Shardul Thakur
-
IND Vs PAK: ప్రాక్టీస్లో టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ ‘గెలుపు’! కానీ..
Asia Cup 2023 Ind vs Pak: ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థిపై గెలవాలనే పట్టుదలతో నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్బౌలర్ల బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పెనాల్టీ షూటౌట్ ఇక ఆదివారం(సెప్టెంబరు 10) నాటి మ్యాచ్ కోసం గురవారం నుంచే నెట్ సెషన్ ఆరంభించిన టీమిండియా.. శుక్రవారం కూడా ప్రాక్టీసులో తలమునకలైంది. శుబ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు.. పెనాల్టీ షూటౌట్తో సరదాగా గడిపారు. అయ్యర్ గెలిచాడు భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి ఫుట్బాల్ను కిక్ చేస్తూ పోటీపడ్డారు. ఇందులో సూర్య, గిల్, శార్దూల్ ఓడిపోగా.. శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్టంప్ను హిట్ చేయగా.. దిలీప్ తన్నిన బంతి మూడు స్టంప్స్ను తాకింది. దీంతో వాళ్లిదరిని ఎత్తుకుని విన్నర్స్ అంటూ సెలబ్రేట్ చేశారు మిగతా ఆటగాళ్లు. పాక్తో ఆ మ్యాచ్ రద్దు.. ఈసారి ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘లక్ష్యం చేరుకోవడంలో అలసత్వం లేదు. ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మున్ముందుకు’’ అంటూ దీనికి #TeamIndia #AsiaCup హ్యాష్ట్యాగ్లతో క్యాప్షన్ జతచేసింది. కాగా పాకిస్తాన్తో పల్లెకెలె మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ క్రమంలో రోహిత్ సేన 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం తేలలేదు. ఇక మరి కొలంబోలో ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి! చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
జింబాబ్వేపై ఆడాడని వరల్డ్కప్కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజువేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. అయితే ఈ మెగా టోర్నీ కోసం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై చాలా మంది భారత మాజీ క్రికెటర్లు పెదవివిరుస్తున్నారు. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేరాడు. ఆల్రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ను తీసుకువడంపై శ్రీకాంత్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఇంకా పూర్తిస్థాయి ఆల్రౌండర్గా మారలేదని అతడు చెప్పుకొచ్చాడు. అసలేందుకు ఎంపిక చేశారు? "శార్దూల్ ఠాకూర్ను వరల్డ్కప్కు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. 8వ స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు కావాలని అందరూ అంటున్నారు. ఆ స్దానంలో అతడు వచ్చి 10 పరుగులు మాత్రమే చేస్తున్నాడు. అది సరిపోతుందా? అలాగే 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేయడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో అతడు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో మనం చూశాం. కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడు జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై చేసిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై ప్రదర్శన చేస్తే ఒత్తడి ఎలా ఉంటుందో తెలుస్తోంది. చిన్న జట్లపై ఆడింది వేరు వరల్డ్కప్ వంటి టోర్నీల్లో వేరు. వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేముందు ఓవరాల్ సగటు కాకుండా వ్యక్తిగత ప్రదన్శనలను పరిగణలోకి తీసుకోవాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ఓ సారి పరిశీలించండి. అన్నివిధాలగా సమతుల్యతగా ఉందని స్టార్స్పోర్ట్స్ షోలో కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ప్రపంచకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్కప్ విన్నర్ అరెస్టు! -
WC 2023: శ్రేయస్ అయ్యర్కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు..
