-
పాము కాటుతో మహిళా పోలీసు మృతి
శ్రీకాకుళం: మండలంలోని తర్లిపేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్)గా పనిచేస్తున్న తామాడ జ్యోతికుమారి (36) పాముకాటుతో మృతిచెందారు. సంత»ొ మ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన తామాడ జ్యోతికుమారి తన తండ్రి రిటైర్డ్ వీఆర్ఓ తామాడ రామారావు ఇంటిలో ఉంటున్నారు. శుక్రవారం బాత్రూమ్ నుంచి బయటకు వ స్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కు టుంబ సభ్యులు ఆమెను ఆటోపై కోట»ొ మ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా జ్యోతికుమారి మార్గం మధ్యలోనే మృతి చెందారు. ఆమెకు భర్త జయరాజ్, కుమారుడు రఘునాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై తర్లిపేట సచివాలయ సిబ్బంది వి.రమే‹Ù, డి.అప్పన్న, ఎం.మాధురి, టి.రాము, వై.సింహాద్రి, హెచ్.మహందాత, బి.భాను తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
పాముకాటుతో యువకుడి మృతి
హన్మకొండ: పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఇబ్ర హీంపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన దొరగొల్ల ఎల్లయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు మహేష్ (27), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు చేదోడువాడుగా ఉండే మహేష్ మంగళవారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. గ్రామ పెద్ద చెరువు కట్ట చివరన గొర్రెలను మేపుతుండగా మహేష్కు పాము కాటువేసింది. తనకు పాము కాటువేసినట్లు స్నేహితులకు ఫోన్ చేసి తెలిపాడు. ఘటనా స్థలిలోనే అస్వస్థతకు గురైన మహేష్ను స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. కాగా, అందరితో కలివిడిగా ఉండే మహేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పాముకాటుతో నర్సింగ్ విద్యార్థిని షఫీనా మృతి
వరంగల్: పాముకాటుతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆర్ఎంపీ షేక్ యాకూబ్ కుమార్తె నర్సింగ్ విద్యార్థిని షఫీనా(22) శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో పాము కాటు వేసింది. దీంతో షఫీనా లేచి తండ్రి యాకూబ్తో ఏదో కుట్టిందని చెప్పింది. ఇంతలోనే షఫీనాకు వాంతులు అవుతుండగా యాకూబ్ వెంటనే మహబూబాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గ్రామానికి చేరుకుని షఫీనా మృతదేహంపై పూలమాల వేసి నివాళులరి ్పంచారు. కార్యక్రమంలో కాంపల్లి సొసైటీ చైర్పర్సన్ కొండపల్లి శ్రీదేవి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, సర్పంచ్ యానాల గంగాధర్రెడ్డి, నాయకులు రవి, భిక్షమయ్య, సత్యనారాయణ, సైదులు, రాందాస్నాయక్ పాల్గొన్నారు. -
పాముకాటుకు తల్లీకొడుకుల బలి
ఒడిశా: జిల్లాలొని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీ సిపిలిజొల్ గ్రామంలో పాముకాటుతో తల్లీకుమారులు మృతిచెందారు. బృందాబిసి(32), ఆమె కొడుకు బిజయ్ బిసి (9) ఎప్పట్లాగే శుక్రవారం వారు రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో విష సర్పం ఇంటిలోకి ప్రవేశించి ముందుగా బిజయ్ను. పక్కనే ఉన్న బృందాను కాటువేసింది. మెలకువ తెచ్చుకున్న బృందా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. పాము కాటువేసినట్టు గమనించి చంద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబంలొ ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
పాముకాటుకు గురైన రైతు మృతి
శ్రీ సత్యసాయి: పాముకాటుకు గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సుద్దకుంటపల్లి తండాకు చెందిన నాగేశ్నాయక్(40) తన పొలంలో వేరుశనగ పంట సాగు చేస్తున్నాడు. భార్య సాలమ్మతో కలసి సోమవారం పంటకు నీరందించేందుకు వెళ్లాడు. స్ప్రింక్లర్ పైపులు మార్చుతున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లగా, అక్కడి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కుమారులు నితిన్నాయక్, నిరంజన్ నాయక్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జనార్దన్నాయుడు పేర్కొన్నారు. -
ఇంటి సామగ్రి కడుగుతుండగా.. మహిళను కాటేసిన అరుదైన పాము..
