sisodia
-
జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు
ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకుగాను మధుర రోడ్లోని తన నివాసానికి వెళ్లారు. భార్యను చూసేందుకు కోర్టు సిసోడియాకు 6 గంటల పాటు ప్రత్యేక అనుమతిచ్చింది. అయితే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయరాదని షరతు విధించింది. సిసోడియా భార్య మల్టీపుల్ స్క్లిరోసిస్తో బాధపడుతున్నారు. జూన్లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతితో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా భార్యను చూడకుండానే జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు రిజెక్ట్ చేశాయి. -
సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికమని, బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నాక ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని ఆరోపించారు, అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీల నాయకులను ఎదుర్కోలేక బీజేపీ పిరికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్ష నేతలను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు కుటిల ప్రయత్నాలను చేస్తోందని ఎద్దేవా చేశారు. నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని, బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
సీబీఐ దాడుల వేళ కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్లో పాల్గొనాలని ‘మిస్డ్ కాల్’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘భారత్ను నంబర్ వన్ చేసేందుకు మా నేషనల్ మిషన్లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్కాల్ ఇచ్చి భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్లోనూ ప్రజలకు సూచించారు. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్ గహ్లోట్, సత్యేందర్ జైన్లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. भारत को दुनिया का नम्बर वन देश बनाने के लिए साथ आयें। इस मिशन से जुड़ने के लिए 9510001000 पर मिस कॉल करें। हमें देश के 130 करोड़ लोगों को जोड़ना है। — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్ -
ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్పి సిసోడియా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సిసోడియాను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. -
Shivani Sisodia: ఈ శివానీ శివంగి!
సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవారు కొందరైతే.. సమస్య మూలాలను కనుక్కొని దానిని కూకటివేళ్లతో సహా పెకలించేసేవారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే 18 ఏళ్ల శివానీ సిసోడియా. రాజస్థాన్కు చెందిన శివానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన తన ఆలోచనా విధానాన్ని మార్చడంతో సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకుని, వందలమంది అమ్మాయిలకు శిక్షణనిస్తూ ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. దీని వెనకాల ఒక కథ ఉంది. శివానీ పదోతరగతిలో ఉన్నప్పుడు.. ఒకరోజు స్కూలు అయిపోయిన తరువాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయం లో అటుగా వెళ్తున్న కొందరు పోకిరీలు శివానీ వాళ్లను అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కాలేదు. దాంతో వారినుంచి ఎలాగో తప్పించుకుని అక్కడినుంచి పారిపోయారు. మరుసటిరోజు స్కూలుకు వెళ్లిన శివానీ ముందురోజు జరిగిన విషయాన్ని తన స్నేహితులతో పంచుకోగా... వాళ్లు తాము కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పడంతో శివానీకి ఆశ్చర్యమేసింది. ‘ఎందుకు మీరు వాళ్లను ఎదుర్కోలేదు’ అని స్నేహితులను ప్రశ్నించింది. అప్పుడు వాళ్లు ‘ఏమో ఆ సమయంలో ఏం చేయాలో తట్టలేదు, వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు’ అని చెప్పారు. అప్పుడే నిర్ణయించుకుంది శివానీ... నేను మాత్రం ఇంకోసారి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అస్సలు భయపడకూడదు అని. ఇందుకోసం ఆమె తన మనసును, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు, స్కూలు టీచర్, యోగా టీచర్ల సాయంతో ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. తరువాత రాజస్థాన్లోని భరత్పూర్లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్లో చేరింది. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రద్ధతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. తనలా అమ్మాయిలందర్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో శివానీ తన కోచ్ ఓంకార్తో కలిసి ఆడపిల్లల కోసం ఆత్మరక్షణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా రెండేళ్లలో.. స్కూళ్లు, కాలేజీకెళ్లే 1500 మందికి పైగా విద్యార్థినులకు శివానీ శిక్షణ నిచ్చింది. ‘‘మా కరాటే స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిలందరిలోకి, శివానీ చాలా చురుకైనది. ఆత్మరక్షణ మెళకువలను సులువుగా నేర్చుకుంది. జాతీయస్థాయి కుస్తీపోటీలలో రజత పతకం కూడా గెలుచుకుంది. శివానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే పద్ధతి చాలా విలక్షణంగా ఉంటుంది’’ అని శివానీ ట్రైనర్ ఓంకార్ పంచోలి చెప్పారు. శివానీ మాట్లాడుతూ..‘‘నాకు అద్భుతమైన ట్రైనర్ దొరకడంతో ఆత్మరక్షణ విద్యలను ఎంతో బాగా నేర్చుకున్నాను. నేటి తరం అమ్మాయిలకు తమని తాము కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే నేను నేర్చుకోవడమేగాక ఎంతోమందికి నేర్పిస్తున్నాను. ఎవరైనా ఆకతాయులు దాడిచేసినప్పుడు వారి నుంచి తప్పించుకోవడమేగాక వారిపై ఎదురు దాడికి ఎలా దిగాలో నేర్పిస్తుండడం వల్ల వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్ గా తమ ఇళ్లకు ఒంటరిగా వెళ్లగలుగుతున్నారు’’ అని చెప్పింది. శివానీకి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వాళ్లలో ఒకరు జూడో ఛాంపియన్, మరొకరు తైక్వాండోలో బ్లాక్బెల్ట్ హోల్డర్. -
బ్రేకింగ్: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా బదిలీ
సాక్షి, అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పువు అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేది నియమితులైన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో ఓటర్లు 3.69 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రత్యేక సవరణ(ఎస్ఎస్ఆర్)–2019 అనంతరం తుది ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. దీనిప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తుది ఓటర్ల జాబితాలో 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో 2,520 మంది ప్రవాసాంధ్ర(ఎన్ఆర్ఐ) ఓటర్లు కూడా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినందున ఎస్ఎస్ఆర్–2019 తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓటర్ల జాబితాలో ప్రజలు తమ పేరు ఉందో లేదో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఎవరి పేర్లయినా లేకపోతే నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా సూచించారు. ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్ (నేరుగా) గానీ ఫారం–6 సమర్పించవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకూ అర్హులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. - ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,74,58,240 మంది పురుషులు, 1,77,33,676 మంది మహిళలు, 3,344 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,51,95260 మంది ఓటర్లు ఉండగా ఎస్ఎస్ఆర్–2019 తుది జాబితాకు వచ్చేసరికి 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి పెరిగింది. - ప్రవాసాంధ్ర ఓటర్ల సంఖ్య ముసాయిదా ఓటర్ల జాబితాలో 15 మాత్రమే ఉండగా, తుది జాబితాకు వచ్చే సరికి 2,520కి చేరింది. - తుది ఓటర్ల జాబితాలో 18–19 మధ్య వయస్కులు 5,39,804 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,11,059 మంది, మహిళలు 2,28,625 మంది, ట్రాన్స్జెండర్లు 120 మంది ఉన్నారు. - తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు. - శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. - ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత 21,24,525 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరగా, 3,86,694 మంది పేర్లను తొలగించారు. - ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత 18–19 వయస్కులు 5,03,516 మంది ఓటర్లుగా నమోదయ్యారు. -
మే నెలలో ఎన్నికలకు అవకాశం
పార్వతీపురం: రాష్ట్రంలో మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా తెలిపారు. సోమవారం రాత్రి విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక సబ్కలెక్టర్ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు జనాన్ని చైతన్యపరచనున్నట్లు వివరించారు. -
13 జిల్లాల్లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్లు
సాక్షి, విజయవాడు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రాంప్రకాశ్ సిసోడియా గురువారం నగరంలోని బారతీనగర్లో స్టేట్ లెవెల్ కాల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు 1950 నెంబర్కు ఫోన్ కాల్ చేసి తమ ఓటు కార్డు స్టేటస్తో పాటు ఈపీఐసీ నెంబర్ను 9223166166 లేదా 51969కు ఎస్ఎంఎస్ చేసి తమ ఓటు స్టేటస్ ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని 13 జిల్లాల్లో 13 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని సిసోడియా చెప్పారు. -
