-
శోభాశెట్టి ట్రాపులో పడిన రతిక.. ఈమెది దెయ్యం తిండి అట!
బిగ్బాస్ 7 సీజన్ కొన్నాళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. గొడవలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీదా పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెడ్డగా.. ఇందులో శోభాశెట్టి హైలైట్ అయ్యింది. అదే టైంలో ఈమె వల్ల రతిక బండారం బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 54 హైలైట్స్లో చూద్దాం. ప్రశాంత్ vs రతిక అక్క ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ నిలవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ప్రశాంత్-రతిక మధ్య 'అక్క' అనే పదం గురించి డిస్కషన్తో శుక్రవారం ఎపిసోడ్ షురూ అయింది. తనని అక్క అని పిలవొద్దని, బయట చాలా ప్రాబ్లమ్ అయిందని రతిక చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కారణం లేకుండా ఓసారి ఏడ్చాడు కూడా. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దిన పెద్దమనిషి శివాజీ.. రతిక-ప్రశాంత్ మధ్య సంధి కుదిర్చాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) కొత్త కెప్టెన్ వచ్చాడ్రోయ్ ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో ఉన్న ఐదుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉందో, వాళ్ల మెడలో ఎండుమిర్చి దండ వేయాలని.. 'ఈ మిర్చి చాలా హాట్' అనే టాస్కుని బిగ్బాస్ పెట్టాడు. చివరగా ఎవరి మెడలో అయితే తక్కువ దండలు ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారని అన్నాడు. ఇందులో అస్సలు ఒక్క దండ కూడా పడని గౌతమ్.. బిగ్బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఎవరు ఎవరికి దండేశారు? అమరదీప్ - ప్రశాంత్ తేజ - ప్రశాంత్ యవర్ - శోభాశెట్టి భోలె - ప్రియాంక అశ్విని - ప్రియాంక రతిక - శోభాశెట్టి అర్జున్ - సందీప్ శివాజీ - సందీప్ (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) శోభా ట్రాప్లో ఇద్దరు అయితే ఈ టాస్కులో భాగంగా తనని అనర్హత పేరు చెప్పి మిర్చి దండ వేయడంపై శోభాశెట్టి తట్టుకోలేకపోయింది. తొలుత యవర్తో.. తొలి రెండు పోటీల్లో ఓడిపోయి, మూడే గేమ్లో గెలిచావ్ అందుకే ఈ దండ వేస్తున్నా అని కారణం చెప్పాడు. దీంతో శోభా పెద్ద గొడవ పెట్టుకుంది. ఏకంగా పిచ్చోడు అనేసింది. దీంతో అతడు నిజంగానే మెంటలెక్కినట్లు అరిచాడు. మిర్చి దండ విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ సాగింది. ఇది అయిన తర్వాత లివింగ్ రూంలో కూర్చుని శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గేమ్లో గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ అని ఏడ్చేసింది. రతిక మళ్లీ అదే తప్పు హౌసులో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతుందనే కారణంతో రతిక ఇప్పటికే ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. శోభాకి మిర్చి దండ వేసిన ఈమె.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ శోభా ఊరుకోలేదు. దీంతో చాలాసేపు గొడవ జరిగింది. 'నిన్న నువ్వే నాతో అన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వే దండం వేస్తున్నావ్' అని రతిక నిజస్వరూపాన్ని శోభా బయటపెట్టింది. అలా శోభా కావాలనే రెచ్చగొడితే.. యవర్, రతిక ఇద్దరూ ట్రాపులో పడ్డారు. ఇది జరిగిన తర్వాత రతిక గురించి శోభా-అశ్విని మాట్లాడుకున్నారు. రతిక ఏంటి? దెయ్యంలా అంత తింటుంది! అని అశ్విని బయటపెట్టింది. రతిక.. తినడం, తిరగడం, మాట్లాడటం తప్ప హౌసులోకి ఏం చేయట్లేదని శోభా అరుస్తూ చెప్పింది. అలా శుక్రవారం ఎపిసోడ్ కాస్త నీరసంగానే ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?
'బిగ్బాస్ 7' షో ఇప్పుడు మంచి మజా ఇస్తోంది. ఎందుకంటే చోటామోటా కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సగం రోజులు కూడా అయిపోయాయి. దీంతో ఎవరికి వాళ్లు హౌసులో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంతటి గొడవకైనా వెనుకాడటం లేదు. మరోవైపు ఈసారి ఎనిమిది నామినేట్ కాగా అందులో ఓ స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా? హౌసులో రెండు గ్రూపులు బిగ్బాస్ షో నిర్వహకులు చెప్పేదాని ప్రకారం.. హౌసులో ఎవరికి వాళ్లు గేమ్ ఆడాలి. కానీ ప్రస్తుత సీజన్లో మాత్రం రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్ద మనిషి అని చెప్పుకొంటున్న శివాజీ.. యవర్, ప్రశాంత్, భోలెకి అండగా నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఇది అంత పెద్దగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంకతో పాటు సందీప్ ఓ గ్రూపుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఎలిమినేషన్ మజా ప్రతిసారి ఎలిమినేషన్లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్ ఉండేవాళ్లు. దీంతో వాళ్లు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలిసేది. కానీ ఈసారి అలా కాదు. శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని.. ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. వీళ్లందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు.. స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తి పెరిగింది. శోభాకి గండం? అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అనుహ్యంగా భోలె రెండో స్థానంలో ఉన్నాడట. తర్వాతి స్థానాల్లో వరసగా అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభాశెట్టి దాదాపు ఒకేలా ఓట్లు పడ్డాయట. కానీ శోభాశెట్టిపై ఎలిమినేషన్ వేటు తప్పదని అంటున్నారు. ఒకవేళ అలా కాదంటే మాత్రం సందీప్ మాస్టర్ బయటకెళ్లిపోవడం గ్యారంటీ. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే పెద్ద షాకింగే అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పిచ్చోడంటూ తిట్టిన శోభ.. ఉగ్రరూపం దాల్చిన ప్రిన్స్