వరంగల్: ఇంటి సామగ్రి కడుగుతుండగా పాము కాటు వేసింది. దీంతో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం నగరంలోని పలువేల్పులలో జరిగింది. పలివేల్పులకు చెందిన సల్లా పద్మ(38) ఉదయం ఇంటి ఆవరణలో సామగ్రి (బోళ్లు) కడుగుతుండగా పాము కాటు వేసింది. వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
పాము కాటుతో బాలిక మృతి
తుమకూరు: పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకా పంచవటి తండాలో జరిగింది. చైతన్య బాయి (10) శనివారం ఉదయం తండ్రితో కలిసి పొలం పనుల్లో ఉండగా పాము కాటేసింది. హుటాహుటిన బాలికను కుణిగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది. -
పాముకాటుతో విద్యార్థి మృతి
అన్నమయ్య: పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని సోంపల్లె పంచాయతీ తంబళ్లవారిపల్లెకు చెందిన బి.చంద్రశేఖర్ కుమారుడు బి.యువరాజు (15) ఇంటి ఆవరణంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయాడు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో నుంచి వచ్చిన పాము కాటు వేసింది. దీనితో అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం ఎంతసేపటికి యువరాజ్ నిద్ర లేవకపోవడంతో గమనించిన తండ్రి లేపించాడు. విద్యార్థి పక్కలోనే పాము ఉండడాన్ని చూసి చంపేశారు. అప్పటికే తీవ్ర అస్వస్థతో ఉన్న బిడ్డను చూసి పాముకాటు వేసినట్లు గుర్తించి ములకలచెరువు పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కోడి కోసం.. కొండచిలువ..! అంతలోనే..
భద్రాద్రి: మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న ఇర్ఫాన్ చికెన్ షాపులోకి ఓ కొండ చిలువ చొరబడి కలకలం సృష్టించింది. షాపు యజమాని సయ్యద్ ఇర్ఫాన్ బుధవారం ఉదయాన్నే షాపు తెరిచి కోళ్లు ఉన్న ఫారమ్లోకి వెళ్లగా, కొండ చిలువ కోళ్లను మింగుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది సుమారు 12 అడుగుల కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
వెళ్లిపోయావా తమ్ముడూ.. ఇంట్లోకి వెళ్లి కాటు వేసిన కట్లపాము
శ్రీకాకుళం: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లి తీవ్ర అనారోగ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రి తాపీ పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. అక్క, తమ్ముడు కలిసి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కట్లపాము కాటు వేయడంతో తమ్ముడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన పొందూరు మండలం తోలాపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రావాడ చిన్నయ్య, నీలవేణికి కుమార్తె రమ్య, కుమారుడు లవకుమార్(14) ఉన్నారు. లవకుమార్ తోలాపి జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నయ్య, నీలవేణి రోజువారీ కూలీలు. నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ పోషణ కోసం చిన్నయ్య రెండు రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. దీంతో అక్క రమ్యతో కలిసి లవకుమార్ ఇంటిలో ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గాలి తగలడం లేదని తలుపుతీసి పడుకున్నారు. ఆ సమయంలో కట్లపాము లవకుమార్ను కాటువేసింది. మెలకువ రావడంతో ఏదో పురుగు కుట్టిందనుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పాము మెడకు చుట్టినట్లు అనిపించడంతో ఒక్కసారిగా నిద్రలేచి పామును గుర్తించాడు. పామును విసిరేస్తే అక్కకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి భయపడకుండా చేతితో తీసి నేలకు గట్టిగా కొట్టాడు. తర్వాత పామును కొట్టి చంపాడు. అలికిడి కావడంతో అక్క నిద్రలోనుంచి లేచింది. అప్పటికే పాము కరిచి చాలాసేపు కావడం, తమ్ముడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు లవకుమార్ను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అప్పటి వరకు తనతో ఉన్న తమ్ముడు పాముకాటుకు బలికావడంతో అక్క కన్నీటిపర్యంతమైంది. తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది. వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ముందు రోజు వరకు రోజూ పాఠశాలకు వస్తున్న విద్యార్థి ఇక లేడని తెలిసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మృదేహానికి పోస్టుమార్టం చేయించారు. -
కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది...