బోగస్ ఓట్లపై ఇంటింటి తనిఖీలు
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున డూప్లికేట్, బోగస్ ఓటర్లున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు, అందజేసిన డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. 18 లక్షల మంది అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ ఓటర్లుగా ఉన్నట్లు డేటాతో సహా వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చారని, ఆ డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆయా చిరునామాల్లో లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని సిసోడియా స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణ, డూప్లికేట్ ఓట్లతో పాటు వివిధ ఆంశాలపై ఆయన సచివాలయంలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. 25 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారనే డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహించి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లున్నారని, కానీ.. ప్రస్తుతం 3.50 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, అంటే 2014 నుంచి ఇప్పటివరకు 20 లక్షల మంది ఓటర్లు తగ్గినట్లు తెలుస్తోందన్నారు. మృతిచెందిన వారి, వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా అప్పుడు తొలగించారన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ 3.50 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు. కొత్తగా 32లక్షల మంది దరఖాస్తు సాధారణంగా రాష్ట్ర జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లు ఉండరాదని, అలా ఉంటే బోగస్ ఓట్లు ఉన్నట్లేనని సిసోడియా తెలిపారు. అయితే, ప్రస్తుతం జనాభాలో 67.3 శాతం మంది ఓటర్లున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా సమయం ఉన్నందున ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించడం ద్వారా బోగస్, డూప్లికేట్, రాష్ట్రంలో లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించి వచ్చే ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా 32 లక్షల మంది ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 80 శాతం వరకు యువతీ, యువకులేననన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఓటరుగా నమోదు చేస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 4న ప్రకటిస్తామన్నారు. బెంగళూరుకు 1.50లక్షల ఈవీఎంలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు 1.13 లక్షల వీవీ ప్యాట్స్(ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అవసరమని, అవి ఇప్పటికే రాష్ట్రానికి రావడం ప్రారంభమైందని సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 లక్షల ఈవీఎంలున్నాయని, అవన్నీ అల్యూమినియంతో తయారై ఉన్నందున వాటిని స్టీలుతో మరింత పటిష్టపర్చనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.50 లక్షల ఈవీఎంలను బెంగళూరు పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం ముగిసినప్పటికీ అది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఓటరుగా నమోదుకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలను జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని.. దీనివల్ల ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. -
ఇక రెండేసి రాష్ట్రాల్లో ఓటు కుదరదు
సాక్షి, అమరావతి: ఇక నుంచి రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా స్పష్టం చేశారు. ఇటీవల పుణేలో, న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలను నిర్వహించిందని ఆయన సోమవారం సచివాలయంలో ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తున్నామని వెల్లడించారు. పుణేలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఓటర్లను అనుసంధానం చేసే ఈఆర్వో నెట్ను రూపొందించిందని, దీని ద్వారా ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే మరో రాష్ట్రంలో ఓటు లేకుండా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండేసి రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన ఓటర్లకు ఆంధ్రప్రదేశ్లోనే ఓటు హక్కు ఉంటుందని, తెలంగాణలో ఉండదని, అలాగే హైదరాబాద్లో ఉన్నవారికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటుందని, వారికి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు ఉండేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజకీయ కారణాలతో ఓట్లు తీసేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని, ఓటు హక్కు లేకపోతే ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు కొనసాగుతోందని, ఓటర్గా నమోదు చేసుకునేందుకు గడువును నవంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.49 కోట్ల ఓటర్లున్నారని వెల్లడించారు. ఇప్పుడు సాగుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు. -