బిగ్బాస్ షోలో ప్రేమానురాగాలు, రాగద్వేషాలు, ఆప్యాయతలు, కలతలు- కలహాలు.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఈ సీజన్లో మాత్రం రాగద్వేషాలు, కలతలు, కలహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటలో పోట్లాటలను స్పోర్టివ్గా తీసుకోకుండా అనవసర కోపాలకు, గొడవలకు పోతున్నారు. మరీ ముఖ్యంగా శోభా శెట్టి ప్రతిదానికి చిటపటలాడుతోంది. మోనితలా మారుతున్నావు అని అటు భోలె, ఇటు నాగార్జున హెచ్చరిస్తున్న తన తీరు మార్చుకోవడం లేదు. మోనితలా మారడం కాదు తన అసలు స్వభావం మోనితయే అన్నంత విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అతిగా ఆశపడటం, ఆవేశపడటం.. ఆటలో తను మాత్రమే కష్టపడుతుందని భావించడం.. ఏ ఛాన్సయినా తనకు మాత్రమే దక్కాలని అతిగా ఆశపడటం, ఆవేశపడటం.. లేదంటే అవతలివారి మీదకు గయ్యిమని లేవడం.. ఇలా ఒకదాని మీద ఇంకోటి తప్పులు చేసుకుంటూ పోతూ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ మరోసారి సైకో మోనితలా మారింది శోభ. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. బిగ్బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్లలో ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటిసభ్యులు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పాడు. చిందులు తొక్కిన శోభ ముందుగా అమర్.. నామినేషన్స్లో ఉన్నవాళ్లకు కెప్టెన్సీ అవసరం నీకన్నా ఎక్కువ ఉందంటూ ప్రశాంత్ మెడలో మిర్చి మాల వేశాడు. భోలె షావళి.. ప్రియాంక మెడలో మిర్చిమాల వేశాడు. రతిక రోజ్, ప్రిన్స్.. శోభా శెట్టికి దండేశారు. ఇంకేముంది... ఆ మిర్చి ఘాటు శోభ నషాళానికి ఎక్కింది. నన్నే కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తారా? అని బుసలు కొట్టింది. బక్వాస్ రీజన్స్.. ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు నీక్కూడా వస్తుంది.. అప్పుడు నేను మాట్లాడతా.. పిచ్చోడు అని తిట్టేసింది. ప్రిన్స్ను పిచ్చోడనేసింది.. నన్ను పిచ్చోడు అంటున్నావా? అని ప్రిన్స్ అడగ్గా.. మళ్లీ మళ్లీ అంటా.. ఏం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. పిచ్చోడినా నేను? అని ప్రిన్స్ శోభా మీదకు వెళ్లి అరిచి మిర్చి దండను నేలకేసి కొట్టాడు. భోలె.. తనను మెంటల్ హాస్పిటల్కు పంపించాలని అన్నందుకు అతడిని జీవితంలో క్షమించనంది శోభా. మరి ఇప్పుడు ప్రిన్స్ యావర్ను పిచ్చోడు అనడం అసలు సమంజసమేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటి కొత్త కెప్టెన్గా గౌతమ్ అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: స్కంద ఓటీటీ రిలీజ్ వాయిదా.. రామ్ ఫ్యాన్స్కు నిరాశ.. -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగ్గా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతిక ఆటలో నుంచి అవుట్ అయి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల కోసం నేడు బిగ్బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు. ఈమేరకు ప్రోమోలు రిలీజయ్యాయి. షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్లోని నీళ్లను తమ కంటెయినర్లలో నింపాలి. అర్జున్ ఆటతీరుపై అసహనం ఈ టాస్కులో అర్జున్, భోలె షావళి, అశ్విని, సందీప్ ఆడారు. స్పాంజ్ను పూర్తిగా తడుకుపుకునేందుకు పోటీపడి మరీ ఆడారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ అయితే అశ్వినిని కింద పడేశాడు. ఈ గేమ్ ముగిసిన తర్వాత సందీప్.. అర్జున్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. నా పీక పట్టుకుని తోశాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే కింద పడింది అంటూ అర్జున్ మీద మండిపడ్డాడు. ఈ ఆటలో సందీప్ గెలిచినట్లు తెలుస్తోంది. గెలిచిందెవరంటే? ఇక మరో ఆటలో వీలైనన్ని ఎక్కువ దుస్తులు వేసుకోవాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో తేజ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఆడారు. ఇక తేజ తనవే కాకుండా అందరి బట్టలు సైతం వేసుకోవడంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. ఈ టాస్కులో శోభ గెలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లైవ్లో జరిగిన గేమ్స్ ప్రకారం ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్గా అవతరిస్తారో చూడాలి! చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్గా.. ఏ ఓటీటీలో అంటే? -
లవ్బర్డ్స్ శోభా-తేజ మధ్య గొడవ.. పుల్ల పెట్టిన శివాజీ!
బిగ్బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అతి చేస్తున్న శివాజీ నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న శోభా స్ట్రాంగ్గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కెప్టెన్సీ గేమ్స్ షురూ ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే. పుల్లలు పెడుతున్న శివాజీ రెండో గేమ్లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్బాస్తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్బాస్లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
నామినేషన్స్లో శివాజీ నిజస్వరూపం బయటపెట్టిన శోభా!
బిగ్బాస్ 7 నామినేషన్స్లో హౌస్మేట్స్ మళ్లీ మాటలతో కొట్టేసుకున్నారు. పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ వస్తున్న శివాజీ నిజస్వరూపాన్ని శోభాశెట్టి బయటపెట్టేసింది. ఇక భోలె గురించి అయితే చెప్పనక్కర్లేదు. గతవారంలానే ఇరిటేట్ చేశాడు. లాజిక్ అనేది లేకుండా ఏదేదో మాట్లాడాడు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 50 హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) రతిక గురించి డిస్కషన్ పూజామూర్తి ఎలిమినేట్, రతిక రీఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. పొద్దుపొద్దునే రతిక గురించి రైతుబిడ్డ-పాటబిడ్డ బాత్రూంలో డిస్కషన్ పెట్టారు. రతిక తిరిగొచ్చింది కదా? ఎలా అనిపిస్తుందని భోలె, ప్రశాంత్ని అడిగాడు. దీంతో ప్రశాంత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడీ ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడురా బాబు అని అనుకున్నాడు. ఎందుకు దిగాలుగా కనిపిస్తున్నావ్? అని భోలె అడగ్గా.. నాన్న వీడియో చూశా కదా! అందుకని అన్నాడు. దీంతో భోలె చల్లబడ్డాడు. రతికపై బిగ్బాస్ ప్రేమ రతికపై బిగ్బాస్కి ఎంత ప్రేముందో మళ్లీ రుజువైంది. ప్రేక్షకులే మాకు ఈమె వద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేసినా, పక్కా ప్లాన్ చేసి మరీ రీఎంట్రీ పేరుతో రతికని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ వారం అస్సలు ఆమెని నామినేట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. ఆమె గురించి చెప్పడానికి కంటెస్టెంట్ దగ్గరు ఎలానూ రీజన్స్ ఉండవు. కాబట్టి రతికని నామినేట్ చేయరు. అయినా సరే బిగ్బాస్ ప్రత్యేకించి చెప్పడం రతికపై ప్రేమ ఎక్కువైపోయినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - శోభాశెట్టి, ప్రియాంక అశ్విని - శోభాశెట్టి, ప్రియాంక గౌతమ్ - ప్రశాంత్, భోలె ప్రియాంక - భోలె, అశ్విని సందీప్ - అశ్విని, భోలె శోభాశెట్టి - శివాజీ, యవర్ భోలె - శోభాశెట్టి, గౌతమ్ లాజిక్స్ మర్చిపోతున్న శివాజీ ఫస్ట్ ఫస్ట్ శివాజీతో నామినేషన్స్ మొదలయ్యాయి. గతవారం నామినేషన్స్ సందర్భంగా భోలెతో గొడవపడటం తనకు నచ్చలేదని చెప్పి శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు.పెద్దోడు కదా సారీ చెప్పిన తర్వాత కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని శోభాతో అన్నాడు. శివాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పెద్దోడు అయితే బూతులు తిట్టేసి సారీ చెబితే క్షమించేయాలేమో? (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్చరణ్) ఇచ్చిపడేసిన శోభా ఇక తన నామినేషన్స్ సందర్భంగా శోభాశెట్టి, శివాజీకి ఇచ్చిపడేసింది. 'భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పొచ్చు. లేదంటే వీకెండ్లో అయినా చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్లో మాత్రమే చెప్పి, ప్రేక్షకులందరిముందు నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నారా?' అని శివాజీని అడిగింది. పైకి పెద్దమనిషి అని చెప్పుకొని.. మనుషుల్ని శివాజీ ఎలా బ్యాడ్ చేస్తున్నాడనేది శోభా ప్రశ్నతో ప్రూవ్ అయింది. అతడి నిజస్వరూపాన్ని బయటపడింది. శివాజీ ఆట చూస్తే ఒకటి మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. మాట వినేవాళ్లని మంచి చేసుకోవడం, అలా కాదంటే మెంటల్గా డౌన్ చేయడం. అమరదీప్ని తొలివారం నుంచి అలానే టార్గెట్ చేశాడు. అతడిని మెంటల్గా డిస్ట్రబ్ చేసి అల్లకల్లోలం చేశాడు. నువ్వు తోపు, తురుము అనేసరికి అమరదీప్ సరిగా కాన్సట్రేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే టెక్నిక్ శోభా మీద ప్రయోగిద్దామని శివాజీ చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్స్లో శోభాని ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) -
బిగ్బాస్: నామినేషన్స్లో ఏడుగురు, ఆ కంటెస్టెంట్ మాత్రం నయా రికార్డు!
బిగ్బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరూ వెళ్లేకొద్దీ నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో వరుసగా ఏడుగురు అమ్మాయిలను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. అయితే రతికను మాత్రం తిరిగి హౌస్లోకి పంపించారు. ఇకపోతే గతవారం భోలె షావళి బూతులు మాట్లాడుతూ అందరికీ బీపీ తెప్పించాడు. వీకెండ్ ఎపిసోడ్లోనూ నాగ్ క్లాస్ పీకాడు. ఇప్పుడదే వ్యవహారాన్ని నామినేషన్ అస్త్రంగా మార్చుకున్నాడు శివాజీ. భోలె తప్పులు మాట్లాడాడు. కానీ అతడు సారీ చెప్పినా క్షమించకపోవడం తప్పంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అర్హత లేదు, బయటకు వెళ్లు మాటలు పడింది తాను.. క్షమించడం, క్షమించకపోవడం తన ఇష్టమని శోభా అభిప్రాయపడింది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నన్ను నెగెటివ్గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, బయటకు వెళ్లు అని చెప్తున్నారు.. అంతే కదా అని నిలదీసింది. దానికి శివాజీ.. నాతో సహా ఇక్కడున్న ఎవరికీ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ తలతిక్క సమాధానం ఇచ్చాడు. ఏడుగురు నామినేట్ ఇక రోజు కూడా భోలె షావళి- ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగేట్లు కనిపిస్తోంది. కాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం శివాజీ, భోలె షావళి, అమర్దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్.. మొత్తంగా ఏడుగురు నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సందీప్ నామినేషన్స్లోకి రాకపోవడం గమనార్హం. వరుసగా ఎనిమిది వారాలుగా సందీప్ నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ లెక్కన ఎక్కువ వారాలు నామినేట్ అవని కంటెస్టెంట్గా సందీప్ రికార్డు సృష్టిస్తున్నాడు. చదవండి: వారిని ఎలిమినేట్ చేయాల్సిందన్న పూజా మూర్తి... గీతూ కౌంటర్లకు దండం పెట్టేసిందిగా -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్బాస్ ఇదిలా ఉంటే కిచెన్లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్బాస్కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
నా కుమారుడిని అలా చేస్తారనుకోలేదు.. ఏడ్చేసిన భోలె షావళి తల్లి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడిపోయింది. అటు నామినేషన్స్ కూడా మరింత వాడివేడిగా జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్కు వెళ్లిపోయాయి! భోలె షావళి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడా వాయించేయడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రియాంక అతడిని థూ అని చీదరించుకుంది. నా కొడుకుది ఎంతో మంచి గుణం తాజాగా ఈ నామినేషన్స్ రచ్చపై భోలె షావళి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా ఆమె తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'అంత మంచి మనసున్నవాడు, పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావట్లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతడితో హౌస్లో ఎవరూ మాట్లాడట్లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు' అంటూ ఏడ్చేసింది. సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది భోలె చెల్లి మాట్లాడుతూ.. 'మా అన్నయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక థూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తన మీద పడి అరిచేస్తోంది. అంత అవసరం లేదు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. శోభా, ప్రియాంక.. హౌస్లో మొదటి నుంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నారు. సీరియల్స్లో నటించినందుకు వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ థూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమీ చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య మాత్రం కూల్గానే మాట్లాడాడు' అని ఫైర్ అయింది. చదవండి: యంగ్ టైగర్కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు! -
భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!
