-
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్ను ముందుకు పోనిచ్చారు. -
లోకేశ్ హైడ్రామా
సాక్షి అమలాపురం/రాజోలు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంతో ఆయన కుమారుడు నారా లోకేశ్ బస చేసిన హోటల్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు లోకేశ్ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన తండ్రిని చూసేందుకు విజయవాడ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ తాను బస చేసిన హోటల్ బయట రోడ్డుపై బైఠాయించి లోకేశ్ నిరసన తెలిపారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో సాగుతోంది. శుక్రవారం రాత్రి లోకేశ్ పాదయాత్ర ముగించుకుని పొదలాడలోని శుభం గ్రాండ్ హోటల్లో బస చేశారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి విజయవాడ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడు విజయవాడ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో వారిపై లోకేశ్ విరుచుకుపడ్డారు. రాజోలు సీఐ గోవిందరాజుతో వాగ్వాదానికి దిగారు. అలాగే కొత్తపేట డీఎస్పీ కేవీ రమణతో సైతం గొడవపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దాక బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు వారిస్తున్నా లోకేశ్ వినిపించుకోలేదు. తీవ్ర పదజాలంతో పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘మీకు సిగ్గులేదా? నన్ను అడ్డుకోమన్న వాడు ఎవరు?’ అంటూ పరుష పదజాలంతో దూషణలకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడే ఉన్నారు. పోలీసులు పలు సందర్భాల్లో నచ్చజెప్పినా లెక్క చేయలేదు. ‘తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసు అనుమతి కావాలా’ అనే ప్లకార్డు, రాజ్యాంగ ప్రతులను చేతితో పట్టుకుని నిరసనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో లోకేశ్ మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి వెళ్లారు. నిరసన తెలుపుతున్న సమయంలో ముఖ్యమైన సన్నిహితులతో లోకేశ్ ఫోనులో మంతనాలు జరిపారు. -
నోటీసులిచ్చాకే చంద్రబాబు అరెస్టు
కొవ్వూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేశారని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. అంతా చట్టప్రకారమే జరిగిందని.. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారని పేర్కొన్నారు. అవినీతి చేయడం వల్లే.. చంద్రబాబు ఇటీవల అరెస్ట్ పేరుతో సానుభూతి డ్రామా మొదలుపెట్టారని చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేత పురందేశ్వరి ఖండించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాపై రాళ్లు వేయించి, ప్రధాని మోదీని తిట్టిన వ్యక్తులను సమర్థిస్తున్నారా? అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆమె బీజేపీకి నిబద్ధతగా ఉంటున్నారో? లేదంటే తన మరిది చంద్రబాబుతో కలిసిపోయారో చెప్పాలని హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. చంద్రబాబు కేసులో ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేశాయని బీజేపీ నేతగా పురందేశ్వరి చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ స్కామ్పై ఇన్నాళ్లూ నోరు మెదపని జనసేన అధినేత పవన్కళ్యాణ్.. ఈరోజు చంద్రబాబుకు అండగా ముందుకు రావడాన్ని వనిత తప్పుబట్టారు. ఈ కుంభకోణంలో మీకు అందుతున్న ప్యాకేజీ ఎంతని పవన్ను ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘నన్ను అరెస్టు చేస్తారు మహాప్రభో.. ధర్నాలు చేసి మద్దతు తెలపండి’
అనంతపురం శ్రీకంఠం సర్కిల్/ సెంట్రల్: ‘నన్ను అరెస్టు చేస్తారు మహాప్రభో.. ధర్నాలు చేసి మద్దతు తెలపండి’ అని రెండు రోజుల క్రితం స్వయంగా ఆయనే విజ్ఞప్తి చేశారు. రచ్చ చేయండి.. అగ్గి రాజేయండి అని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఆయన చెప్పినట్టు అరెస్టయితే జరిగింది కానీ, ఆ పార్టీ నాయకులు ఏమనుకున్నారో ఏమో తూతూ మంత్రపు నిరసనలతో సరిబెట్టారు. తప్పు చేసినట్లు చంద్రబాబుకే తెలిసిపోయింది.. దానికి మేమెందుకు రోడ్డెక్కాలి అనుకున్నట్లుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అసలు స్పందించనే లేదు. వెరసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న చంద్రబాబుకు జిల్లాలో సంఘీభావం కరువైంది. ఉనికి చాటుకునేందుకు మాత్రమే టీడీపీ నేతలు అక్కడక్కడా నిరసనలు తెలిపారు. కానీ ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. చివరకు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా మద్దతు లభించలేదు. పలు ప్రాంతాల్లో నేతలపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ‘తప్పు చేసిన వారిని అరెస్టు చేయక.. ఇంకేం చేస్తారు.. అయినా అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నా చేసి, సామాన్యులను ఇబ్బంది పెట్టడమే మీ రాజకీయమా’ అంటూ ఎదురుదాడికి దిగడంతో టీడీపీ నేతలు కంగు తిన్నారు. పోలీసుల అప్రమత్తం.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రధాన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపట్టారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరితో పాటు పరిటాల శ్రీరామ్, బుల్లే శివబాలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ ముందు రోడ్డుపై బైఠాయించిన కొంత మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. యథావిధిగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు ‘పల్లె’ అభాసుపాలు.. టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ అంటూ షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలకు తరలించి శనివారం చంద్రబాబు అరెస్టయితే, నిరసన అంటూ రచ్చ చేసి కార్యకర్తలను తనకు అనుకూలంగా మలచుకుందామనుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అభాసుపాలయ్యారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. అనంతపురం నుంచి తన సొంత నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిరసనకు దిగుదామని తలచిన ఆయనకు అక్కడ మాత్రం భిన్నమైన స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు సహకరించలేదు. దీంతో కొంత మంది తన అనుయాయులతో హడావుడి చేశారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపడతారనే ముందస్తు సమాచారంతో బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఉదయం కాసేపు డిపోలకు పరిమితం చేశారు. కానీ జిల్లాలో వారి పెద్దగా ప్రభావం లేదని తెలుసుకుని, ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా బస్సులను యథావిధిగా తిప్పారు. జిల్లా వ్యాప్తంగా రోజూ 405 సర్వీసులను ఆర్టీసీ సంస్థ నడుపుతోంది. అనంతపురం డిపో 82, గుత్తి 23, గుంతకల్లు 46, కళ్యాణదుర్గం 62, రాయదుర్గం 48, తాడిపత్రి 92, ఉరవకొండ డిపోలో 52 సర్వీసులున్నాయి. మధ్యాహ్నానికి 51 శాతం సర్వీసులు నడిచాయి. సాయంత్రం వంద శాతం బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.