Advertisement
second ODI
-
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
సూర్యకుమార్ 'ఖేల్' ఖతమైనట్టే..!
IND VS AUS 2nd ODI: భారీ అంచనాల నడుమ ప్రతి మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్లుగా చెత్త ప్రదర్శన చేస్తూ ఉసూరుమనిపిస్తున్నాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో (51 బంతుల్లో 112) చివరిసారిగా సెంచరీ చేసిన స్కై.. ఆతర్వాత వరుస విఫలమవుతూ ఫ్యాన్స్కు విసుగు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన సూర్యకుమార్.. తొలి వన్డేలోనూ ఇదే తరహాలో తొలి బంతికే ఔటయ్యాడు. రెండు సార్లు మిచెల్ స్టార్కే స్కై వికెట్ తీశాడు. అది కూడా ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కైని వెంటనే వన్డే జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వన్డేల్లో స్కైకి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని అంటుంటే.. మెజార్టీ శాతం అతన్ని సాగనంపాలని కోరుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఇరగదీసే స్కై.. వన్డేల్లో తేలిపోతుండటం అతని అభిమానులతో పాటు అతన్ని కూడా బాధిస్తుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో స్కైని మర్యాద పూర్వకంగా వన్డే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ వర్గాలు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆసీస్తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (30), జడేజా (8) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్లో వికెట్కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్లకు ఔట్చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు
SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్తో రెండో టెస్ట్లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్ చేశారు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. విండీస్తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్లో భారీ షాట్లతో పాటు మాస్టర్ క్లాస్ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బెస్ట్ వన్డే నాక్ ఆడాడు. కెరీర్ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్తో సమాధానం చెప్పడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్ అఫ్రికన్ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్తో పాటు కొందరు అలా చేసేందుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్ ఏకంగా తన కెరీర్నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్ను వ్యతిరేస్తూ కొందరు స్టార్ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్తో కెప్టెన్ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్ టీమ్కు కెప్టెన్ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్ఏ20 లీగ్లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్ సర్కిల్స్లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్మెంట్గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. కెరీర్లో 56 టెస్ట్లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్ సెంచరీ ఉన్నాయి. -
వైజాగ్లో సిరీస్ సాధిస్తారా!
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్లో ఓడించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా పడగొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో ఉంది. ఇరు జట్ల నేడు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. మరోవైపు సిరీస్ను సజీవంగా ఉంచేందుకు ఆసీస్కు ఈ మ్యాచ్లో గెలవడం తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే నుంచి తప్పుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సారథిగా బాధ్యతలు తీసుకుంటాడు. మూడో స్పిన్నర్కు చోటు... తొలి వన్డేలో భారత పేసర్లు షమీ, సిరాజ్ చక్కగా రాణించారు. స్పిన్ విభాగంలో జడేజా రాణించగా, కుల్దీప్ మాత్రమే కొన్ని పరుగులిచ్చాడు. అయితే ముంబైతో పోలిస్తే వైజాగ్ పిచ్ స్పిన్కు మరింత అనుకూలంగా ఉండటంతో రెండో రెగ్యులర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కు అవకాశం దక్కవచ్చు. మూడో పేసర్ పాత్రను హార్దిక్ సమర్థంగా నిర్వహిస్తుండటంతో శార్దుల్ అవసరం ఇప్పుడు జట్టుకు కనిపించడం లేదు. బ్యాటింగ్లో ఊహించినట్లుగానే మిడిలార్డర్లో శ్రేయస్ లేని లోటు కనిపిస్తోంది. సూర్యకుమార్ మరోసారి వన్డేల్లో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ మ్యాచ్లోనైనా ఆడకపోతే అతను వన్డే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. రోహిత్ రాకతో ఓపెనింగ్లో జట్టు బలం పెరిగింది. గత మ్యాచ్లో విఫలమైన కోహ్లి తన