బిగ్బాస్ ఎపిసోడ్ చూస్తుంటే అయితే ఎంటర్టైన్మెంట్ లేదంటే విసుగొస్తుంది. కానీ చిరాకు మాత్రం రాదు. అయితే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ వల్ల అదే జరిగింది. హౌసులో గలీజుగా బూతులు మాట్లాడాడు. అది కూడా ఆడపిల్లల ముందు. పైగా దానికో పిచ్చి సమర్ధన. ఇదంతా కూడా మంగళవారం నామినేషన్స్ సందర్భంగా జరిగింది. ఇంతకీ తాజాగా ఏం జరిగిందనేది Day 44 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బయటకొచ్చిన మోనిత ఏడుగురు తమ తమ నామినేషన్స్ పూర్తి చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తొలుత వచ్చిన శోభా.. భోలెని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాస్కులో 'ఆడపిల్ల కాబట్టి వదిలేశాను' అనే స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? అని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అయితే కుండ పగలగొట్టని చెప్పాలి లేదంటే డిఫెండ్ చేయాలి కానీ.. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా' అని కామెడీ చేశాడు. నువ్వు మోనిత కావొద్దని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పదేపదే మోనిత అనే పేరు ప్రస్తావిస్తూ.. వింత వింత సామెతలన్నీ చెబుతూ పిచ్చెక్కించాడు. (ఇదీ చదవండి: విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శోభాశెట్టి - తేజ, భోలె శివాజీ - గౌతమ్, అమరదీప్ అశ్విని - పూజామూర్తి, అర్జున్ గౌతమ్ - భోలె, శివాజీ భోలె - శోభాశెట్టి, ప్రియాంక యవర్ - గౌతమ్, అమరదీప్ భోలె బూతు పురాణం అయితే శోభాశెట్టి నామినేట్ చేస్తున్న టైంలో భోలె ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అని ప్రియాంక అనగానే.. 'ఆగమ్మ కాసేపు ఆగు' అని మరింత ఇరిటేషన్ తెప్పించాడు. మధ్యలో 'మా రైతుబిడ్డ' అని చెప్పి ప్రశాంత్ ఫ్యాన్స్ సింపతీ కొట్టేద్దామని చూశాడు. మధ్యలో ఎంటరైన శోభా.. ప్రేమ చూపించి, ప్రశాంత్ ఫ్యాన్స్ ఓట్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అని భోలె ఆలోచన బయటపెట్టి, కడిగిపారేసింది. దీంతో వచ్చే వారమే వెళ్లిపోతా, రాస్కో అని భోలె బరస్ట్ అయిపోయాడు. అంత సీరియస్గా గొడవ జరుగుతుంటే.. 'ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది' అని ఏదేదో మాట్లాడాడు. ఇక కాసేపటి తర్వాత స్పందించిన బిగ్బాస్.. బూతులు మాట్లాడటం ఆపేయకపోతే సహించేది లేదని అన్నాడు. (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) మళ్లీ శోభా vs భోలె ఇక భోలె తన నామినేషన్స్లో భాగంగా శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు. అలా అని వాళ్లతో వాదించనూ లేకపోయాడు. మధ్యలో 'నీకు ఎర్రగడ్డే దిక్కు' అని శోభాతో అన్నాడు. దీంతో ఆమె మళ్లీ రెచ్చిపోయింది. అయితే బూతులు మాట్లాడటం తనకు ఊతపదం అని ఏదో చెప్పుకొచ్చాడు కానీ అది ఏ మాత్రం కరెక్ట్గా అనిపించలే. ఈ వారం నామినేట్ అయింది వీళ్లే భోలె అశ్విని తేజ ప్రశాంత్ పూజా అమరదీప్ గౌతమ్ అయితే భోలెని సరిగ్గా పరిశీలిస్తే ఓ విషయం క్లియర్గా అర్థమైంది. రైతుబిడ్డ అనే పేరుని పోలినట్లు పాటబిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని సింపతీ కొట్టేద్దామనుకున్నాడు. అలానే శివాజీలా మంచి మాటలు చెబుతూ.. హౌసులో ఉండిపోదామనుకున్నాడు. కానీ వచ్చిన రెండోవారానికే భోలె నిజస్వరూపాన్ని ప్రియాంక, శోభాశెట్టి బయటపెట్టేశారు. దీనికి తోడు బూతులు మాట్లాడటంతో భోలె తన పరువు తానే తీసుకున్నట్లు అయింది. మరి ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటాడా? ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) -
'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటిరోజే ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో నామినేట్ చేయనున్నారు. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ప్రోమోలో శోభాశెట్టి మాట్లాడుతూ..'తేజ నువ్వు పనిష్మెంట్ అనేది చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్. ఈరోజు కూడా వెళ్తా. నేను వీఐపీ గదిలోనే ఉంటా. అది నా ఇష్టం' అని చెప్పింది. దీనికి టేస్టీ తేజ రిప్లై ఇస్తూ.. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ బ్రో అని చెప్పాడు. ప్రతిదీ నీకు ఫన్.. కానీ మాకే సీరియస్గా అనిపిస్తోందని చెప్పింది శోభాశెట్టి. (ఇది చదవండి: ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా) ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టిని ఉద్దేశించి.. 'మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలె షావలి కాస్తా వెటకారంగా' అన్నారు. దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్.. 'ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది' అంటూ భోలే షావలిపై మండిపడింది. ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలె షావలి అనడంతో.. కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత షావలి అరే ఎంత మంచిగా ఉన్నా నేను' అంటాడు. కానీ ప్రియాంక్ మాట్లాడుతూ..'నువ్వు నటించావ్' అంటుంది. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ.. 'పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ భోలె షావలికి వార్నింగ్ ఇస్తుంది'. అనంతరం తూ.. అని ప్రియాంక జైన్ అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అంటాడు భోలె షావలి. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది. ఇక టేస్టీ తేజ శోభాశెట్టితో మాట్లాడుతూ.. రూమ్లో ఉన్న వాళ్లందరు నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు నా కుండ పగలగొట్టడం ఒక ఎత్తు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో ప్రోమో ముగిసింది. హౌస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు సీరియస్గా విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ప్రోమో చూస్తే ఓవరాల్గా ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేయనున్నారు. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్) -
బిగ్బాస్ ఎలిమినేషన్: వరుసగా ఆరో వారమూ అమ్మాయేనా?
