమాండ్కు తరలించారు. బోగస్ ఇన్వాయిస్లు, బోగస్ బిల్లులతో కోట్లు కొల్లగొట్టిన నేరంపై DRI, డైరెక్టరేట్ ఆఫ్ GST అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అమరావతి అనకొండ కథేంటో చూద్దాం. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అవెక్సా కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పుల్లారావు భార్య, కొడుకు శరత్ మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు తన భార్య కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకి తీసుకుని, వాటి ద్వారా కోట్ల రూపాయలను అడ్డదారిలో మళ్లించారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులను కొల్లగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలతో సహా బట్టబయలైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. డీజీజీఐ విచారణలో తేలిన ఆధారాలపై ఏపీ డీఆర్ఐ కూడా విచారించడంతో మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ నేపథ్యంలోనే డీఆర్ఐ అధికారులు ప్రత్తిపాటి శరత్ పై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్తిపాటి శరత్ ని పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ ని 14 రోజులు రిమాండ్ కి పంపింది. బోగస్ ఇన్వాయిస్ లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని సాక్షాత్తూ అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్రా జగదీష్ అంగీకరించారు. డీజీజీఐ, డీఆర్ఐ విచారణలోనే నేరం అంగీకరించడంతో ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో కూడా జగదీష్ పూసగుచ్చినట్టు వెల్లడించడంతో ప్రత్తిపాటి శరత్కి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించి అమరావతి పనులు చేసే కాంట్రాక్టు సంస్థల నుండి ఈ కంపెనీ 2017 నుండి అడ్డగోలుగా సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టు పొందింది. ఆ కంపెనీ నుండి 37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలో రోడ్డు, వరద నీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాకులు గ్రీనరీ పనులు చేస్తామని సబ్ కాంట్రాక్టు తీసుకుంది. అయితే వీళ్లు మళ్లీ తానిషా ఇన్ ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు 21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్టు చూపించారు. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్ లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా మాయ చేసింది. ప్రభుత్వ ఖజానా నుండి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. ఏ పనులు చేయలేదు. ఆ నాలుగు కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21.93 కోట్లు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. మరో వైపు అమరావతిలోని ఉద్దండ రాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకుంది ప్రత్తిపాటి పుల్లారావు అవెక్సా కంపెనీ. ఇక్కడైతే అసలు రోడ్డు పనులు చేయకుండానే బిల్లులు పెట్టి ప్రజా ధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్ళించేసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్ పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఏ పనీ చేయకుండానే 26 కోట్లకు పైగా దోపిడీ చేసింది ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ. పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ కోట్లు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జీ ప్లస్ 3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్ లను సమర్పించి ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీకి చెందిన కంపెనీ. ఈ మేరకు ఆధ్యా ఎంటర్ ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17.85 కోట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ మొత్తం 66.3 కోట్లు కొల్లగొట్టింది. ఈ అవినీతి దందా మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అవెక్సా డైరెక్టర్ అయిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ప్రత్తిపాటి శరత్ కి రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం -
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ. 17 కోట్ల సాయం కోసం ఎదురుచూపు!
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. హృదయాంశ్కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు. తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
మన్సూరాబాద్/హయత్నగర్: మద్యం తాగి కుటుంబ పరువు తీస్తున్నాడని కలత చెందాడో..ఆస్తి తగాదాలు ఉన్నాయో తెలియలేదు కానీ..ఓ తండ్రి కన్న కొడుకును కడతేర్చాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్గౌడ్ గత కొంత కాలంగా మునగనూరులోని రామాంజనేయకాలనీ రోడ్నెంబర్–7 స్వంత ఇంటిలో నివాసం ఉంటూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాస్గౌడ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వినయ్ (28) ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లికను ప్రేమించి పెళ్లి చేసుకుని సమీపంలోని ఓ ఇంట్లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల పాప రక్షిత ఉంది. ఇటీవల కొద్ది కాలంగా వినయ్ తరచుగా మద్యం తాగి తండ్రి శ్రీనివాస్గౌడ్ నివాసానికి వచ్చి వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. వ్యాపారం చేసుకుంటా..ఆస్తిలో తన భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అలాగే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. చేసేది లేక శ్రీనివాస్గౌడ్ రూ.500 మద్యానికి ఇచ్చాడు. అనంతరం వినయ్ మద్యం తెచ్చుకుని తాగి మరింతగా ఇంట్లో గొడవకు దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్గౌడ్ అక్కడే ఉన్న ఇనుప పారతో వినయ్ తలపై గట్టిగా బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై వినయ్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని కూడా తెలుస్తోంది. హయత్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శ్రీనివాస్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)