నేటి నుంచి ఓటర్ల నమోదు
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితాను సమగ్రంగా రూపొందించడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులకు, అలాగే అర్హులై ఉన్నప్పటికీ ఓటర్లుగా నమోదు కాని వారికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల ముసాయిదా బాబితాను జిల్లా కలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేని వారు ఓటర్గా నమోదు చేయించుకోవచ్చు. ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదు ఎలాంటి తనిఖీలు లేకుండా ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదని, అలా చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలంటే అందుకు సవివరణమైన వాస్తవ కారణాలుండాలని పేర్కొంది. క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించకుండా ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తరువాతే మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని పేర్కొంది. అలాగే ఆయా కుటుంబ సభ్యులు లేదా పక్క నివాసుల నుంచి ఫాం 7 తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతిచెందినవారి పేర్లను తొలగించాలని స్పష్టం చేసింది. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇద్దరి నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని కూడా పేర్కొంది. ఎలాంటి తొలగింపులైనా తహశీల్దార్ స్థాయి అధికారే చేయాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను కూడా సేకరించాలని, పోలింగ్ రోజున వారిని పోలింగ్ కేంద్రాలను తీసుకువచ్చేందుకు కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపింది. అర్హులంతా నమోదు చేసుకోండి: సిసోడియా ఓటర్ల జాబితా పునస్సవరణ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఫారం 6 దాఖలు చేయాలని, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఫారం 6ఏను దాఖలు చేయాలని సూచించారు. -
ఓట్ల తొలగింపుపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావి వెంకటరమణ తదితరులు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని వివరించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా ఓట్లను తొలగించారని సిసోడియా దృష్టికి తీసుకువెళ్లారు. గల్లంతైన ఓట్లపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎన్నికల అధికారిని కోరారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ...‘ ఒక్క సత్తెనపల్లిలోనే 15వేల ఓట్లు గల్లంతు అయ్యాయి. గల్లంతు అయిన ఓట్లు అన్నీ వైఎస్ఆర్ సీపీ నేతలవే. నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. కొంతమంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో కుమ్మక్కు అయ్యారు. టీడీపీకి మేలు చేసేందుకే ఓట్లు తొలగించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. మా కుటుంబసభ్యుల ఓట్లు తొలగించారు. ఇక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటును మరో వార్డుకు మార్చారు. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను మాయం చేశారు. కోడెల, ఆయన తనయుడి దురాగతాల వల్లే ఓట్లను తొలగించారు. వెంటనే అక్రమాలను సరిచేయకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్–సీఈవో) రామ్ ప్రకాశ్ సిసోడియాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజుల క్రితమే ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన సిసోడియాను రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. సిసోడియా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటారు. -
లేపాక్షి ఆలయంలో సిసోడియా
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిసోడియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులు సూర్యప్రకాష్రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. చిత్రాలు, శిల్పలేఖనాలు చూసిన వారు జీవితంలో ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ ఆనందకుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
నజీబ్ జంగ్ రాజీనామా