బిగ్బాస్ హౌస్కు గ్లామర్ టచ్ కావాలంటే అమ్మాయిలుండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకువస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుసపెట్టి అమ్మాయిలనే హౌస్ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట కిరణ్ రాథోడ్.. తనకు తెలుగు రావడం లేదని పంపించేశారు. షకీల.. కంటెంట్ కోసం అతి చేయకుండా హుందాగా వ్యవహరించింది. ఇలా ఒద్దికగా, పద్ధతిగా ఉంటే మాకెందుకు అనుకున్నారో ఏమో.. తననూ పంపించేశారు. అలా ఒక్కొక్కరూ వెళ్లిపోయారు దామిని.. సింగర్గా తన టాలెంట్ చూపించే ఈ బ్యూటీ కిచెన్లో వండి వార్చడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ వంటలక్క మాకొద్దని తనను పంపించేశారు. రతిక రోజ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారంతా! పోయి పోయి పల్లవి ప్రశాంత్తో పెట్టుకుంది. అతడితోనే లవ్ ట్రాక్ నడిపి, వర్కవుట్ కాకపోవడంతో ప్లేటు తిప్పేసింది. అదే ఆమెను దెబ్బ కొట్టింది, ఆ దెబ్బకు బిగ్బాస్ హౌస్ బయటకు వచ్చి పడింది. శుభశ్రీ.. ఈ అందాల సుందాంగి గేమ్ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇంత ఆలస్యంగా గేమ్ స్టార్ట్ చేసి మా మనోభావాలు దెబ్బతీశావంటూ తనను కూడా ఎలిమినేట్ చేసేశారు. తేజ లేక హౌస్ డల్.. కాబట్టి అతడికి నో! నెక్స్ట్ ఎవరు? అన్నది అసలైన ప్రశ్న. ఈవారం నామినేషన్లో ఏడుగురు ఉన్నారు. అమర్దీప్, ప్రిన్స్ యావర్, తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి.. వీరంతా నామినేషన్లో ఉన్నారు. ఇందులో అమర్దీప్, ప్రిన్స్ ఇప్పుడప్పుడే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు కానే కాదు. తేజ లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. కాబట్టి మరికొన్నాళ్లు అతడిని హౌస్లో ఉంచే ఛాన్స్ ఉంది. మిగిలిందల్లా నయని పావని, శోభ, అశ్విని, పూజా మూర్తి.. నలుగురూ ఆడపిల్లలే! వీరిలో శోభ ముందు నుంచీ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఫాలోయింగ్ దండిగా ఉంటుంది, గండం గట్టెక్కుతుందనుకుంటున్నారేమో.. సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈ వారం మోనితనే ఎలిమినేట్ కానుందట! చేజేతులా ఎలిమినేషన్ కొనితెచ్చుకుంటున్న మోనిత తన తిక్కకు లెక్క లేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది శోభా శెట్టి. గేమ్లో సవ్యంగా ఆడటానికి బదులు అడ్డదిడ్డంగా ఆడుతోంది. తనే తోపు అన్నట్లుగా మాట్లాడుతోంది. ప్రేక్షకులకు ఇదంతా చిరాకు తెప్పిస్తోంది. తనను పంపించేస్తే అప్పుడు తన గ్రూపులో ఉన్న మిగతా వాళ్లు కూడా సరైన దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయినా అశ్విని, పూజా, నయని ఉండగా శోభకు తక్కువ ఓట్లు రావడమేంటో అర్థం కావడం లేదని మరికొందరు తల గోక్కుంటున్నారు. ఏదేమైనా ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. మరి బయటకు వెళ్లేది మోనితనా? లేదంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: శోభా ఓవరాక్షన్.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా? -
శోభా శెట్టి చిల్లర గేమ్.. అంతా అయ్యాక ఏడుపొకటి!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లుగా మారింది. మొదట్లో తమ ప్రతాపం చూపించిన పోటుగాళ్లు నెమ్మదిగా వెనకబడ్డారు. ఆరంభంలో ఓటమిపాలవుతూ వచ్చిన ఆటగాళ్లు తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. చివరకు ఇరు టీములు చెరి మూడు పాయింట్లతో సమానంగా నిలబడ్డారు. అదెలాగో తాజా(అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం.. ఓటమి నుంచి పాఠాలు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడే కానీ ఆ నాయకుడి లక్షణాలైతే లేవు. ఇతడు అవతలి వారికి పని చెప్పడానికి బదులు అవతలి వారు ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నాడు. అన్నింటినీ ఓ కంట గమనిస్తూనే ఉన్న బిగ్బాస్ ప్రశాంత్ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అయితే అది కేవలం వార్నింగ్ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కు ఇచ్చేశాడు. ఇక అమర్.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకున్నాడు. మేకప్ కోసం ప్రాణం పోతోంది మరోవైపు శోభా శెట్టి మేకప్ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్ అడిగి మరీ ముఖాన కొట్టుకుంది. అబ్బే, బిగ్బాస్ ఒప్పుకోలేదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో అర్జున్.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్ను వేసుకోవాలని చెప్పాడు. అది కంపు కొడుతున్నా చేసేదేం లేక ముక్కు మూసుకుని దాన్ని ధరించింది శోభా. ఎవరు స్మార్ట్? తర్వాత ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లలో ఎవరు స్మార్ట్ అనేది తేల్చేందుకు హూ ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో సినిమాలు, పాటలు, డైలాగులకు సంబంధించి రకరకాల ప్రశ్నలడిగాడు. ఇందులో ఆటగాళ్లే గెలిచారు. అయితే శోభా కాస్త ఓవర్ చేసింది. బిగ్బాస్ అడిగే ప్రశ్నకు ఏది కరెక్ట్ సమాధానం అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకుని బోర్డుపై పెట్టాలి. కానీ శోభ ఎందుకైనా మంచిది అన్నట్లుగా రెండు బోర్డులను పట్టుకుని నేనివ్వను అంటూ చిల్లరగా ప్రవర్తించింది. ఏడ్చేసిన శోభా శెట్టి అయితే రెండు బోర్డులు తీసుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభా పరువు తీశాడు బిగ్బాస్. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు. పూజా మూర్తితోనూ గొడవకు దిగింది శోభ. తను చెప్తే నీతులు, ఎదుటివాళ్లు చెప్తే బూతులా.. అని పూజా ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత పాప.అనంతరం ఎవరు ఫోకస్ అనే టాస్క్ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు గేమ్ చెరి మూడు పాయింట్లతో టై అయింది. మరి నెక్స్ట్ బిగ్బాస్ ఏ గేమ్ ఇస్తాడు? ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్కు కూడా రెడీ అంటూ.. పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్ -
రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల
బిగ్బాస్ హౌసులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఐదుగురు కొత్తోళ్లు వచ్చారు. వాళ్లలో ఓ హాటెస్ట్ బ్యూటీ ఉంది. ఆదివారం ఆమె ఒంపుసొంపులు చూసి అబ్బా సూపర్ అనుకున్న ప్రేక్షకులు.. సోమవారం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో రామా అనుకున్నారు. ఓ లేడీ కంటెస్టెంట్ వల్ల ఇలా జరిగింది. అలానే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమైందనేది Day 36 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) పుల్ల పెట్టిన బిగ్బాస్ కొత్తగా వచ్చిన ఐదుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చేయడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. వాళ్లని చూపించడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఉదయం లేవగానే బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని చెప్పాడు. అలానే హెడ్స్ ఆఫ్ లగేజ్ గేమ్లో భాగంగా హౌసులో ఉన్నవాళ్లందరికీ కలిపి కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తిరకాసు పెట్టేశాడు. నామినేషన్స్ రచ్చ తొలుత పోటుగాళ్లు మాత్రమే నామినేషన్ చేస్తారని.. గత ఐదువారాలుగా ఉన్న ఇంటి సభ్యుల్ని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్బాస్ చెప్పాడు. వీళ్లలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నయని పావని - తేజ, అమరదీప్ భోలె షావళి - అమరదీప్, సందీప్ అశ్విని - అమరదీప్, శోభాశెట్టి పూజామూర్తి - తేజ, యవర్ అర్జున్ - సందీప్, అమరదీప్ (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) ఇకపోతే నామినేషన్స్లో భాగంగా అమరదీప్ స్వార్థంతో ఆడుతున్నాడని అశ్విని చెప్పింది. అలానే శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని చెప్పింది. దీంతో శోభా ఫైర్ అయింది. అసలు గ్రూపిజం అంటే ఏంటి? నేను ఎవరితో గ్రూపులో ఉన్నానంటూ రెచ్చిపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పోటుగాళ్ల నామినేషన్ పూర్తయిన తర్వాత.. బట్టల విషయంలో అశ్విని- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్కి తానే మహారాణి అనుకుంటుందా అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌసులో ఆమె పాలిటిక్స్ నడిపిస్తోందని చెప్పింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లందరూ మాట్లాడుకుని తనని సెపరేట్ చేసేశారని బోరున ఏడ్చేసింది. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఇక పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తిచేసిన తర్వాత ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - అశ్విని, యవర్ శోభాశెట్టి - అమరదీప్, అశ్విని శివాజీ - అమరదీప్, పూజామూర్తి తేజ - సందీప్, నయని పావని ప్రియాంక - తేజ, అశ్విని సందీప్ - తేజ, అర్జున్ యవర్ - శోభాశెట్టి, పూజామూర్తి ప్రశాంత్ - నయని పావని, అమరదీప్ ఈ నామినేషన్లో భాగంగా అమరదీప్, అశ్వినిని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు.. మీరు కన్నింగ్, సెల్ఫిష్ అని పదాలు నా గురించి వాడటం సరికాదని అశ్విని కామెంట్స్పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు శోభాశెట్టి.. అశ్విని నామినేట్ చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని గట్టిగా ఏడ్చేసింది. తనని పక్కనున్నవాళ్లు ఓదారుస్తున్నా సరే ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో హాట్హాట్గా కనిపించి వావ్ అనిపించిన అశ్విని.. ఎలిమినేషన్స్ అనేసరికి ఏడవటం చాలామంది కుర్రాళ్లు అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!) -
నామినేషన్స్లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..