వారాంతం కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సౌలభ్యం దృష్ట్యా ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సు సర్వీసులను నడిపినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు. -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్కుమార్, ఈడీ దినేష్కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్
కారాగారంలో గడిపే సమయం శిక్ష సమయం కాదు, శిక్షణ సమయం. కారాగారం మానసిక పరివర్తన దిశగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే ప్రదేశంగా ఉండాలి. అలాగే ఉంటాయి కూడా. అయితే ఈ ఏడాది దేశం మరో అడుగు ముందుకేసింది. శిక్ష అనుభవిస్తున్న మహిళలకు ఉపాధి అవకాశాలను జైలు గోడల మధ్య కాకుండా సమాజంలో కల్పించడం ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రత్యేకత. చెన్నై నగర శివారులో అంబత్తూరు– పుఱల్ రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ‘ఆల్ ఉమెన్ పెట్రోల్ బంక్’ అనే ప్రయోగాత్మకమైన సంస్కరణకు వేదికైంది. పుఱల్ మహిళల కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మహిళల్లో ముప్ఫై మందికి ఉద్యోగం ఇచ్చింది. దేశంలో ఇదే మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంతో ఈ పెట్రోల్ బంకు ఫ్రీడమ్ ఫిల్లింగ్ స్టేషన్ అనే గౌరవ సూచికకు అర్హత సాధించింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు మహిళలు విధులు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత పురుష ఖైదీలు విధుల్లోకి వస్తారు. ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తయిన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించడం కోసం రకరకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. అవన్నీ జైలు గోడల మధ్యనే ఉంటాయి. మారుతున్న సమాజానికి తగినట్లు కొత్త కొత్త ఉపాధి మార్గాలకు తగిన ఏర్పాట్లు ఉండవు. అందుబాటులో ఉన్న పనుల్లోనే శిక్షణ ఇవ్వడమే జరిగేది. ఇదిలా ఉంటే... జైళ్లలో మహిళా ఖైదీలకు తగిన సౌకర్యాల పర్యవేక్షణ కోసం అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన మహిళా కమిషన్ సభ్యుల పరిశీలనలో కొత్త విషయాలు తెలిశాయి. జైలు గోడల మధ్య ఉండడం వల్ల మహిళలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారని, వారికి సమాజంలో భాగస్వామ్యం కల్పించాలని సూచించడంతో, ఆ సూచనను అందుకున్న జైలు అధికారుల్లో మొదటగా పుఱల్ జైలు అధికారులు ఈ ప్రయత్నం చేశారు. మహిళలకు పెట్రోల్ పట్టడంలో శిక్షణ ఇవ్వడంతోపాటు వినియోగదారులతో మాట్లాడడం, ఉద్యోగానికి తగిన ప్రవర్తనా నియమావళిలో కూడా మహిళలకు శిక్షణ ఇప్పించారు. పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తిస్తున్న మహిళలు తమకు స్వాతంత్య్రం వచ్చినట్లు సంతోషిస్తున్నారు. శిక్ష కాలాన్ని ఆనందంగా పూర్తి చేస్తామని, పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో సమాజంలోకి విడుదలవుతామని చెప్పారు. శిక్ష కాలం సమాజంలోనే! శిక్షణ కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకు రావడంతోపాటు ఖైదీలను సమాజంతో అనుసంధానం చేయడం, వారి పునరావాసం కోసం పని చేయడం కూడా అవసరమే. ఆ అవసరాన్ని గుర్తించి మహిళలతోనే ముందడుగు వేసింది జైళ్ల శాఖ. శిక్ష సమయంలో కూడా సమాజంలో మనుషులతో మాట్లాడుతూ ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి దూరంగా ఉన్నామనే ఆవేదన దూరమవుతుంది. సమాజంలోనే నివసిస్తున్న భావనతో జీవిస్తారు. -
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య యువతకు డిమాండ్
-
ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్ సిటీలోని సైగాన్ హైటెక్ ఇండ్రస్టియల్ పార్క్లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ ట్రైనింగ్ సెంటర్ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు. పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్ హైటెక్ పార్కు అధ్యక్షుడు న్గుయెన్ అన్హ్ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్ ఫిష్ (మాఘ చేప), ట్యూనా ఫిష్ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్ నై ప్రావిన్స్ వైస్ చైర్మన్తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్ చైర్మన్ను ఆహ్వానించారు. -
గ్రామీణ యువతకు శిక్షణ, ఉపాధిలో ఏపీ స్పీడ్
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ఐదు రాష్ట్రాల్లో స్థానం సంపాదించుకుంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణలో మూడో స్థానం, వారు ఉపాధి పొందడం (ప్లేస్మెంట్స్)లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశంలోని 27 రాస్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 14.51 లక్షల మంది గ్రామీణ యువత శిక్షణ పొందగా ఇందులో 8.70 లక్షల మంది ఉపాధి పొందినట్లు తెలిపింది. గ్రామీణ యువతకు వృత్తిపరమైన లేదా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 15 నుంచి 35 ఏళ్ల లోపు పేద కుటుంబాలకు చెందిన గ్రామీణ యువతకు ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ ఇస్తారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 15 శాతం, మహిళలకు 33 శాతం మందికి శిక్షణలో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే దివ్యాంగులు, కుటుంబ నిర్వహణలో ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో 37 రంగాల్లో 877 ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు 2,369 కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తున్నాయి. -
ఎన్నేళ్లకు చిక్కి'నారా'? లోపలేస్తారా?