హఠాత్తుగా ప్రకటించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ► సీఎం కేజ్రీవాల్ ఆశ్చర్యం ► వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో నలుగుతున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ గురువారం హఠాత్తుగా రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఈ రాజీనామా జరగటం ఢిల్లీతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే.. ‘కేంద్రానికి రాజీనామా సమర్పించాను. నాకు ఇష్టమైన విద్యారంగం వైపు వెళ్లాలనుకుంటున్నాను’ అని నజీబ్ జంగ్ మీడియాకు పంపిన సంక్షిప్త సందేశంలో పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రధాని మోదీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన సందర్భంగా హస్తిన ప్రజలు అందించిన తోడ్పాటు మరవలేనన్నారు. కాగా, జంగ్ రాజీనామాపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలసిపోయినందువల్లే రాజీనామా చేసినట్లు నజీబ్ తెలిపారని డిప్యూటీ సీఎం సిసోడియా అన్నారు. బీజేపీ మాత్రం ఆప్ సర్కారుపై అసంతృప్తితోనే నజీబ్ రాజీనామా చేశారని ఆరోపించింది. బుధవారం ఆయన్ను కలిసినప్పుడు కూడా ఆప్ సర్కారు వ్యవహారంతో కలత చెందినట్లు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ మాత్రం ‘ఆరెస్సెస్ వ్యక్తిని ఎల్జీగా నియమించేందుకే జంగ్ తప్పించారా?’ అని ప్రశ్నిం చింది. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆప్ ప్రభుత్వంతో వివాదాల వల్ల జంగ్ రాజీనామా చేయలేదని, దీనిపై కొన్ని నెలలుగా యోచిస్తున్నారని జంగ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండ్రోజుల క్రితం కలిసినపుడే జంగ్ రాజీనామా గురించి సంకేతాలిచ్చారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి తెలిపారు. ‘ఆప్’తో నిరంతర సంఘర్షణ 2015లో ఆప్ రెండోసారి పగ్గాలు చేపట్టినపుడు ప్రభుత్వం, ఎల్జీ మధ్య ఘర్షణ మొదలైంది. జంగ్.. ప్రధాని కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఉప రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపణలు గుప్పించింది. వీరి వివాదాలు సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. ఢిల్లీలో పాలనాధికారాలు ఎల్జీకే చెందుతాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీర్పునివ్వడంతో వివాదం తారస్థాయికి చేరింది. సాధారణంగా గవర్నర్గా నియమితులయ్యేవారు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. అయితే ఎల్జీలకు నిర్ధారిత పదవీకాలం ఉండదు. అయినా నజీబ్ జంగ్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, డిసెంబర్ 25 నుంచి వారం రోజులపాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం గోవాకు వెళ్తున్నట్లుగా జంగ్ సంతకంతో తేదీ లేకుండా ఉన్న లేఖ బయటకొచ్చింది. యూపీఏ హయాంలో పదవీ స్వీకరణ 1973లో ఐఏఎస్గా ఎంపికైన నజీబ్ జంగ్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాల్లో పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో విధులు నిర్వర్తించారు. జామియా మిలియా యూనివర్సిటీ వీసీగా పని చేస్తున్నప్పుడు 2013 జూలైలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో యూపీఏ ప్రభుత్వం జంగ్ను ఢిల్లీకి 19వ ఎల్జీగా నియమించింది. ఐదు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 49 రోజుల్లో కుప్పకూలిన తర్వాత ఏడాది పాటు నగర పాలనా వ్యవహారాలు నిర్వర్తించారు. కొత్త ఎల్జీ ఎవరు? కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరొస్తారనే అంశంపై ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ జాబితాలో కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్ పేరు మొదటి స్థానంలో ఉండగా.. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్ బేడీ, ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పేర్లు కూడా వినబడుతున్నాయి. -
'సరి-బేసి'తో పొల్యూషన్ భారీగా దిగొచ్చింది!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది. అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు. -
పోలీసులు విధుల్లో మరణిస్తే రూ.కోటి ఆర్థిక సాయం