బిగ్బాస్.. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్మేట్స్కు నిన్న ఒక్కసారిగా ఝలక్ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్లోకి దించాడు. వీరితోనూ ఆడి గెలవాలని ఛాలెంజ్ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్లో ఉన్న పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్బాస్. తాజాగా రిలీజైన ప్రోమో పోటుగాళ్లు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, హౌస్లో ఉన్న ఆటగాళ్లంతా చేసేదేం లేక బిక్కమొహం వేసుకుని కూర్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారి ముఖంపై ఎక్స్ మార్క్ వేసి అందుకు తగిన కారణాలు చెప్పాలన్నాడు బిగ్బాస్. మొదటగా నయని పావని.. తేజ గేమ్ ఆడినట్లు కనిపించలేదని తనను నామినేట్ చేశాడు. గౌతమ్ను బెల్ట్తో కొట్టిన విషయంపై తేజను పూజా మూర్తి నామినేట్ చేసింది. స్వార్థంగా ఆలోచిస్తున్నావంటూ అమర్దీప్ ముఖంపై ఎక్స్ మార్క్ వేసింది అశ్విని శ్రీ. తర్వాత శోభా శెట్టిని నామినేట్ చేసింది. అయితే పదేపదే గ్రూపిజం అనడంతో తట్టుకోలేకపోయింది శోభా. ఏంటి గ్రూపిజం? గ్రూపిజం వల్ల మీరు నష్టపోయారా? వేరేవాళ్లు నష్టపోయారా? అని ఫైర్ అయింది. ఇకపోతే మొదట పోటుగాళ్లకు ఛాన్స్ ఇచ్చిన బిగ్బాస్ తర్వాత ఆటగాళ్లకు ఇతరుల్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. యావర్కు తెలుగు క్లాసులు బిగ్బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
ఆ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్లో ఎవరెవరున్నారంటే?
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టాపల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే ఆస్కారం ఉంది. ఇకపోతే ఈరోజు మండే అంటే బిగ్బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య మంటపెట్టే రోజు. నీ కాళ్లు పట్టుకోవాలా? తాజాగా నామినేషన్స్పై బిగ్బాస్ ప్రోమో వచ్చేసింది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నావంటూ రతిక శివాజీతో వాదనకు దిగింది. నేను లేకపోతే నాగార్జున వీడియోలు వేసి చూపిస్తే నీ పరిస్థితేంటి? అని ప్రశ్నించాడు తిరిగి ప్రశ్నించాడు శివాజీ. అయినా మెట్టు దిగని రతిక ఇంకా సాగదీయడంతో ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా? అని అడిగాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జడ్జిలు ఏకీభవిస్తేనే నామినేషన్ మరోవైపు బిగ్బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టాడు. పవరాస్త్ర గెలుచుకుని హౌస్మేట్స్గా ప్రమోషన్ పొందిన శోభా, శివాజీ, సందీప్లను జ్యూరీ సభ్యులిగా నియమించాడు. ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిని బోనులో నిలబెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు ఆ జడ్జిలకు సమ్మతంగా అనిపిస్తే అవతలివారు నామినేట్ అవుతారు. తేజ, ప్రియాంకను నామినేట్ చేసిన ప్రిన్స్ ముందుగా ప్రిన్స్ యావర్.. ఫెమినిజాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరమ్మాయిలు నన్ను ఆటలో నుంచి తప్పించారంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. కానీ ఇందుకు జడ్జి శోభా ఒప్పుకోలేదు. ఇద్దరమ్మాయిలున్నారు కాబట్టి త్యాగం చేస్తానని నువ్వు తేజతో అన్నావా? లేదా? అని నిలదీసింది. దీనికి ప్రిన్స్.. అది వేరే విషయమని.. అందరి ముందు చెప్పినదాని గురించి తాను మాట్లాడుతున్నానని వాదించాడు. తర్వాత తేజను సైతం నామినేట్ చేశాడు. బయట సెలబ్రిటీ గురించి ఎందుకు? అటు శుభశ్రీ సైతం కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. ఈ హౌస్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని వ్యక్తి, ఓ సెలబ్రిటీ గురించి పదేపదే మాట్లాడటం తప్పని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం గౌతమ్, ప్రిన్స్, శుభశ్రీ, తేజ, రతిక, ప్రియాంక నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్: దామిని అవుట్.. వెళ్తూ వెళ్తూ ఆ సర్ప్రైజ్ -
సీరియల్ బ్యాచ్ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!