-
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కు కర్త, కర్మ, క్రియ అప్పటి సీఎం చంద్రబాబే
-
స్కిల్ స్కాం: స్పీడ్ పెంచిన ఈడీ.. టీడీపీ ముఖ్య నేత ఇంటికి సొమ్ము!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వ ముఖ్య నేత సాధనంగా వాడుకున్న షెల్ కంపెనీ డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను శుక్రవారం జప్తు చేసింది. 2015–16 లో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు ముసుగులో ఆ కంపెనీ పేరిట అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే సాగిన ఈ కుంభకోణం కోసం డిజైన్ టెక్ అనే కంపెనీని తెరపైకి తెచ్చారు. అనంతరం ఆ కంపెనీ వెచి్చంచాల్సిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.370 కోట్లను విడుదల చేశారు. అనంతరం ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ నుంచి వేర్వేరు షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించి అక్కడి నుంచి హవాలా విధానంలో హైదరాబాద్లోని అప్పటి ప్రభుత్వ ముఖ్య నేత నివాసానికి మళ్లించారు. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసి కీలక ఆధారాలను సేకరించింది. మనీ లాండరింగ్కు పాల్పడి నల్లధనాన్ని తరలించినందున కుంభకోణంపై దృష్టి సారించాలని ఈడీని సీఐడీ కోరింది. రంగంలోకి దిగిన ఈడీ కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు, షెల్ కంపెనీల ప్రతినిధులను విచారించింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, సీమెన్స్ ప్రాజెక్టు మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్ను అరెస్టు చేసింది. తాజాగా డిజైన్ టెక్కు చెందిన డిపాజిట్లను ఈడీ జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు -
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఈడీ దూకుడు, రూ.31 కోట్ల ఆస్తుల అటాచ్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా ముందుకెళ్తోంది. డిజైన్టెక్ సిస్టమ్స్కు చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్టెక్ మనీ లాండరింగ్కి పాల్పడింది. నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్లో ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇప్పటికే డిజైన్టెక్ ప్రతినిధులు వికాస్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ను ఈడీ అరెస్ట్ చేసింది. చదవండి: ‘స్కిల్డ్’ క్రిమినల్ బాబే ED has provisionally attached properties amounting to Rs. 31.20 Crore belonging to M/s Designtech Systems Private Limited (DTSPL) in a money laundering case for diversion and misutilisation of funds. — ED (@dir_ed) April 28, 2023 కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అప్పటి సీఎం చంద్రబాబే అన్న సంగతి తెలిసిందే.. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరుతో కథ నడపటం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం.. అందుకోసం ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం.. అనంతరం ఆ నిధులను షెల్ కంపెనీల పేరిట హవాలా మార్గంలో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి చేర్చడం.. అంతా కూడా చంద్రబాబు పక్కా పన్నాగం ప్రకారమే సాగిందన్నది ఆధారసహితంగా వెల్లడైంది. చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్ల సీమెన్స్ ప్రాజెక్టు పేరిట ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ ప్రాజెక్టు సమయంలో అప్పటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు ఉన్నతాధికారులను సీఐడీ విచారించగా ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. పూర్తిగా చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు తేలింది. ఇకనైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట నిధులు కొల్లగొట్టడానికి చంద్రబాబు ఏపీఎస్ఎస్డీసీని ఓ సాధనంగా చేసుకున్నారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గురించి సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఏమీతెలీదు. అప్పట్లో సీమెన్స్ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ను అడ్డంపెట్టుకుని కథ నడిపారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రాజెక్టును రూపొందించారు. ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కన్విల్కర్ కలిశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. -
నైపుణ్యాలను పెంచుకుంటాం
న్యూఢిల్లీ: కెరీర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు మన దేశంలో ఎక్కువ మంది నిపుణులు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ‘గ్రేట్ లెర్నింగ్’ ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే నైపుణ్యాల పెంపు విషయంలో భారత్లోనే ఎక్కువ మంది సానుకూల ధోరణితో ఉన్నారు. అలాగే, తమ ఉద్యోగాలను కాపాడుకోగలమని భారత్లో 71% మంది నిపుణులు చెప్పగా, అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగానే ఉన్నారు. అంటే భారత్లోనే ఎక్కువ మంది ఉద్యోగ భద్రత విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నైపుణ్యాల పెంపు, ఈ దిశగా వారిని ప్రేరేపించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోకుండా అడ్డుపడే అంశాలు, కార్యాలయాలు తిరిగి తెరవడం వల్ల నైపుణ్యాల పెంపుపై ప్రభావం గురించి గ్రేట్ లెర్నింగ్ సంస్థ తన నివేదికలో వివరాలు వెల్లడించింది. సర్వే అంశాలు.. ► మన దేశంలో 85 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాలు సంపాదించడం ద్వారా తమ కెరీర్లో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే 76 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► ఆగ్నేయాసియా దేశాల నుంచి 84 శాతం మంది, ల్యాటిన్ అమెరికా నుంచి 76 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ► అభివృద్ధి చెందిన అమెరికాలో తమ కెరీర్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సముపార్జించుకుంటామని కేవలం 64 శాతం మంది చెప్పగా, మధ్య ప్రాచ్యం నుంచి 66 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► 2023లోనే తాము నైపుణ్యాలను పెంచుకుంటామని 83 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 74 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ► 71 శాతం మంది భారతీయ నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకుంటామని చెప్పగా, అంతర్జాతీయంగా 59 శాతం మంది ఈ విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ► మన దేశంలో 71 శాతం మంది నిపుణులు ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగా ఉన్నారు. ► అమెరికాలో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగ భద్రతను ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలో ఇది 60 శాతంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధం మెజారిటీ ఉద్యోగుల మనోగతం పియర్సన్ స్కిల్ అవుట్లుక్ సర్వేలో వెల్లడి తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు తాము కెరీర్ అంతటా నేర్చుకునేందుకు, శిక్షణ తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా మని 88% మంది ఉద్యోగులు తెలిపారు. కొత్త భాషను, ముఖ్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల తమ కెరీర్లో పురోగతికి తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. పియర్సన్ స్కిల్ అవుట్లుక్ సర్వే లో ఈ విషయాలు తెలిశాయి. అమెరికా, బ్రిటన్, భారత్, బ్రెజిల్లో 4,000 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా సర్వే వివరాలు విడుదలయ్యాయి. ► ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ► కంపెనీలు తమకు నైపుణ్య శిక్షణను ఆఫర్ చేస్తాయని 75 శాతం మంది చెప్పారు. ► మన దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా ప్రాసెసింగ్, కోడింగ్ భవిష్యత్తు ప్రాధాన్య నైపుణ్యాలుగా ఉన్నాయి. ► భవిష్యత్ మానవ నైపుణ్యాలుగా భాషను జెనరేషన్ జెడ్ గ్రూపులోని వారు (1990– 2010 మధ్య జన్మించిన) చూస్తున్నారు. ► జెనరేషన్ ఎక్స్లోని వారు తమ కెరీర్ వృద్ధి పట్ల సానుకూల దృక్పథంతోఉన్నారు. ► గత మూడేళ్లలో ఎదురైన అనిశ్చితుల నేపథ్యంలో తమ కెరీర్పై పునరాలోచన చేస్తున్నట్టు 88 శాతం జెనరేషన్ జెడ్ వారు చెప్పారు. -
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన!
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. అందుకనుగుణంగా ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది (2023–24) నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసే వీలుంది. ఈ క్రమంలో ఈనెల 28న వంద కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఇంజనీరింగ్తో సమానంగా డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, ఆనర్స్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రవేశపెట్టే నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని, చదువుతూనే ఉపాధి పొందవచ్చని మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలనూ తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారుచేస్తోందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. చదవండి: 3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏమిటీ కోర్సులు? కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా పథకంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ కొన్నేళ్లుగా సరికొత్త కోర్సులపై అధ్యయనం చేసి.. 14 నైపుణ్య కోర్సులకు రూపకల్పన చేసింది. వీటిలో రిటైల్ మేనేజ్మెంట్, క్రియేటివ్ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి. స్కిల్ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫస్టియర్ నుంచే స్కిల్ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి వీటిని అమలు చేయడం మరో విధానంగా తీసుకురానున్నారు. చదివే సమయంలోనే స్టైపెండ్ డిగ్రీ చదివే సమయంలో స్కిల్ కోర్సులను ప్రాక్టికల్గా నేర్పుతారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆయా సంస్థల్లో వారానికి మూడు రోజులు విద్యార్థి ప్రాక్టికల్గా శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రూ.10 వేల వరకూ నెలకు ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్లో ఆప్..! -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్కు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్కు చుక్కెదురైంది. భాస్కర్, ఆయన భార్య అపర్ణ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. రెండు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు పిటిషన్ను కోర్టు కొట్టివేయడం సంతోషకరమన్నారు. ‘‘గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో స్కీములు ఎక్కువగా నడిచాయి. ప్రజాధనాన్ని దోచుకున్న వారు చట్టం నుండి తప్పించుకోలేరు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. భాస్కర్, అతని భార్య అరుణ ఉపాధ్యాయ తప్పిదాల్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని భావిస్తున్నాను. ఈ కేసును ఈడీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది’’ అని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
‘లోతుగా విచారిస్తే బాబుల స్కాం బయటపడుతుంది’
తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కాం టీడీపీ హయాంలోనే జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు నైపుణ్యతకు స్కిల్ స్కాం ఓ ఉదాహరణ అని అమర్నాథ్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమల ఏర్పాటు వల్ల అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవసరం పెరిగిందన్నారు. ఒక ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఎందుకు కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని, యూరో లాటరీల మాదిరిఆ టీడీపీ హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కాం జరిగిందన్నారు. సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానం ఇచ్చారన్నారు. డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్ఫర్ జరిగిందన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రిన్పిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారన్నారు. అప్పటి ఏలేరు స్కాంలో చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసని, స్టాంప్ల కుంభకోణంలోనూ చంద్రబాబు హస్తం బయటపడిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం దేశంలోనే అతి పెద్ద స్కాం అని, స్కిల్ స్కాంలో చంద్రబాబు, లోకేష్ అరెస్టు కావాల్సి ఉందన్నారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే బాబుల స్కాం బయటపడుతుందన్నారు. బాబుకి అవినీతిలో నోబుల్, మోసం చేయడంలో ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ బాబే
బటన్ నొక్కితే... నేను బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు బటన్ నొక్కగానే ప్రభుత్వ ఖాతా నుంచి అటూ ఇటు తిరిగి ఆయన ఖాతాలోకి డబ్బులు వచ్చాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? స్కిల్ స్కామ్లో నిధుల విడుదలపై కొందరు ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేసినా వెంటనే డబ్బులివ్వాలని అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశిస్తూ చంద్రబాబు నోట్ ఫైల్లో పేర్కొన్నారు. ఇంకో నోట్ ఫైల్లో సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి నిధులు నేరుగా విడుదల చేశామని చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ రాశారు. ఈ స్కామ్లో ఇన్ని సాక్షాధారాలను నేను చూపిస్తున్నా. ఈ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అనడానికి ఇంతకన్నా ఏం కావాలి...? – శాసనసభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు చేసిన స్కామ్ ఇది. ఉద్యోగులు, విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద స్కామ్కు పాల్పడింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ దొంగల ముఠాగా ఏర్పడి లోపాయికారీ ఒప్పందంతో రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కాజేశారని ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ స్కామ్పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎందుకు నోరు మెదపలేదు..? దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ సంస్థ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సృష్టించింది. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకుంది. చంద్రబాబు అవినీతి స్కిల్ ఇదీ’ అని మండిపడ్డారు. “కనీసం డీపీఆర్ లేదు. రూల్స్ బేఖాతర్.. ప్రొసీజర్స్ బేఖాతర్.. పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ బేఖాతర్. చంద్రబాబు చెప్పిందే వేదం’ అని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై శాసనసభలో సోమవారం చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఈ స్కామ్ జరిగిన తీరును వివరిస్తూ జీవోలు, ఎంవోయూలను సభలో స్లైడ్స్ ద్వారా ప్రదర్శిస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలు ఇవీ.. “షెల్’ డబ్బులు బాబు ఇంటికి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్గా తీసుకుని ఆ పది కూడా దోచుకున్న మాదిరిగా ఈ వ్యవహారం ఉంది. అమెరికా, యూరప్లో లాటరీ తగిలింది.. 