సంగారెడ్డి: పొలంగట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్కలతో నిండిన పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, గృహాల ఎదుట పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకొచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి. పాములకు శరీరం కింది భాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్దం గ్రహిస్తాయి. వేడిరక్తం ప్రసవించే, జంతువులు, మనుషులు సమిపిస్తే వెంటనే గుర్తిస్తాయి. కదులుతున్న ప్రాణులను గుర్తించి కాటేస్తాయి. నాగుపాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటి కాటుకు గురైనా బాధితులకు వెంటనే వైద్యమందక ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పంట పొలాలు, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. సర్పాలకు ప్రాణభయం ఉన్నప్పుడు ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు కాటేస్తాయి. అన్ని ప్రమాదం కాదు.. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు. కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతుల్లోనే ప్రమాదముంటోంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం, ప్రమాదంలేని మాములు గాయాలే. చికిత్స తీసుకుంటే నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్తో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వారు. ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులుగా ఏడుపులు ప్రారంభిస్తే బాధితులు భయాంతోళనకు గురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. పాములు వాటి విషప్రభావం కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతోంది. రక్తపింజర: ఇది కాటేసిన 2 గంటల తర్వాత విషం ఎక్కుతోంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇవి కాటేసిన విషం ఉండదు. కాటు వేసిన చోట చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఉత్తమం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాత్రివేళల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవాళ్లు టార్చ్లైట్ను వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు పరిసరాలల్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి పాముకాటుకు గురై వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెబుతుండాలి. పాముకాటేసిన పైభాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటేసిన చోట బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. నోటిలో పుండ్లు, గాట్లు లేకుంటే రక్తం పీల్చి ఉమ్మివేయాలి. పాముకాటుకు గురైనా వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. – డాక్టర్ శాలిని, పీహెచ్సీ టేక్మాల్ -
బాలుడిని కాటేసిన రెండు పాములు...
నిజామాబాద్: పాము కాటుకు గురైన మూడేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులకు రుద్రాన్ష్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో పక్కనున్న మరో గదిలో వీరంతా శుక్రవారం నిద్రించారు. ఈ క్రమంలో రెండు పాములు వచ్చి రుద్రాన్ష్ను కాటు వేశాయి. బాలుడు గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి వెళ్తున్న పాములను తండ్రి భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
పాము కాటు వేసిన ఐదు నిమిషాల్లో మృతి..
‘గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన కమటాన చిరంజీవి గత ఏడాది సెప్టెంబర్ 8న పొలంలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా పాము కాటువేసింది. కాలికి ఏదో విషపురుగు కరిచినట్టు గుర్తించి నడుచుకుంటూ గ్రామానికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లిన ఐదు నిముషాల్లో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. ఆయనకు కరిచింది చంద్రపొడి (రెసెల్స్వైపర్) జాతికి చెందిన విషసర్పమని, సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాలు నిలిచేవని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.’ కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి రామకృష్ణ గత ఏడాది సెప్టెంబర్ 7న పత్తి పంటను చూసేందుకు వెళ్లగా ఉల్లిపాము కరిచింది. ఆయన ఎటువంటి భయానికి గురికాకుండా దగ్గరలో ఉన్న పీహెచ్సీకి వెళ్లారు. అక్కడి వైద్యులు స్నేక్యాంటీ వీనం వ్యాక్సిన్ వే శారు. మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్చేశారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. పార్వతీపురం టౌన్: వర్షాకాలం వచ్చిందంటే సాధారణంగా పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలం పనిలో నిమగ్నమైన సమయంలో, గట్లపై వెళ్తున్న సమయంలో రైతులు పాముకాటు బారిన పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు సంవత్సరంలో 498 మంది పాముకాటుకు గురయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందారు. సరైన అవగాహనలేకపోవడం, సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని వైద్యులు తేల్చారు. అవగాహన ఉంటే ప్రాణాపాయ స్థితినుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా పాములు సంచరించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా చూసుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. ఏమరపాటు తగదు... ప్రస్తుత వర్షాకాలంలో పాములు తల దాచుకోవడాని కి అనేక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి. పొ లం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. దీనికి తోడు అవి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లతో పాటు ఇళ్లలో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో తలదాచుకొంటాయి.అప్రమత్తంగా ఉండి పరిసరాల ను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోపాటు మురుగు లేకుండా చూసుకోవటం, రైతులు పొలాల కు వెళ్లేటప్పుడు కర్ర చేతిలో ఉంచు కోవడం, వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవడం మంచి దని వైద్యులు సలహా ఇస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గుట్టలు, పుట్టలు దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసి ఉంచినప్పుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాముల్లో అన్నీ ప్రమాదకరమైనవి కావు విషపూరితమైన నాగుపాము, కట్లపాడు, రక్తపింజరి, చంద్రపొడి వంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన వెంటనే స్నేక్ యాంటీ వీనమ్ తీసుకోవాలని చెబుతున్నారు. పాము కాటుకు అందుబాటులో చికిత్స పాముకాటు బారిన పడిన వ్యక్తికి పీహెచ్సీలలో చికిత్స అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్వీనం వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా కరిచిన వెంటనే ముందుగా గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తీసుకోవా లి. గాయాన్నిబట్టి రెండుసార్లు స్నేక్వీనం డోస్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. భయపడకుండా నిర్భయంగా ఉండాలి. – డాక్టర్ బి.వాగ్దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం పాము కాటు లక్షణాలు పాము కాటుకు గురైన వెంటనే మనిషి శరీరం చల్లగా మారిపోతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి రావ డంతోపాటు ఆయాసం వస్తుంది. నోటి నుంచి నురగలు వస్తాయి. ప్రథమ చికిత్స ఇలా.. పాము కాటుకు గురైన వ్యక్తిని నిదానపరచాలి. కంగారు పడకుండా చూడాలి. ఆందోళనకు గురైతే విషం వేగంగా శరీరం అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పొడిగా, వదులుగా ఉన్న పట్టీతో లేదా వస్త్రంతో కాటును కప్పాలి. వేగంగా యాంటీ–వీనమ్ను అందించగల ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి. గాయం కడగకూడదు. గాయం మీద ఐస్ను పెట్టకూడదు. గాయం నుంచి విషాన్ని పీల్చేందుకు ప్రత్నించరాదు. -
విషాదం.. పాము కాటుతో తండ్రీకొడుకు మృతి
రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు. వివరాల ప్రకారం.. రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత, తనయుడి మృతి -
పాము కాటుతో తండ్రీకొడుకులు మృతి
రాజంపేట: పాము కాటుకు తండ్రీకొడుకులు బల య్యారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తె లిపాడు. దీంతో భార్యాభర్త లు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధ రాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతు లు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగు తున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కొడుక్కి పాము కాటు.. చంపబోయిన తండ్రికి కూడా.. నాటు వైద్యాన్ని నమ్ముకుని ఇద్దరి మృతి!
కామారెడ్డి జిల్లా: రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే వినోద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు. -
పాము కాటుకు మరో కార్మికుడు మృతి
వేలూరు: అల్లేరి గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో పాము కాటుకు మరో కార్మికుడు మృతిచెందిన సంఘటన గ్రామస్తులను కలచివేసింది. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని జవ్యాది కొండ, అల్లేరు వంటి 30కి పైగా గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ప్రసవ నొప్పులు వచ్చినా డోలి కట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులు తమ గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల వద్ద వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. ఇదిలా ఉండగా అల్లేరి గ్రామానికి చెందిన ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి ప్రియ రెండు నెలల క్రితం పాము కాటుకు గురై రోడ్డు వసతి లేక ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని పది కిలోమీటర్ల దూరం తల్లి భుజంపై వేసుకుని వెళ్లిన విషయం సోషల్ మీడియాలో రావడంతో అఽధికారులు చర్యలు తీసుకుని రోడ్డు పనులను ప్రారంభించారు. ఇదిలాఉండగా అల్లేరి గ్రామానికి చెందిన శంకర్(38) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా శంకర్ పాము కాటుకు గురయ్యాడు. అనంతరం అంబులెన్స్, వైద్య బృందానికి సమాచారం అందజేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే శంకర్ మృతిచెందాడు. -
పాముకాటుకు గురైన ఆమంచి..