'బిగ్బాస్' షో అంటే నామినేషన్స్, కంటెస్టెంట్స్ మధ్యగొడవలు, వీకెండ్ లో నాగార్జున ప్రతి ఒక్కరికీ వేసే కౌంటర్స్ ఇలా ఉండాలి. కానీ ఈసారి అలాంటివి ఏం లేకుండా మూడో వారం చివరకొచ్చేసింది. ఇలాంటి టైంలో నాగ్ రూట్ మార్చారు. హౌసులో సీరియల్ బ్యాచ్గా పేరు తెచ్చుకున్న అమరదీప్, శోభాశెట్టిని నాగ్ ఓ రేంజులో ఆటాడేసుకున్నాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది? ముందు పెట్టిన గేమ్లో అమరదీప్తో మరో ఇద్దరు కూడా ఫెయిలయ్యారు. ఈ కారణంతో అతడు గేమ్ ఆడటానికి అనర్హుడని ప్రియాంక చెప్పింది. ఈ విషయాన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. దీన్ని ఒప్పుకొంటున్నావా? అని అమరదీప్ నే డైరెక్ట్గా అడిగేశాడు. దీంతో అతడు తల అడ్డంగా ఊపుతూ నో అన్నాడు. అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు బయటపెట్టుకోలేదని అమర్ని నాగ్ అడిగాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'అసలు నువ్వు నీకోసం ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?' అని ఓ రేంజులో అమరదీప్కి నాగార్జున ఇచ్చిపడేశాడు. తన కోసమే తాను ఆడుతున్నా అని అమర్ చెప్పగా.. మరే అదే పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేశావ్ అని నాగ్ ఆటాడేసుకున్నాడు.వీకెస్ట్ (బలహీనమైన) కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయమన్నారు, మరి నువ్వేమన్నావ్.. యవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి, సైడ్ చేసేశావ్. అంటే దీనిబట్టి నువ్వు వీక్ కంటెస్టెంట్ అని ఒప్పుకొంటున్నట్లే కదా అని శోభాశెట్టితో నాగ్ అన్నాడు. దీంతో ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలానే సంచాలక్గా సందీప్ ఫెయిలయ్యాడని నాగ్ ఇచ్చిపడేశాడు. ఆట మధ్యలో అసలు ఇన్వాల్స్ కాకూడదు, మరి నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అని సందీప్ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు. హౌజులో ఉన్నవాళ్ల అభిప్రాయం తీసుకుని.. అతడి బ్యాటరీ లెవల్ పచ్చ నుంచి పసుపునకు తగ్గించాడు. ప్రోమో చూస్తుంటే ఈసారి మంచి హీట్ ఉండబోతుందనిపిస్తుంది. అదే టైంలో ప్రోమో చూసి మోసపోవద్దని కూడా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
అమ్మాయిల స్కెచ్.. యవర్ అడ్డంగా బలైపోయాడు!
'బిగ్బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ హౌసులో 19వ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఫిట్టింగ్ పెట్టేశాడు! తొలి రెండు వారాల్లో పవరస్త్రని సందీప్, శివాజీ గెలుచుకున్నారు. మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చుకుని ప్రిన్స్ యవర్, అత్యంత కారంగా ఉండే చికెన్ ముక్కలు తిని శోభా, జుత్తుని కత్తిరించుకుని ప్రియాంక.. ఫైనల్-3లో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవడమే బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో.. వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్బాస్ చెప్పుకొచ్చాడు. యవర్ బలైపోయాడు అయితే సైడ్ అయ్యే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శోభా, యవర్ పేరుని.. యవర్, శోభా పేరుని చెప్పారు. అలా చెప్పిన టైంలో ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవపడ్డారు. ఇక డిసైడింగ్ ఓటు వేయాల్సిన ప్రియాంక.. శోభా పేరు చెప్పింది. అలానే టేబుల్ పై ఉన్న యవర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో ఇరగ్గొట్టారు. తనని పక్కకు జరపడాన్ని తట్టుకోలేకపోయిన యవర్.. అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్ని బలంగా కొట్టాడు. దెబ్బకు అది విరిగిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న 'ఏజెంట్') కోపానికి కారణాలు చెప్పాడు గతవారం రణధీర టీమ్లో ఉండి కష్టపడినప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కావొచ్చు యవర్కి అవకాశం రాలేదు. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తొలుత హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. శివాజీ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పాడు. జాబ్ లేదు, ఒకానొక టైంలో రూ.100 కూడా లేని రోజులు ఉన్నాయని.. అందుకే తనకు కోపం, ఆకలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. తనకు సరైన జడ్జిమెంట్ దక్కట్లేదని బాధపడిపోయాడు. ఆమె గెలిచిందా? చివరగా మిగిలిన ప్రియాంక-శోభాశెట్టి మధ్య బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.. బుల్పై తాడుని పట్టుకుని పడుకున్న పొజిషన్లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాశెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్లో బుల్పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు ప్రియాంకనే విజేత అనిపిస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చేస్తారని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
బిగ్బాస్ టాస్క్.. నొప్పి తట్టుకోలేక లేడీ కంటెస్టెంట్ కేకలు!
బిగ్బాస్ 7.. మూడో వారంలోకి వచ్చేసింది. తొలిరెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ రియాలిటీ షో క్రమక్రమంగా గొడవలతో హీటెక్కుతున్నట్లు అనిపిస్తుంది. హౌసులో ఉండేందుకు, పవరస్త్ర సాధించేందుకు కంటెస్టెంట్స్ దేనికైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ కంటెస్టెంట్స్ ఇప్పుడు గాయపడింది. కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తింది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఏం జరిగింది? మూడో పవరస్త్ర కోసం జరుగుతున్న పోటీలో కంటెండర్స్గా యవర్, శోభాశెట్టి, ప్రియాంక ఉన్నారు. అయితే ప్రియాంక స్థానంలో అమరదీప్ ఉండాల్సింది. కానీ జత్తు కత్తిరించుకోని కారణంగా అతడి బదులు ప్రియాంక పోటీలో నిలిచింది. అయితే మరో ఫిట్టింగ్ పెట్టిన బిగ్బాస్.. ప్రిన్స్ యవర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో పవరస్త్ర ఫైనల్ పోరు కోసం ప్రియాంక, శోభాశెట్టి నిలిచాడు. బుల్ ఫైట్- ప్రమాదం ఇక చివరి టాస్కులో భాగంగా ఎలా పడితే అలా కదిలే ఎలక్ట్రిక్ ఎద్దుపై ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వాళ్లదే పవరస్త్ర అని బిగ్బాస్ చెప్పాడు. హైట్ తక్కువ కావడంతో ప్రియాంక.. అలా దానిపై పూర్తిగా పడుకుని ఉండిపోయింది. శోభాశెట్టి మాత్రం ఆ జర్క్లకు తట్టుకోలేకపోయింది. ఓ సందర్భంగా పట్టుకున్న తాడుని వదిలేసి కిందపడింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి గాయమైంది. దాన్ని గౌతమ్ చూస్తున్న క్రమంలోనే నొప్పితే అరిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఇన్నాళ్లకు మోక్షం కలిగింది) -
పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్బాస్ ప్లాన్ అదేనా?
బిగ్బాస్ ఇంట్లో మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్లుపెడుతున్నాడు బిగ్బాస్. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్లో తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం.. చికెన్ ముక్కల్ని లాగించిన శోభా మూడో పవరాస్త్ర కోసం బిగ్బాస్.. ప్రిన్స్ యావర్, అమర్దీప్, శోభా శెట్టిని సెలక్ట్ చేశారు. ఇప్పటికే బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్బాస్. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా. గౌతమ్ కదా విన్నర్? ఇక ఆమె కంటెండర్గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు సేమ్ టాస్క్ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్ పీసులు తినాలని చెప్తూ సందీప్ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్ 28 తినేసి బెల్ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్గా ఉన్న సంచాలక్.. తర్వాత మాత్రం ఒక పీస్ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్బాస్ ఆమెనే కంటెండర్గా ఎంపిక చేశాడు. గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్ ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్దీప్.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్బాస్. అమర్దీప్ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్ చేసిన ప్రియాంక బేబీకట్ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్కట్ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్కట్కు రెడీ అయిపోయింది ప్రియాంక. అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక.. అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్కట్ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్బాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందుతారా? లేదా? అనేది చూడాలి. చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా -
అమర్ను గుండు గీయించుకోమన్న బిగ్బాస్.. ఛాన్స్ ఉందా?