10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్గా రూ.10 లక్షలు కట్టండి.. ఆ తరువాత 10 వేల మిలియన్ డాలర్లు వస్తాయని చెబుతుంటారు. అదే మాదిరిగా సీమెన్స్ పేరుతో స్కామ్ జరిగింది. ఇలాంటి గొప్ప స్కామ్ను నడిపిన వ్యక్తి నారా చంద్రబాబే. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని మాయం చేశారు. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్లీ చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్కు తరలించారు. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. న్యాయ పరిభాషలో పార్టనర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీజర్స్ లాంటిదీ ఈ స్కామ్. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం కేబినెట్లో ఒకటి చెప్పి ఆ ప్రకారం జీవో జారీ చేశారు. వాటికి విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత మరో ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేశారు. ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్ స్కామ్ను ఉదాహరణగా చెప్పవచ్చు. విదేశాల్లో షెల్ కంపెనీలకు ఈ స్కామ్ పాకింది. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చింది. ఈ స్కామ్పై జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఈడీ, సీఐడీ.. అన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. ముందుగానే ఊహించి.. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి..? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి..? చట్టానికి దొరక్కుండా ఏ ఫైల్స్ను ముందుగానే మాయం చేయాలి..? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి..? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి..? ఇవన్నీ ముందుగానే ఊహించుకుని రూపకల్పన చేశారు. ఒక క్రిమినల్ మాత్రమే ఇలా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ ఆయన. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ స్కిల్ స్కామ్ ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సిన మనుషులను చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? సీమెన్స్ కంపెనీలో ఓ ఉన్నతోద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడి ద్వారా దోపిడీకి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం, సీమెన్స్ కంపెనీ 90 శాతం భరిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా..? పోనీ చంద్రబాబు ముఖాన్ని చూసి ఇస్తారా...? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు...? ప్రభుత్వం వాటా ఎంత? మిగిలిన వారి వాటా ఎంత..? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది..? మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు..? ప్రతి స్ధాయిలో ఖర్చు ఎంత ఉంటుంది..? ఏ రకంగా నిధులు వస్తాయి..? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది..? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది..? ఇలా అన్ని కోణాల్లోనూ ఆధ్యయనం చేసి అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులోకి తేవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్ను సర్టిఫైడ్ చేయాలి. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ముందస్తుగానే ఆ కంపెనీలో లాలూచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు రూపొందించిన డీపీఆర్ను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక నోట్ పెట్టించారు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. చంద్రబాబుకు మాత్రమే ఇటువంటిది సాధ్యం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. గత ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి, ఆపై స్ధాయిలో చూసీ చూడనట్లు వదిలేశారు. ఏకంగా స్పెషల్ ఐటెమ్గా కేబినెట్లోకి ఈ నోట్ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం, వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అధ్యయనం చేయని, ఎవరో ఇచ్చిన డీపీఆర్ను ఇలా కేబినెట్కు నోట్ పెట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిపించారు. ఎల్లో మీడియా రాయదు.. దత్తపుత్రుడు ప్రశ్నించడు ఈ స్కామ్.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వింది కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది బయటకు పొక్కింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తుంటే వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ).. ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు, ఎవరూ రాయరు, ఎవరూ చూపరు, ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. గ్రాంట్ అనే పదమే లేకుండా ఒప్పందం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అని, 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90 శాతం ఖర్చును సీమెన్స్, డిజైన్టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10 శాతం అంటే ఒక్కో సెంటర్కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో పది శాతం, పన్నులతో కలిపి రూ.371 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మిగిలిన రూ.3 వేల కోట్లను సీమెన్స్ సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఉదారంగా ఇస్తుందంటూ కేబినెట్లో చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చిందంటే ఆ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆ పదమే ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం వాటా కాస్తా రూ.330 కోట్లు ఫైనాన్సియల్ అసిస్టెన్స్గా మారిపోయింది. కుంభకోణానికి ఇక్కడే బీజం పడింది. ఒప్పంద పత్రంలో వివరాలు నింపాల్సిన చోట ఖాళీగా విడిచిపెట్టారు. ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? సీమెన్స్ నుంచి పైసా రాలేదు గత ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేసినప్పుడు సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. అసలు ఆ ప్రాజెక్టు గురించే ఆ కంపెనీకి తెలియదు. గత ప్రభుత్వం ఐదు దఫాల్లో రూ.371 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరిన వెంటనే దఫాల వారీగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. నోట్ ఫైల్స్ మాయం.. క్లీనింగ్ ఆపరేషన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక విజిల్ బ్లోయర్ టీడీపీ హయాంలోనే 2018లో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణ మొదలు పెట్టినా ఆ తరువాత అందిన ఆదేశాలతో ఆ ఫైలును పక్కనపెట్టేసింది. ఏసీబీ దర్యాప్తు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఏసీబీ ముఖ్యమంత్రికి రిపోర్టు చేస్తుంది. ఈ వ్యవహారం గురించి బయటకు పొక్కడంతో ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్ను మాయం చేశారు. క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా బోగస్ ఇన్వాయిస్లతో “సెన్ వ్యాట్’ కోసం క్లెయిమ్ చేశాయి. కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. 2017లోనే ఇది బయటపడింది. వాళ్లు బయటపెట్టినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే సాక్షాత్తూ చంద్రబాబే ఈస్కామ్లో అడుగులు వేయించారు కాబట్టి! ఆధారాలతో రుజువైనా ఎల్లో మీడియా గగ్గోలు ఈ స్కామ్పై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్ష సాధింపంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ బాధ వర్ణనాతీతం. ఇన్ని ఆధారాలతో రుజువై అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అంటున్నాయి. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నలుగురిని అరెస్టు చేసింది. సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్ను అరెస్టు చేసి పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. దొరికిపోవడంతో.. ఇంత దారుణంగా స్కామ్ చేసి దొరికిపోయారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తట్టుకోలేక ఉక్రోషంతో బాధపడుతున్నాయి. ఇన్ని దారుణాలు చేసిన ఈ గజదొంగల ముఠా చట్టం నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీఇన్నీ కావు. నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. వీళ్లను మళ్లీ ఏ రోజూ రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. సభ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు.. ఈ విషయంపై చర్చ జరుగుతుంటే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దగ్గర మీడియా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు. ఒక అబద్ధాన్ని నిజం చేయగలరు. అంతటి స్కిల్డ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. ఈ సభ ద్వారా వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలనే సాక్ష్యాలు, ఆధారాలను చూపిస్తున్నాం. అలాంటి స్కీమ్లే లేవన్న సీమెన్స్ మన అధికారులే కాకుండా ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించింది. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఎంఓయూలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ కోర్టుకు చెప్పింది. ఇది సీమెన్స్ అంతర్గతంగా విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ మేనేజ్మెంట్నుగానీ లీగల్ టీమ్నుగానీ సంప్రదించలేదని కూడా కోర్టుకు వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఆర్థిక సహాయంతో కూడిన కార్యక్రమాలను సీమెన్స్ ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు అలాంటి స్కీమ్లు ఏవీ తమ సంస్థలో లేవని కూడా స్పష్టం చేసింది. వారి అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అందజేశారు కూడా. అంటే రూ.371 కోట్లు తమకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి చేరాయి? అటు తిరిగి ఇటు తిరిగి షెల్ కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్కి తెప్పించుకున్నారు. రూ.371 కోట్లను చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు. ఆనేక షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బు చేతులు మారి మనీల్యాండరింగ్తో వీళ్ల చేతుల్లోకి వచ్చింది. -
‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్డే’
అమరావతి: గత కొన్ని రోజులుగా శాసనసభలో టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం, వాకౌట్ చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఏడు రోజులుగా డోలా వీరాంజనేయస్వామి పదేపదే స్పీకర్ను దుర్భాషలాడుతున్నారని, ఈరోజు స్పీకర్పై దాడికి దిగారన్నారు. ఈ రోజు శాసనసభ చరిత్రలో బ్లాక్ డే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో కూర్చొని దశ, దిశ చేస్తుంటాడని, సభకు రాడని మండిపడ్డారు మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం.. వాకౌట్ చేయడం ఇదే వారి పని. ఏడు రోజులుగా స్పీకర్ను దుర్భాషలాడుతున్నారు. ఈరోజు స్పీకర్ పై దాడికి దిగారు వెల్ లోకి వెళ్లడమే నేరం..పైగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. హద్దులు దాటి సభాపతి పై దాడి చేశారు. భర్తను కొట్టినమ్మ బావురుమన్నట్లుంది టీడీపీ తీరు. మాపై వారే దాడి చేసి...నింద మాపై వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చర్చ జరగకూడదనే పథకం ప్రకారం ఈరోజు గొడవ చేశారు’ అని మంత్రి తెలిపారు. -
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై సీఎం జగన్ ట్వీట్
తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై అసెంబ్లీలో ఈరోజు(సోమవారం)వాడి వేడి చర్చ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను చంద్రబాబు అండ్ కో ఎంత చాకచక్యంగా చేశారో అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్కామ్పై అసెంబ్లీలో ప్రస్తావించిన కొన్ని అంశాలను సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అర్హులైన వారికి నేరుగా నగదు జమ చేసే డీబీటీని ఈ ప్రభుత్వం చేస్తుంటే..గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో... అనే డీపీటీ కార్యక్రమం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ. 371 కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగింది. దోపిడీచేసిన వారు చట్టం నుంచి, ప్రజలనుంచి తప్పించుకోలేరు’ అని ట్వీట్ చేశారు. కాగా, స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని అసెంబ్లీలో గత చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు సీఎం జగన్. ‘రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది’ అని సీఎం జగన్ స్పష్ఠం చేశారు. అర్హులైన వారికి నేరుగా నగదు జమచేసే డీబీటీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంటే, గత ప్రభుత్వం దోచుకో, పంచుకో, తినుకో…డీపీటీ కార్యక్రమం చేసింది. స్కిల్డెవలప్మెంట్ పేరుతో రూ. 371 కోట్ల ప్రజాధనం దోపిడీ జరిగింది. దోపిడీచేసిన వారు చట్టం నుంచి, ప్రజలనుంచి తప్పించుకోలేరు. pic.twitter.com/mdZHpbmOIR — YS Jagan Mohan Reddy (@ysjagan) March 20, 2023 చదవండి: దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది: సీఎం జగన్ -
‘స్కిల్’ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, ఆయన ఆదేశాల మేరకే డీపీఆర్, టెండర్లు లేకుండా నిధుల దోపిడీ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. గుజరాత్ మోడల్ అంటూ అబద్ధాలు వల్లించి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులను శిక్షించి తీరుతామన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంశంపై బుగ్గన మాట్లాడారు. “ఏపీఎస్ఎస్డీసీకి ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావు ఎండీగా నియమించడంతోపాటు సీమెన్స్ కంపెనీ పేరిట వాటా నిధులు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు విడుదల చేయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఇంత పెద్ద ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ఎంఓయూ, లైసెన్స్ ఒప్పంద పత్రంలో సీమెన్స్ కంపెనీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్బోస్గా పేర్కొన్నారు. సంతకాలు చేసేటప్పుడు మాత్రం ఎండీ పేరును సుమన్బోస్గా చూపారు. ఈ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్లతో మోసాలకు పాల్పడ్డారని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి కూడా నివేదించింది. ఈ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. జీఎస్టీ విభాగంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ కూడా కుంభకోణంపై దృష్టి సారించాయి’ అని బుగ్గన పేర్కొన్నారు. గత సర్కారు నైపుణ్యాభివృద్ధి ముసుగులో స్కామ్లకు పాల్పడగా తమ ప్రభుత్వం యువత భవిష్యత్ కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని బుగ్గన తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా 192 స్కిల్ హబ్లను నెలకొల్పాం. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలతో అనుసంధానం, డిజిటల్ క్లాస్రూమ్లు, వైఫై, సీసీటీవీలు, బయోమెట్రిక్ హాజరు సదుపాయాలతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. ఇప్పటికే 21 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల ఏర్పాటు చేపట్టాం. సంవత్సరానికి 50 వేల మందికి పైగా యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అని బుగ్గన వెల్లడించారు. 90 శాతం గ్రాంట్ ఎందుకిస్తుంది?: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రాన్ని, ఖజానాను కొల్లగొట్టారో తెలుసుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ స్కాంను పరిశీలిస్తే చాలు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే స్కిల్ డెవలప్మెంట్ ప్రతిపాదన తెచ్చారు. టేబుల్ అజెండాగా కేబినెట్లో ప్రవేశపెట్టి రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. సిమెన్స్ కంపెనీ కాకుండా ఇతరులు డీపీఆర్ ఇచ్చారు. ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు? ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడుతుందా? అసలు 90 శాతం గ్రాంట్ను ఓ ప్రైవేటు కంపెనీ ఎందుకిస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో రూ.వందల కోట్ల దుర్వినియోగంపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ నిలదీసినా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయలేదు. రెండు టోకెన్లు హైదరాబాద్ వెళ్లాయనే కోడ్ భాషను చేధించాలని కోరుతున్నా. ముందే హెచ్చరించినా బేఖాతర్: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్లే. యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామంటూ ప్రజాధనం దోచేశారు. నిరుద్యోగ భృతి రూ.వెయ్యి ఇస్తామని యువతను మోసగించారు. గంటా సుబ్బారావుకు నాలుగు పోస్టులిచ్చారు. బాత్రూమ్ సైజు కార్యాలయంలో 34 షెల్ కంపెనీల ద్వారా రూ.371.25 కోట్లు కాజేశారు. డబ్బులు ఎలా విడుదల చేయాలి? ఎలా ఖర్చు చేయాలనే వివరాలు ఎంవోయూలో లేవు. ఆర్ధిక శాఖ కొర్రీలను కూడా పట్టించుకోలేదు. ఏసీబీ, సీమెన్స్ అంతర్గత సర్వే, జీఎస్టీ అధికారులు నాలుగుసార్లు హెచ్చరించినా చంద్రబాబు లెక్క చేయలేదు. దేశంలో చంద్రబాబు తెచ్చుకున్నన్ని స్టేలు ఇంకెవరూ పొందలేదు. చిత్తశుద్ధి ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నిందితులు స్టే తెచ్చుకోకుండా విచారణకు సిద్ధపడాలి. -
‘తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది’
సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఈ స్కామ్లో ఉండబట్టే దర్యాప్తు చేయలేదు. తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సీమెన్స్ పేరుతో చంద్రబాబు దోపిడీపై అసెంబ్లీలో చర్చించాం. రేపు కూడా స్కిల్ డెవలప్మెంట్ దోపిడీపైనే చర్చిస్తాం. తిమ్మిని బమ్మిని చేయాలని ఈనాడు ప్రయత్నించింది. 2004లో వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆరోజు ఎంత క్షోభ అనుభవించానో నాకు తెలుసు. ఆరోజు మేమే సీబీఐ విచారణ కోరాం. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో 330 కోట్ల దోపిడీ జరిగితే ఎందుకు కేంద్ర సంస్థల దర్యాప్తు కోరలేదు. ఈ కుంభకోణాన్ని జీఎస్టీ, ఈడీ సంస్థలు గుర్తించినా ఎందుకు స్పందించలేదు. చంద్రబాబు ఈ స్కామ్లో ఉండబట్టే ఆయన దర్యాప్తు చేయించలేదు. ఒకటి, రెండు గెలుపోటములు వస్తుంటాయి. ఇందులో ఏం జరిగిందో విశ్లేషించుకుంటాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిది: సజ్జల -
మనీలాండరింగ్ ద్వారా ‘స్కిల్’ కుంభకోణం: ఈడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణంలో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించింది. అందులో రూ.70 కోట్లు ఎక్కడికి చేరాయో గుర్తించినట్టు తెలిపింది. మిగిలిన మొత్తం ఎక్కడికి చేరిందన్న దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొంది. మనీలాండరింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను కోర్టు ఆదేశాలతో విచారణ కోసం ఏడురోజుల కస్టడీకి తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్ -
ఈడీ కస్టడీకి స్కిల్డెవలప్మెంట్ కేసు నిందితులు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ స్కిల్డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన నలుగురు నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి సోమవారం అనుమతించింది కోర్టు. విచారణ కోసం 15 రోజుల కస్టడీ కోరింది ఈడీ. అయితే.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశించారు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని నిర్దేశించింది కోర్టు. దీంతో రేపటి నుంచే అరెస్ట్ అయిన నలుగురిని ఈడీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ‘స్కిల్’ గోల్మాల్ మీ ప్రభుత్వ హయాంలోదే.. వినబడుతోందా? -
‘స్కిల్’ గోల్మాల్ మీ ప్రభుత్వ హయాంలోదే.. కేశవ్ వినబడుతోందా?
ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను పసికట్టడానికిగాని, వాటిపై కేసులు పెట్టడానికి గాని చాలా కష్టపడవలసి వస్తోంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం లోని కొందరు ఆ స్కామ్ లను చేయడం లో అంత స్కిల్ ప్రదర్శించినట్లుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందినవారిపై ఏదైనా ఆరోపణ వస్తే భూతద్దంలో చూపించే టీడీపీ మద్దతు మీడియా ఈ స్కామ్ల విషయంలో నోరు ఎత్తడం లేదు. ఎలాంటి సొంత పరిశోధనలు చేయడం లేదు. పైగా స్కామ్ ఆరోపణల ఉన్నవారికి మద్దతుగా ప్రముఖంగా వార్తలు ఇస్తున్నాయి. దీనిని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ సంగతి పక్కనపెడితే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ స్కామ్ పై ఇచ్చిన వివరణలో కొన్ని ఆసక్తికర పాయింట్లు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు సీఐడీ ఎలాంటి జవాబు ఇస్తుందన్నది చూడాల్సి ఉంది. అదే టైమ్లో సీఐడీ తన పరిశోధనలో కనిపెట్టిన వాటిపైన, అసలు తొలుత ఈ స్కామ్ను గుర్తించిన జీఎస్టీ అధికారుల సందేహాలపైన కేశవ్ సమాధానాలు చెప్పి ఉంటే టీడీపీకి ఈ కేసుతో అంత సంబందం లేదేమోలే అనుకునే పరిస్థితి ఏర్పడేది. కాని కేశవ్ వాటి జోలికి వెళ్లకుండా , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేశారు. అదే టైమ్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించి ఆయన జోలికి సీఐడీ ఎందుకు వెళ్లడం లేదని అడుగుతున్నారు. మళ్లీ ఆ వెంటనే కేశవే ఆ అధికారి చేసిన తప్పేమీ లేదని సర్టిపై చేస్తున్నారు.ఈ స్కామ్ లో ఒకరిద్దరు కేశవ్కు బాగా తెలిసినవారు ఉంటే ఉండవచ్చు. ఆయన వారి పాత్ర గురించి ప్రస్తావించినట్లు కదనాలలో రాలేదు. దానికి కారణం తెలియదు. నైపుణ్యాభివృద్ది సంస్థ ( స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) నిధులు సుమారు 335 కోట్లు పక్కదారి పట్టాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. స్కిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్న సీమెన్స్ సంస్థ 3300 కోట్ల వ్యయం చేయాల్సిఉన్నా, ఆ కంపెనీ నిదులు విడుదల చేయడానికి ముందే మొత్తం 370 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలోని మతలబుపై సీఐడీ విచారణ జరుపుతోంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 370 కోట్ల రూపాయలు. అయితే దానిని అమాంతంగా 3300కి ఎలా మార్చేశారన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఈ స్కామ్ లో సీమెన్ కంపెనీ వారు తమకు తెలియకుండానే షెల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వ నిధులు తరలివెళ్లాయని కనిపెట్టారని సమాచారం వచ్చింది. జీఎస్టీ అదికారులు తమ విధులలో భాగంగా పరిశీలిస్తున్నప్పుడు ఈ షెల్ కంపెనీల విషయం బయటపడిందని అదికారవర్గాలు చెబుతున్నాయి. ఈ షెల్ సంస్థల ద్వారానే నిధులను సింగపూర్కు మళ్లించారన్న ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణలపై కేశవ్ ఒక్క మాట కూడా చెప్పలేదు. టీడీపీకి ఏమి సంబంధం అంటున్నారే కాని, ప్రభుత్వంలో జరిగిన గోల్ మాల్ పై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. జీఎస్టీ వారు ఈ కేసును వెలుగులోకి తీసింది వాస్తవమా?కాదా? సీమెన్స్ కంపెనీ ఈ లావాదేవీలను డిజ్ ఓన్ చేసుకున్నది నిజమా?అబద్దమా? ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్టు అయ్యారు. అయితే కేశవ్ అడిగిన ప్రశ్న ఒకదానికి సీఐడీ సమాధానం చెప్పగలగాలి. స్కిల్గా కాజేశారంటున్న ఈ డబ్బు టీడీపీ పెద్దల ఖాతాలలోకి ఎలా వెళ్లిందన్నది తెలియచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. ఇంత కుంభకోణం జరిగితే మరో అధికారి అర్జా శ్రీకాంత్ అసలేమీ జరగలేదని నివేదిక ఇవ్వడంలోని ఆంతర్యాన్ని సీఐడీ ప్రశ్నించిన మాట నిజమే. దానికి ఆయన ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది కదా! అందులో తప్పేముంటుంది. దానిపై కేశవ్ చేసిన ఆరోపణ అంత సమంజసంగా లేదని చెప్పాలి. బలవంతంగా శ్రీకాంత్తో మాట్లాడిస్తారని ఆయన అనుమానిస్తున్నారు. ఈ మాత్రానికే శ్రీకాంత్ సీఐడీ చెప్పే దానితో ఏకీభవిస్తారా? తదుపరి కోర్టులో భిన్నంగా మాట్లాడరా? శ్రీకాంత్ టీడీపీ అదినేత చంద్రబాబు ప్రభావానికి గురై తప్పుడు నివేదిక ఇచ్చారని ఎందుకు అనుకోరాదో కేశవ్ చెప్పాలి. మరో సంగతి చెప్పాలి. తాను బీజేపీ అద్యక్షుడుగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిత్యం అవినీతి ఆరో్పణలు చేస్తూ వంద రోజులుపైగా ప్రశ్నల పరంపర కొనసాగించారు. అలాంటి ఆయన ఇప్పుడు చంద్రబాబుకు పక్కన నిలబడి టీడీపీలో చేరారు. ఆయనతోనే అర్జా శ్రీకాంత్ కు అనుకూలంగా మాట్లాడించడంలో వ్యూహం అర్దం చేసుకోలేనిది కాదు కదా! గుజరాత్తో సహా ఆరు రాష్ట్రాలలో సీమెన్స్ ఒప్పందం చేసుకుంటే,ఆ రాష్ట్రాలలో ఎందుకు ఆరోపణలు రాలేదు? ఇక్కడే ఎందుకు వచ్చాయి?అన్నదానిని కేశవ్ ఆలోచించకుండా ఉంటారా? నిజంగానే వైసీపీ ప్రభుత్వం కావాలని కేసులు పెడుతోందన్నది రొటీన్ డైలాగ్ తప్ప మరొకటి కాదు. టీడీపీవారికి ఆయా వ్యవస్థలలో ఉన్న పట్టు ద్వారా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలుగుతారేమో అన్న డౌట్ కూడా లేకపోలేదు. సీఐడీ ఇంత పక్కాగా బోలెడంత వర్క్ చేసి ఆధారాలు బయటపెట్టే యత్నం చేస్తోంది. అయినా కేసు నిలబడకపోతే అది వ్యవస్థలోని తప్పు అవుతుందా? లేక నిజంగానే సీఐడీ దర్యాప్తు లోపమా? అన్నది ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పటికైతే స్కిల్ స్కామ్ కేసు చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కేసు టీడీపీలోని అత్యంత పెద్దలకు తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏది ఏమైనా స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ కొందరి స్కామ్ కు బలికావడం బాధాకరమే. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్