-
నిద్రిస్తున్న బాలికను కాటు వేసిన నాగుపాము
దుర్గి/చిలకలూరిపేట టౌన్: పాముకాటులో బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అడిగొప్పల యానాది కాలనీకి చెందిన కొమరగిరి అనిల్ బాబు, పూజ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనిక స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో కూలీ పనులు కోసం వెళ్లారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో శనివారం బంధువులతో తల్లిదండ్రుల వద్దకు పోతవరం వెళ్లింది. తల్లిదండ్రులతో ఆటపాటలతో సంతోషంగా గడిపి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో తల్లిదండ్రులు పాము కాటు అని గుర్తించి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న క్రమంలో బాలిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న సర్పంచి నలబోతు చిన్నబ్బాయి మృతి చెందిన బాలిక కుటుంబానికి మట్టి ఖర్చులు కోసం రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను వైస్ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్ హుసేన్ పరామర్శించారు. -
బూటులో దూరిన పాము.. విద్యార్థికి పాముకాటు
అనంతపురం: పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కోనాపురం గ్రామానికి చెందిన హరినాథ్... నగరూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న హరినాథ్... ఆవరణలో బూట్లు వదిలి తన హోం వర్క్ చేసుకున్నాడు. ఇంతలో బెల్ మోగడంతో హడావుడిగా బూట్లు ధరించి ప్రేయర్కు హాజరయ్యాడు. ఇంతలో తన కాలుకు ఏదో కుట్టిందంటూ గట్టిగా అరవడంతో హరినాథ్ను పీడీ మహబూబ్బాషా పక్కకు పిలుచుకెళ్లి బూట్లు విప్పించి చూడగా, లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చింది. వెంటనే పామును చంపేసి, బాధిత విద్యార్థిని తన ద్విచక్ర వాహనంపై తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి పీడీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత విద్యార్థిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో విద్యార్థిని ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలపడంతో అక్కడే ఉన్న పీడీ మహబూబ్బాషాను ఎమ్మెల్యే అభినందించారు. -
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకులంలో బాలికకు పాముకాటు
-
పాఠశాలలో పాము కాట్లు.. రెండు రోజుల్లో ఇద్దరు విద్యార్థినిలను..
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధినిలు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చుని చదువుకుంటున్న నాలుగో తరగితి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో నాలుగు పాములు చిన్నారిని కాటేసిన పామును స్కూల్ సిబ్బంది చంపేయగా.. గురుకుల ఆవరణలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో రెండు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగతా రెండింటినీ గ్రామస్తులు చంపేశారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిందట కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం మరో విద్యార్థినిని పోతంగల్ మండలం జల్లాపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే విద్యార్థినిని పాటు కాటేసింది. కిటికీలో నుంచి పుస్తకం బయట పడటంతో తీసుకోవడానికి వెనకవైపు వెళ్లిన విద్యార్థినిని పాము కాటేసింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినిలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల ఘటనలతో పాఠశాల, గురుకల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. స్కూల్ ఆవరణలో ఏ క్షణంలో ఎటువైపు నుంచి పాముల వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆందోళన విద్యార్థిని పాము కాటుకు గురికావటంపై చిన్నారుల తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రయడుతున్నారు.ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి -
నాలుగుసార్లు పాము కాటు వామ్మో.. చితిపై లేచి కూర్చున్నాడు!
కర్ణాటక: పాముకాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే అతను చనిపోతాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే బాధితుడు చితిపై లేచి కూర్చున్నాడు. ఈఘటన హుబ్లీలో జరిగింది. గదగ్ జిల్లా నరగుంద తాలూకా హిరేకొప్ప గ్రామంలోని ఓ ఇంటిలో పాము చొరబడగా అదేగ్రామానికి చెందిన సిద్ధప్ప బళగనూరు మద్యం మత్తులో అక్కడకు వెళ్లాడు. ఎలాంటి సురక్షిత ఏర్పాట్లు లేకుండా పామును పట్టేశాడు. అనంతరం దానిని రోడ్డుపై వదిలాడు. మళ్లీ పట్టుకునేందుకు వెళ్లగా పాము నాలుగుసార్లు కాటు వేసింది. దీంతో అతన్ని హుబ్లీ కిమ్స్కు తరలించారు. పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో సిద్ధప్ప ప్రాణాలు ఉండవని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయాలని గ్రామంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సిద్ధప్ప చితిపై లేచి కూర్చున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కాగా బాధితుడికి వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
మెదక్: పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని అనంతరావుపల్లి గ్రామానికి చెందిన గద్ద విజయ్–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంజయ్కుమార్(16) ఉన్నారు. సంజయ్ అల్వాల్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి పశువులకు మేత వేసి వస్తున్న క్రమంలో సంజయ్ కాలికి పాముకాటు వేసింది. దీంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తకు పాము కాటు... పామును తొక్కి చంపేశారు...
కర్నూలు: రాత్రి మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తలను పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలోని పాత బీసీ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిన్న భాస్కర్, లక్ష్మి (38) దంపతులు సోమవారం రాత్రి భోజనం అనంతరం మిద్దైపె నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11 గంటల అనంతరం గొల్ల చిన్న భాస్కర్ను పాము కాటువేయడంతో విదిల్చి పడేయగా పక్కనే ఉన్న లక్ష్మి కాలికి కాటు వేసింది. ఆమె కాలిని వదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పామును తొక్కి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేని లక్ష్మి మృతిచెందగా చిన్న భాస్కర్ కోలుకుంటున్నాడు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.