Gautam Gambhir's Picks For India's ICC World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన జట్టును ఎంచుకున్నాడు. అనూహ్యంగా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్కు మాత్రం చోటివ్వని గౌతీ.. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత తొలిసారి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో వరల్డ్కప్ టోర్నీకి తెరలేవనుంది. సొంతగడ్డపై ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్ ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. టీమిండియాతో పాటు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్కప్ టైటిల్ వేటకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల తుది జట్ల కూర్పు ఎలా ఉండాలన్న అంశంపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయ్యర్తో పాటు వాళ్లకూ నో ఛాన్స్ ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ 15 మంది సభ్యుల టీమిండియాను ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా.. శ్రేయస్ అయ్యర్ను విస్మరించిన గౌతీ.. ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కని వాషింగ్టన్ సుందర్కు స్థానం కల్పించాడు. అంతేకాదు.. సూర్యకుమార్ యాదవ్ తప్పక జట్టులో ఉండాలన్న ఈ కామెంటేటర్.. తిలక్ వర్మకు అవకాశం ఇవ్వలేదు. ఇక సంజూ శాంసన్ను పక్కనపెట్టి.. కేఎల్ రాహుల్కు బ్యాకప్ కీపర్గా ఇషాన్ కిషన్ను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా నాలుగో ఫాస్ట్బౌలర్గా శార్దూల్ ఠాకూర్ను కాదని కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణకు టాప్-15లో చోటు కల్పించాడు. గౌతీ జట్టుపై ఫ్యాన్స్ కామెంట్స్ దీంతో వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న అయ్యర్ను కాదని.. సూర్యకు చోటివ్వడం.. అలాగే పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కేఎల్ రాహుల్ కోసం సంజూను బలిచేయాలనడం సరికాదంటూ గౌతీ టీమ్పై టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ఏ ప్రాతిపదికన ఈ జట్టును ఎంపిక చేశాడో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం గౌతం గంభీర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
నేపాల్తో మ్యాచ్.. శార్ధూల్పై వేటు! షమీకి ఛాన్స్!
ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూనపై గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్పై భారత్ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. బ్యాటింగ్కు మంచి ఛాన్స్.. ఇక పాకిస్తాన్తో మ్యాచ్తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్ టాపర్డర్ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్లోకి రావడానికి నేపాల్తో మ్యాచ్ మంచి అవకాశం. నేపాల్పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్పై టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా(87) ఇషాన్ కిషన్(82) మాత్రం కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు. శార్ధూల్పై వేటు.. షమీకి ఛాన్స్ ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో షమీకి కాదని శార్థూల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్ ఆల్రౌండర్కు జట్టు మెన్జ్మెంట్ అవకాశం ఇచ్చింది. మెనెజ్మెంట్ నమ్మకన్ని శార్ధూల్ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్తో మ్యాచ్కు శార్ధూల్ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెన్జెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
IND VS PAK: షమీని కాదని శార్దూల్ను తీసుకుంది ఇందుకేనా..?
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు చేరడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇషాన్, హార్ధిక్ ఔటవ్వగానే రవీంద్ర జడేజా (14), శార్దూల్ ఠాకూర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లారు. కేవలం 3 పరుగుల వ్యవధిలో హార్దిక్, జడేజా, శార్దూల్ ఔటయ్యారు.దీంతో 48.5 ఓవర్లలో టీమిండియా ఇన్నింగ్స్కు తెరపడింది. 266 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఆఖర్లో బుమ్రా (16) అడపాదడపా బ్యాట్ను ఝులిపించడంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. ఇదిలా ఉంటే, షమీని కాదని శార్దూల్ను తుది జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తలాతోకా లేని లాజిక్ చెప్పి షమీని పక్కకు పెట్టాడని దుయ్యబడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసమని కీలక బౌలర్ను పక్కకు పెట్టడమేంటని అక్షింతలు వేస్తున్నారు. శార్దూల్ కేవలం 3 పరుగులు చేసి ఔటైన విధానాన్ని చూసి, ఇందుకేనా షమీని కాదని ఇతన్ని తీసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ మాత్రం బ్యాటింగ్ షమీ చేయలేడా అని అంటున్నారు. శార్దూల్ కోసమని షమీని పక్కకు పెట్టి టీమిండియా తగు మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓ మోస్తరు స్కోర్ను డిఫెండ్ చేసుకోవాలంటే షమీ ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పిచ్ కూడా పేసర్లకు సహకరిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ విషయంలో రోహిత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, షమీని ఇలా పొంతనలేని కారణాల చెప్పి పక్కకు పెట్టిడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో బలమైన కారణాలు లేకుండా షమీని బెంచ్కు పరిమితం చేశారు. ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. -
Ind Vs Pak: షమీకి నో ఛాన్స్.. అందుకే ముందు బ్యాటింగ్: రోహిత్ శర్మ
Asia Cup, 2023 Pakistan vs India- Toss- Rohit Sharma Comments: ‘‘మేము ముందు బ్యాటింగే చేస్తాం. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు కదా! మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం.సవాళ్లు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వెస్టిండీస్ పర్యటన తర్వాత మాకు కావాల్సినంత సమయం దొరికింది. బెంగళూరులో మా ఆటగాళ్లంతా కఠినంగా శ్రమించారు. ఈ టోర్నీలో మా ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రత్యర్థి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా.. జట్టుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి ఉంది. అయ్యర్, బుమ్రా తిరిగి వచ్చారు. ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్తో ప్రయాణం ఆరంభం పాకిస్తాన్తో మ్యాచ్కు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. ఆసియా కప్-2023లో భారత్.. దాయాది పాక్తో మ్యాచ్తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇందుకు వేదిక అయింది. ఆశ్చర్యపరిచిన రోహిత్ నిర్ణయం ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయాల నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేశామని హిట్మ్యాన్ ధీమాగా ఉన్నప్పటికీ.. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. షమీకి నో ఛాన్స్ కాగా క్యాండీలోని హై క్వాలిటీ పిచ్పై బౌలర్లు లేదంటే బ్యాటర్లు.. ఎవరు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చకుంటే వారికే మేలు చేకూర్చే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హైవోల్టేజీ వన్డేలో శార్దూల్ ఠాకూర్కు అవకాశమిచ్చిన మేనేజ్మెంట్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని పక్కనపెట్టింది. ఆసియా కప్-2023 పాకిస్తాన్తో మ్యాచ్కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ -
అలాంటి వాడిని కాదు! ఆ విషయంలో నేనేం చేయలేను: శార్దూల్ ఠాకూర్
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. విండీస్తో మూడు మ్యాచ్లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బార్బడోస్లో తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(17) వికెట్ తన ఖాతాలో వేసుకున్న ఈ పేస్ ఆల్రౌండర్.. అదే వేదికపై రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు. వరల్డ్కప్ సన్నాహక సిరీస్లో.. ఇక ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్ల(4/37)తో చెలరేగాడు. వన్డే వరల్డ్కప్-2023 సన్నాహకంగా భావిస్తున్న సిరీస్లో ఈ అద్భుతంగా రాణించి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురుకాగా శార్దూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 8 వికెట్లు పడగొట్టి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో 8 వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఓ క్రికెటర్గా జట్టులో స్థానం కోసం మేము ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి మెరుగ్గా రాణిస్తాం.. మరికొన్నిసార్లు నిరాశ తప్పదు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేనైతే నా కెరీర్లో ఆడిన ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. జట్టులో స్థానం సంపాదించాలనే ఆలోచనతో ఉండే మనస్తత్వం కాదు నాది. అది సెలక్టర్ల ఇష్టం జట్టుకు ఉపయోగపడే విధంగా ఆడాలని మాత్రమే అనుకుంటాను. ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తారో చేయరో అన్నది సెలక్టర్ల ఇష్టం. ఆ విషయంలో నేనైతే ఏమీచేయలేను. ముందుగా చెప్పినట్లు పరిస్థితులకు అనుగుణంగా జట్టును గెలిపించేలా ఆడటంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది’’ అని రైట్ ఆర్మ్ సీమర్ శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాను కాబట్టే గత రెండేళ్లలో తాను జట్టులో రెగ్యులర్ సభ్యుడినయ్యానన్న ఈ మహారాష్ట్ర ఆల్రౌండర్.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం తనను కీలక ఆటగాళ్లలో ఒకడిగా మార్చిందన్నాడు. జట్టును గెలిపించే క్రమంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్ను 200 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్గా ఉండటం కష్టం.. ఎప్పుడు, ఎక్కడైనా: సంజూ శాంసన్ విండీస్ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. -
చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
విండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/25), ఉనద్కత్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ఆటగాళ్ల పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (32), కారియా (19), అల్జరీ జోసఫ్ (26), గడకేశ్ మోటీ (39 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్పై.. తర్వాత పసలేని బౌలింగ్పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్డౌన్లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది. బార్బోడస్ వేదికగా విండీస్తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజా ధాటికి కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3 వికెట్లు సాధించాడు. అనంతరం 115 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శార్దూల్పై రోహిత్ సీరియస్.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. సహాచర ఆటగాడు శార్ధూల్ ఠాకూర్పై రోహిత్ సీరియస్ అయ్యాడు. ఫీల్డింగ్లో శార్ధూల్ బద్దకంగా వ్యవహరించడంతో రోహిత్ కోపమయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో షాయ్ హోప్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే షాట్లో పవ్ర్ లేకపోవడంతో బంతి బౌండరికి వెళ్లలేకపోయింది. అయితే కవర్స్లో ఉన్న శార్ధూల్ బంతిని అందుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. ఈ క్రమంలో విండీస్తో బ్యాటర్లు 3 పరుగులు పూర్తి చేశారు. దీంతో శార్ధూల్ పేలవ ఫీల్డింగ్పై రోహిత్ ఆసహనం వ్యక్తం చేశాడు. అతడి వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs WI: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్ Rohit Sharma praising Shardul Thakur for his fielding effort.#INDvsWI pic.twitter.com/121NrAKQhY — Foax Cricket News (@FoaxCricket) July 27, 2023 -
Ind vs WI: బార్బడోస్ చేరుకున్నాం.. జడ్డూ ఫొటో వైరల్! ఇక వాళ్లిద్దరు..