స్థాయికి తగ్గట్లు ఆడితే భారీ స్కోరు ఖాయం. వార్నర్ ఆడితే... మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ బలహీనత తొలి వన్డేలో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఆడితే జట్టులో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయి. కీపర్ ఇన్గ్లిస్ స్థానంలో క్యారీ వస్తాడు. హెడ్, లబుషేన్ రాణించడం కీలకం. అయితే అన్నింటికి మించి స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్ను ఆందోళన పరుస్తోంది. భారత్లో అడుగు పెట్టినప్పటి నుంచి అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇప్పటికైనా అతను ఆ లోటును తీర్చుకుంటాడా చూడాలి. స్టార్క్ తన బౌలింగ్ పదును భారత్కు చూపించగా... తొలి వన్డేలో ఒక బౌలర్ను తక్కువగా ఆడించి ఇబ్బంది పడిన కంగారూలు ఈసారి ఎలా వ్యూహం మారుస్తారో చూడాలి. వాన గండం... విశాఖ పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్కు బాగా అనుకూలం. దాదాపు అన్ని మ్యాచ్లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటి పిచ్ ఎదురు కావచ్చు. అయితే వర్షం ఆటకు ఇబ్బందిగా మారవచ్చని తెలుస్తోంది. స్థానిక వాతావరణ సూచన ప్రకారం ఆదివారం వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), మార్‡్ష, హెడ్, లబుషేన్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, అబాట్, స్టార్క్, జంపా. 7:విశాఖపట్నంలో భారత్ 9 వన్డేలు ఆడగా...7 గెలిచింది. ఒక మ్యాచ్లో ఓడిపోగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఈ వేదికపై ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి 118, 117, 99, 65, 157 నాటౌట్, 0 స్కోర్లు నమోదు చేశాడు. -
IND VS AUS 2nd ODI: హాట్కేకుల్లా ‘విశాఖ’ వన్డే టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించింది. మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది. -
టీమిండియా చేతిలో పరాజయం.. టాప్ ర్యాంక్ కోల్పోయిన న్యూజిలాండ్
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ వన్డేల్లో తమ టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్తో సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే సింగిల్గా టాప్ ర్యాంక్కు చేరుకుంటుంది. ఇప్పటికే టీ20ల్లో టాప్ ర్యాంక్లో ఉన్న భారత్.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్లు) మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే, రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) భీకర ఫామ్ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్ ముగించే క్రమంలో విరాట్ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరుగనుంది. -
Ind Vs NZ: మన బౌలింగ్ భళా... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే
ఎలాంటి సంచలన ప్రదర్శనలు, ఎలాంటి ప్రతిఘటన, పోరాటాలు లేవు... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే.. తొలి వన్డేలో మన జట్టును వణికించిన న్యూజిలాండ్ రెండో పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్ను ఎదుర్కోలేక 108 పరుగులకే ఆట కట్టేసి ముందే ఓటమికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఛేదన పూర్తి చేసిన భారత్ మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. రాయ్పూర్: తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రాయ్పూర్ అభిమానులకు తగిన ఆనందం దక్కలేదు. మొత్తం మ్యాచ్ 54.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (3/18) కివీస్ను దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్లో జరుగుతుంది. సమష్టి వైఫల్యం... ఇన్నింగ్స్ ఐదో బంతికి అలెన్ (0)ను షమీ బౌల్డ్ చేయడంతో కివీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత పరుగు తేడాతో నికోల్స్ (2), మిచెల్ (1) వెనుదిరగ్గా... ఆరు బంతుల వ్యవధిలో కాన్వే (7), లాథమ్ (1) అవుటయ్యారు. దాంతో కేవలం 15 పరుగుల స్కోరు వద్దే కివీస్ సగం బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో ఫిలిప్స్తో కలిసి గత మ్యాచ్ హీరోలు బ్రేస్వెల్, సాన్ట్నర్ పోరాడారు. ఫిలిప్స్... ఆరో వికెట్కు బ్రేస్వెల్తో 41 పరుగులు, ఏడో వికెట్కు సాన్ట్నర్తో 47 పరుగులు జోడించాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన బ్రేస్వెల్ తర్వాతి బంతికి అవుట్ కాగా, కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాన్ట్నర్ను పాండ్యా వెనక్కి పంపించాడు. స్కోరు 100 దాటాక తర్వాతి రెండు వికెట్లు సుందర్ ఖాతాలో చేరగా, కుల్దీప్ చివరి వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, గిల్ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 52/0కు చేరింది. 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక టిక్నర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లి (11) విఫలంకాగా... అప్పటికే కుదురుకున్న గిల్... ఇషాన్ కిషన్ (8 నాటౌట్)తో కలిసి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) షమీ 0; కాన్వే (సి అండ్ బి) పాండ్యా 7; నికోల్స్ (సి) గిల్ (బి) సిరాజ్ 2; మిచెల్ (సి అండ్ బి) షమీ 1; ఫిలిప్స్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 36; బ్రేస్వెల్ (సి) ఇషాన్ (బి) షమీ 22; సాన్ట్నర్ (బి) పాండ్యా 27; షిప్లీ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 1; టిక్నర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–9, 4–15, 5–15, 6–56, 7–103, 8–103, 9–105, 10–108. బౌలింగ్: షమీ 6–1–18–3, సిరాజ్ 6–1–10–1, శార్దుల్ 6–1–26–1, హార్దిక్ పాండ్యా 6–3–16–2, కుల్దీప్ 7.3–0–29–1, వాషింగ్టన్ సుందర్ 3–1–7–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) షిప్లీ 51; గిల్ (నాటౌట్) 40; కోహ్లి (స్టంప్డ్) లాథమ్ (బి) సాన్ట్నర్ 11; ఇషాన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–72, 2–98. బౌలింగ్: ఫెర్గూసన్ 5–0– 21–0, షిప్లీ 5–0–29–1, టిక్నర్ 4–0–19–0, సాన్ట్నర్ 4.1–0–28–1, బ్రేస్వెల్ 2–0–13–0. రోహిత్ మతిమరుపు... టాస్ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. టాస్ గెలిచిన రోహిత్ ఏం ఎంచుకోవాలో చెప్పకుండా కొన్ని క్షణాల పాటు తటపటాయించాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలో తాను మరచిపోయానని అంటూ కొంత ఆలోచించి, ఆలోచించి చివరకు ఫీల్డింగ్ అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. -
IND VS NZ 2nd ODI: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. -
తొలి వన్డేలో 7 ఓవర్లలో 70.. రెండో మ్యాచ్లో 6-3-16-2
Hardik Pandya: రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా బంతితో విజృంభించాడు. 6 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (కాన్వే, సాంట్నర్) పడగొట్టాడు. హార్ధిక్ తన స్పెల్లో ఏకంగా 3 మెయిడిన్ ఓవర్లు సంధించడం విశేషం. హార్ధిక్తో పాటు షమీ (6-1-18-3), సిరాజ్ (6-1-10-1), శార్దూల్ (6-1-26-1), కుల్దీప్ (7.3-0-29-1), వాషింగ్టన్ సుందర్ (3-1-7-2) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో రెండో వన్డేలో భారత్.. న్యూజిలాండ్ను 108 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కాగా, తొలి వన్డేలో 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకుని చెత్తగా బౌలింగ్ చేసిన హార్ధిక్.. మరుసటి మ్యాచ్లోనే ఊహించని రీతిలో రికవర్ అయ్యి బౌలింగ్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హార్ధిక్ ఓ ఫైటర్ అంటూ తెగ మోసేస్తున్నారు. 6 ఓవర్లలో ఏకంగా 3 మెయిడిన్లు వేయడం అద్భుతమని కొనియాడుతున్నారు. నిజానికి హార్ధిక్ ఈ మ్యాచ్లో ఫ్రంట్ లైన్ పేసర్గా సత్తా చాటాడు. షమీ, సిరాజ్లతో పోటీ పడి మరీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో హార్ధిక్ ప్రదర్శన తర్వాత కొందరు భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మ్యాచ్లో విఫలమైతే దూషించడం, మరుసటి మ్యాచ్లో రాణిస్తే ఆకాశానికెత్తడం షరా మామూలుగా మారిందని కామెంట్లు పెడుతున్నారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ ఈ మ్యాచ్లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్పూర్లోని షహీద్ వీర్నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్ను చూపించాడు. స్పిన్నర్ సాన్ట్నర్ కూడా బ్యాటింగ్తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు. -
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది. రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
PAK VS NZ 2nd ODI: పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్
కరాచీ వేదికగా పాకిస్తాన్తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) కివీస్ పతనాన్ని శాశించారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5 — Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023 కాగా, ఈ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో (39వ ఓవర్లో)పాక్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్ అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్, చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్లో ఉన్న పాక్ ఆటగాళ్లు అంపైర్ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డే సోషల్మీడియాలో షేర్ చేసింది. -
కింగ్ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!
IND VS SL 1st ODI: 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కింగ్ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుంది. -
కాన్వే సూపర్ సెంచరీ.. పాక్ను మట్టికరిపించిన న్యూజిలాండ్
కరాచీ: పాకిస్తాన్తో బుధవారం (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో పర్యాటక న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) అదరగొట్టగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) ఆకట్టుకున్నారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. బాబర్ మినహా పాక్ జట్టంతా విఫలమైంది. మహ్మద్ రిజ్వాన్ (28), అఘా సల్మాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. -
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
IND VS SL 2nd ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. రేపటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్తో తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు మాత్రమే. గత మ్యాచ్లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్ 28, రాహుల్ 39 పరగులు చేసి ఔట్ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి. స్కై, ఇషాన్లకు ఛాన్స్ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్ ఎటూ వికెట్కీపింగ్ చేస్తాడు కాబట్టి రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్ స్థానాన్ని సూర్యకుమార్తో ఫిల్ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. తొలి వన్డేలో శ్రేయస్, రాహుల్ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అందుకే సంజూ శాంసన్ను పక్కకు పెట్టాం: టీమిండియా కెప్టెన్
హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్లను ఎండగట్టారు. సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్పైన ఉంటుంది, అలాంటిది శాంసన్ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు. -
సిరీస్ కాపాడుకునేందుకు...
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై గత పర్యటనలో టి20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈసారి కూడా టి20 సిరీస్ గెలిచిన ఊపులో వన్డేల్లో అడుగు పెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్లో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇదే తరహా భారీ స్కోర్లకు వేదికైన పిచ్ సెడాన్ పార్క్లో ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కోలుకొని సిరీస్ను మూడో వన్డే వరకు తీసుకెళుతుందా, లేక కివీస్ ఖాతాలో సిరీస్ చేరుతుందా చూడాలి. న్యూజిలాండ్ చేతిలో భారత్ వరుసగా గత 5 వన్డేలు ఓడగా... సొంతగడ్డపై కివీస్ వరుసగా 13 వన్డేలు నెగ్గి జోరు మీదుంది. మ్యాచ్కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది. కుల్దీప్కు చాన్స్! తొలి వన్డేలో శిఖర్ ధావన్, గిల్, అయ్యర్ అర్ధ సెంచరీలు చేయగా, సంజు సామ్సన్ కూడా దూకుడుగా ఆడాడు. అయితే ఓపెనర్లు ధావన్, గిల్ మరీ నెమ్మదిగా ఆడటం, పవర్ప్లేను సద్వినియోగం చేసుకోకపోవడం భారత్ను నష్టపరిచింది. సూర్యకుమార్ వైఫల్యం జట్టును కొంత ఇబ్బంది పెడుతోంది. టి20ల్లో విధ్వంసానికి మారుపేరుగా నిలుస్తున్న అతను వన్డేల్లో మాత్రం రాణించడం లేదు. అవసరమైతే ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం కోసం సూర్య స్థానంలో దీపక్ హుడాను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులిచ్చిన శార్దుల్ స్థానంలో దీపక్ చహర్కు చాన్స్ దక్కవచ్చు. మరోవైపు లెగ్స్పిన్నర్ చహల్ బౌలింగ్లో మునుపటి పస కనిపించడం లేదు. అతనికి బదులుగా కుల్దీప్ యాదవ్ను ఆడించే ఆలోచనలతో మేనేజ్మెంట్ ఉంది. నీషమ్కు చోటు! విలియమ్సన్ నాయకత్వంలో కివీస్ మంచి ఫామ్లో ఉంది. తొలి వన్డేలో ఆ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్కు మారినా లాథమ్ బ్యాటింగ్లో జోరు తగ్గలేదు. ఓపెనర్లు అలెన్, కాన్వే దూకుడుగా ఆడగల సమర్థులు. గాయంతో గత మ్యాచ్కు దూరమై ఇప్పుడు కోలుకున్న నీషమ్... ఫిలిప్స్ స్థానంలో జట్టులోకి వస్తాడు. -
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
-
IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్ను సిరీస్లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మార్క్రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు. రాణించిన హెండ్రిక్స్, మార్క్రమ్ డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి. కిషన్ సిక్సర్లు కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277. బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209. బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్రమ్ 3–0–22–0. -
IND vs SA 2nd ODI: సిరీస్ కాపాడుకునేందుకు...
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్కు సంబంధించి వన్డే సిరీస్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు. షహబాజ్కు అవకాశం దక్కేనా! 40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి. ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. రెండు మార్పులతో... వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్రౌండర్ మార్క్రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు జాన్సెన్, ఫెలుక్వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు. -
ధవన్ సేన బి టీమ్ కాదు.. భారత్కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!
IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్ ఆడుతున్న శిఖర్ ధవన్ సేనను భారత-బి టీమ్ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్కప్ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో సంజూ శాంసన్ (86 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్ ఆవేశ్ ఖాన్ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్కు స్ట్రయిక్ రాకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. -
‘జులన్కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్ల విజయాలతో 2–0తో సిరీస్ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్లో ఆఖరి వన్డే జరుగుతుంది.