బిగ్బాస్ ఇంట్లో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వీరంతా కంటెస్టెంట్లే అయినప్పటికీ ఓ ఇద్దరు మాత్రం హౌస్మేట్స్గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే! సందీప్, శివాజీ పవరాస్త్ర దక్కించుకోగా తాజాగా మూడో పవరాస్త్ర కోసం పోటీ జరుగుతోంది. ఇందుకోసం బిగ్బాస్ నేరుగా ముగ్గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకున్నాడు. అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ను పవరాస్త్ర కోసం పోటీపడే కంటెండర్లుగా ఎంపిక చేశాడు. సత్తా చాటిన ప్రిన్స్ ఈ ఎంపికతో అందరూ ఏకీభవించారా? లేదా? తెలుసుకునేందుకు మిగతా కంటెస్టెంట్ల అభిప్రాయం అడిగాడు. ఈ క్రమంలో చాలామంది ప్రిన్స్ యావర్ ఇంటిసభ్యుడిగా ఉండేందుకు అనర్హుడు అని చెప్పాడు. దీంతో ప్రిన్స్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో అతడు విజయం సాధించి కంటెండర్గా నిలబడ్డాడు. తర్వాత శోభాకు అత్యంత కారంగా ఉండే చికెన్ తినాలని ఓ టాస్క్ ఇచ్చాడు. ఏడుస్తూనే టాస్క్ పూర్తి చేసేసింది శోభా. ఇక మిగిలిందల్లా అమర్దీప్. ఇక్కడ బిగ్బాస్ పెద్ద ఫిట్టింగే పెట్టాడు. అతడికి జుట్టంటే చాలా ఇష్టం. ఓసారి రవితేజ అతడి నెత్తిన చేయేసి తన జుట్టులానే ఉందని చెప్పాడట. అందుకని దాన్ని తీసేయడానికి అస్సలు ఇష్టపడడు. అలాంటి ఇప్పుడేకంగా బిగ్బాస్ గుండు గీయించుకోవాలని చెప్పాడు. దీనికి ససేమీరా కుదరదని చెప్పేశాడు. దీంతో జుట్టు కత్తిరించుకునేందుకు ప్రియాంక జైన్ రెడీ అయింది. అన్నట్లుగా తన హెయిర్ కట్ చేసుకుంది. అలా ఆమె కంటెండర్గా నిలిచింది. మరి ప్రియాంక, శోభా, ప్రిన్స్.. ఈ ముగ్గురిలో ఎవరు పవరాస్త్ర గెలుచుకుంటారో చూడాలి! చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
నోరుజారిన డాక్టర్బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా
'బిగ్బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్లో భాగంగా కాస్త హడావుడి జరిగినా.. తర్వాతి రోజుకే అది చల్లారిపోయింది. మరోవైపు మూడో పవరస్త్ర కోసం ముగ్గుర్ని సెలెక్ట్ చేసిన బిగ్బాస్.. హౌస్ మొత్తాన్ని ఆగమాగం చేసేశాడు. ఇందులో భాగంగా బుధవారం కూడా శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఇంతకీ హౌసులో 17వ రోజు ఏం జరిగిందనేది Day-17 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఒకే ప్లేటులో తిన్నారు మంగళవారం జరిగిన పవరస్త్ర టాస్కులో యవర్.. అనర్హుడని రతిక నామినేట్ చేసింది. తనతోనే ఉంటూ తననే వెన్నుపోటు పొడవడంపై తొలుత కాస్త ఇబ్బందిపడ్డ ప్రిన్స్.. తనని తాను సంభాళించుకున్నాడు. రతికతోనే మాట్లాడుతూ.. తనకు ఏం ప్రాబ్లమ్ లేదని ఆమెకే చెప్పుకొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాత్రి ఒకే ప్లేటులో కలిసి భోజనం కూడా చేశారు. ఇది చూసి శుభశ్రీ, దామిని, గౌతమ్.. గుసగుసలాడుకున్నారు. (ఇదీ చదవండి: రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్ఫ్రెండ్!) శివాజీ పవరస్త్ర గొడవ తన పవరస్త్ర దొంగిలించారని పిల్లాడిలా శివాజీ గిలగిలా కొట్టేసుకుంటూనే ఉన్నాడు. సందీప్తో మాట్లాడుతూ తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే, ఇలా చేస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని అంటూ రెచ్చిపోయాడు. మరోవైపు పవరస్త్ర కొట్టేసిన అమరదీప్.. శివాజీ, రతిక బెడ్స్ దగ్గర టిష్యూ పేపర్పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్ ఇచ్చేలా పెట్టాడు. కానీ వాళ్లు కనిపెట్టలేకపోయారు. యవర్ని ఆటాడేసుకున్నారు అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్ యవర్.. కంటెండర్గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని రూల్ పెట్టాడు. దీన్ని పాటించిన యవర్.. కదలకుండా అలానే నిలబడ్డాడు. అయితే దామిని,రతిక, తేజ మాత్రం.. పేడ, గడ్డి, శాంపూ నీళ్లు, ఐస్ గడ్డలతో ఆటాడేసుకున్నారు. కానీ యవర్ ఇందులో గెలిచి నిలబడ్డాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) శోభాశెట్టి vs గౌతమ్ ఇక యవర్ టాస్క్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన వాళ్ల వీడియోలు చూపించారు. ప్రశాంత్, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె.. గౌతమ్ తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను శారీరకంగా బలంగా లేకపోతే.. పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను అంటూ గొడవ పెట్టుకుంది. దీంతో గౌతమ్.. తను అనుకున్న కారణాలు చెబుతూ షర్ట్ విప్పేశాడు. అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాశెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని అన్నాడు. అలా మాటామాట పెరిగిన ఒకానొక టైంలో.. 'అసలు నీకు హౌసులో ఉండటానికి అర్హతే లేదు' అని గౌతమ్ నోరుజారాడు. దెబ్బకు శోభాశెట్టి కౌంటర్ ఇచ్చింది. 'హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా' అని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ గొడవంతా చూస్తుంటే.. కార్తీకదీపం మోనిత శోభాశెట్టిని పూనిందేమో అని ప్రేక్షకులకు డౌట్ వచ్చింది. మరోవైపు అమరదీప్ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశారు. అలా బుధవారం ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)