India tour of West Indies, 2023: టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెస్టిండీస్కు చేరుకుంటున్నారు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సహా పలువురు శుక్రవారమే కరేబియన్ దీవిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శనివారం విండీస్కు చేరుకున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ శార్దూల్ ఠాకూర్తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘బార్బడోస్ చేరుకున్నాం’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. రోహిత్, కోహ్లి ఆలస్యంగా! ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ తర్వాత లభించిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కుటుంబాలకు కేటాయించారు. దీంతో పారిస్, లండన్లలో చక్కర్లు కొడుతున్న ఈ బ్యాటింగ్ స్టార్లు కాస్త ఆలస్యంగా విండీస్కు పయనం కానున్నట్లు తెలుస్తోంది. పాపం వెస్టిండీస్ కాగా డొనిమినికా వేదికగా విండీస్- భారత్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఆతిథ్య జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రెగ్ బ్రాత్వైట్ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు నెట్స్లో శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ రేసు నుంచి వెస్టిండీస్ అధికారికంగా నిష్క్రమించింది. జింబాబ్వేలోని హరారే వేదికగా సూపర్ సిక్సెస్ దశలో శనివారం జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన విండీస్ కనీసం ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేక చతికిలపడింది. ఇక క్వాలిఫయర్స్లో జూలై 7న ఆఖరి మ్యాచ్ ఆడనున్న విండీస్ ఆటగాళ్లు.. ఆ వెంటనే స్వదేశంలో భారత్తో సిరీస్కు సిద్ధం కానున్నారు. వెస్టిండీస్తో టెస్టు 'సిరీస్ ఆడనున్న టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! Touchdown Barbados🛬 pic.twitter.com/netOxNARuY — Ravindrasinh jadeja (@imjadeja) July 1, 2023 -
కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు. 2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంగ్లండ్తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు. కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి. -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్రౌండర్పై వివాదాస్పద వ్యాఖ్యలు
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. శార్దూల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్. సీఎస్కేతో మ్యాచ్లో ఇలా ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జడ్డూను కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్రౌండర్’ శార్దూల్ ఠాకూర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! -
మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బ్యాటింగ్లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. శార్దూల్కు కలిసి రాని ప్రమోషన్ ఇక శార్దూల్ ఠాకూర్కు బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్లో క్వాలిఫయర్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్తో మ్యాచ్లో పించ్ హిట్టర్గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్గా వెనుదిరిగాడు. Mohit Sharma you beauty 🔥🔥 A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH — IndianPremierLeague (@IPL) April 29, 2023 చదవండి: ట్రాక్లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా! -
టీమిండియా ఆల్రౌండర్కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానే అవకాశం దక్కింది. దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్తో పాటు అదనపు పేసర్గా శార్దూల్ ఉండనున్నాడు. అదే విధంగా ప్లేయింగ్ ఎల్వన్లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్ వికెట్ హాల్తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్గా భారత్ తరపున 8 టెస్టు మ్యాచ్లు ఆడిన శార్ధూల్.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్కు చుక్కదరైంది. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో (ఇంపాక్ట్ ప్లేయర్గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్తో తమ ఆరంభ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్కు గత రెండు మ్యాచ్లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో సన్రైజర్స్ కేవలం 8 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్లో సైతం కోల్కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్తో చివరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్కతాను నిలువరించడం సన్రైజర్స్కు సాధ్యమవుతుంది. కేకేఆర్తో మ్యాచ్ సన్రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్
IPL 2022- KKR vs RCB: ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్కు తొలి విజయం అందించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ పేస్ ఆల్రౌండర్ తన అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడంటూ కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు ఊహించలేదంటూ ఆకాశానికెత్తాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ టాపార్డర్లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(57) మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. చుక్కలు చూపించిన శార్దూల్ ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రింకూ సింగ్(46), ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. శార్దూల్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 68 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేకేఆర్ 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ రెండు, సూయశ్ శర్మ మూడు వికెట్లతో మెరిశారు. బ్యాటింగ్లో అదరగొట్టి శార్దూల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రసెల్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటివి ఊహిస్తాం.. కానీ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్లో కూర్చున్న వేళ మైదానంలోకి దిగిన శార్దూల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఊహించని రీతిలో శార్దూల్ నిజానికి ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. శార్దూల్ 30-35 పరుగులు చేస్తే ఎక్కువని భావిస్తాం. అలాంటిది అతడు ఎవరూ ఊహించని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నమ్మకం నిలబెట్టుకున్నాడు టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరనుకుంటా. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వికెట్లు తీస్తాడని.. ఆరు.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి వారు తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్.. శార్దూల్ ఠాకూర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ 9న తలపడనుంది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
శార్దుల్ ధనాధన్...కేకేఆర్ ఘన విజయం
కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో ఈడెన్ గార్డెన్స్లో గురువారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సుయశ్ శర్మ (3/30) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు. ఆ ఇద్దరి దూకుడుతో... తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్ జోరు కొనసాగించడంతో కోల్కతా పవర్ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్కతా కెపె్టన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్తో జత కలిసి గుర్బాజ్ కోల్కతా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్ను సిరాజ్ అవుట్ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. తడబాటు... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. హిట్టర్లు బ్రేస్వెల్, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. కోల్కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్లో సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు లక్నోVs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహా్మనుల్లా గుర్బాజ్ (సి) ఆకాశ్దీప్ (బి) కరణ్ శర్మ 57; వెంకటేశ్ అయ్యర్ (బి) విల్లీ 3; మన్దీప్ సింగ్ (బి) విల్లీ 0; నితీశ్ రాణా (సి) దినేశ్ కార్తీక్ (బి) బ్రేస్వెల్ 1; రింకూ సింగ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ 46; రసెల్ (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 0; శార్దుల్ ఠాకూర్ (సి) మ్యాక్స్వెల్ (బి) సిరాజ్ 68; నరైన్ (నాటౌట్) 0; ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్: సిరాజ్ 4–0–44–1, డేవిడ్ విల్లీ 4–1–16–2, ఆకాశ్దీప్ 2–0–30–0, బ్రేస్వెల్ 3–0–34–1, షహబాజ్ అహ్మద్ 1–0–6–0, కరణ్ శర్మ 3–0–26–2, హర్షల్ పటేల్ 3–0–38–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) నరైన్ 21; డు ప్లెసిస్ (బి) వరుణ్ చక్రవర్తి 23; బ్రేస్వెల్ (సి) నితీశ్ రాణా (బి) శార్దుల్ ఠాకూర్ 19, మ్యాక్స్వెల్ (బి) వరుణ్ చక్రవర్తి 5; హర్షల్ పటేల్ (బి) వరుణ్ చక్రవర్తి 0; షహబాజ్ అహ్మద్ (సి) శార్దుల్ (బి) నరైన్ 1; దినేశ్ కార్తీక్ (సి) వరుణ్ (బి) సుయశ్ శర్మ 9; అనూజ్ రావత్ (సి) నరైన్ (బి) సుయశ్ శర్మ 1; విల్లీ (నాటౌట్) 20, కరణ్ శర్మ (సి) నితీశ్ రాణా (బి) సుయశ్ శర్మ 1, ఆకాశ్దీప్ (సి అండ్ బి) వరుణ్ చక్రవర్తి 17; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 123. వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–17–0, టిమ్ సౌతీ 2–0–25–0, సునీల్ నరైన్ 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్ శర్మ 4–0–30–3, శార్దుల్ ఠాకూర్ 2–0–15–1. -
#Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్ పవర్ చూపించిన శార్దూల్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఇక కేకేఆర్ తరపున ఏడు, ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి 50ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు. ఇంతకముందు ఆండ్రీ రసెల్ ఐదుసార్లు, పాట్ కమిన్స్ మూడుసార్లు, సాహా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఇక ఏడు ఆ తర్వాత స్థాన్లాల్లో బ్యాటింగ్కు వచ్చి ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్ చోటు సంపాదించాడు. ఓవరాల్గా శార్దూల్ 29 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 150 కూడా కష్టమనుకున్న తరుణంలో రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్కు 103 పరుగులు జోడించి కేకేఆర్ స్కోరు 200 మార్క్ అందుకునేలా చేశాడు. Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్ అతడేనా..?
ఐపీఎల్-2023 సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయ్యర్ గత కొంత కాలంగా వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్ గాయం మళ్లీ తిరిగి బెట్టింది. దీంతో అతడు నాలుగో టెస్టులో బ్యాటింగ్ కూడా రాలేదు. ఈ క్రమంలో అతడు ఆసీస్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. కాగా తన వెన్నుముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని అయ్యర్ను నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం సూచించింది. ఒక వేళ సర్జరీ జరిగితే అతడు దాదాపు ఏడాది వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండంతో అయ్యర్ ఎన్సీఏ సలహాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్ ప్రస్తుతం డాక్టర్ల సలహా మెరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏదిఏమైనప్పటికీ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్కు మాత్రం దూరంగా ఉండనున్నాడు. కేకేఆర్ కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్.. ఇక ఈ ఏడాది సీజన్కు అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్ తమ కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో పడింది. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ జట్టు మేనెజ్మెంట్ శార్దూల్ ఠాకూర్ వైపు మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా శార్దూల్ను ఢిల్లీ కొనుగోలు చేసింది. మరోవైపు యూఏఈ టీ20లీగ్లో కేకేఆర్ ఫ్రాంచైజీ అబుదాబి నైట్రైడర్స్ కు సారథ్యం వహించిన సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు కెప్టెన్సీలోని నైట్రైడర్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో నరైన్ను కాదని శార్దూల్కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ దృఢ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ కొత్త కెప్టెన్ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. చదవండి: BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను? జట్టులో చోటు గురించి ఆలోచనే లేదు!
India vs Australia- WTC Final: ‘‘నేను ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా.. నిజాయితీగా ఉంటాను. జట్టులో చోటు దక్కించుకునేందుకు చేయాల్సిన దాంట్లో కనీసం 10 శాతం కూడా సాధించలేదు. పది దాకా ఎందుకు.. కనీసం ఒక్క శాతం కూడా నేను అందుకు అర్హుడిని కాను. అలాంటిది.. ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చి వేరే వాళ్ల స్థానాన్ని ఆక్రమించలేను కదా! అది సరైంది కాదు కూడా!’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లేదు.. ఆ ఆలోచనే లేదు! ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాండ్యాకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్-2023 తర్వాత జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్కు మీరు అందుబాటులో ఉంటారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. అసలు ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు గురించి అసలు తనకు ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా 2017 జూలైలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ పేస్ ఆల్రౌండర్.. 2018లో ఇంగ్లండ్తో ఆడిన టెస్టు ఆఖరిది. అప్పటి నుంచి ఇంతవరకు అతడు టెస్టు మ్యాచ్ ఆడలేదు. పేస్ ఆల్రౌండర్ కావాలి కదా! పోటీలో లేను ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో భవిష్య కెప్టెన్గా ఎదుగుతున్న 29 ఏళ్ల పాండ్యా.. ఇప్పటికే పలు టీ20 సిరీస్లకు సారథ్యం వహించి పలు విజయాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ ఆవశ్యకత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడగా.. శార్దూల్ ఠాకూర్ ప్రస్తావన వచ్చింది. విదేశాల్లో ముఖ్యంగా ఆసీస్పై అతడికి మంచి రికార్డే ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు కూర్పుపై ప్రశ్న ఎదురుకాగా.. హార్దిక్ పాండ్యా ఇలా తాను పోటీలో లేనంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే! Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్ను కలిసిన యువీ.. ఫొటో వైరల్ -
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)