న్యూఢిల్లీ : విధులు నిర్వర్తిస్తూ ప్రమాదాల్లో మరణించే పోలీసులు, భద్రతా సిబ్బందికి చెందిన కుటుంబీకులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధంగా మరణించే భద్రతా సిబ్బంది కుటుంబీకులకు కోటి రూపాయాలు ఆర్థిక సాయంగా అందించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి విధులు నిర్వర్తిస్తూ చనిపోయే పోలీసులు, ఇతర ఆర్మ్డ్ దళాల సిబ్బంది కుటుంబీకులకు కోటి రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తాం’ అని సిసోడియా చెప్పారు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధులను కూడా బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 5న అవినీతి వ్యతిరేక హెల్ప్లైన్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యాంటీ కరప్షన్ బ్రాంచి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. యాంటీ కరప్షన్ బ్రాంచిని బలోపేతం చేయడం కోసం కొత్త పోస్టులను సృష్టిస్తున్నామన్నారు. అంతకు ముందు ఈ విభాగంలో 30 మంది ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 40 మంది ఉన్నారని చెప్పారు. ఈడీఎంసీ సిబ్బంది వేతనాల కోసం నిధులు విడుదల! తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఈడీఎంసీ)కు చెందిన పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు తగిన నిధులను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈడీఎంసీ పారిశుధ్య కార్మికుల వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని నిర్ణయించాం. వీలైనంత త్వరలో వారు వేతనాలను అందుకుంటారు’ అని సిసోడియా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా ఈడీఎంసీకి చెందిన పారిశుధ్య కార్మికులు వేతనాల కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా రోడ్ల మీద చెత్తను కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లన్నీ దుర్గంధభరితంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి వేతనాల కోసం నిధులు విడుదల చేయడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులను కేవలం పారిశుధ్య కార్మికుల వేతనాల కోసమే ఉపయోగించాలని కోరారు. వేరే ఏ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని సూచించారు. ప్రభుత్వం దీని కోసం కేటాయించిన నిధుల వివరాల గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. -
ఢిల్లీకి హజ్ కోటా పెంచాలని డిమాండ్ చేసిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మక్కా యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ స్టేట్ హజ్ కమిటీ వెబ్సైట్ను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ హజ్ కోటాను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఢిల్లీ హజ్ కోటా 1,163 ఉండగా, 8,875 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. హజ్ కోసం ఏర్పాటు చేసిన విమానాలు ఆగస్టు 17 నుంచి మొదలవుతాయని తెలిపారు. హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు, వాక్సినేషన్ కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి హజ్ యాత్రికుల ఎంపిక కోసం కంప్యూటరైజ్డ్ ‘డ్రా ఆఫ్ లాట్స్’(లాటరీ) నిర్వహించారు. ఎంపికైన దరఖాస్తుదారుల పేర్లను కొత్తగా ఆవిష్కరించిన వెబ్సైట్తో పాటు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఉంచుతారని హజ్ కమిటీ సభ్యులు తెలిపారు. -
కేజ్రీవాల్కు ఏ శాఖా లేదు...
‘డిప్యూటీ’కే కీలక శాఖలు ప్రభుత్వ పనితీరుపై సీఎం పర్యవేక్షణ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేజ్రీవాల్ తన వద్ద ఏ మంత్రిత్వశాఖనూ ఉంచుకోరాదని నిర్ణయించుకున్నారు. ఒక సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. కేజ్రీవాల్ మొత్తం ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తారు. మొత్తం ఆరుగురు మంత్రుల్లో ఉపముఖ్యమంత్రి సిసోడియాకు కీలకమైన బాధ్యతలతో పాటు అత్యధిక విభాగాలను అప్పగించారు. ప్రమాణం అనంతరం కేజ్రీవాల్, ఆరుగురు మంత్రులు సిసోడియా, అసీమ్ అహ్మద్ ఖాన్, సందీప్ కుమార్, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, జితేంద్ర సింగ్ తోమర్లు సచివాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను సిసోడియా విలేకర్లకు తెలిపారు. మంత్రులు- శాఖలు అరవింద్ కేజ్రీవాల్: ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ, సేవలు, విద్యుత్, విద్య, ఉన్నత విద్య, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విద్య, పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధి, భూములు, భవనాలు, విజిలెన్స్ విభాగాలతో పాటు.. ఎవరికీ కేటాయించని ఇతర విభాగాల బాధ్యతలు గోపాల్రాయ్: ఉపాధికల్పన, అభివృద్ధి, కార్మిక, రవాణా, సాధారణ పాలనా విభాగం శాఖలు సత్యేందర్ జైన్: విద్యుత్, ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా నిర్వహణ, సాగునీరు, వరద నియంత్రణ, ప్రజాపనుల విభాగం జితేంద్రసింగ్ తోమర్: హోంశాఖ, న్యాయశాఖ, పర్యాటకం, కళలు, సంస్కృతి అసిం అహ్మద్ఖాన్: ఆహారం, సరఫరా, పర్యావరణం, అటవీ, ఎన్నికల శాఖలు సందీప్కుమార్: మహిళా, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, భాష, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు